సెప్టెంబర్ 20 న ఛత్తీస్‌గఢ్ బంద్‌కు ఆదివాసీ సమాజ్ పిలుపు

సెప్టెంబర్

19-09-2021

అడ్స్మేటా, సర్కేగూడ, తాడ్మెట్ల కాల్పుల ఘటనకు పాల్పడిన అప్పటి అధికారులు, గృహమంత్రి, ముఖ్యమంత్రిలపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని డిమాండ్

అడ్స్మేటా కాల్పుల ఘటనలో న్యాయ విచారణ నివేదిక ప్రభుత్వానికి అందడంతో, అప్పటి పోలీసు ఎస్‌పి, ఐజి, డిజిపి, హోంమంత్రి, ముఖ్యమంత్రి బాధ్యత వహించి ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని, వారిపై హత్య కేసు నమోదు చేయాలని, బాధితులకు తగిన, న్యాయమైన పరిహారం అందించాలని సర్వ్ ఆదివాసీ సమాజ్ డిమాండ్ చేస్తోంది. సెప్టెంబర్ 20 న ఛత్తీస్‌గఢ్ బంద్ ప్రకటించింది.
అడ్స్మేటా, సర్కేగూడ, తాడ్మెట్ల కేసుల న్యాయ విచారణ నివేదిక మరణించిన వారు అమాయక ఆదివాసీలని స్పష్టం చేసినట్లు ఛత్తీస్‌గఢ్ సర్వ్ ఆదివాసీ సమాజ్ యొక్క పోటాయీ వర్గ వర్కింగ్ ప్రెసిడెంట్ బిఎస్ రావుటే చెప్పారు. ఈ ఘటనల తర్వాత పదోన్నతి, శౌర్యశాలి పతకం పొందిన పోలీసు అధికారిని వెనక్కి తీసుకోవాలి, సిల్‌గేర్ కాల్పుల ఘటనలో మరణించిన వారి కుటుంబానికి రూ. 50 లక్షల పరిహారం అందించాలి, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం యివ్వాలనే డిమాండ్లు వున్నాయని ఆయన అన్నారు.
పాండో తెగ ఆదివాసీల మరణంపై ప్రభుత్వం చర్యలు చేపట్టాలి
రిజర్వేషన్, పెసా చట్టానికి సంబంధించి వారి ఆందోళన కొనసాగుతోంది. రక్తహీనత వల్ల పాండో తెగ ప్రజలు మరణిస్తున్నారనే నివేదికలపై కూడా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. సర్వ్ ఆదివాసీ సమాజ్ ఈ రెండు సమస్యలను తన ఉద్యమానికి కొత్త డిమాండ్‌గా చేర్చింది.
సమాజ్‌లోని పోటాయీ వర్గం సెప్టెంబర్ 20 న బంద్‌ను ప్రకటించింది
సోమవారం నాడు వ్యాపార సంస్థలు, ప్రజా రవాణా పూర్తిగా ఆగిపోతాయి. ఇంతకుముందు ఆగస్టు 30 న సర్వ్ ఆదివాసీ సమాజ్ హైవేలు, రైల్వేలలో గూడ్స్ క్యారియర్‌లను నిలిపివేసే ఆందోళన చేసింది.
అడ్స్మేటా, సర్కేగూడ, తాడ్మెట్లలో ఏం జరిగింది?
2013 మే 17 రాత్రి, భద్రతా దళాల ఆపరేషన్ బృందం బీజాపూర్‌లోని అడ్స్మేటా గ్రామంలో జరిపిన కాల్పుల్లో భద్రతా సిబ్బంది సహా 11 మంది మరణించారు. వారిలో నలుగురు పిల్లలు ఉన్నారు. పోలీసులు దీనిని ఎన్‌కౌంటర్ అన్నారు. సెప్టెంబర్ 8 న, జస్టిస్ వికె అగర్వాల్ నేతృత్వంలోని న్యాయ విచారణ కమిషన్ ప్రభుత్వానికి ఇచ్చిన తన నివేదికలో పోలీసుల ఎన్‌కౌంటర్ దావాని తిరస్కరించింది.
2012 జూన్ లో సర్కేగూడ గ్రామంలో, బీజ్ పండుమ్ (విత్తనాల పండుగ) వేడుకలను జరుపుకోవడానికి తరలివచ్చిన గ్రామస్థులపై ఈ కాల్పులు జరిగాయి, దీనిని పోలీసులు ఎన్‌కౌంటర్ అన్నారు. ఇందులో 17 మంది గ్రామస్తులు మరణించారు.
2010 ఏప్రిల్ 6నాడు సుక్మాలోని తాడ్మెట్ల గ్రామం సమీపంలో సిఆర్‌పిఎఫ్‌పై అతి పెద్ద దాడి జరిగింది. ఇందులో 76 మంది పోలీసులు
మరణించారు. మరుసటి సంవత్సరం, ఏప్రిల్ 11-16 తేదీల మధ్య, భద్రతా దళాలు తాడ్మెట్ల, మోర్‌పల్లి, తిమ్మాపూర్ గ్రామాలలోకి ప్రవేశించి కాల్పులు జరిపాయి. ఈ కేసు 2011 జూలైలో సిబిఐకి అప్పగించబడింది. సిబిఐ 2016 లో వేసిన ఛార్జిషీట్‌లో భద్రతా దళాలను బాధ్యుల్ని చేసింది.
ʹప్రభుత్వం డిమాండ్‌ను నెరవేరుస్తోంది కాబట్టి, ఉద్యమం వద్దుʹ - మరో వర్గం
సర్వ్ ఆదివాసీ సమాజ్ BPS నేతమ్ వర్గం సెప్టెంబర్ 20 బంద్‌ని వ్యతిరేకించింది. సమాజ్ రాష్ట్ర అధ్యక్షుడు భరత్ సింగ్ మాట్లాడుతూ, తన సంస్థకు మహాబంద్‌కు, సెప్టెంబర్ 20 ఆర్థిక దిగ్బంధంతో ఎలాంటి సంబంధం లేదన్నారు. ఆదివాసీ సంఘ్ డిమాండ్ల గురించి వారు ముఖ్యమంత్రి భూపేష్ బాఘేల్‌తో చర్చించారు. ముఖ్యమంత్రి ఈ సమస్యల పరిష్కారానికి చీఫ్ సెక్రటరీ అధ్యక్షతన ఒక కమిటీని ఏర్పాటు చేశారు.

Keywords : chattis garh, adivasi, bandh, fake encounter
(2024-04-18 20:36:05)



No. of visitors : 916

Suggested Posts


చత్తీస్ గడ్ ఎన్ కౌంటర్ పై మావోయిస్టు పార్టీ ప్రకటన

ఏప్రెల్ 3 న చత్తీస్ గడ్ లోని బీజాపూర్ జిల్లా, జీరగూడెం వద్ద పోలీసు బలగాలకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో 23 మంది పోలీసులు మరణించగా నలుగురు మావోయిస్టులు మరణించారు. ఈ నేపథ్యంలో భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ అధికార ప్రతినిధి వికల్స్ మీడియాకు విడుదల చేసిన

మావోయిస్టుల పై డ్రోన్ల ద్వారా బాంబు దాడులు చేస్తున్న ప్రభుత్వం ..... మావోయిస్టు నేత వికల్ప్ లేఖ‌

ఏప్రిల్ 19 న తెల్లవారుజామున 3 గంటలకు, బీజాపూర్ జిల్లాలోని పమీద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బోటలాపూర్ మరియు పాలగుడెం గ్రామాల మధ్య, కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు ఆకాశం నుండి డ్రోన్ల ద్వారా బాంబు దాడులను చేశాయి.

బస్తర్ లో వేలాదిమందితో భారీ బహిరంగ సభ... రామకృష్ణ స్తూపావిష్కరణ‌

జూలై 28 నుంచి ఆగస్టు 3వ తేదీ వరకు జరిగిన అమరుల వారోత్సవాల సందర్భంగా దేశవ్యాప్తంగా అనేక చోట్ల ర్యాలీలు, సభలు, సమావేశాలు జరిగాయి. తెలంగాణ అటవీ ప్రాంతంలో, ఏవోబీ, చత్తీస్ గడ్, బీహార్, జార్ఖండ్ ప్రాంతాల్లో బహిరంగ సభలు జరిగాయి.

ప్రధానికి ఐరాస నిపుణుల బృందం లేఖ - చత్తీస్ గడ్ లో మహిళలపై హింస, హిడ్మే మార్కమ్ అరెస్టుపై ఆగ్రహం

చత్తీస్ గడ్ లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమం నిర్వహించిన ఆదివాసీ మహిళ హిడ్మే మార్కమ్ ను పోలీసులు అరెస్టు చేయడాన్ని ఐక్యరాజ్యసమితి తప్పుబట్టింది. ఆమెపై కేసును వెంటనే ఎత్తివేయాలని ఏడుగురు ఐరాస నిపుణుల బృందం భారత ప్రధాని నరేంద్ర మోడీకి ఓ లేఖ రాసింది.

తమ వద్ద బందీగా ఉన్న జవాను ఫోటోను విడుదల చేసిన మావోయిస్టులు

చత్తీస్ గడ్ లో ఏప్రెల్ 3 వ తేదీన పోలీసులకు మావోయిస్టులకు జరిగిన ఎన్ కౌంటర్ తర్వాత మావోయిస్టులకు బందీగా చిక్కిన సీఆర్పీఎఫ్ జవాను క్షేమంగా ఉన్నాడు. ఈ మేరకు సీపీఐ మావోయిస్టు పార్టీ ఓ ఫోటోను రిలీజ్ చేసింది. ఆ ఫోటోలో CRPF జవాను రాకేశ్వర్ సింగ్ కూర్చొని ఎవరితోనో మాట్లాడుతూ ఉన్నట్టు తెలుస్తోంది.

హెచ్‌ఐవి పాజిటివ్ బాలికలు,వారి లాయర్ పై దుర్మార్గంగా దాడి చేసిన పోలీసులు

ఛత్తీస్‌ఘడ్ పోలీసులు, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు హెచ్ఐవి సోకిన 14 మంది బాలికలు, న్యాయవాది ప్రియాంక శుక్లాలపై దారుణంగా దాడి చేసి రక్తాలు వచ్చేలా కొట్టి వారందరినీ గుర్తు తెలియని ప్రదేశానికి ఎత్తుకెళ్ళారు.

ʹపోలీసు కాల్పుల్లో చనిపోయింది ముగ్గురు కాదు 9 మంది, 16 మందికి గాయాలుʹ

చత్తీస్ గడ్ సుక్మా-బీజాపూర్ సరిహద్దులోని తారెమ్‌లోని మోకూర్ క్యాంప్ కు వ్యతిరేకంగా నిరసనతెలుపుతున్న ఆదివాసులపై పోలీసులు ఏకపక్షంగా కాల్పులు జరిపారని స్థానికులు ఆరోపిస్తున్నారు.

పోలీసులు ప్రయోగించిన డ్రోన్లను కూల్చి వేసిన మావోయిస్టులు - మరో లేఖ, చిత్రాలు విడుదల

దండకారణ్యంలో ప్రజా సమూహాలపై పోలీసులు ప్రయోగించిన డ్రోన్లను కొన్నింటిని మావోయిస్టు పార్టీ పీఎల్జీఏ దళాలు కూల్చి వేశాయి. ఈ మేరకు కూలిన డ్రోన్ల చిత్రాలను, ఓ లేఖను మావోయిస్టు పార్టీ ఈ రోజు విడుదల చేసింది.

మావోయిస్టు ప్రాంతాల్లో సర్వే: సైనిక దాడులు కాదు...శాంతి చర్చలు కావాలంటున్న 92 శాతం ప్రజలు

మావోయిస్టులకు, పోలీసులకు మధ్య సాయుధ‌ ఘర్షణలు జరుగుతున్న‌ఛత్తీస్గడ్ ‌లోని పలు ప్రాంతాల్లో ఓ సర్వే జరిగింది. స్థానిక ఆదివాసీ భాషలైన గోండీ, హల్బీ బాషలతో పాటు హిందీ భాషలో ఈ సర్వే నిర్వహించబడింది. ఈ ప్రాంతాల్లో సంఘర్షణ ఆపడానికి శాంతి చర్చలు మార్గమా లేక మిలటరీ దాడులా ? ఏది సరైనదని ఆదివాసులు అభిప్రాయపడుతున్నారో తెలుసుకోవడానికి ఈ సర్వే నిర్వహించబడింది.

మావోయిస్టు మధుకర్ కరోనాతో చనిపోలేదు,పోలీసులే చంపేశారు -మావోయిస్టు పార్టీ ప్రకటన‌

జూన్ 1వ తేదీన తెలంగాణ పోలీసులు అరెస్టు చేసిన మావోయిస్టు పార్టీ నాయకుడు గడ్డం మధుకర్ ఎలియాస్ శోభరాయ్ కరోనా తో చనిపోలేదని అతనిని పోలీసులే హత్య చేశారని మావోయిస్టు పార్టీ ప్రకటించింది.

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


సెప్టెంబర్