రేపు కామ్రేడ్ సునీల్@రవి సంస్మరణ సభ
04-12-2021
ప్రమాద వశాత్తు మరణించిన మావోయిస్టు నాయకుడు కామ్రేడ్ సునీల్ కుమార్ ఎలియాస్ రవి, ఎలియాస్ జైలాల్ సంస్మరణ సభ ఆదివారం నాడు జరగనుంది. ఆయన స్వగ్రామమైన నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం తిమ్మాయపాళెం గ్రామంలో ఆదివారం ఉదయం 10 గంటలకు ప్రారంభం కానుంది. సునీల్ కుటుంబ సభ్యులు, బంధు మిత్రులు ఈ సభను ఏర్పాటు చేస్తున్నారు.
కాగా ఝార్ఖండ్లోని కొల్హాన్ అటవీ ప్రాంతంలో తను అభివృద్ధి చేసిన బాణం బాంబును పరీక్షించే క్రమంలో జరిగిన ప్రమాదంలో 2020 జూన్ 25 న రవి మరణించాడు. రవి మరణం విషయాన్ని మావోయిస్టు పార్టీ ఏడాదిన్నర కాలం ఆలస్యంగా ప్రపంచానికి తెలిపింది. అనివార్య కారణాల జరిగిన ఈ ఆలస్యానికి చింతిస్తున్నామని ఆ పార్టీ ప్రకటించింది.
కామ్రేడ్ సునీల్ ఎలియాస్ రవి అమరత్వం గురించి తెలుపుతూ సీపీఐ మావోయిస్టు కేంద్ర కమిటీ విడుదల చేసిన ప్రకటన పూర్తి పాఠం....
కామ్రేడ్ రవి (జైలాల్) అమర్ రహే!
కామ్రేడ్ రవి (జైలాల్) ఆశయాలను కొనసాగిద్దాం!
ప్రియమైన ప్రజలారా!
భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) కేంద్రకమిటీ స్టాఫ్ సభ్యుడు (డివిజనల్ కమిటీ స్థాయి) మన ప్రియతమ కామ్రేడ్ రవి (జైలాల్) అమరత్వ వార్తను అనివార్య పరిస్థితులలో దాదాపు సంవత్సరంన్నర కాలం ఆలస్యంగా తెలియజేస్తున్నందుకు తీవ్రంగా చింతిస్తున్నాం. మీ-మా రవి అమరత్వ వార్త మీకు కలిగించే అపార దు:ఖం, వేదన, బాధలో పాలుపంచుకుంటూ, కేంద్రకమిటీ కామ్రేడ్ రవి తల్లితండ్రులు బుచ్చమ్మరమణయ్యలకు, కుటుంబ సభ్యులందరికీ, బంధుమిత్రులందరికి ప్రగాఢ సంతాపాన్నీ, సానుభూతిని తెలియజేస్తున్నది. కామ్రేడ్ రవి స్వస్థలం ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లా.
శతృవు కొనసాగిస్తున్న విప్లవ ప్రతీఘాతుక వ్యూహాత్మక దాడి ʹసమాధాన్ʹను ఎదుర్కోవడానికి పార్టీ నాయకత్వంలో పీఎల్ జీఏ నిర్వహిస్తుండిన ఎత్తుగడలపరమైన ఎదురుదాడుల క్యాంపెయిన్లో భాగంగా, ఝార్ఖండ్లోని కొల్హాన్ అటవీ ప్రాంతంలో తను అభివృద్ధి చేసిన బాణం బాంబును పరీక్షించే క్రమంలో జరిగిన ప్రమాదంలో కామ్రేడ్ రవి జూన్ 25, 2020న ఉదయం 11 గం||లకు తీవ్రంగా గాయపడి అమరుడయ్యాడు. ఆకస్మికంగా, అనూహ్యంగా జరిగిన కామ్రేడ్ రవి అమరత్వం(జైలాల్)తో అక్కడి పీఎల్జీఏ క్యాంపులోని నాయకత్వం, పీఎల్జీఏ కమాండర్లు, యోధులు, ప్రజలు తీవ్ర ధిగ్ర్భాంతికి లోనయ్యారు.
తమ ప్రియతమ సహచరుడు నిపుణుడైన,యోగ్యుడైన టెక్నిషియన్, ఎలక్ట్రానిక్ మరియు కమ్యూనికేషన్ పర్సన్, కంప్యూటర్ ఆపరేటర్, అత్యంత విశ్వసనీయుడైన అమరుడు కామ్రేడ్ రవి (జైలాల్)కి జూన్ 26న చివరి వీడ్కోలు చెప్పి, శ్రద్ధాంజలి అర్పించి, విప్లవ లాంచనాలతో అంతిమ క్రియలు నిర్వహించారు. ʹకామ్రేడ్ రవి (జైలాల్) అమర్ రహే! కామ్రేడ్ రవి ఆశయాలను తుదకంటా కొనసాగిస్తాం! శతృ ʹసమాధాన్ʹ దాడిని ఓడిద్దాంʹ అంటూ నినాదాలిస్తూ శపథం చేసారు.
విప్లవోద్యమం గర్వించే కామ్రేడ్ రవి లాంటి ఉత్తమ పుత్రున్ని కని, విద్యాబుద్ధులతోపాటు, విప్లవ రాజకీయాలను చిన్నప్పటినుండే నేర్పిస్తూ, పెంచి పెద్దచేసి, దేశ విప్లవోద్యమానికి అంకితం చేసిన తల్లిదండ్రులు ధన్యజీవులు.
భారత విప్లవోద్యమానికి తమ ప్రాణాలను ధారపోసిన వేనవేల అమరుల త్యాగాల స్ఫూర్తితో విప్లవోద్యమంలోకి అడుగిడిన కామ్రేడ్ రవి (జైలాల్) పార్టీ ఇచ్చిన వివిధ పనులను బాధ్యాతాయుతంగా నిర్వహిస్తూ వచ్చాడు. ఆ తర్వాత పార్టీ నిర్ణయాన్ని అమలు చేస్తూ, 2014లో గెరిల్లా జోన్లలో బాధ్యతలు నిర్వహించడానికి వెళ్ళిన కామ్రేడ్ రవి (జైలాల్) అప్పటినుండి, తన అమరత్వం దాకా ఝార్ఖండ్ లో ఈఆర్బీ స్టాఫ్ గా పని చేసాడు.
వివిధ నైపుణ్యాలు కలిగిన కామ్రేడ్ రవి, కంప్యూటర్ ఆపరేటర్ గా, ఎలక్ట్రానిక్ మరియు కమ్యూనికేషన్ పర్సన్ గానే కాక, ఇంప్రువైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైసెస్ ను అభివృద్ధి చేస్తూ, ప్రజాయుద్ధాన్ని పెంపొందించడంలో పీఎల్ జీఏకు కొత్త ఆయుధాలు అందించే టెక్నిషియన్ గా వివిధ రూపాల్లో విప్లవోద్యమానికి తన సేవలను అందించాడు. ఈ క్రమంలో డివిజనల్ కమిటీ స్థాయికి ఎదిగాడు. నాయకత్వం, క్యాడర్లు, ప్రజలతో సన్నిహితంగా కలిసి, మెలసి ఉంటూ, అందరికి తలలో నాలుకయ్యాడు. కామ్రేడ్ రవి అమరత్వం విప్లవోద్యమానికి ప్రత్యేకించి బీహార్-ఝార్ఖండ్ ఉద్యమానికి వెంటనే పూడ్చుకోలేని తీవ్రమైన లోటు. విప్లవోద్యమం ఆయన సేవలను ఎల్లప్పుడూ స్మరించుకుంటుంది. కామ్రేడ్ రవి అమరత్వపు దు:ఖం నుండి మీరు వీలైనంత త్వరగా కోలుకోవాలని కోరుతూ, కోలుకుంటారని ఆశిస్తున్నది. అది అంత సులువైనది కాదనేది వాస్తవమే అయినప్పటికీ, విప్లవకారుల మరణం మనలో మరింత వర్గకసిని, లక్ష్యం కోసం పోరాడే తెగింపును చివరి శ్వాస వరకు ఉద్యమంలో నిలబడాలన్న దృఢసంకల్పాన్ని ఇనుమడింపజేస్తుంది.
అత్యున్నతమైన కామ్రేడ్ రవి ప్రాణత్యాగం మనకు ఆదర్శం. ఆ ఆదర్శాన్ని ఎత్తిపడుతూ, ఆయన ఆశయాలైన భారత నూతన ప్రజాస్వామిక విప్లవాన్నీ, సోషలిస్టు విప్లవాన్నీ, అంతిమంగా కమ్యూనిజాన్ని సాధించే లక్ష్యంతో తుదకంటా పోరాడదామని మరోసారి ప్రతిజ్ఞ చేస్తున్నది.
విప్లవాభివందనాలతో,
కేంద్రకమిటీ,
భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు)
Keywords : suneel, ravi, jailal, cpi maoist, meeting, andhrapradesh, nelloor, timmayapalem
(2024-04-15 05:12:38)
No. of visitors : 780
Suggested Posts
| లేటరైట్, బాక్సైట్ అక్రమ మైనింగ్ లకు నిరసనగా రేపు ఏపీ బంద్ - మావోయిస్టు నేత గణేష్ పిలుపువిశాఖపట్నం, తూర్పు గోదావరి జిల్లాల్లోని ఏజెన్సీ ప్రాంతాలలో లేటరైట్, బాక్సైట్ అక్రమ మైనింగ్ లకు నిరసనగా సిపిఐ (మావోయిస్ట్) ఆగస్టు 10 న రాష్ట్రవ్యాప్త బంద్కు పిలుపునిచ్చింది. ఈ ప్రాంతంలోని గిరిజనులు,సమాజంలోని అన్ని వర్గాల |
| తిరుమలలో పోగుబడ్డ ఆస్తులెవరివి ?ప్రజాస్వామిక పాలనలోనో, ప్రజాసమస్యల పరిష్కారం విషయంలోనో కాదు, విచిత్రమైన వివాదాలతో వార్తలకెక్కాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించుకున్నట్టున్నది. భక్తిరసం తెప్పలుగా పారుతున్న తెలుగునాట, ఆపద మొక్కులవాడని, వడ్డికాసులవాడని పేరున్న వేంకటేశ్వర స్వామికి, తిరుమల తిరుపతి దేవస్థానానికి ఇబ్బడి ముబ్బడిగా నిధులు అందడంలో |
| మన్యంలో నెత్తురు పారిస్తున్న జగన్ సర్కార్వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆంధ్రా ఒడిషా సరిహద్దు ప్రాంతంలో తీవ్రమైన అణచివేత చర్యలకు పరాకాష్టగా సెప్టెంబర్ 22, ఆదివారం మధ్యాహ్నం విశాఖ ఏజెన్సీలో ఒక బూటకపు ఎన్కౌంటర్ జరిగింది. అయితే ఇప్పటికీ ఈ ఘటన గురించి పోలీసులు వాస్తవాలు చెప్పడం లేదు. |
| గౌస్ పోలీసు దెబ్బలకు చనిపోలేదట...బైటికెందుకొచ్చావ్ అని అడగంగనే చనిపోయాడట !
గుంటూరు జిల్లాలో మెడిసిన్ కోసం మెడికల్ షాపుకు వచ్చిన ఓ యువకుడిని పోలీసులు లాఠీలతో కొట్టడంతో అతను అక్కడికక్కడే కుప్పకూలి మరణించాడు. ఈ సంఘటనలో ఉన్నతాధికారులు ఎస్సైని సస్పెండ్ చేశారు. |
| నీ వల్లే గెలిచి... నీ వల్లే ఓడి...సీతామాతను అపహరించి చెరబట్టాడని రావణుని ద్వేషిస్తున్నాం. ద్రౌపదీమాతను వస్త్రాపహరణ యత్నించిన కారకులనూ, ప్రేరకులు అయిన దుర్యోధనాదులను దూషిస్తాం. ఎందుకూ? వీరిలో ఎవరితోనూ, ఈ అమానుష ఘటనలతోనూ మనకు ఎట్లాంటి సంబంధం లేదే |
| విశాఖ గ్యాస్ లీక్ అంశంపై 20 ప్రశ్నలు సంధించిన వృద్దురాలిపై కేసులు
12 మంది ప్రాణాలను బలితీసుకున్న ఎల్జీ పాలిమర్స్ ను వదిలేసి.. కేవలం ఫేస్ బుక్ లో ఆ దుర్ఘటనపై పోస్టుల పెట్టిన వారిని మాత్రం కేసులతో భయపెడుతోంది ఏపీ ప్రభుత్వం. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారంటూ ఇప్పటికే రంగనాయకమ్మ అనే వృద్ధురాలిపై |
| డేటా చౌర్యంలో దోషులెవరు ?ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపు 3 కోట్ల 70 లక్షల మంది ఓటర్లుగా నమోదై ఉన్నారు. ఇది గత నెలలో ఎన్నికల సంఘం అధికారిక లెక్కల అంచనా. అయితే ఫామ్ (6) ద్వారా ఎన్నికల
నోటిఫికేషన్ (మార్చ్ 18 - 25 వరకు నామినేషన్ల స్వీకరణ) లోపుగా సమర్పించుకునే వారు ఓటర్లుగా నమోదు కావడానికి మార్చి 15 వరకు గడవు ఉంటుంది. ఈ అవకాశాన్ని ఎన్నికల సంఘం మార్చి 10 వరకు ప్రకటించింది. |
| జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం తీవ్రతరం చేయండి - మావోయిస్టు పార్టీ పిలుపు
ఉద్యోగులను నిట్టనిలువునా ముంచివేసే మోసపూరిత పీఆర్సీ ఫిట్ మెంట్ కు వ్యతిరేకంగా ఉద్యోగులు,జాబ్ క్యాలండర్ కోసం నిరుద్యోగులు, జీతాల పెంపు, రెగ్యులరైజేషన్ కోసం సచివాలయ ఉద్యోగులు, జగన్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా అన్ని సెక్షన్ల ప్రజలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా చేస్తున్న ఆందోళనలకు ఏఓబీ ఎస్ జడ్ సీ సంపూర్ణ మద్దతును తెలియజేస్తున్నది |
| రాజును మించిన రాజభక్తి: మోడీ పై భక్తి ని నిరూపించుకోవడానికి జగన్ తహ తహ
కరోనాతో దేశం అల్లకల్లోలంగా మారింది. దేశంలో కరోనా రోగులకు ఆస్పత్రుల్లో బెడ్లు లేవు, అత్యవసరమైన ఆక్సీజన్ లేదు. రెమిడెసివర్ ఇంజక్షన్ బ్లాక్ మార్కెట్లో లక్షరూపాయల దాకా పలుకుతోంది. |
| Andhrapradesh:తమ గ్రామాన్ని కాపాడుకోవడం కోసం దశాబ్దాల పోరాటం
న్యాయస్థానాల్లో విజయం పొందినప్పటికీ మైనింగ్ తవ్వకాల నుండి భూమిని కాపాడుకోవడానికి పోరాడుతున్న 3 ఆంధ్ర ఆదివాసీ గ్రామాల ప్రజలు |