కంగనా రనౌత్ కు చుక్కలు చూపించిన పంజాబ్ రైతులు

కంగనా

03-12-2021

మోదీ భక్తురాలు బాలీవుడ్ నటి కంగనా రనౌత్ కు పంజాబ్ రైతులు చుక్కలు చూపించారు. కార్పోరేట్ అనుకూల , ప్రజా వ్యతిరేక మూడు వ్యవసాయ చట్టాల రద్దుకై ఏడాది కాలంగా ఉద్యమం చేస్తున్న రైతులను ఖాలిస్తానీ తీవ్రవాదులు, సమాజ వ్యతిరేకులంటూ ఆమె చేసిన కామెంట్లపై రగిలి పోయిన రైతులు శుక్రవారంనాడు పంజాబ్ లో ఆమె కారును అడ్డుకున్నారు.

పంజాబ్‌లోని కిరాత్‌పూర్ సాహిబ్ మీదుగా ఆమె కారులో వెళ్తుండగా సమాచారం తెలిసిన వందలాది మంది మహిళలు, రైతులు రోడ్డుకు అడ్డంగా నిలబడి ఆమె కారును ఆపేశారు. రైతులకు క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేశారు. కంగనాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రైతులను చెదరగొట్టడానికి పోలీసులు ప్రయత్నించినప్పటికీ సాధ్యపడలేదు. కారు డోర్లు లాక్ చేసుకొని ఆమె లోపలే కూర్చుండి పోయింది. "నన్ను ఇక్కడ ఒక గుంపు చుట్టుముట్టింది. వారు నన్ను దుర్భాషలాడుతున్నారు, చంపేస్తామని బెదిరిస్తున్నారు" అని కంగనా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో పోస్ట్ చేసిన వీడియోలో పేర్కొంది.

"ఇది బహిరంగంగా మాబ్ లిన్చింగ్. నాకు భద్రత లేకపోతే నా పరిస్థితి ఏంటి ? ఇక్కడ పరిస్థితి నమ్మశక్యం గా లేదు. నేను రాజకీయవేత్తనా? ఈ ప్రవర్తన ఏమిటి?" అని తన వీడియోలో రనౌత్ అన్నారు.

చివరకు కారు దగ్గరకు వచ్చిన కొందరు మహిళలా నిరసనకారులతో మాట్లాడిన కంగనా వాళ్ళకు క్షమాపణ చెప్పినట్టు తెలిసింది. ఆ తర్వాత రైతులు ఆమెను ముందుకు వెళ్ళనిచ్చారు.

కాగా వ్యవ‌సాయ చట్టాలను కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవడాన్ని కంగనా తీవ్రంగా విమర్షించింది. కొందరు ఖాలీస్తానీ తీవ్రవాదులకు ప్రభుత్వం భయపడిందని ఆమె ఆరోపించారు. "ఖలిస్థానీ ఉగ్రవాదులు ఈరోజు ప్రభుత్వాన్ని వణికిస్తుండవచ్చు. కానీ ఒక్క మహిళను మాత్రం వాళ్ళు మరచిపోకూడదు. ఏకైక మహిళా ప్రధానమంత్రి వారిని తన బూటు కింద నలిపివేసారు. ఆమె తన స్వంత జీవితాన్ని పణంగా పెట్టింది కానీ దేశాన్ని విచ్చిన్నం కానివ్వలేదు. ఈ రోజు కూడా, వారు ఆమె పేరు వింటే వణుకుతున్నారు, వారికి ఆమెలాంటి వ్యక్తే సరిఅనదిʹʹ అని కంగనా వ్యాఖ్యానించింది. ఈ వ్యాఖ్యలు సిక్కు సమాజానికి తీవ్ర ఆగ్రహాన్ని కలగజేసాయి. మొత్తం సిక్కు సమాజంపై, నిరసన తెలిపిన రైతులపై "ఖలిస్థానీ టెర్రరిస్టులు" అని లేబుల్ వేయడం పట్ల పంజాబ్ ప్రజలు మండి పడుతున్నారు. ఈ విషయంపై ఆమెపై పోలీసు కేసు కూడా నమోదయ్యింది. ఢిల్లీ అసెంబ్లీ ఆమెకు సమన్లు అందజేసింది.

ఒక రైతు ఉద్యమంపైనే కాక ఆమె దేశంలో జరిగిన ప్రతి ఉద్యమంపై విషం కక్కింది. కేంద్రం తీసుకవచ్చిన‌ వివాదాస్పద పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా గత సంవత్సరం ఢిల్లీలోని షాహీన్ బాగ్ వద్ద ప్రదర్శనలు చేస్తున్న నిరసనకారులను లక్ష్యంగా చేసుకుని తీవ్ర విమర్షలు చేసింది.


అంతే కాదు ఈ దేశానికి 2014 వరకు స్వాత్రత్య్రం రాలేదని మోడీ ప్రధాని అయినాకే ఈ దేశానికి స్వతంత్య్రం వచ్చిందంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది.

Keywords : Kangana Ranaut, punjab, farmers, protest
(2024-04-14 19:53:51)



No. of visitors : 723

Suggested Posts


0 results

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


కంగనా