include 'men';
?>
ప్రవేటీకరణకు వ్యతిరేకంగా సమ్మె సైరన్ మోగించిన సింగరేణి కార్మికులు
25-11-2021
సింగరేణి కార్మికులు సమ్మె సైరెన్ మోగించారు. తెలంగాణ బొగ్గు గనుల్లోని బ్లాకులను ప్రైవేట్ పరం చేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా అధికార గుర్తింపు సంఘం టీబీజీకేఎస్ సింగరేణి బోర్డు యాజమాన్యానికి నోటీసు ఇచ్చింది. కల్యాణ్ ఖని బ్లాక్ -6, కోయగూడెం బ్లాక్ -3, సత్తుపల్లి బ్లాక్ -3, శ్రావణపల్లి బొగ్గు గనులను వేలం వేయాలని కేంద్ర సర్కార్ ప్రణాళికలు సిద్ధం చేసింది. కేంద్రప్రభుత్వ చర్యలపై కార్మికులు భగ్గుమంటున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం సమ్మె నోటీసు ఇచ్చింది. డిసెంబర్ 9వ తేదీ నుంచి నిరవధిక సమ్మె చేస్తామని టీబీజీకేఎస్ ప్రకటించింది.
ప్రైవేటీకరణతో కార్మికులకు రావాల్సిన వారసత్వ ఉద్యోగాల్లో కోతపడుతుందని, లాభాల్లో వాటాలు కూడా కనుమరుగవుతాయని యూనియన్ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేటీకరణ అంశం చర్చించేందుకు పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని యైటింక్లైన్ కాలనీలో జరిగిన కేంద్ర కమిటీ సమావేశంలో కార్మిక సంఘాల నాయకులు సమావేశమయ్యారు. సమావేశంలో ఆదిలాబాద్, పెద్దపల్లి, భూపాలపల్లి తదితర జిల్లాల కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు. టీబీజీకేఎస్ అధ్యక్షుడు వెంకట్రావు, మిర్యాల రాజిరెడ్డి, కెంగర్ల మల్లయ్య తదితర నాయకులు పాల్గొన్నారు.
సమ్మె నోటీసు ఇచ్చిన కార్మిక సంఘం పరివేటీకరణ నిలిపివేయాలన్న డిమాండ్ తో పాటు రెండు పేర్లు ఉన్న సింగరేణి కార్మికుల డిపెండెంట్స్కు బేషరతుగా ఉద్యోగాలు కల్పించాలని, కరోనా కారణంగా మెడికల్ బోర్డు నిలిచిపోయిన దరిమిలా 35 సంవత్సరాలు దాటిన డిపెండెంట్స్ కు ఉద్యోగాలు కల్పించాలని, 35 సంవత్సరాల వయో పరిమితిని 40 సంవత్సరాలకు పెంచి వన్ టైం మేజర్ గా డిపెండెంట్లందరికి ఉద్యోగాలు ఇవ్వాలని, కుటుంబంలో ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగులున్నప్పటికీ డిపెండెంట్లకు కంపెనీలో ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
Keywords : singareni, strike, telangana, coal black
(2024-04-19 07:21:48)
No. of visitors : 399
Suggested Posts
0 results
| కేసీఆర్ కుటుంబానికి చెందిన అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్ |
| రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్ |
| నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు |
| 24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే ! |
| డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు |
| ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ |
| హుస్నాబాద్ స్తూపం స్థలాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక
|
| కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు |
| 5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన |
| ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా? |
| తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
|
| అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
|
| పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన |
| వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2) |
| వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1) |
| విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్ |
| హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ |
| అనారోగ్యంతో ఉన్న మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు |
| మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన |
| మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ ! |
| సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ |
| తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శన్ స్తూపావిష్కరణ |
| గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది -మావోయిస్టు పార్టీ |
| గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం |
more..