నాగాలాండ్ లో 13 మంది అమాయక పౌరులను కాల్చి చంపిన సైన్యం

నాగాలాండ్

05-12-2021

నాగాలాండ్ లో సైన్యం 13 మంది అమాయక పౌరులను కాల్చి చంపింది. అనంతరం ప్రజలు తిరగబడటంతో ఓ జవాను మరణించాడు. నాగాలాండ్ మోన్ జిల్లాలో ఓటింగ్, తిరు గ్రామాల మధ్య ఈ సంఘటన జరిగింది. ఓటింగ్ గ్రామంలోని మైనింగ్ కేంద్రంలో పని ముగించుకొని శనివారం రాత్రి ఓ వాహనంలో తిరిగి వస్తున్న సమయంలో అస్సాం రైఫిల్స్‌ జవాన్లు హటాత్తుగా వాహనంపై దాడి చేసి కాల్పులకు తెగబడ్డారు. ఆ కాల్పుల్లో ఆరుగురు కార్మికులు అక్కడికక్కడే నేలకొరిగారు. బస్సులో ఉన్న వారిని మిలిటెంట్లనుకొని కాల్పులు జరిపినట్లు ఆర్మీ అధికారులు చెబుతున్నారు.

కాల్పులు ఘటన తెలియడంతో ఆ ప్రదేశంలో పెద్ద ఎత్తున గ్రామస్తులు చేరుకున్నారు. వారు.. తమ వారు విగతజీవులుగా పడిఉండటాన్ని చూసి ఆగ్రహంతో రగిలిపోయారు. వెంటనే అక్కడే ఉన్న భద్రత సిబ్బందిపై, వారి వాహనాలపై దాడిచేశారు. ఈ సంసర్భంగా ఆర్మీ మళ్ళీ కాల్పులు జరపడంతో మరో ఏడుగురు పౌరులు మరణించారు. ఈ దాడుల్లో ఒక ఆర్మీ జవాను కూడా మృత్యువాత పడ్డాడు.

ప్రస్తుతం మోన్‌ జిల్లాలో ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేసినట్లు అధికారులు ప్రకటించారు. ఎలాంటి వివాదాస్పద సందేశాలు వ్యాప్తి చెందకుండా ముందస్తుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే కాల్పులు జరిగిన ప్రదేశంలో హింసాత్మక సంఘటనలు జరగకుండా అదనపు బలగాలను మోహరించారు.

ప్రస్తుతం.. అక్కడి పరిస్థితి అదుపులో ఉన్నట్లు స్థానిక అధికారులు ప్రకటించారు. ప్రజలు సంయమనం పాటించాలని కోరారు. కాల్పుల ఘటనను నాగాలాండ్‌ ముఖ్యమంత్రి నీఫియు రియో తీవ్రంగా ఖండించారు. ఆయన కోహిమా చేరుకుని అధికారులతో అత్యవసరంగా సమావేశం నిర్వహించారు. ఇది అత్యంత హేయమైన చర్యగా పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ట్విట్ట‌ర్‌లో ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.

ఈ ఘటనపై దర్యాప్తు చేయడానికి ప్రత్యేక సిట్‌ బృందాన్ని ఏర్పాటు చేశామని నాగాలాండ్‌ గవర్నర్‌ జగదీష్‌ ముఖి అధికారికంగా ప్రకటించారు. కేంద్రం హోంమంత్రి అమిత్‌షా స్పందించారు. దీనిలో కారకులైన ఆర్మీ అధికారులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.

ఈ ఘటనపై..కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ, మేఘాలయ సీఎం కాన్రాడ్‌ సంగ్మా, టీఎంసీ అధినేత్రి మమతా, టీఎంసీ నేత సుస్మితాదేవ్‌, నాగాలాండ్‌ ఎమ్మెల్యే టిఆర్‌ జెలియాంగ్‌ తదితరులు స్పందించారు. బాధిత కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. దీనిపై రిటైర్డు జడ్జి నేతృత్వంలోని బృందంతో.. విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. బాధితులందరికీ న్యాయం జరిగేలా చూడాలన్నారు.

Keywords : nagaland, Assam Rifles, soldier, firing, 13 dead, At least 13 civilians shot dead by army in Indiaʹs Nagaland state
(2024-04-24 23:01:10)



No. of visitors : 636

Suggested Posts


Touching letter by Naga girl to boyfriend before suicide. She was raped by Army personnel

In a world seeded with envy, our love shall never bloom together like those lovely flowers in the same stalk but we will bloom radiantly in that pure everlasting place of our true love. That I am leaving this world should not bereaved you to utter melancholy.....

Nagalandపౌరుల హత్య:సాక్ష్యాలను మార్చేందుకు సైన్యం ప్రయత్నాలు -వెల్లడించిన పోలీసు నివేదిక‌

నాగాలాండ్ లో 15 మంది అమాయకులను పొట్టనపెట్టుకున్న సైన్యం తమ హత్యలను కప్పిపుచ్చుకునేందుకు, సాక్షాలను తారుమారు చేసేందుకు ప్రయత్నించిందని నాగాలాండ్ పోలీసులు తమ ప్రాథమిక నివేదికలో పేర్కొన్నారు.

Nagaland: అమాయక గ్రామస్థులపై సైన్యం కాల్పులకు వ్యతిరేకంగా గళం విప్పండి

ఈ మధ్య కాలంలో ఒకదాని తర్వాత మరొకటి జరిగిన సంఘటనలు, భారత రాజ్యం మెల్లమెల్లగా పోలీసు-మిలటరీ రాజ్యం వైపు ఎలా వెళుతుందో మనం చూడవచ్చు. ఇటీవలి ముఖాముఖి ఎన్‌కౌంటర్లు దీనికి మరొక ఉదాహరణ.

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


నాగాలాండ్