తెలుగు రాష్ట్రాల్లో ప్రజా సంఘాల కార్యకర్తల ఇళ్ళపై NIA దాడులు - ఖండించిన ప్రజా సంఘాలు
18-11-2021
నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ NIA ఇవ్వాళ్ళ రెండు తెలుగురాష్ట్రాల్లోని ఏడు జిల్లాల్లో 14 ఇళ్ళల్లో సోదాలు నిర్వహించింది. తెలంగాణ లోని హైదరాబాద్, మెదక్, రంగా రెడ్డి జిల్లాల్లో, ఏపీ లోని విశాఖపట్నం, విజయవాడ, నెల్లూరు, ఒంగోలు జిల్లాల్లో ఈ సోదాలు జరిగాయి.
NIA సోదాలు నిర్వహించిన వారి వివరాలు:
1)కె.రవిచందర్, అధ్యక్షుడు, తెలంగాణ ప్రజా ఫ్రంట్(TPF), ఎల్బీనగర్- హైదరాబాద్
2)నార్ల రవి, 3)బి. అనురాధ, హిందూత్వ ఫాసిస్టు దాడి వ్యతిరేక వేదిక, నాగోల్- హైదరాబాద్,
4)బి.పద్మ, న్యాయశాస్త్ర విద్యార్థిని- హైదరాబాద్
5)అరుణాంక్ లత, కవి, హైదరాబాద్
6)పద్మ కుమారి, 7)భవాని --అమరుల బంధుమిత్రుల సంఘం, హైదరాబాద్
8)జి.కళ్యాణ రావు,విప్లవ రచయితల సంఘం, ఆలకురపాడు, ప్రకాశం జిల్లా
9)మాచర్ల మోహన్ రావు, చేనేత సంఘం నాయకుడు, చీరాల, ప్రకాశం జిల్లా
10)అరసవెల్లి కృష్ణ, విప్లవ రచయితల సంఘం- విజయవాడ
11)డప్పు రమేష్, ప్రజాకళాకారుడు-విజయవాడ
12)ఎం శ్రీనివాసరావు,విరసం, 13)అన్నపూర్ణ, చైతన్య మహిళా సంఘం-విశాఖపట్నం
14)రమణయ్య, అమరుల బంధుమిత్రుల సంఘం, నెల్లూరు.
కాగా 2019 జూలై 28 వ తేదీన చత్తీస్ గడ్ బస్తర్ జిల్లాలో జరిగిన ఓ ఎన్ కౌంటర్ లో ఆరుగురు మావోయిస్టులు, ఒక గ్రామస్తుడు మరణించారు. ఈ కేసుకు సబంధించి స్థానిక పోలీసులు ఎఫ్ ఐ ఆర్ నమోదు చేసినప్పటికీ ఈ ఏడాది మార్చ్ లో NIA, నిందితులైన సంజు ఎలియాస్ పాండు పూనెం, లక్ష్మణ్, మున్నీ, దాశరితో సహా 30-40 మంది గుర్తు తెలియని వ్యక్తులపై కేసును తిరిగి నమోదు చేసింది. ఈ కేసుకు సంబంధించి సంజు అనే నిందితుడు ఇచ్చిన వాగ్మూలం మేరకు ఇవ్వాళ్ళ ఈ సోదాలు నిర్వహించినట్టు NIA ప్రకటించింది.
ఉదయం 5, 6 గంటలకు మొదలైన ఈ సోదాలు సాయంత్రం 6 గంటల వరకు కొనసాగాయి. ఇలా సోదాలు నిర్వహించడం అప్రజాస్వామికమని విప్లవ రచయిత కళ్యాణ్ రావు మండిపడ్డారు. ప్రజాసంఘాల కార్యకర్తలపై NIA సాగిస్తున్న దాడులను సీపీఐ ఎంఎల్ న్యూ డెమాక్రసీ తో సహా వివిధ సంఘాలు ఖండించాయి. ఈ మేరకు న్యూ డెమాక్రసీ, విప్లవ రచయితల సంఘం, పౌరహక్కుల సంఘం, అమరుల బంధు మిత్రుల సంఘం వేరు వేరు ప్రకటనలు విడుదల చేశాయి.
ప్రజా సంఘాల నాయకుల ఇళ్ళ పై NIA దాడులను ఖండించండి! సీపీఐ ఎంఎల్ న్యూ డెమాక్రసీ
నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA)ఆధ్వర్యంలో ఈరోజు (18-11-2021)న రాష్ట్ర రాజదాని హైదరాబాద్లో తెల్లవారి నుండే వివిధ ప్రజా సంఘాల కార్యకర్తల, నాయకుల ఇండ్లపై సోదాలు ప్రారంభమయ్యాయి. ఇంకా కొనసాగుతున్నట్లు గా తెలుస్తున్నది. వారి ఇళ్లలో నుండి సెల్ ఫోన్లు, ల్యాప్ టాప్ లు, హార్డ్ డిస్కులు, పుస్తకాలను స్వాధీనం చేసుకుంటున్నారు. ఇళ్లలోకి ఎవరినీ,ఆఖరికి ప్రెస్ వాళ్లను కూడా అనుమతించడం లేదు.భారీగా పోలీసులను మోహరించి, పరిసరాల ప్రజలను, కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు.
దశాబ్దాల తరబడి సమాజంలోని వివిధ వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్నసమస్యలకు పరిష్కారం కోసము,భావ ప్రకటనా స్వేచ్ఛ కోసం పని చేస్తున్న ఈ ప్రజా సంఘాల నాయకులపై దాడులు,తగు సమాచార మివ్వకుండా భయానక వాతావరణం లో సాగించడం అప్రజాస్వమికమని, నిరంకుశమని తెలియ చేస్తున్నాం.
తెలంగాణ రాష్ట్ర సాధనకోసం పోరాడిన
తెలంగాణ ప్రజా ఫ్రంట్(TPF) రాష్ట్ర అధ్యక్షులు రవి చందర్ ను, హిందూత్వ ఫాసిస్టు దాడి వ్యతిరేక వేదిక నాయకులైన రవి,అనురాధ లతో పాటు విద్యార్థులు బి.పద్మ, అరుణాంక్ లత లతో పాటు అమరుల బంధుమిత్రుల సంఘం నాయకులైన పద్మకుమారి ల ఇళ్లపై సాగిస్తున్న దాడులను సీపీఐ(ఎం ఎల్) న్యూడెమోక్రసీ ఖండిస్తున్నది.
ప్రజా సమస్యల పరిష్కారం కోసం పొరాడుతున్న వారిని అప్రజాస్వామిక పద్దతుల్లో, నిరంకుశ విధానాలతో అణచి వేయ చూడడానికి ప్రభుత్వాలు మానుకోవాలని కోరుతున్నాం.ఇప్పటికైనా రాజ్యాంగం ప్రకారం వ్యావహరించాలని కోరు తున్నాము.
విప్లవ అభినందనలతో
సాదినేని వెంకటేశ్వరావు
రాష్ట్ర కార్యదర్శి సీపీఐ(ఎం-ఎల్) న్యూడెమోక్రసీ
హైదరాబాద్ ,విద్యానగర్
అమరుల కుటుంబాలపై, అమరుల బంధుమిత్రుల సంఘం తదితర ప్రజా సంఘాల నాయకులపై ఎన్ఐఏ దాడులను ఖండించండి అమరుల బంధుమిత్రుల సంఘం
ఈ రోజు ఉదయం 6 గంటల నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజా సంఘాల నేతలు, రచయితల ఇండ్లపై ఎన్ఐఏ పోలీసులు దాడులు మొదలు పెట్టారు. హైదరాబాదులోని సుభాష్ నగర్లో ఉంటున్న అమరుల బంధుమిత్రుల సంఘం సహాయ కార్యదర్శి భవాని ఇంటి మీదికి కూడా పోయారు. చుట్టు ప్రక్కల ఇండ్ల వాళ్లను భయాందోళనకు గురి చేశారు. భవానీ ఇంట్లో సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి. అక్కడే ఉన్న ఏబీఎంఎస్ కార్యదర్శి పద్మకుమారిని ఉదయం నుంచి విచారణ పేరుతో పోలీసులు వేధిస్తున్నారు. గత ఇరవై ఏళ్లుగా ఆమె తీవ్ర అనారోగ్యంతో ఉన్నది. ప్రస్తుతం ఆమె గుండె సంబంధమైన వ్యాధితో తీవ్రంగా బాధపడుతోంది. ఆక్సిజన్ మిషన్ లేకుంటే ఉండలేని పరిస్థితి. ఈ పరిస్థితుల్లో ఉదయం నుంచి ఆమెను ఎన్ఐఏ పోలీసులు విచారణ పేరుతో వేధించడంతో ఆమె పరిస్థితి ప్రమాదకరంగా మారింది. దీంతో ఆస్పత్రికి తీసికెళుతున్నట్లు చెప్పి ఆటోలో తరలించారు. ఆ తర్వాత ఆస్పత్రికి వెళ్లమని ఆమెను ఒక్కదాన్నే వదిలేసినట్లుగా తెలిసింది. ఆమె ఆరోగ్యం ఆందోళనకరంగా ఉంది.
అలాగే నెల్లూరు జిల్లాలో అమరుల కుటుంబమైన రమణయ్య, బుచ్చెమ్మ దంపతుల ఇంటి మీద కూడా పోలీసులు దాడి చేసి ఇంకా సోదాలు నిర్వహిస్తున్నారు. గత ఏడాది జూన్ 25న విప్లవోద్యమంలో వారి కుమారుడు సునీల్ ఒక ప్రమాదంలో అమరుడయ్యాడు. ఆ సంగతి పత్రికల ద్వారా వాళ్లకు నాలుగు రోజుల కింద తెలిసింది. ఆ విషాదంలో ఉన్న ఆ కుటుంబంపై ఎన్ఐఏ పోలీసులు దాడి చేసి సోదాలు నిర్వహిస్తున్నారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో విరసం అధ్యక్షుడు అరసవిల్లి కృష్ణ, కళ్యాణరావు, బి. అనూరాధ, ఎన్. రవి, అన్నపూర్ణ తదితరుల ఇండ్లలో పోలీసులు సోదాలు చేస్తున్నారు. ఈ అప్రజాస్వామిక చర్యలను ఖండించాలని అమరుల బంధుమిత్రుల సంఘం విజ్ఞప్తి చేస్తోంది.
బి. అంజమ్మ
అధ్యక్షురాలు
ఏబీఎంఎస్
ఏపీ, తెలంగాణాలో NIA దాడులను ఖండించండి! పౌరహక్కుల సంఘం
నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA)ఆధ్వర్యంలో ఈరోజు 18-11-2021న ఉదయం 6 గంటల నుండి ఈక్రింది ప్రజా సంఘాల కార్యకర్తల ఇండ్లపై దాడులు చేసి, సెల్ ఫోన్లు, ల్యాప్ టాప్ లు, హార్డ్ డిస్కులు, పుస్తకాలను స్వాధీనం చేసుకుంటున్నారు. ఇళ్లలోకి ఎవరినీ, ప్రెస్ వాళ్లను కూడా అనుమతించకుండా, వందలాది మంది పోలీసులను పహారాగా ఉంచి, పరిసరాల ప్రజలను, కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో దశాబ్దాలుగా సమాజంలోని వివిధ వర్గాల ప్రజల పరిష్కారం కోసము, న్యాయబద్ధ హక్కుల సాధనకు...రాజ్యాంగబద్ధంగా ఈ ప్రజా సంఘాలు బహిరంగంగా తమ కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి.
*NIA దాడులకు గురైనవారు.*
1)కె.రవిచందర్, అధ్యక్షుడు, తెలంగాణ ప్రజా ఫ్రంట్(TPF), ఎల్బీనగర్- హైదరాబాద్ 2)నార్ల రవి, & 3)బి. అనురాధ, హిందూత్వ ఫాసిస్టు దాడి వ్యతిరేక వేదిక, నాగోల్- హైదరాబాద్ 4)బి.పద్మ, న్యాయశాస్త్ర విద్యార్థిని- హైదరాబాద్ 5)అరుణాంక్ లత, కవి, హైదరాబాద్ 6)పద్మ కుమారి, & 7)భవాని --అమరుల బంధుమిత్రుల సంఘం, హైదరాబాద్ 7)జి.కళ్యాణ రావు,విప్లవ రచయితల సంఘం, ఆలకురపాడు, ప్రకాశం జిల్లా 8)మాచర్ల మోహన్ రావు, చేనేత సంఘం నాయకుడు, చీరాల, ప్రకాశం జిల్లా 9)అరసవెల్లి కృష్ణ, విప్లవ రచయితల సంఘం- విజయవాడ 10)డప్పు రమేష్, ప్రజాకళాకారుడు-విజయవాడ 11)ఎం శ్రీనివాసరావు,విరసం, &12)అన్నపూర్ణ, చైతన్య మహిళా సంఘం-విశాఖపట్నం 13)రమణయ్య, అమరుల బంధుమిత్రుల సంఘం, నెల్లూరు.
NIA వారు ఇచ్చిన స్వాధీన పంచనామా ఆధారంగా Cr. No: 179/2019చత్తీస్గఢ్ రాష్ట్రం, నగర్నార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తిరియా గ్రామంలో 28.07.2019 నాడు జరిగిన ఎన్ కౌంటర్ లో ఆరుగురు మావోయిస్టులు మరియు ఒక పౌరుడు మృతిచెందారని, ఆ కేసులతో సంబంధాలు ఉన్నాయని ఆరోపణలతో కేంద్ర ప్రభుత్వం రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్న ప్రజాసంఘాల నాయకుల ఇండ్ల పైన దాడులు జరిగినాయని ప్రాధమికంగా తెలియవచ్చింది.
1. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు మేధావుల పై,ప్రజాసంఘాల కార్యకర్తల పై అక్రమంగా నమోదుచేస్తున్న UAPA కేసులు ఎత్తివేయాలి.
2. UAPA లాంటి నల్లచట్టాలను రద్దుచేయాలి.
3. విచారణ పేరుతో NIA కార్యాలయానికి ప్రజాసంఘాల నాయకులను పిలిపించుకొని గంటలతరబడి వేధింపులకు గురిచేసారు.
ఇకముందు ఇటువంటి వేధింపులను నిలిపివేయాలి.
4. ప్రజా సంఘాల పై ఇప్పుడు జరుగుతున్న ఈ ముడవ విడుత దాడిని తక్షణమే నిలిపివేయాలని పౌర హక్కుల సంఘం తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ కమిటీలు డిమాండ్ చేస్తున్నది.
1. గడ్డం లక్ష్మణ్. CLC President, TS
2. చిట్టిబాబు AP CLC President
3. N. నారాయణరావ్. CLC General Secretary, TS
4. CH. చంద్రశేఖర్ AP CLC General Secretary.
రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజా సంఘాల నాయకుల ఇండ్లపై పోలీసుల దాడులు విరసం
ఈ ఉదయం ఐదు గంటలకు ప్రకాశం జిల్లా ఆలకూరపాడులో విరసం సీనియర్ సభ్యుడు, ప్రముఖ రచయితల జి. కళ్యాణరావు ఇంటి మీదికి పోలీసులు వెళ్లారు. స్థానికులు చెబుతున్నదాని ప్రకారం బైటి రాష్ట్రాలకు చెందిన పోలీసులని తెలుస్తోంది. విశాఖపట్నంలో ప్రగతిశీల కార్మిక సంఘం నాయకురాలు అన్నపూర్ణ ఇంట్లో పోలీసులు సోదాలు మొదలు పెట్టారు. హైదరాబాదులోని సుభాష్నగర్లో అమరుల బంధుమిత్రుల సంఘం సహాయ కార్యదర్శి భవాని ఇంటికి పోలీసులు వెళ్లారు. అక్కడే ఆ సంస్థ కార్యదర్శి పద్మకుమారి ఉన్నట్లు తెలుస్తోంది. పెద్ద ఎత్తున పోలీసులు బస్తీని చుట్టుముట్టి ఎవరినీ ఇండ్లలోంచి బైటికి రాకుండా చేశారని తెలుస్తున్నది. హైదరాబాదులో ప్రముఖ రచయితలు, అనువాదకులు బి. అనూరాధ, ఎన్. రవి దంపతుల ఇంట్లో సోదాలు జరుగుతున్నట్లు తెలుస్తున్నది.
ప్రజా సంఘాల నాయకుల, సాహిత్యకారుల కార్యకలాపాలను అడ్డుకోడానికి, వారి భావ ప్రకటనా స్వేచ్ఛను, ప్రజా ఆచరణను నిర్బంధించడానికే ఈ దాడులని విరసం అభిప్రాయపడుతున్నది. ఈ దుర్మార్గాన్ని ఖండించాలని ప్రజాస్వామికవాదులకు విరసం విజ్ఞప్తి చేస్తోంది.
అరసవిల్లి కృష్ణ
రివేరా
పాణి
Keywords : NIA, Maoists, virasam, clc, abms,
(2024-03-24 12:06:30)
No. of visitors : 951
Suggested Posts
| కలకత్తాలో జరుగుతున్న చారుమజుందార్ శత జయంతి ఉత్సవాల్లో విరసం కార్యదర్శి పాణి స్పీచ్ నక్సల్బరీ లేకపోతే భారత పీడిత ప్రజానీకానికి విప్లవ దారే లేకుండా పోయేది. కమ్యూనిస్టు రాజకీయాలు చర్చించుకోవడానికే తప్ప వర్గపోరాట బాట పట్టకపోయేవి. ఆ నక్సల్బరీ దారిని చూపినవాడు చారు మజుందార్. విప్లవ పార్టీకి వ్యూహాన్ని, ఎత్తుగడలను ఒక సాయుధ పోరాట మార్గాన్ని చూపించిన వాడు చారు మజుందార్. |
| ఆదివాసి.. లంబాడా వివాదం - ఎం.రత్నమాలమహారాష్ట్ర ప్రభుత్వం లంబాడాలను ఆదివాసి తెగగా గుర్తించడం లేదు కనుక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లంబాడాలను ఆదివాసి షెడ్యూల్డు తెగగా ప్రకటించడంతో దీన్ని అవకాశంగా తీసుకుని మహారాష్ట్ర నుంచి ఆదిలాబాద్ (పాత) జిల్లాకు లంబాడాల వలసలు పెద్ద ఎత్తున వెల్లువలా సాగాయి..... |
| మహాశ్వేతా దేవి - మన తెలంగాణ సాగర హారంః వరవర రావుమన మహా సాగరహారం ʹచలో హైదరాబాద్ అంటూ తెలంగాణ మార్చ్ చేసిన సెప్టెంబర్ 30, 2012 మహత్తర మధ్యాహ్నం మహాశ్వేతాదేవి కూడా మన ఊర్లో ఉన్నారు. ఆ రోజు ఆమెను మన మధ్యకు తెచ్చుకొని ఉంటే.... |
| సెప్టెంబర్ 17 - ఇండియన్ యూనియన్ సైనిక దురాక్రమణ దినం - వరవరరావు1947 ఆగస్ట్ 15న విలీనానికి అంగీకరించకుండా షరతులు విధిస్తూ వచ్చిన నిజాంను నెహ్రూ - పటేల్ ప్రభుత్వం సగౌరవంగా, సాదరంగా చర్చలకు ఆహ్వానించింది. అప్పటికే నిజాంను వ్యతిరేకిస్తూ వీరోచిత పోరాటం నడుపుతున్న కమ్యూనిస్టులను మాత్రమే కాదు, కనీసం కాంగ్రెస్ ను కూడా ఈ చర్చల్లో భాగం చేయలేదు.... |
| అమరుడు బొజ్జా తారకం — ʹనది పుట్టిన గొంతుకʹ - వరవరరావుగోదావరి తెలంగాణలో ప్రవేశించిన నిజామాబాద్ కు 1968లో వచ్చిన తారకం గారు ఇక్కడి మట్టిలోని ఎరుపులోనూ, ఇక్కడి నీళ్లలోని ప్రవాహ గుణంలోనూ కలగలిసిపోయారు. 1968 నుంచి 78 దాకా ఒక దశాబ్దం పాటు విప్లవోద్యమాలకు, విప్లవ సాహిత్యానికి నిజామాబాద్ చిరునామా బొజ్ఞాతారకం.... |
| ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ పోరాటానికి విరసం మద్దతుఅట్టడుగున ఉన్న మనిషికి ఫలితాలు అందినప్పుడే సామాజిక న్యాయం జరిగినట్టు లెక్క. మాదిగ, డక్కలి, చిందు, మాష్టి, బుడగజంగం, దాసరి, బేగరి కులాలకు ఈ నాటికీ ఎస్సీ రిజర్వేషన్ ఫలాలు అందడం లేదు.... |
|
ʹఅన్నలు మల్లొస్తరు బిడ్డా.. ఆల్లొస్తే వాళ్ళకు గిన్ని మంచి నీల్లో, తిండో పెట్టాలనే బతుకుతాన్నʹఅందుకే అంత నిర్బంధంల కూడా నా కొడుకు అంత్యక్రియలకు వచ్చిన జనాలకు మా ఖిలా వరంగల్ సరిపోలె. ఎక్కడోల్లను అక్కడ అరెస్ట్ చేసినా వచ్చిండ్రు. ఎవరో నక్సలైట్ అట, చిన్న పిల్లగాడేనట, బలే తెలివికల్లోడట అని అనుకుంట జనాలు వచ్చిండ్రు. పద్దెనిమిది నిండి పందొమ్మిది పడగానే చంపేసిండ్రు. |
| కాగడాగా వెలిగిన క్షణం... అమరుడు యెం యెస్ ఆర్ కోసం ... నారాయణ స్వామిఎంత ప్రాణం శ్రీనుది బక్క పలుచగా ఉండేటోడు – ఎక్కడన్న సరిగ్గా తిన్నడో లేదో శరీరం లో బలం సత్తువ ఉన్నదో లేదో – ఆ దుర్మార్గులు పట్టుకొని చిత్రహింసలు పెడుతుంటే ఆ లేత శరీరం ఎంత గోస పడిందో ఎంత హింసకు గురైందో ఎంత అల్లల్లాడిందో – ఆ క్రూరులు చంపేయ్యబోతుంటే, చివరికి మేఘే ఢాకా తార లో సుప్రియ అరిచినట్టు నాకు బతకాలని ఉంది నాకు చావాలని లేదు నాకు బతకాలని ఉంది.... |
| ఉత్తేజకరంగా సాగిన విరసం సాహిత్యపాఠశాల
అంతకుముందు అంతర్జాతీయ శ్రామికవర్గ పతాకావిష్కరణతో కార్యక్రమాలను ప్రారం భించారు. అమరుడు పులి అంజన్న తల్లి సైదమ్మ ఎర్ర జెండాను, సీనియర్ విరసం సభ్యురాలు రత్నమాల విప్లవ రచయితల సంఘం జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా అమరుడు శేషయ్య సోదరుడు సాంబయ్య, అమరుడు వివేక్ తండ్రి యోగానంద్ అమరుల స్థూపాన్ని ఆవిష్క రించారు. |
| ʹఅరుణోదయʹ పై పోలీసుల దాడిని ఖండించిన విరసం తెలంగాణ ఉద్యమంలో ఆట పాటతో ఆరుణోదయ కళాకారులు గ్రామ గ్రామాన తిరిగి ప్రజల్లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని రగిలించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తమ వంతు కృషి చేశారు. ఆ సంస్థ కార్యాలయాన్ని దౌర్జన్యంగా మూసేయడం అత్యంత నిరంకుశమైన...... |