అనేక త్యాగాలతో... అడ్డంకులు, కుట్రలు దాటుకొని సాగుతున్న పోరాటానికి ఏడాది పూర్తి
26-11-2021
1Year of Parmers Protest:మారుమోగుతున్న హిందీ, పంజాబీ, హర్యాణ్వీ భాషల్లో ఉద్యమ పాటలు... నృత్యాలు.... లక్షలాదిగా రైతులు... నినాదాలతో దదరిల్లుతున్న ఢిల్లీ సరిహద్దులైన సింఘు, టిక్రి, ఘాజీపూర్. ఇవ్వాళ్ళక్కడ విషాదం, సంతోషం కలగలిసిన వాతావరణం. ఒకవైపు తమతోపాటు కలిసి నడిచి పోరుబాటలో మరణించిన 700పైగా రైతుల ఙాపకాలు...మరో వైపు ఫాసిస్టుల తలలు వంచి సాధించిన విజయం తాలూకూ ఆనందం. ఇవ్వాల్టికి సరిగ్గా ఏడాది కింద 2020 నవంబర్ 26న ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు ప్రారంభించిన మహత్తర పోరాటం అనేక ఆటు పోట్లను, అనేక అడ్డంకులను, కుట్రలను ఛేదించుకొని, త్యాగాల, కష్టాల దారిలో నడిచిన రైతాంగం ఇవ్వాళ్ళ దేశమంతా ప్రదర్శనలు నిర్వహించారు రైతులు.
ఉత్తరప్రదేశ్, హర్యాణా, పంజాబ్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్ లనుండి లక్షలాది మంది రైతులు ఇవ్వాళ్ళ సింఘు, టిక్రి, ఘాజీపూర్ లకు చేరుకున్నారు. ఈ దేశం కోసం రైతులు చేస్తున్న పోరాటానికి ఏడాది నిండిన సందర్భంగా ఆ మూడు సరిహద్దుల్లో ఇవ్వాళ్ళ భారీ బహిరంగసభలు జరిగాయి.
మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుంటామని మాత్రమే ప్రధాని చెప్పారని, అయితే ఆ మూడు చట్టాలను రద్దుచేస్తూ పార్లమెంటులో చట్టం చేసే వరకు తాము ప్రభుత్వాన్ని నమ్మబోమని రైతు సంఘాలు అంటున్నాయి. తాము మొదటి నుండి చేస్తున్నది మూడు వ్యవసాయ చట్టాలు రద్దు చేయడమొక్కటే కాదని కనీస మద్దతు ధర MSP కోసం చట్టబద్ధమైన హామీ ఇవ్వాలని, విద్యుత్ సవరణ బిల్లును ఉపసంహరించాలని, ఢిల్లీలో గాలి నాణ్యత నియంత్రణపై చట్టానికి సంబంధించిన శిక్షాస్పద సెక్షన్ల నుండి రైతులను మినహాయించాలనే తమ డిమాండ్లు ఇంకా పెడింగులోనే ఉన్నాయని భారతీయ కిసాన్ యూనియన్ అధ్యక్షుడు రాకెష్ తికాయత్ అన్నారు. అంతే కాక మోడీ ప్రభుత్వం తన మొండి, అహంకార ప్రవర్తన కారణంగా 700 పైగా రైతులు ప్రాణాలు విడిచారని, ఆ అమరవీరుల కుటుంబాలకు నష్టపరిహారం, ఉపాధి అవకాశాలు కల్పించి ఆదుకోవాలి. పార్లమెంట్ సమావేశాల్లో అమరవీరులకు నివాళులర్పించి, వారి పేరిట స్మారక చిహ్నం నిర్మించాలి. హర్యానా, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, ఉత్తరాఖండ్, చండీగఢ్, మధ్యప్రదేశ్ మొదలైన వివిధ రాష్ట్రాల్లో వేలాది మంది రైతులపై వందలాది తప్పుడు కేసులు నమోదు చేసిన కేసులన్నింటినీ బేషరతుగా ఉపసంహరించుకోవాలి, లఖింపూర్ ఖేరీ రైతుల హత్యకు కారణమైన కేంద్రమంత్రి అజయ్ మిశ్రా టేనిని అరెస్టు చేసి కేంద్ర మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని తికాయత్ మరో సారి డిమాండ్ చేశారు.
మరోవైపు ఇవ్వాళ్ళ కర్నాటకలో అనేక చోట్ల రైతులు రహదారులను దిగ్బంధించారు. బీహార్, తమిళనాడు, మధ్యప్రదేశ్, పంజాబ్, హర్యాణా, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ లలో అనేక జిల్లా కేంద్రాల్లో రైతులు ప్రదర్శనలు నిర్వహించారు. రైతులతో పాటు ఈ ప్రదర్శనల్లో వేలాది కార్మికులు పాల్గొన్నారు. కోల్కతాతో పాటు పశ్చిమ బెంగాల్ వ్యాప్తంగా రైతులు ట్రాక్టర్ ర్యాలీలు చేపట్టారు.
Keywords : farmers protest, delhi, singhu, tikri, ghajipur, BKU, Rakesh tikait, 1Year of Parmers Protest
(2024-03-24 21:56:37)
No. of visitors : 514
Suggested Posts
| అవార్డులను వాపస్ చేయడానికి రాష్ట్రపతి భవన్ వైపు మార్చ్ చేసిన క్రీడాకారులు
- అడ్డుకున్న పోలీసులురైతు చట్టాల విషయంలో కేంద్రం ప్రవర్తిస్తున్న తీరును నిరసిస్తూ క్రీడా రంగంలో వివిధ అవార్డులు అందుకున్న వారుఇవ్వాళ్ళ రాష్ట్రపతి భవన్ వైపు మార్చ్ నిర్వహించారు. |
| తీవ్రమైన రైతుల ఉద్యమం - రాజకీయ ఖైదీలను రిలీజ్ చేయాలని డిమాండ్ఢిల్లీ సరిహద్దుల్లోని టిక్రీ వద్ద భారతీయ కిసాన్ యూనియన్ (ఏక్తా ఉగ్రహాన్) ఆద్వర్యంలో జరిగిన ఈ కార్యక్రంలో రాజకీయ ఖైదీలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అక్రమ అరెస్టుకు గురై జైళ్ళలో ఉన్న వరవరరావు, సుధా భరద్వాజ్, ఆనంద్ తేల్తుంబ్డే, గౌతమ్ నవాలఖా తో సహా ఎల్గర్ పరిషథ్ కేసులో ఉన్న వారందరినీ విడుదల చేయాలని అదే విధంగా ఢిల్లీలో అక్రమ కేసులు బనాయించి అరెస్టు చే |
| రైతు ఉద్యమానికి మద్దతుపలికిన బాలీవుడ్ ప్రముఖులపై ఐటీ దాడులు
దేశంలో కొనసాగుతున్న రైతుల ఉద్యమానికి మద్దతుపలికిన బాలీ వుడ్ ప్రముఖుల ఇళ్ళపై ఆదాయపు పన్ను శాఖ రైడ్స్ నిర్చహించింది. నిర్మాత, దర్శకుడు అనురాగ్ కాశ్యప్, హీరోయిన్ తాప్సీ పన్ను ఇళ్ళపై ఈ రోజు ఆదాయపు పన్ను శాఖ రైడ్స్ నిర్చహించింది. |
| ఈ ఫోటో తీసిన జర్నలిస్టుపై దాడి - ప్రభుత్వ వాహనంలో వచ్చిన అగంతకులు
ఆ ఫోటో తీసిన జర్నలిస్టు రవి చౌదరిపై ఈ రోజు దాడి జరిగింది. ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్ లో గంగా కాలువ రోడ్డులో ఓ ప్రభుత్వ వాహనంలో వచ్చిన కొందరు అగంతకులు తనపై దాడి చేశారని రవి తెలిపాడు. |
| ఈ నెల 27న రైతు సంఘాల భారత్ బంద్ - విజయవంతం చేయాలని మావోయిస్టు పార్టీ పిలుపు
గత 10 మాసాల రైతాంగ ఉద్యమంలో అపూర్వ స్థాయిలో 5 సెప్టెంబర్ నాడు ముజఫర్ నగర్ లో భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) సహ సంయుక్త కిసాన్ మోర్చాతో పాటు కేంద్ర సాగు చట్టాలను వ్యతిరేకిస్తున్న అనేక రైతు సంఘాల పిలుపుపై జరుపతల పెట్టిన కిసాన్ మహా పంచాయత్ తో బెంబేలు పడిన ఉత్తర ప్రదేశ్ అదిత్యనాథ్ యోగీ సర్కార్ దానిని |
| దేశంలో ప్రజాపోరాటాలు ఆగవు... వాటికి నాయకత్వం వహించకుండా ఏశక్తీ మమ్మల్ని అడ్డుకోలేదు - మావోయిస్టు పార్టీ ప్రకటన
ప్రజా వీరులు గేంద్ సింగ్, బాబూరావు సడ్మెక్, గుండాదుర్, బిర్సాముండా, సిద్ధ-కానో, జ్యోతిబా ఫూలే, భగత్ సింగ్, రామరాజు, కొంరంభీం, బాబా సాహెబ్ అంబేడ్కర్, పెరియార్ మున్నగు అనేక మంది మహనీయుల పేర్లు ఉచ్ఛరించడానికైనా నైతిక అర్హతలేని బ్రాహ్మణీయ హిందుత్వ శక్తులు వారిని ముందు పెట్టి శాహీన్ బాగ్ నుండి సిల్గేర్ వరకు ప్రజా పోరాటాలను నెత్తురుటేరులలో ముంచడాన్ని మా పార్టీ |
| ఎర్ర కోట వద్ద జరిగిన హింస బీజేపీ కుట్రే - మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రకటన మోదీ ప్రభుత్వం తెచ్చిన మూడు రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోనూ, దేశవ్యాప్తంగానూ ఐక్యంగా, దృఢ సంకల్పంతో నిరంతరాయంగా పోరాడుతున్న రైతులకు భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) మరొకసారి విప్లవాభినందనలతో లాల్ సలాం చెబుతున్నది. |
| రైతాంగ ఉద్యమానికి మద్దతు ప్రకటించిన క్రాంతికారీ జనతన సర్కార్
నిరంతరం విస్తరిస్తున్న, తీవ్రతరం అవుతున్నదేశవ్యాప్త రైతు ఉద్యమాన్ని దెబ్బ తీయడానికి కేంద్ర ప్రభుత్వం జనవరి 26 న ఎర్రకోట కుట్రను అమలు చేసింది, దీనిని జనతన ప్రభుత్వం తీవ్రంగా ఖండిస్తున్నది. |
| ఉల్లిగడ్డలు తినకపోతే చస్తారా -మంత్రి గారి దబాయింపువాళ్ళ పొరపాట్లను ఎత్తి చూపితే పాలకులకు ఆవేశం పొంగుకొస్తుంది. వాళ్ళను ప్రశ్నలడిగితే చిర్రెత్తుకొస్తుంది. అడిగిన వారినే దబాయిస్తారు. బెదిరిస్తారు. ఈ మంత్రి కూడా అదే చేశారు..... |
| కెనడాలోని పాఠశాలల్లో భారత్ రైతు ఉద్యమ పాఠ్యాంశాలు... తొలగించాలని భారత్ లేఖభారత దేశంలో సాగుతున్న రైతుల ఉద్యమం గురించి కెనడాలోని కొన్ని పాఠశాలల్లో పాఠ్యాంశాలు ప్రవేశపెట్టడాన్ని భారత ప్రభుత్వం వ్యతిరేకింది. ఆ పాఠ్యాంశాలను వెంటనే తొలగించాలని కెనడాలోని భారత కాన్సులేట్ అంటారియో ప్రావిన్స్లోని |