పృథ్వీ రాజ్, సంపత్ : వీళ్ళిద్దరు ఏమయ్యారు ?
31-08-2021
అంబేద్కర్ ఫూలే యువజన సంఘం (APYS)నాయకులు పృథ్వీ రాజ్, సంపత్ లు మూడు రోజులుగా కనిపించడం లేదు. వాళ్ళేమయ్యారో తెలియక వాళ్ళ కుటుంబ సభ్యులు, వారి సహచరులు ఆందోళనకు గురవుతున్నారు. అయితే వాళ్ళిద్దరినీ పోలీసులే కిడ్నాప్ చేశారని APYS, పౌరహక్కుల సంఘం నాయకులు ఆరోపిస్తున్నారు. భద్రాచలం పోలీసులు వాళ్ళిద్దరిని హైదరాబాద్ లోని నాగోల్ ప్రాంతంలో పట్టుకొని తీసుకెళ్ళారని, అయితే వాళ్ళు ఎక్కడున్నారో చెప్పకపోగా తమవద్ద లేడంటూ అబద్దాలు చెబుతున్నారని APYS ప్రధాన కార్యదర్శి గుద్దేటి అశోక్ ఓ ప్రకటనలో మండిపడ్డారు.
పృథ్వీ రాజ్, సంపత్ లను తక్షణం విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ అంబేద్కర్ ఫూలే యువజన సంఘం (APYS), పౌరహక్కుల సంఘం (CLC) విడుదల చేసిన ప్రకటనలు....
Date: 31/08/2011
పోలీసులు కిడ్నాప్ చేసిన అంబేద్కర్ ఫూలే యువజన సంఘం నాయకులు అంకాళ్ళ పృథ్వీరాజ్, శివగాల సంపత్ లను వెంటనే చూపించాలి
అంబేద్కర్ పూలే యువజన సంఘం నాయకులైనటువంటి అంకాళ్ళ పృథ్వీరాజ్ మరియు శివగాల సంపత్ కుమార్ లను పోలీసులు శుక్రవారం రాత్రి సుమారు 7 గం|| నుండి 9 గం॥ సమయంలో నాగోల్ పరిసర ప్రాంతం నుండి కిడ్నాప్ చేయడం జరిగింది . పోలీసులు చర్ల మరియు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సంబంధిత అధికారులు. అంకాళ్ళ పృథ్విరాజ్ , శివగాల సంపత్ కుమార్ సమాచారాన్ని ఇప్పటి వరకు పోలీసులు తెలుపలేదు . వీరికి సంబంధించిన సంఘం బాధ్యులు సమాచారాన్ని పోలీసులను అడుగగా , ఇక్కడ ఆ పేరుతో ఎవ్వరూ లేరని సమాధానం ఇస్తున్నారు . శుక్రవారం నుండి ఇప్పటి వరకు కూడా వారి గురించి ఎటువంటి సమాచారం లేదు.
దళిత బంధు పథకాన్ని ఆహ్వానిస్తూనే బహుజన బంధు కావాలని పలు కార్యక్రమాలను APYS సంఘం తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా దళిత బహుజనులపై ఈ మధ్యకాలంలో జరుగుతున్న దాడులను ఖండిస్తూ , పోరాడుతోంది. పలు కార్యక్రమాలకు కార్యచరణను సిద్ధం చేసుకుంది. ప్రశ్నించే అనేక గొంతులను అణిచివేసినట్టి ఈ రోజు దళిత బహుజన గొంతులను అణచాలని అంబేద్కర్, ఫూలే వంటి మహానీయుల ఆశయాలను ముందుకు తీసుకెళ్తున్న బహుజన సంఘాలను అణిచివేయాలని ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. దానికి పరాకాష్ట AP నాయకులైనటువంటి అంకాళ్ళ పుథ్వీరాజ్ మరియు శివగాల సంపత్ కుమార్ ల కిడ్నాప్.
పృథ్వీరాజ్ మరియు సంపత్ లను వెంటనే చూపించాలి , వారికి ఏ హాని జరిగినా పోలీసులదే బాధ్యత అని మీడియా ముఖంగా హెచ్చరిస్తున్నాం. పృథ్వీరాజ్ మరియు సంపత్ లను కాపాడుకోవడం కోసం జరుగు కార్యక్రమాలలో కలిసి వస్తారని ఆశిస్తున్నాం.
APYS
అంబేద్కర్ ఫూలే యువజన సంఘం గుద్దేటి అశక్
(రాష్ట్ర ప్రధాన కార్యదర్శి)
తెలంగాణ పోలీసుల అదుపులోనున్న న్యాయవాది పృథ్వీ రాజ్, సంపత్ లను విడుదల చేయాలి...పౌర హక్కుల సంఘం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు కు చెందిన అడ్వకేట్,అంకాల పృథ్వీరాజ్ మరియు అంబేద్కర్ పూలే యువజన సంఘం, హైదరాబాద్ కు చెందిన సంపత్ అనే కార్యకర్తను తెలంగాణ రాష్ట్ర భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు నిన్న 29,ఆగస్ట్ 2021 ఆదివారం మద్యహ్నం అదుపులోకి తీసుకున్నారని, సాయంత్రం 6 గంటల సమయంలో ప్రెస్ మీట్ ద్వారా ప్రకటిస్తామని చెప్పినారని స్థానిక న్యాయవాదులు పౌర హక్కుల సంఘానికి తెలిపినారు.ఈ రోజు సోమవారం,30 ఆగస్ట్ 2021 రాత్రి 9:30గంటలవరకు కూడా పోలీసులు వారిద్దరిని తమ అదుపులోఉన్నట్లుగా ప్రకటించలేదు మరియు మేజిస్ట్రేట్ ముందు హాజరు పరచ లేదు...
ప్రజాస్వామిక వ్యవస్థలో పోలీసులే కిడ్నాప్ చేసినట్లుగా ప్రజలు భావిస్తున్నారు.ఇది ముఖ్యమంత్రి KCR అప్రజాస్వామిక పాలనకు మరియు రాజ్యాంగ వ్యతికరేక వైఖరికి నిదర్శనం ఈ పోలీస్ కిడ్నాప్ లు.ఇప్పటికైన వారిద్దరిని విడుదల చేయాలని లేదా మెజిస్ట్రేట్ ముందు హాజరు పరచాలని పౌర హక్కుల సంఘం డిమాండ్ చేస్తుంది....
1.N. నారాయణ రావు, ప్రధాన కార్యదర్శి,పౌర హక్కుల సంఘం తెలంగాణ..
2.చిలుకా చంద్రశేఖర్,ప్రధాన కార్యదర్శి,పౌర హక్కుల సంఘం ఆంధ్రప్రదేశ్...
30,ఆగస్ట్,2021,సోమవారం,రాత్రి.10:00.
Keywords : ambedkar phule yuvajana sangham, CLC, pruthvi raj, sampath, police, kidnap, bhadradri
(2024-03-28 07:05:14)
No. of visitors : 950
Suggested Posts
| ʹరోళ్ళగడ్డ ఎన్ కౌంటర్ లో పాల్గొన్న పోలీసులందరిపై సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం హత్య కేసు నమోదు చేయాలిʹ
సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఎన్కౌంటర్లో పాల్గొన్న పోలీసులపై 302 కేసు నమోదు చేయాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం. అంతేకాక పోలీసుల అదుపులో వున్న నలుగురు ఉద్యమకారులను కోర్టులో హాజరుపరిచి వారి ప్రాణాపాయం లేకుండా బాధ్యత పడాల్సిందిగా ముఖ్యమంత్రి చంద్రశేఖరరావును పౌరహక్కుల సంఘం డిమాండ్ ఉన్నది. |
| ప్రతి ఎన్కౌంటర్ పై హత్యానేరం నమోదు చేసి విచారించాలి... సుప్రీం కోర్టు సంచలన తీర్పు ఆంధ్రప్రదేశ్ కు చెందిన ప్రత్యేక పోలీసు బలగం గ్రేహూండ్స్ పోలీసులు 2006 జూలై 23న నల్లమల అడవుల్లో మావోయిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి బుర్రా చిన్నయ్య (మాధవ్) ను, ఐదుగురు మహిళలతో సహా మరొక ఏడుగురిని ఎన్ కౌంటర్ పేరుతో కాల్చిచంపారు. వెంటనే ఆంధ్రప్రదేశ్ పౌరహక్కుల సంఘం హైకోర్టులో రిట్ దాఖలు చేసింది. |
| ఆదివాసుల జీవించే హక్కును కాలరాసున్న తెలంగాణ పాలకులుఅక్కడ ʹఆడాʹ ప్రాజెక్ట్ కాలువలకింద భూములు ఉన్నాయి. ఆ ప్రాజెక్ట్ కాలువలకింద నీటితో, వ్యవసాయం చేయడానికి, చిన్న,పిల్ల కాలువలు ఉన్నాయి.మొత్తానికి ఇక్కడ సారవంతమైన, అద్భుతమైన నీటివనరులు గల భూములున్నాయి. బహుశా ఆదివాసులనూ తరలించి, భూములను కబ్జాజేయడానికి స్థానిక అధికార పార్టీ నేతలు కుట్ర చేస్తున్నారని అందుకే స్థానిక MLA కొనేరుకొనప్ప దృష్టికి ఈ విషయం వచ్చినా కనీస |
| సింగరేణి కార్మికుడు కోడెం సంజీవ్ మృతికి యాజమాన్యానిదే బాధ్యత...పౌరహక్కుల సంఘంGDK 11 వ గనిలో మరణించిన కోడెం సంజీవ్ మృతికి సింగరేణి యజమాన్యందే బాధ్యత,ఈ ఘటనపై హై కోర్ట్ సిట్టింగ్ జడ్జ్ చే న్యాయవిచారణ జరిపించాలి, .సింగరేణి CMD పై క్రిమినల్ కేసులు నమోదు చెయ్యాలి,కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఒక కోటి రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలనిపౌర హక్కుల సంఘం తెలంగాణ డిమాండ్ చేస్తున్నది. |
| జాడి వీరస్వామి, వెట్టి నందయ్యలను పోలీసులు హత్య చేశారు...నిజ నిర్దారణ కమిటీ రిపోర్ట్మంగళవారం 20 ఆగస్టు,2019 న రాత్రి 12 నుండి 1 గంటల మధ్యన సుమారు 200 మంది వరకు సాయుధ పోలీసులు బుడుగుల గ్రామాన్ని దిగ్బంధించి ఆదివాసీ ప్రజలందరినీ గ్రామంలో రెండు చోట్లకు తీసుకువచ్చి,ప్రజలందరినీ తీవ్రంగా కొడుతూ ఒక్కొక్క ఇంటిని సోదాచేసి, ఒక ఇంటిలోనుండి జాడి వీరస్వామిని పోలీసులు గ్రామంపక్కన ఉత్తర దిక్కు అడవిలోకి తీసుకుపోయి రాత్రంతా చిత్రహింసలు పెట్టి ఉదయం 7 గంటల |
| CLC ప్రకటన: కార్మిక చట్టాలను రద్దు చేసి కార్మికులను భానిసత్వంలోకి నెట్టిన పాలకులపై పోరాడుదాం
ఈ కార్మిక చట్టాలను రద్దు చేయడం అప్రజాస్వామ్యం మరియు రాజ్యాంగ విరుద్ధం. సంవత్సరాల పైబడి ఎన్నో త్యాగాలతో పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను ఈ విధంగా రద్దు చేయడం అంటే కార్మిక వర్గాన్ని బానిసత్వం లోకి నెట్టివేయడమే. |
|
ʹఅవి ఎదురుకాల్పులు కాదు.. ఆదివాసీల హత్యలుʹచత్తిస్ ఘడ్ లోని కుంట బ్లాక్ లో జరిగిన ఎన్ కౌంటర్ నిజమైన ఎన్ కౌంటర్ కాదని అది కేవలం ఆదివాసీల హత్య కాండేనని భావిస్తున్నాం.చత్తిస్ ఘడ్ అటవీ ప్రాంతములో లక్షలాదిగా ఉన్న ఫారా మిలటరీ బలగాలు నిత్యం అడవిని జల్లెడ పడుతూ అనుమానంతో ఆదివాసీ యువతి యువకులను అదుపులోకి తీసుకుని చిత్రహింసలు పెట్టి హత్య చేసి ఎన్ కౌంటర్ గా ప్రకటిస్తున్నారు. |
| మంథని లో లాకప్ డెత్...పౌరహక్కుల సంఘం నిజ నిర్దారణ... విచారణకు ఆదేశించిన హైకోర్టుపెద్దపల్లి జిల్లా మంథని పోలీస్స్టేషన్లో మంగళవారంనాడు రంగయ్య అనే వ్యక్తి మరణం ఆత్మహత్యగా పోలీసులు చెబుతుంటే అది ఆత్మహత్య కాదని దానిపై విచారణ జరిపించాలని పౌరహక్కుల సంఘం డిమాండ్ చేసింది. మరో వైపు దీనిపై తెలంగాణ హైకోర్టు వీచారణకు ఆదేశించింది. |
| ʹఅది ఎన్కౌంటర్ కాదు వేటాడి చంపారుʹ....విజయవాడలో పౌరహక్కుల సంఘం సభవిజయవాడలోని రాఘవయ్య పార్కు దగ్గరలోని మాకినేని బసవ పున్నయ్య విజ్ఞాన కేంద్రంలో ఆంధ్రప్రదేశ్ పౌరహక్కుల సంఘం ఆధ్వర్యంలో శనివారం ఒరిస్సా-మల్కన్గిరి ఎన్కౌంటర్ బూటకం అనే అంశంపై సభ జరిగింది. ఈ సభకు పౌరహక్కుల సంఘం రాష్ట్ర..... |
| ఆనంద్ తెల్ తుంబ్డే, గౌతమ్ నవలఖా అరెస్టులపై పౌరహక్కుల సంఘం ప్రకటన
14 ఏప్రిల్ 2020 న అంబేద్కర్ 129 వ జయంతి రోజున ప్రొపెసర్, విద్యావేత్త, విమర్శకుడు దళిత మేధావి మరియు హక్కుల నాయకుడైన ఆనంద్ తెల్ తుంబ్డే, ప్రముఖ జర్నలిస్టు మరియు హక్కుల నాయకుడైన గౌతమ్ నవలఖా లను భారత కేంద్ర ప్రభుత్వము ఈ రోజు అరెస్టు చేసి ముంబై మరియు ఢిల్లీలో ని NIA కార్యాలయాల్లో నిర్భందించడాన్ని పౌరహక్కుల సంఘం తెలంగాణ తీవ్రంగా ఖండిస్తుంది. |