మోడీ బర్త్ డే ను ʹజుమ్లా దినంʹ గా పాటిద్దాం - యువజన సంఘాల పిలుపు
03-09-2021
ప్రధాని నరేంద్ర మోడీ పుట్టినరోజైన సెప్టెంబర్ 17 ను "జుమ్లా నిరుద్యోగ దినం" గా పాటించాలని యువజన సంఘాలు నిర్ణయించాయి. నిరుద్యోగానికి వ్యతిరేకంగా దేశవ్యాప్త యువజన ఉద్యమం, యువ హల్లా బోల్ ద్వారా నరేంద్ర మోడీ పాలన విధానం హైలైట్ చేయబడతుంది. అని యువ హల్లా బోల్ ప్రకటించింది.
యువ హల్లా బోల్ జాతీయ కన్వీనర్ అనుపమ్ ఒక ప్రకటనలో ఇలా అన్నారు: "ప్రధానమంత్రి పుట్టినరోజు నిరుద్యోగం మరియు జుమ్లా సమస్యలకు అంకితం చేయబడుతుంది."
ఉద్యమ ప్రతినిధి రిషవ్ రంజన్ ఇలా అన్నారు: " సమ్స్యల పరిష్కారానికి మోడీ కనుగొన్న సరికొత్త పద్దతులను మేము ఆయన భర్త్ డే సందర్భంగా అనుసరించబోతున్నాం. అందుకోసం మేము ప్లేట్ల పై కర్రలతో వాయించడం , చప్పట్లు కొట్టడం చేస్తాము. ఇది ప్రజలను ఉల్లాసంగా ఉంచడానికి మోడీ కనుగొన్న పద్ధతి."
మోడీ తన 2014 ఎన్నికల ప్రచారంలో విదేశీ బ్యాంకులలో దాచుకున్న నల్లధనాన్ని స్వదేశానికి రప్పించేందుకు ప్రతిజ్ఞ చేసి, ఆ మొత్తం చాలా పెద్దదని ప్రతి భారతీయుడు "రూ 15-20 లక్షలు పొందుతాడు" అని చెప్పారు. ప్రతి భారతీయుడి బ్యాంక్ ఖాతాలో రూ .15 లక్షలు జమ చేస్తానని వాగ్దానం చేశారు.
అయితే మోడీ ఎన్నికల విజయం సాధించిన కొన్ని నెలల తర్వాత, అప్పటి బిజెపి అధ్యక్షుడు అమిత్ షా ఈ ప్రకటన "జుమ్లా" అని అన్నారు. ఇది ఒక మాట్లాడే పద్ధతి దాన్నిఅక్షరాలా తీసుకోకూడదు అని అన్నారు.
కోవిడ్ మొదట వ్యాప్తి చెందినప్పుడు, మహమ్మారిపై పోరాడుతున్న ఆరోగ్య కార్యకర్తల మనోబలాన్ని పెంచడానికి గత ఏడాది మార్చి 22 రాత్రి 7 గంటల నుండి పాత్రలను కొట్టాలని మరియు ఐదు నిమిషాలు చప్పట్లు కొట్టాలని మోదీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
కోవిడ్ రాకముందే, భారతదేశంలో నిరుద్యోగ గణాంకాలు నాలుగు దశాబ్దాలలో అత్యంత ఘోరంగా ఉన్నాయి. మహమ్మారి సమయంలో పరిస్థితి మరింత దిగజారింది. మోడీ ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను, ఆరోగ్య సంరక్షణను రెండింటినీ తప్పుడు పద్దతిలో నిర్వహిస్తోందని ఆరోపించారు యువ హల్లా బోల్ ప్రతినిధి రిషవ్ రంజన్
"మేము మోడీ 70 వ పుట్టినరోజును (గత సంవత్సరం) జుమ్లా దినోత్సవంగా జరుపుకున్నాము. ఈసారి, అనేక ఇతర సంస్థలు మరియు యూనియన్లు కూడా మా ఉద్యమంలో పాల్గొనాలని నిర్ణయించుకున్నాయి "అని రంజన్ అన్నారు.
"ఈ ప్రచారం ద్వారా దేశవ్యాప్తంగా యువకులు తమ సమస్యలను తెలియజేయడానికి ఆసక్తి చూపుతున్నారు. వారు నిరుద్యోగాన్ని హైలైట్ చేయాలని మరియు మోడీ ప్రభుత్వంపై వేదనను వ్యక్తం చేయాలని కోరుకుంటున్నారు.ʹʹ
ఆయన ఇలా అన్నారు: "మేము నిరుద్యోగం మరియు ప్రైవేటీకరణను పెద్ద రాజకీయ సమస్యలుగా మార్చాలనుకుంటున్నాము, తద్వారా ప్రధాన మంత్రి, అతని ప్రభుత్వం, ప్రతిపక్ష పార్టీలు మరియు మీడియా ఈ వాస్తవ సమస్యలను పరిష్కరిస్తాయి."
* జుమ్లా అనే పదం నిజానికి అరబ్ నుండి వచ్చింది అయితే అమిత్ షా మాటల తర్వాత ఆ పదాన్ని మన దేశంలో అబద్దాల వాగ్దానాలు చేసే రాజకీయ నాయకులను, అబద్దాలు చెప్పే రాజకీయ నాయకులను, మాట ఇచ్చి తప్పే రాజకీయులను ఉద్దేశించి ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా మోడీని, ఆయన ప్రభుత్వాన్ని విమర్షించేందుకు ప్రతి పక్షాలు, వివిధ సంఘాలు ఈ పదాన్ని ఉపయోగిస్తున్నాయి.
Keywords : Jumla Diwas, narendra modi, Birthday, Yuva Halla Bol,Youth Group Announces Nationwide ʹJumla Diwasʹ Events on Narendra Modiʹs Birthday
(2024-04-14 04:49:53)
No. of visitors : 921
Suggested Posts
| ఫోటోకు ఫోజు కోసం జుకర్ బర్గ్ ను లాగేసిన మోడీ !అమెరికా పర్యటనలో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కెమెరాలో కనిపించడం కోసం చేసిన ఓ పని ... ఇప్పుడు సోషల్ మీడియాలో ఆ వీడియో హల్ చల్ చేస్తోంది.... |
| నరేంద్రమోడీ విదేశీ పర్యటనల ఖర్చెంత ?భారతదేశపు ప్రధానమంత్రి భారతదేశంలో ఉండి పాలించాలని, పాలిస్తారని ఎవరైనా అనుకుంటారు. కాని నరేంద్ర మోడీ భారతదేశానికి అప్పుడప్పుడు వచ్చిపోతూ పాలిస్తున్నారని ఆయన మీద పరిహాసాలు వస్తున్నాయి. ఈ పరిహాసాలకు పరాకాష్టగా.... |
| ఈ అనంతపు గగ్గోలు ఎవరికోసం?దారుణాన్ని దారుణం అన్నవాడిపైననే
అన్యాయాన్ని అన్యాయం అన్నవాడిపైనన ఈయనగారి వ్యంగం.
పావులాకు, బేడాకు ఆడవాళ్ల శరీరాలపై పచ్చబొట్ల పాటలు రాసేవారి నుండి శాంతిని, మానవతావాద స్పందనను ఆశించడం మన బుద్దితక్కువతనమే అవుతుందనకుంటా |
| ప్రధాని మోడీ పీజీ చదువు అబద్దమేనా ?ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఎమ్.ఏ డిగ్రీ చేశాడన్నది అబద్దమేనా ? మోడీ అఫీషియల్ వెబ్ సైట్ లో ఈ సంవత్సరం మే వరకు ఉన్న డిగ్రీ వివరాలు జూన్ నెలలో ఎందుకు లేవు ? ఢిల్లీ లా మంత్రి జితేందర్ సింగ్ తోమర్ నకిలీ డిగ్రీ కేసులో..... |
| బాలికా విద్య పై గుజరాత్ గొప్పలన్నీ ట్రాష్బాలికల సంక్షేమం, బాలికల విద్యపై గుజరాత్ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటున్నది. వాస్తవంగా వారి విద్య విషయంలో ఆ రాష్ట్రం అట్టడుగున నిలిచింది.బాలికల బంగారు భవిష్యత్తు కోసం అంటూ *కన్యా కెలవనీ* పథకం అమలు చేస్తున్నామని.... |
| కేంధ్ర ప్రభుత్వ విధానాలకు నిరసనగా రచయిత్రి సంచలన నిర్ణయంప్రముఖ రచయిత్రి కేంధ్ర సాహిత్య అకాడమీ అవార్డును తిరిగి వెనక్కి పంపింది. నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశంలో ప్రజాస్వామిక వాతావరణం చెడగొడుతూ, సాంస్కృతిక వైవిధ్యానికి తూట్లుపొడిచేవిధంగా పరిపాలిస్తోందని ఆరోపిస్తూ.... |
| జైశ్రీరాం పదం కొందరు నేరస్థులకు ఆయుధమైంది...ఇకనైనా మూక దాడులు ఆపండి...మోడీకి లేఖ రాసిన 49 మంది ప్రముఖులు
మీరు పార్లమెంట్లో మూకదాడుల్ని ఖండించారు. కానీ అవి ఆగిపోలేదు. అయితే మీరు వాటిపై తీసుకున్న చర్యలేంటి? ఈ దేశంలో ఒక్క పౌరుడు కూడా భయంతో బతకాడినికి వీళ్లేదు. ʹజై శ్రీరామ్ʹ అనే పదం వింటేనే ప్రజలు వణికిపోతున్నారు. ఇప్పుడది కొందరు ఆకతాయిలు, నేరస్థులకు ఆయుధమైంది. |
| రిజర్వు బ్యాంకు తేల్చిన సత్యం...నోట్ల రద్దుతో బ్లాక్ మనీ పోలేదు... వైటై పోయింది !
గతేడాది నవంబర్ 8వ తేదీ నుండి రిజర్వ్ బ్యాంకుకు తిరిగి వచ్చిన 1000, 500 రూపాయలు ఎన్ని అనేది ఇప్పటికి లెక్కలు తేల్చింది రిజర్వ్ బ్యాంక్. ఇప్పటి వరకు ఎవ్వరు ఎన్ని సార్లు అడిగినా నోరుమెదపని రిజర్వ్ బ్యాంక్ ఎట్టకేలకు బుధవారం విడుదల చేసిన వార్షిక రిపోర్టులో ఆ వివరాలు బయటపెట్టింది. 99 శాతం పెద్ద నోట్లు తమ వద్ద డిపాజిట్ .... |
| ʹప్రతిపక్షాల చేతబడి వల్లే బీజేపీ నేతలు చనిపోతున్నారుʹబీజేపీ నేతలపై ప్రతిపక్షాలు చేతబడి చేస్తున్నాయని బీజేపీ ఎంపీ సాధ్వి ప్రఙ్ఞాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ సీనియర్ నేతలు బాబూలాల్ గౌర్, అరుణ్ జైట్లీలకు నివాళులర్పించేందుకు ఏర్పాటు చేసిన సంతాప సభలో ప్రఙ్ఞా ఈ విధమైన వ్యాఖ్యలు చేశారు. |
| మోడీ రాజ్యం: మోసాన్ని బహిర్గతం చేసినందుకు ఉద్యోగాలు పోగొట్టుకున్నజర్నలిస్టులు !ఏబీపీ న్యూస్ నెట్వర్క్ మేనేజింగ్ ఎడిటర్ మిలిండ్ ఖండేకర్ తోటి జర్నలిస్ట్ పుణ్య ప్రసూన్ బాజ్పేయి ఏబీపీ టీవీ ఛానెల్లో రాత్రి 9 గంటలకు ʹమాస్టర్ స్ట్రోక్ʹ పేరిట షోను నిర్వహిస్తుంటారు. ఆయన సాధారణంగా ఈ షో ద్వారా ప్రభుత్వ విధానాల్లో ఉన్న తప్పొప్పుల గురించి సమీక్షింస్తుంటారు. |