Custodial Violence in MP:లాకప్ లో ఆదివాసులపై చిత్ర హింసలు, యువకుడి మృతి...భగ్గుమన్న ఆదివాసులు
18-09-2021
పోలీసు కస్టడీలో ఓ ఆదివాసీ యువకుడిని తీవ్ర చిత్రహింసలు పెట్టి, హత్య చేసినందుకు నిరసనగా వేలాదిమంది ఆదివాసీలు మధ్యప్రదేశ్ Madhyapradesh,ఖార్గోన్ Khargone లో నిరసన ప్రదర్శన నిర్వహించారు. దోషులైన పోలీసు సిబ్బందిపై చర్యలు చేపట్టకపోతే సహించబోమని రాష్ట్రప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేశారు.
దోషులైన పోలీసు సిబ్బందిపై ఎఫ్ఐఆర్ దాఖలు చేయాలని, ఆదివాసీ యువకుడు బిసాన్ మరణానికి కారణమైన వైద్యులను అరెస్టు చేయాలని 3000 మందికి పైగా ఆదివాసీలు డిమాండ్ చేశారు.
ఖార్గోన్ జిల్లా, బిస్తాన్ పోలీస్ స్టేషన్ Bistan Police Station పరిధిలోని, ఖేర్కుండి గ్రామాని Kherkundi village కి చెందిన బిసాన్ను మరో ముగ్గురిని దొంగతనం చేశారనే అనుమానంతో ఆగస్టు 31 రాత్రి పోలీసు అధికారులు పట్టుకుని - వారి అక్రమ నిర్బంధం, చిత్రహింసలకు వ్యతిరేకంగా కోర్టులో అరెస్టయిన వారి కుటుంబాలు పిటిషన్ దాఖలు చేసే వరకు వారిని అక్రమ కస్టడీలో ఉంచారు.
అధికారికంగా అరెస్ట్ను సెప్టెంబర్ 4 న మాత్రమే నమోదు చేసారు, అయితే ఎవరినీ 24 గంటలు కంటే ఎక్కువ తమ కస్టడీలో ఉంచడానికి పోలీసులకు హక్కు లేదు. బిసాన్, మరో ముగ్గురిని రెండు రోజుల పాటు పోలీసు రిమాండ్లో ఉంచారు, ఆ సమయంలో బిసాన్, భావసింగ్ s/o ఫూల్సింగ్ లపై పోలీసులు తీవ్రంగా దాడి చేశారు. చిత్ర హింసలకు గురిచేశారు.
వారి పోలీసు రిమాండ్ ముగిసాక జైలుకు తీసుకెళ్లినప్పుడు, జైలు అధికారులు పద్ధతి ప్రకారం సరిగానే పోలీసుల చిత్రహింసల వల్ల కలిగిన తీవ్ర గాయాలకు వైద్య చికిత్స లేకుండా వారిని జైల్లోకి తీసుకోడానికి నిరాకరించారు.
అయితే పోలీసుల హింసల వల్ల బిసాన్ కు అయిన గాయాన్ని డాక్టర్ జెపి బడేరియా "చిన్నది" అని చెప్పి, చికిత్స చేయడానికి నిరాకరించాడు, ఇది చివరికి బిసాన్ మరణానికి దారితీసింది. బిసాన్ని ఎంత తీవ్రంగా కొట్టారంటే, అతని పిరుదులపై మాంసం ఎముక నుండి వూడిపోయింది. దాంతో సెప్సిస్/సెప్టిక్ షాక్కు దారితీసి బీసన్ మరణించాడు.
అలాంటి సంఘటనల్లో నిందితులను మధ్య ప్రదేశ్ ప్రభుత్వం కాపాడుతూండడం వల్ల రాష్ట్రంలో ఆదివాసీలపై హింసాత్మక ఘటనలు నిరంతరం పెరుగుతున్నాయని ఆదివాసులు పేర్కొన్నారు. ఆదివాసీ సమాజం అటువంటి అన్యాయాన్ని చూస్తూ వూరుకోమని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు.
ఆదివాసుల డిమాండ్స్:
1. బిసాన్ మరణానికి పాల్పడిన పోలీసు అధికారులపై FIR నమోదు చేయాలి. బిసాన్ పై హింస, హత్యలకు పాల్పడినందుకు వారిని వెంటనే అరెస్టు చేయాలి.
2. తప్పుడు MLC లను దాఖలు చేసినందుకు, బిసాన్ మరణానికి దారితీసిన తీవ్ర గాయాలైనప్పటికీ చికిత్సను తిరస్కరించినందుకు డాక్టర్ జెపి బదేరియాను, బిస్తాన్ మెడికల్ ఆఫీసర్లను వెంటనే సస్పెండ్ చేయాలి. బిసాన్ మరణానికి ఈ అధికారులను కూడా ఎఫ్ఐఆర్లో పేర్కొనాలి, తదనుగుణంగా అరెస్టు చేయాలి.
3. బిస్తాన్ పోలీస్ స్టేషన్లోని పోలీసు సిబ్బందిని తక్షణమే బదిలీ చేయాలి, ఖేర్కుండి నిందితులను హింసించడంలో వారి ప్రమేయం గురించి క్షుణ్ణంగా దర్యాప్తు చేయాలి, వారిపై అవసరమైన శిక్షా చర్యలు తీసుకోవాలి.
4. బిసాన్ కుటుంబానికి కోటి రూపాయల పరిహారం తప్పనిసరిగా ఇవ్వాలి.
ఈ డిమాండ్లపై చర్య తీసుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వ, జిల్లా పాలనా యంత్రాంగాలు విఫలం అవుతే ఆదివాసీ సమాజం తమ డిమాండ్లన్నీ నెరవేరే వరకు మరింత పెద్ద ఆందోళన చేపడతామని ఆగ్రహంతో ఉన్న ఆదివాసులు హెచ్చరించారు.
Keywords : madhyapradesh, Khargone district, Bisan, custodial violence, 3,000 tribals staged protests, adivasi death
(2025-02-05 16:09:09)
No. of visitors : 1625
Suggested Posts
| ఆదివాసీ యువతిపై దాడి చేశారు...నగ్నంగా ఊరేగించారు..ఓ గుంపు ఓ ఆదివాసీ మహిళ పై అనాగరికంగా.... దుర్మార్గంగా... దాడి చేశారు. ఆమె పట్ల అతి నీచంగా ప్రవర్తించారు. మధ్య ప్రదేశ్ లో మంత్రగత్తె అనే నెపంతో ఓ యువతి పట్ల గ్రామస్తులు... |
| హద్దుల్లేని మత పిచ్చి - మూర్ఖత్వం అనంతం
బస్సో, రైలో, విమానమో నడుపుతున్నది ముస్లిం అని తెలిస్తే మధ్యలో గెంతెయ్యాలి . ఈవీఎం మెషీన్లని తయారుచేసేవాడు ముస్లిమో క్రిస్టియనో అయితే వోటేయ్యడం మానెయ్యాలి. ఇమిగ్రేషన్ కౌంటర్లో వున్నది ముస్లిమో, క్రిస్టియనో అయితే విమానమెక్కకుండా వెనక్కి వచ్చేయాలి. ఇంతకీ క్రిస్టియన్లు కనిపెట్టిన నడుపుతున్న ట్విట్టర్, పేస్బుక్ లను వాడడం మానెయ్యాలి. ముస్లిం దేశాల గాలి సోకకుం |
| లారీతో తొక్కించి జర్నలిస్ట్ ను హత్య చేసిన ఇసుక మాఫియాఈ అవినీతిలో ఉన్న ప్రజా ప్రతినిధుల పేర్లను పూర్తి ఆధారాలతో బయటపెడతానని ఆయన చెప్పారు కూడా. అయితే సోమవారం ఉదయం ఆయన విధులకు వెళ్తున్న క్రమంలో ఓ లారీ ఆయన్ని ఢీ కొట్టింది. వెంటనే లారీ డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా.. వారొచ్చి సందీప్ను ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. |
| CPI Maoist Extends Support to Peasants On Strike In Madhya PradeshExtending support to the farmersʹ strike in Madhya Pradesh and other states, Outlawed Communist Party of India (Maoist) have dropped pamphlets and put up banners expressing solidarity with the agitating peasants.... |
| బీజేపీకి వ్యతిరేకంగా వార్తలు రాసినందుకు జర్నలిస్టులపై దుర్మార్గం - అర్ద నగ్నంగా నిలబెట్టిన పోలీసులుమధ్యప్రదేశ్ లోని సిధి జిల్లాలో స్థానిక బీజేపీ శాసనసభ్యుడు కేదార్నాథ్ శుక్లాకు వ్యతిరేకంగా వార్తలు రాశారనే కోపంతో ఆయన ఆదేశాలతో పోలీసులు 8 మంది జర్నలిస్టులను అరెస్టు చేశారు. వాళ్ళందరినీ అర్దనగ్నంగా డ్రాయర్లమీద పోలీసు స్టేషన్ లో నిలబెట్టి ఫోటోలు తీశారు. దారుణంగా అవమానించారు. వారిపై అక్రమ కేసు బనాయించారు. |
| దానమడిగినందుకు పసివాణ్ణి తన్నిన మంత్రిఓ వీధి బాలుడు దానం అడిగినందుకు ఆ మంత్రికి కోపమొచ్చింది. ఆ బాలుడిని కాలితో తన్ని వెళ్ళి పోయింది. మధ్యప్రదేశ్ ప్రభుత్వంలోని పశు సంవర్థకశాఖ మంత్రి కుసుమ్ మెహడేలే చేసిన ఈ అమానవీయ చర్య.... |
| ఆర్ఎస్ఎస్ కు భజన చేస్తున్న పోలీసు అధికారులుప్రభుత్వ శాఖలను పూర్తిగా కాషాయమయం చేస్తున్నారంటూ విమర్శలు వినవస్తున్న నేపథ్యంలో ఆ విమర్షలను నిజం చేస్తూ మధ్యప్రదేశ్ నార్కోటిక్స్ విభాగం ఓ క్యాలెండర్ ప్రచురించింది. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, బీజేపీ అధ్యక్షుడు అమిత్షా కొటేషన్లతో పాటు వారి ఫోటోలను ఈ క్యాలెండర్లలో ప్రచురించి ఆర్ఎస్ఎస్ పై భక్తిని చాటుకున్నారు ఆ పోలిసు అధికారులు....
|
| దళితుడు,RTI కార్యకర్తపై దుర్మార్గమైన దాడి - మూత్రం తాగించే ప్రయత్నం
మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ జిల్లాలోని ఒక గ్రామ పంచాయతీకి సంబంధించిన సమాచారం కోరినందుకు 33 ఏళ్ల దళిత సమాచార హక్కు (RTI) కార్యకర్తను ఏడుగురు వ్యక్తులు కొట్టి, బలవంతంగా మూత్రం తాగించారని |
| రిలియన్స్ పవర్ దుర్మార్గం....ఇద్దరు మృతి, నలుగురు గల్లంతురిలయన్స్ కంపెనీ దుర్మార్గానికి ఇద్దరు మరణించగా నలుగురు వ్యక్తుల ఆచూకీ తెలిఅయడం లేదు. నిబందనలు పాటించకుండా ఓ గ్రామ సమీపంలో విద్యుత్ ప్లాంట్ బూడిద వ్యర్థాలు కుమ్మరించడంతో ఆ గ్రామంలో అనేక ఇళ్ళు బూడిదతో కప్పబడిపోయాయి |
| లాక్ డౌన్ నిబందనలు బేఖాతరు... ఓ స్వామీజీ అంత్యక్రియలకు హాజరైన ముఖ్యమంత్రి సహా వేలాది మంది జనంవ్ ప్రభాకర్ శాస్త్రి పూర్తి ఊపిరితిత్తులు, కిడ్నీ వ్యాధులతో బాధపడుతూ ఆదివారం చనిపోయారు ఆయన అంఅత్యక్రియలు అధికార లాంఛనాలతో జరిగాయి. ఆ అంత్యక్రియల్లో భౌతిక దూరం నిబంధనలను పక్కనపెట్టి వేలాదిగా జనం గుమికూడారు. అంతిమయాత్రలో ముఖ్యమంత్రి శివ్ రాజ్ సింగ్ చౌహాన్, బీజేపీ జాతీయ జనరల్ సెక్రటరీ కైలాశ్ విజయవర్గీయ, మధ్య ప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్, మాజీ ముఖ్యమంత్రి కమల్ |