333 రోజులు...600 మరణాలు...కుట్రలు, దాడులు, హత్యలను ఎదుర్కొంటూ అప్రతిహతంగా సాగుతున్న రైతాంగ ఉద్యమం
26-10-2021
శరీరాలను మండించే ఎండలు... ఎముకలు కొరికే చలి.... మనుషులను చంపే వడగళ్ళవానలు.... ప్రభుత్వ కుట్రలు... హత్యా ప్రయత్నాలు....హత్యలు...దాడులు...దుష్ప్రచారాలు.... 600మంది సహచరుల మరణం...వీటన్నింటినీ భరిస్తూ, ఎదిరిస్తూ 333 రోజులుగా రైతులు ఉద్యమిస్తున్నారు.
కేంద్రం తీసుకవచ్చిన మూడు ప్రజా వ్యతిరేక, కార్పోరేట్ అనుకూల వ్యవసాయ చట్టాల రద్దు డిమాండ్ తో 11నెలల క్రితం 2020, నవంబర్ 26 నాడు పంజాబ్ నుండి వేలాది మంది రైతులు పోలీసుల అడ్డంకులు దాటుకొని ఢిల్లీ సరిహద్దుల్లోని సింఘు, టిక్రీ కి చేరుకొని అక్కడే రోడ్డుపై బైటాయించారు. ఇక అక్కడి నుండి ఉద్యమం రోజురోజుకూ పుంజుకుంది. విస్తరించింది. ఢిల్లీ సరిహద్దుల్లో వేల మంది కాస్తా లక్షలకు చేరుకుంది. ప్రారంభంలో సింఘు, టిక్రీ ల్లో మాత్రమే బైటాయించిన రైతులు అనంతరం ఘాజీపూర్ లో కూడా రైతులు రోడ్లపై బైటాయించారు.
ముందుగా పంజాబ్ నుండి మొదలైన ఉద్యమం అనంతరం హర్యాణా, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరాఖండ్, బీహార్, మహారాష్ట్రలకు కూడా విస్తరించింది. దక్షిణభారతం నుండి కూడా వేల మంది రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో జరుగుతున్న రైతుల నిరసనల్లో పాలుపంచుకున్నారు.
ఉద్యమం ఊపందుకున్నాకొద్దీ కేంద్రప్రభుత్వ కుట్రలు కూడా పెరిగాయి. ఉద్యమాన్ని అణిచివేయడానికి హింసని ప్రయోగించింది. పోలీసులే కాక బీజేపీ కార్యకర్తలు కూడా రైతులపై దాడులకు తెగబడ్డారు. మరో వైపు ఉద్యమంపై దుష్ప్రచారానికి తెరతీసింది. అయినప్పటికీ రైతుల ఐక్యతను బద్దలు చేయలేకపోయింది ప్రభుత్వం.
ʹనిరసనను విచ్ఛిన్నం చేయడానికి చాలా కుట్రలు జరుగుతున్నాయి, అయితే రైతులు అప్రమత్తంగా ఉన్నారు.ప్రభుత్వ కుట్రలను ప్రతిఘటిస్తున్నారు. సింఘూ సరిహద్దులో నిహాంగ్ సిక్కులు ఒక వ్యక్తిని కొట్టి చంపడం, అనేక వ్యవసాయ సంస్థలు చట్టాలకు అనుకూలంగా ఉన్నాయని, పోరాటాలు త్వరలోనే ముగిసి పోతాయని కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ప్రకటించడం, కేంద్ర మంత్రులు రైతు అగ్ర నాయకులతో టచ్ లో ఉన్నారని త్వరలోనే పోరాటం ముగిసిపోతుందని తాజాగా పంజాబ్ మాజీ సీఎం అమరీందర్ సింగ్ పేర్కొనడం, ఇవన్నీ రైతుల ఐక్యతను దెబ్బకొట్టడానికి వేసే ఎత్తుగడలుʹʹ అని సంయుక్త కిసాన్ మోర్చా (SKM) నాయకుడు దర్శన్ పాల్ అన్నారు.
ఈ ఉద్యమాన్ని దెబ్బకొట్టడానికి భవిష్యత్తులో మరిన్ని ప్రయత్నాలు జరుగుతాయని రైతులు భావిస్తున్నారు. రైతులపై భౌతిక దాడులు చేయడాని 1,000 మందిని రెడీ చేయాలని హర్యానాలోని బిజెపి ప్రభుత్వ పెద్దలు ఇప్పటికే బీజేపీ కార్యకర్తలను ఆదేశించారని రైతు సంఘాలు ఆరోపించాయి.
BKU (ఏక్తా దకుండా) ప్రధాన కార్యదర్శి జగ్మోహన్ సింగ్ మాట్లాడుతూ, గత 11 నెలల్లో, మండి వ్యవస్థను నిర్వీర్యం చేయడానికి ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలను చేస్తోందన్నారు. ప్రభుత్వ మద్దతు ధర లేకుండానే తమ దాన్యాన్ని, ఇతర సరుకులను అమ్మాలని రైతులపై తీవ్ర వత్తిడి తెస్తున్నారని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వం. ʹకార్పొరేట్లకు లబ్ది చేకూర్చే ఈ బహిరంగ దోపిడీ నుండి రైతులను రక్షించాలంటే ప్రతి రైతుకు ప్రతి వస్తువుకు కనీస మద్దతు ధర (MSP) ఇవ్వాల్సిందే. ఈ డిమాండ్ వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలనే డిమాండ్ నుండి విడదీయరానిది, ʹ అన్నారాయన.
ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖేరీ జిల్లాలోని టికునియా గ్రామంలో నలుగురు రైతులను బీజేపీ నాయకులు చంపడం, బిజెపి నాయకులను వ్యతిరేకిస్తూ, పోరాట సంకల్పాన్ని మరింత దృఢపరిచిందని రైతు ఉద్యమంలో అగ్రగామిగా ఉన్న BKU (ఏక్తా ఉగ్రహన్) అధ్యక్షుడు జోగీందర్ సింగ్ ఉగ్రహన్ అన్నారు. ʹʹచివరి వరకు ఎలాంటి వెనకడుగు లేకుండా పోరాడుతూనే ఉంటాం. రైతుల పోరాటం సాధారణ నిరసన కాదు, శక్తివంతమైన ప్రభుత్వాలను ఎదుర్కోవడానికి సంకల్పం ఎంత అవసరమో ప్రపంచానికి చూపించిన మార్గనిర్దేశం, ʹఅని ఉగ్రహన్ అన్నారు.
సంయుక్త కిసాన్ మోర్చా (SKM) 11 నెలల ఆందోళనకు గుర్తుగా మంగళవారం ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు హర్యానాలోని బంగర్ బెల్ట్కు చెందిన రైతులు జింద్ మరియు కైతాల్ జిల్లాల్లోని వివిధ సబ్డివిజన్లలోని కీలక కార్యాలయాలను ముట్టడించారు.
11నెలలుగా అప్రతిహతంగా సాగుతున్న ఈ దేశ రైతాంగ ఉద్యమాన్ని ఎలాగైనా అణిచివేసి తాము ఎలాంటి రాజీ లేకుండా కార్పోరేట్ సంస్థలవైపు మాత్రమే ఉన్నామని నిరూపించుకునేందుకు పాలకులు ప్రయత్నిస్తూ ఉండగా, 600 సహచరుల ప్రాణాలు కోల్పోయి, కష్టాల బాటలో సాగుతున్న రైతాంగపోరాటం విజయవంతం కావాలని ఈ దేశ ప్రజలు కోరుకుంటున్నారు.
Keywords : farmers protest, delhi, punjab, haryana, uttar pradesh, Farmersʹ protest: 333 days & 600 deaths later, stir still strong
(2024-03-24 12:08:27)
No. of visitors : 657
Suggested Posts
| అవార్డులను వాపస్ చేయడానికి రాష్ట్రపతి భవన్ వైపు మార్చ్ చేసిన క్రీడాకారులు
- అడ్డుకున్న పోలీసులురైతు చట్టాల విషయంలో కేంద్రం ప్రవర్తిస్తున్న తీరును నిరసిస్తూ క్రీడా రంగంలో వివిధ అవార్డులు అందుకున్న వారుఇవ్వాళ్ళ రాష్ట్రపతి భవన్ వైపు మార్చ్ నిర్వహించారు. |
| తీవ్రమైన రైతుల ఉద్యమం - రాజకీయ ఖైదీలను రిలీజ్ చేయాలని డిమాండ్ఢిల్లీ సరిహద్దుల్లోని టిక్రీ వద్ద భారతీయ కిసాన్ యూనియన్ (ఏక్తా ఉగ్రహాన్) ఆద్వర్యంలో జరిగిన ఈ కార్యక్రంలో రాజకీయ ఖైదీలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అక్రమ అరెస్టుకు గురై జైళ్ళలో ఉన్న వరవరరావు, సుధా భరద్వాజ్, ఆనంద్ తేల్తుంబ్డే, గౌతమ్ నవాలఖా తో సహా ఎల్గర్ పరిషథ్ కేసులో ఉన్న వారందరినీ విడుదల చేయాలని అదే విధంగా ఢిల్లీలో అక్రమ కేసులు బనాయించి అరెస్టు చే |
| రైతు ఉద్యమానికి మద్దతుపలికిన బాలీవుడ్ ప్రముఖులపై ఐటీ దాడులు
దేశంలో కొనసాగుతున్న రైతుల ఉద్యమానికి మద్దతుపలికిన బాలీ వుడ్ ప్రముఖుల ఇళ్ళపై ఆదాయపు పన్ను శాఖ రైడ్స్ నిర్చహించింది. నిర్మాత, దర్శకుడు అనురాగ్ కాశ్యప్, హీరోయిన్ తాప్సీ పన్ను ఇళ్ళపై ఈ రోజు ఆదాయపు పన్ను శాఖ రైడ్స్ నిర్చహించింది. |
| ఈ ఫోటో తీసిన జర్నలిస్టుపై దాడి - ప్రభుత్వ వాహనంలో వచ్చిన అగంతకులు
ఆ ఫోటో తీసిన జర్నలిస్టు రవి చౌదరిపై ఈ రోజు దాడి జరిగింది. ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్ లో గంగా కాలువ రోడ్డులో ఓ ప్రభుత్వ వాహనంలో వచ్చిన కొందరు అగంతకులు తనపై దాడి చేశారని రవి తెలిపాడు. |
| ఈ నెల 27న రైతు సంఘాల భారత్ బంద్ - విజయవంతం చేయాలని మావోయిస్టు పార్టీ పిలుపు
గత 10 మాసాల రైతాంగ ఉద్యమంలో అపూర్వ స్థాయిలో 5 సెప్టెంబర్ నాడు ముజఫర్ నగర్ లో భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) సహ సంయుక్త కిసాన్ మోర్చాతో పాటు కేంద్ర సాగు చట్టాలను వ్యతిరేకిస్తున్న అనేక రైతు సంఘాల పిలుపుపై జరుపతల పెట్టిన కిసాన్ మహా పంచాయత్ తో బెంబేలు పడిన ఉత్తర ప్రదేశ్ అదిత్యనాథ్ యోగీ సర్కార్ దానిని |
| దేశంలో ప్రజాపోరాటాలు ఆగవు... వాటికి నాయకత్వం వహించకుండా ఏశక్తీ మమ్మల్ని అడ్డుకోలేదు - మావోయిస్టు పార్టీ ప్రకటన
ప్రజా వీరులు గేంద్ సింగ్, బాబూరావు సడ్మెక్, గుండాదుర్, బిర్సాముండా, సిద్ధ-కానో, జ్యోతిబా ఫూలే, భగత్ సింగ్, రామరాజు, కొంరంభీం, బాబా సాహెబ్ అంబేడ్కర్, పెరియార్ మున్నగు అనేక మంది మహనీయుల పేర్లు ఉచ్ఛరించడానికైనా నైతిక అర్హతలేని బ్రాహ్మణీయ హిందుత్వ శక్తులు వారిని ముందు పెట్టి శాహీన్ బాగ్ నుండి సిల్గేర్ వరకు ప్రజా పోరాటాలను నెత్తురుటేరులలో ముంచడాన్ని మా పార్టీ |
| ఎర్ర కోట వద్ద జరిగిన హింస బీజేపీ కుట్రే - మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రకటన మోదీ ప్రభుత్వం తెచ్చిన మూడు రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోనూ, దేశవ్యాప్తంగానూ ఐక్యంగా, దృఢ సంకల్పంతో నిరంతరాయంగా పోరాడుతున్న రైతులకు భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) మరొకసారి విప్లవాభినందనలతో లాల్ సలాం చెబుతున్నది. |
| రైతాంగ ఉద్యమానికి మద్దతు ప్రకటించిన క్రాంతికారీ జనతన సర్కార్
నిరంతరం విస్తరిస్తున్న, తీవ్రతరం అవుతున్నదేశవ్యాప్త రైతు ఉద్యమాన్ని దెబ్బ తీయడానికి కేంద్ర ప్రభుత్వం జనవరి 26 న ఎర్రకోట కుట్రను అమలు చేసింది, దీనిని జనతన ప్రభుత్వం తీవ్రంగా ఖండిస్తున్నది. |
| ఉల్లిగడ్డలు తినకపోతే చస్తారా -మంత్రి గారి దబాయింపువాళ్ళ పొరపాట్లను ఎత్తి చూపితే పాలకులకు ఆవేశం పొంగుకొస్తుంది. వాళ్ళను ప్రశ్నలడిగితే చిర్రెత్తుకొస్తుంది. అడిగిన వారినే దబాయిస్తారు. బెదిరిస్తారు. ఈ మంత్రి కూడా అదే చేశారు..... |
| కెనడాలోని పాఠశాలల్లో భారత్ రైతు ఉద్యమ పాఠ్యాంశాలు... తొలగించాలని భారత్ లేఖభారత దేశంలో సాగుతున్న రైతుల ఉద్యమం గురించి కెనడాలోని కొన్ని పాఠశాలల్లో పాఠ్యాంశాలు ప్రవేశపెట్టడాన్ని భారత ప్రభుత్వం వ్యతిరేకింది. ఆ పాఠ్యాంశాలను వెంటనే తొలగించాలని కెనడాలోని భారత కాన్సులేట్ అంటారియో ప్రావిన్స్లోని |