include 'men';
?>
ములుగు జిల్లాలో ఇవ్వాళ్ళ జరిగిన ఎన్ కౌంటర్ బూటకం - బంద్ కు పిలుపునిచ్చిన మావోయిస్టులు
25-10-2021
తెలంగాణలో మరో సారి ఎన్ కౌంటర్ పేరుతో నెత్తురు పారింది. ములుగు జిల్లా వేజేడు మండలం టేకుల గూడెం ప్రాతంలో తెలంగాణ గ్రే హౌండ్స్ చేసిన ఎన్ కౌంటర్ లో ముగ్గురు మావోయిస్టులు మరణించారు. ఇది బూటకపు ఎన్ కౌంటరే అని సీపీఐ మావోయిస్టు ప్రకటించింది. ఈ బూటకపు ఎన్ కౌంటర్ కు నిరసనగా ఈ నెల 27న బంద్ కు పిలుపునిస్తూ ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ ఓ ప్రకటన విడుదల చేశారు.
ఆ ప్రకటన పూర్తి పాఠం....
25.10.2021
ములుగు జిల్లా వాజేడు మండలం టేకుల గూడెం అటవీ ప్రాంతంలో ఈ రోజు తెలంగాణ రాష్ట్ర గ్రేహౌండ్స్ పోలీసులు పక్క సమాచారంతో మా బలగాలను వందలాది మందితో చుట్టు ముట్టి దొంగ దెబ్బ కొట్టారు. ఈ దాడిని టీఆర్ఎస్ ప్రభుత్వం పక్క ప్లాన్ తో చేయించింది. ఇది ముమ్మాటికి బూటకపు ఎన్ కౌంటరే. మానవ రక్తానికి మరిగిన టిఆర్ఎస్ ప్రభుత్వం విప్లవ కారులను హత్యలు చేసి ప్లీనం పేరిట నెత్తుటి వాళి అడుతుంది. తెలంగాణలో అభివ్రుద్ధి ని వల్లిస్తున్న టిఆర్ఎస్ ప్రభుత్వానికి వారి స్వంత లాభాల కోసం ప్రజా పోరాటాలను, విప్లవ కారులను హత్యలు చేయడమే లక్ష్యంగా పెట్టుకొని తెలంగాణలో కేసిఆర్ నియంత్రుత్వ పాలనను కొనసాగిస్తున్నాడు. ఈ నెల కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో ముఖ్య మంత్రుల భేటీ తరువాత వ్యూహాత్మక సమాధాన్ దాడి లక్ష్యంలో భాగంగా కేసిఆర్ రెట్టించిన ఉత్సతో అణిచివేతకు పూనుకుంటున్నాడు. నీచమైన ఆక్రుత్యాలకు పాల్పడుతున్న టీఆర్ఎస్ ప్రభుత్వానికి విప్లవ ప్రజలు బుద్ధి చెప్పక మానరు.
ఈ దాడిలో ముగ్గురు కామేడ్స్ అమరులయ్యారు. నరోటి దామాల్ (ఏసిఎం), మహారాష్ట్ర గడిచి రోలి జిల్లా జారవేడ గ్రామం. పార్టీ సభ్యులు సోడి రామాల్ ది బీజా పూర్ జిల్లా బాసగూడెం ప్రాంతం మల్లిపాడు గ్రామం. పూనెం బద్రు ది బీజాపూర్ జిల్లా గంగులూర్ ఎరియా పెద్ద కోర్మ గ్రామానికి చెందిన వాడు. ఈ ముగ్గురు కూడా నీరు పేద ఆదివాసీ కుటుంబంలో జన్మించారు. పీడిత ప్రజల విముక్తి. తమ కుటుంబాలను, వ్యక్తి గత ప్రయోజనాలను త్రుణ సాయంగా వదిలి విప్లవోద్యంలో చేరారు. ప్రపంచ సోషలిస్టు విప్లవమే వారి లక్ష్యంగా సెంట్రల్ రీజనల్ కంపెనీ నిర్మాణంలో పని చేస్తున్నారు. అందుకోసమే దోపిడి వర్గాల ప్రయోజనాలను కాంక్షించే పాలక వర్గాలు ఈ ఆదివాసి ముద్దు బిడ్డలను పెట్టుకుంటున్నాయి. పీడిత ప్రజల పక్షాన నిలిచి తమ నులువెచ్చని రక్తాన్ని ధార పోసినా ఈ కామ్రేడ్స్ కు వినయంగా జోహార్లు అర్పిద్దాం. వారి బంధూకలను అందుకొని వారి ఆశయాల నిజం చేద్దాం. ఈ బూటకపు ఎన్ కౌంటర్ కు నిరసనగా ఈ నెల 27న బందును పాటించమని విప్లవ శ్రేణులను, ప్రజలను అన్ని రకాల వ్యాపార యాజమాన్యులను కోరుచున్నాము.
జగన్,
అధికార ప్రతినిధి,
తెలంగాణ రాష్ట్ర కమిటీ,
భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు)
Keywords : Telangana, Mulugu, Vajedu, Encounter, Fake Encounter, Maoists, CPI Maoists, Bandh
(2024-04-14 19:54:28)
No. of visitors : 1603
Suggested Posts
| గూడ అంజన్నకు జోహార్లు !ʹఊరు మనదిరా.. ఈ వాడ మనదిరాʹ పాటతో అంజయ్యకు గుర్తింపు వచ్చింది. ఆయన రాసిన ఈ పాట తెలంగాణా ప్రతి పల్లె, ప్రతి ఇల్లు పాడుకుంది. ఆ పాట ప్రతి పల్లెలో సంఘం ఏర్పాటుకు మార్గమయ్యింది. ఈ ఊరు మనది... ఈ వాడ మనది.... దొర ఎవడురో అంటూ విప్లవకారుల నాయకత్వంలో తెలంగాణా పల్లెలు దొరల గడీల మీద... |
| విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్తెలంగాణను విముక్తి చేయడానికి వచ్చిందని చెప్పబడుతున్న సైన్యం 1948 సెప్టెంబర్18 నుంచి1951 అక్టోబర్ దాకా వేల మంది తెలంగాణ రైతుకూలీలను, పోరాటయోధులను కాల్చిచంపింది. నైజాం సైన్యాలు, రజాకార్లు చేసిన హత్యల కన్న, 1948 సెప్టెంబర్ తర్వాత కేంద్రప్రభుత్వ సైనిక బలగాలు చేసిన హత్యలు,అకృత్యాలు ఎక్కువ.... |
|
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్సెప్టెంబర్ 17, 1948 ని ʹహైదరాబాద్ విమోచన దినంʹ అని అభివర్ణిస్తే చరిత్ర మాత్రం ఫక్కున నవ్వుతుంది. ఏ ఒక్క చారిత్రక కోణం నుంచి చూసినా అది తెలంగాణ విమోచన కాదు. కావడానికి అవకాశం లేదు. ఎక్కువలో ఎక్కువ అది హైదరాబాద్ రాజ్యాన్ని భారత ప్రభుత్వ పాలన... |
| జైళ్ళలో పేదలే మగ్గుతున్నారు... ప్రజలకు పోలీసులతో ఎలాంటి లాభం లేదు... తెలంగాణ ఐపీఎస్ అధికారి
ʹభారత దేశం జైళ్ళలో 90 శాతం పేదలే మగ్గుతున్నారు. కొంతమందికి కనీసం ఎందుకు అరెస్ట్ అయ్యామో.. ఏ కేసులో అరెస్ట్ అయ్యి జైల్కు వచ్చామో కూడా తెలియదుʹʹ ఈ మాటలన్నది హక్కుల సంఘాల కార్యకర్తలు కాదు. కమ్యూనిస్టులు కాదు. మావోయిస్టులసలే కాదు. ఓ ఐపీఎస్ అధికారి ఈ మాటలు మాట్లాడారు. |
| కామ్రేడ్ మారోజు వీరన్న స్థూపాన్ని కాపాడుకుందాం - విరసంకామ్రేడ్ మారోజు వీరన్న స్మృతి చిహ్నాన్ని తొలగించాలని తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ప్రజల కనీస అవసరాలు తీర్చలేని పాలకులు విధ్వంసకర అభివృద్దిని శరవేగంగా ముందుకు తీసుకొనిపోతున్నారు.... |
| సమైక్య సభలో తెలంగాణను నినదించిన శ్రీనివాస్ గౌడ్ ను తెలంగాణ ప్రభుత్వం సస్పెండ్ చేసిందిసమైక్య గూండాల చేతుల్లో దెబ్బలు తిని నెత్తురోడుతూ కూడా జై తెలంగాణ అని నినదించిన చేగోను... లాఠీలతో చితకబాదుతున్నా... ఆగకుండా తెలంగాణను నినధించిన పోలీసు శ్రీనివాస గౌడ్ నుమర్చి పోగలమా ? తన నేల తల్లి విముక్తి కోసం ఉద్యోగాన్ని లెక్క చేయకుండా నినాదాలు చేసి.... |
| ʹనా భర్తను పోలీసులు కొట్టి చంపారుʹరాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట పోలీసులు కరీంనగర్ జిల్లా బావుపేటకి చెందిన వెంకటేశ్ ను దొంగతనం చేశాడనే పేరుతో అరెస్ట్ చేశారు. జులై 13 న కోర్టులో హాజరుపరచగా వెంకటేశ్ నుకోర్టు జ్యుడిషియల్ కస్టడికి ఆదేశించింది. ఆరోగ్యంబాగా లేదని చెప్పి వెంకటేష్ ను.... |
| ఉస్మానియా గుండె నిండా... ఈ దేశపు విప్లవ జెండాఉస్మానియాలో ఆరెస్యూ నాయకులైన రాంచందర్, మల్లోజుల కోటేశ్వర్ రావు, పటేల్ సుధాకర్, సంతోష్ రెడ్డి ఎలియాస్ మహేష్ , ఆ తర్వాత కాలంలో మావోయిస్టు పార్టీ నాయకత్వంలో ప్రత్యామ్నాయ రాజకీయాలతో భారత దేశంలో సాగుతున్న విప్లవానికి నాయకత్వం వహించినవారు... దేశ విప్లవంలో తమ ప్రాణాలను త్యాగం చేసిన మారోజు వీరన్న, దామోదర్ రెడ్డి, విజయ కుమార్, రామేశ్వర్ లు ఉస్మానియా... |
| మార్చ్13 ఎంఆర్పిఎస్ బంద్ ను విజయవంత చేయండి - మావోయిస్టు పార్టీ ప్రకటనఇరవయ్యేళ్లకు పూర్వమే ముఖ్యమంత్రి నివాసాన్ని లక్షలాది మందితో ముట్టడించడం మొదలు గాంధీభవన్ ముట్టడి, పెరేడ్ గ్రౌండ్స్లో మెరుపు సమ్మె, కలెక్టరాఫీసుల ముందు ధర్నాలు, పాలకవర్గాల ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా భారతీ మాదిగ స్మృతిలో ఊరేగింపు వంటి ఎన్నో మిలిటెంట్ ఉద్యమాలు నిర్వహించారు. |
| కెసిఆర్ రెండేళ్లపాలన - విద్యారంగం - వరవరరావు
ఒక తెలంగాణ కవి తెలంగాణ ప్రభుత్వాధినేతను గరుత్మంతునితో పోల్చాడు. చూపు బహు తీక్షణం అని, రెండు కండ్ల తార్మికుడని, ఈ గరుత్మంతుని ముక్కు అంత పెద్దదని ఎంత ఎత్తుకు ఎదిగినా గూడు లేని తెలంగాణ గుడ్డుమీదే ధ్యాస అని అభివర్ణించాడు. |
| కేసీఆర్ కుటుంబానికి చెందిన అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్ |
| రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్ |
| నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు |
| 24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే ! |
| డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు |
| ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ |
| హుస్నాబాద్ స్తూపం స్థలాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక
|
| కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు |
| 5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన |
| ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా? |
| తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
|
| అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
|
| పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన |
| వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2) |
| వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1) |
| విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్ |
| హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ |
| అనారోగ్యంతో ఉన్న మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు |
| మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన |
| మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ ! |
| సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ |
| తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శన్ స్తూపావిష్కరణ |
| గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది -మావోయిస్టు పార్టీ |
| గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం |
more..