రోజు రోజుకు క్షీణిస్తున్న డాక్టర్ సాయిబాబా ఆరోగ్యం...తక్షణం విడుదల చేయాలని హరగోపాల్ డిమాండ్

రోజు

12-12-2021

(ʹకమిటీ ఫర్ ద డిఫెన్స్ అండ్ రిలీజ్ ఆఫ్ డా. జి ఎన్ సాయిబాబా ʹ చైర్మన్ ప్రొఫెసర్ జి. హరగోపాల్ విడుదల చేసిన ప్రకటన)

డా. జి.ఎన్. సాయిబాబాను విడుదల చేయాలి

10 డిసెంబర్ 2021

డిల్లీ విశ్వవిద్యాలయంలో ఇంగ్లీష్ పూర్వ ప్రొఫెసర్ డాక్టర్ జి ఎన్ సాయిబాబా నాలుగున్నరేళ్లకు పైగా మహారాష్ట్రలోని నాగ్‌పూర్ సెంట్రల్ జైలు అండా సెల్‌లో మగ్గుతున్నారు.

కల్పిత ఆరోపణలతో డాక్టర్ సాయిబాబాను అరెస్టు చేసి UAPA కింద గడ్చిరోలి సెషన్ కోర్టు జీవిత ఖైదు విధించింది. దళితులు, ఆదివాసీలు, ముస్లింలు, ఇతర మైనారిటీలతో సహా మన సమాజంలోని దోపిడీకి గురవుతున్న, అణగారిన వర్గాల హక్కుల కోసం ఆయన ప్రచారం చేశారు. డాక్టర్ జి.ఎన్. సాయిబాబా ఆదివాసీల హక్కుల కోసం, భూమి, నీరు, సహజ వనరులపై వారి హక్కుల కోసం పోరాడారు.

ఈరోజు డాక్టర్ సాయిబాబా కనీసం ఇద్దరు వ్యక్తుల సహాయం లేకుండా కదలలేరు. తన 90% శారీరక వైకల్యంతో పాటు, 19 వ్యాధులతో నాగ్‌పూర్ సెంట్రల్‌ జైలులో బాధపడుతున్నాడు. అతని ఆరోగ్య పరిస్థితులలో ఎడమ జఠరిక పనిచేయకపోవడం, హైపర్‌టెన్షన్, మూత్రపిండాల్లో రాళ్లు, మెదడులోని తిత్తి, ప్యాంక్రియాటిక్ సమస్యలు, భుజం, చేయి కండరాల, నరాల క్షీణతతో కూడిన హైపర్‌ట్రోఫిక్ కార్డియోమయోపతి కూడా ఉన్నాయి, ఫలితంగా అతని ఎగువ అవయవాలు పాక్షిక పక్షవాతానికి లోనయ్యాయి, వీటిలో చాలా వరకు జైలులో తీవ్రతరమయ్యాయి. ఆర్టీఐ కింద డిమాండ్ చేసిన తరువాతనే జైలు అధికారులు అతని వైద్య నివేదికను ఇటీవల యిచ్చారు. ఈ వైద్య నివేదికలను పరిశీలిస్తే, డాక్టర్ సాయిబాబాకు తక్షణం, తీవ్ర వైద్య సహాయం, ముఖ్యంగా భుజం కండరాల బలం క్షీణించడానికి సంబంధించి అందించాల్సి వుంటుందని వెల్లడైంది. అండా సెల్‌లోని సుదీర్ఘ ఖైదు సమయంలో అతను COVID-19 బారిన పడ్డాడు, దాని తర్వాత అతని ఆరోగ్యం మరింతగా క్షీణించింది.

అతను జైలులో ఉన్నప్పటి నుండి, అతనికి కొన్ని రోగనిర్ధారణ పరీక్షలు చేయడం తప్ప సరైన వైద్యం అందించలేదు. నాగ్‌పూర్‌లోని సెంట్రల్ జైలులో సరైన ఆరోగ్యపర, ఇతర సౌకర్యాలు లేవు. నిజానికి, వికలాంగుల హక్కుల పట్ల పూర్తి నిర్లక్ష్య వైఖరి వహిస్తున్నారు.

కోవిడ్ విపత్తు నేపథ్యంలో, జైళ్ల రద్దీని తగ్గించడానికి ఖైదీలను విడుదల చేయాలని గౌరవనీయ సుప్రీంకోర్టు ఆదేశించింది. అయితే, పెరోల్ పొందడానికి అర్హత ఉన్నప్పటికీ డాక్టర్ సాయిబాబా పెరోల్ దరఖాస్తులను జైలు అధికారులు మూడుసార్లు తిరస్కరించారు. ఏడాది క్రితం డాక్టర్ జి.ఎన్. సాయిబాబా తల్లి క్యాన్సర్‌తో మరణించినప్పుడు పెట్టుకున్న పెరోల్‌ విజ్ఞప్తిని జైలు అధికారులు అమానవీయంగా తిరస్కరించారు. ఆ తరువాత మళ్ళీ, తన తల్లి మొదటి వర్ధంతికి హాజరు కావడానికి కూడా పెరోల్ యివ్వ నిరాకరించారు.

ఖైదీలపై అమానుషంగా ప్రవర్తించిన తీరును వివిధ కేసుల్లో భారత అత్యున్నత న్యాయస్థానం తీవ్రంగా పరిగణించింది. భారతదేశం కూడా పౌర, రాజకీయ హక్కులపై అంతర్జాతీయ ఒడంబడిక (ICCPR)పై సంతకం చేసింది, ఇది మానవుల స్వాభావిక గౌరవాన్ని, పౌర, రాజకీయ స్వేచ్ఛను అనుభవిస్తున్న స్వేచ్ఛా మానవుల ఆదర్శాన్ని గుర్తిస్తుంది. ఖైదు సమయంలో కూడా ఒక మానవుడు అతని ప్రాథమిక హక్కులను కోల్పోలేడు. అతని/ఆమె స్వాభావిక గౌరవాన్ని గౌరవించాలి, నిలపాలి.

ఖైదీల చికిత్స కోసం ప్రామాణిక కనీస నిబంధనలపై ఐక్యరాజ్యసమితి తీర్మానం 70/175పై భారతదేశం కూడా సంతకం చేసింది (నెల్సన్ మండేలా నియమాలు అని పిలుస్తారు). వికలాంగుల హక్కులకు సంబంధించి నిర్దిష్ట చట్టం పరంగా, భారతదేశం, 2007 అక్టోబర్ 1న వికలాంగుల హక్కులపై UN కన్వెన్షన్ (CRPD)ని ఆమోదించింది.

వైకల్యాలున్న వ్యక్తుల హక్కులపై ప్రత్యేక నివేదికలతో సహా అనేక UN ప్రత్యేక రిపోర్టర్లు (నివేదిక ఇవ్వడానికి నియమించబడిన వ్యక్తి); శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పొందగలిగే అత్యున్నత ప్రమాణాన్ని ఆస్వాదించడానికి ప్రతి ఒక్కరికి వున్న హక్కుపై ప్రత్యేక రిపోర్టర్ ; మానవ హక్కుల మండలి తీర్మానాలు 35/6, 33/9, 34/5, 34/19 ప్రకారం మానవ హక్కుల పరిరక్షకుల పరిస్థితిపై ప్రత్యేక ప్రతినిధి, హింస, ఇతర క్రూరమైన, అమానవీయ లేదా అవమానకరమైన వ్యవహారం లేదా శిక్షలపై ప్రత్యేక ప్రతినిధి – మొదలైన వారంతా డా. GN సాయిబాబాకు అవసరమైన సహాయం అందించాలని, విడుదల చేయాలని భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

ఈ రోజు దేశం జాతీయ మానవ హక్కుల దినోత్సవాన్ని జరుపుకుంటోంది. సమ్మిట్ ఆఫ్ డెమోక్రసీలో పాల్గొన్న భారతదేశం, ఆయా దేశాలు తమ రాజ్యాంగ సూత్రాలను పాటించాలని అభిప్రాయపడింది.

భారత, మహారాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక చట్టాన్ని అనుసరించాలి, సంతకం చేసిన అంతర్జాతీయ తీర్మానాలను గౌరవించాలి. జాతీయ మానవ హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకుని, డాక్టర్ జి ఎన్ సాయిబాబాను, అదే కేసులో ఖైదు చేయబడిన వారందరినీ బెయిల్ లేదా పెరోల్ ఇవ్వడం ద్వారా వెంటనే విడుదల చేయాలని కమిటీ డిమాండ్ చేస్తూంది.

ప్రొ. జి.ఎన్‌ సాయిబాబాకి మద్దతుగా ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావాలని, ప్రజావాణిని పెంచాలని ప్రజాస్వామికవాదులందరికీ కమిటీ విజ్ఞప్తి చేస్తోంది.

కమిటీ డిమాండ్లు

• మహారాష్ట్ర ప్రభుత్వం డాక్టర్ జి.ఎన్. సాయిబాబాకి సరైన వైద్యం, ఇతర సౌకర్యాలను అందచేయాలి.

• పెరోల్ పొందడానికి అర్హత కలిగి ఉన్నందున అతనికి పెరోల్ మంజూరు చేయాలి. అదే కేసులోని ఇతర వ్యక్తులకు బెయిల్ లేదా పెరోల్ మంజూరు చేయాలి.

• అతని కుటుంబ సభ్యులు మహారాష్ట్ర జైలు అధికారులకు సమర్పించిన అభ్యర్థన మేరకు నాగ్‌పూర్ సెంట్రల్ జైలు నుండి హైదరాబాద్‌లోని చెర్లపల్లి సెంట్రల్ జైలుకు తరలించాలి.

- ప్రొఫెసర్ జి. హరగోపాల్

చైర్మన్

Keywords : gn saibaba, haragopal, nagpur, jail, police, UAPA
(2024-04-21 16:45:46)



No. of visitors : 1183

Suggested Posts


ʹరోళ్ళగడ్డ ఎన్ కౌంటర్ లో పాల్గొన్న పోలీసులందరిపై సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం హత్య కేసు నమోదు చేయాలిʹ

సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఎన్కౌంటర్లో పాల్గొన్న పోలీసులపై 302 కేసు నమోదు చేయాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం. అంతేకాక పోలీసుల అదుపులో వున్న నలుగురు ఉద్యమకారులను కోర్టులో హాజరుపరిచి వారి ప్రాణాపాయం లేకుండా బాధ్యత పడాల్సిందిగా ముఖ్యమంత్రి చంద్రశేఖరరావును పౌరహక్కుల సంఘం డిమాండ్ ఉన్నది.

ప్రతి ఎన్కౌంటర్ పై హత్యానేరం నమోదు చేసి విచారించాలి... సుప్రీం కోర్టు సంచలన తీర్పు

ఆంధ్రప్రదేశ్ కు చెందిన ప్రత్యేక పోలీసు బలగం గ్రేహూండ్స్ పోలీసులు 2006 జూలై 23న నల్లమల అడవుల్లో మావోయిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి బుర్రా చిన్నయ్య (మాధవ్) ను, ఐదుగురు మహిళలతో సహా మరొక ఏడుగురిని ఎన్ కౌంటర్ పేరుతో కాల్చిచంపారు. వెంటనే ఆంధ్రప్రదేశ్ పౌరహక్కుల సంఘం హైకోర్టులో రిట్ దాఖలు చేసింది.

ఆదివాసుల జీవించే హక్కును కాలరాసున్న తెలంగాణ పాలకులు

అక్కడ ʹఆడాʹ ప్రాజెక్ట్ కాలువలకింద భూములు ఉన్నాయి. ఆ ప్రాజెక్ట్ కాలువలకింద నీటితో, వ్యవసాయం చేయడానికి, చిన్న,పిల్ల కాలువలు ఉన్నాయి.మొత్తానికి ఇక్కడ సారవంతమైన, అద్భుతమైన నీటివనరులు గల భూములున్నాయి. బహుశా ఆదివాసులనూ తరలించి, భూములను కబ్జాజేయడానికి స్థానిక అధికార పార్టీ నేతలు కుట్ర చేస్తున్నారని అందుకే స్థానిక MLA కొనేరుకొనప్ప దృష్టికి ఈ విషయం వచ్చినా కనీస‌

సింగరేణి కార్మికుడు కోడెం సంజీవ్ మృతికి యాజమాన్యానిదే బాధ్యత...పౌరహక్కుల సంఘం

GDK 11 వ గనిలో మరణించిన కోడెం సంజీవ్ మృతికి సింగరేణి యజమాన్యందే బాధ్యత,ఈ ఘటనపై హై కోర్ట్ సిట్టింగ్ జడ్జ్ చే న్యాయవిచారణ జరిపించాలి, .సింగరేణి CMD పై క్రిమినల్ కేసులు నమోదు చెయ్యాలి,కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఒక కోటి రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలనిపౌర హక్కుల సంఘం తెలంగాణ డిమాండ్ చేస్తున్నది.

జాడి వీరస్వామి, వెట్టి నందయ్యలను పోలీసులు హత్య చేశారు...నిజ నిర్దారణ కమిటీ రిపోర్ట్

మంగళవారం 20 ఆగస్టు,2019 న రాత్రి 12 నుండి 1 గంటల మధ్యన సుమారు 200 మంది వరకు సాయుధ పోలీసులు బుడుగుల గ్రామాన్ని దిగ్బంధించి ఆదివాసీ ప్రజలందరినీ గ్రామంలో రెండు చోట్లకు తీసుకువచ్చి,ప్రజలందరినీ తీవ్రంగా కొడుతూ ఒక్కొక్క ఇంటిని సోదాచేసి, ఒక ఇంటిలోనుండి జాడి వీరస్వామిని పోలీసులు గ్రామంపక్కన ఉత్తర దిక్కు అడవిలోకి తీసుకుపోయి రాత్రంతా చిత్రహింసలు పెట్టి ఉదయం 7 గంటల

CLC ప్రకటన: కార్మిక చట్టాలను రద్దు చేసి కార్మికులను భానిసత్వంలోకి నెట్టిన‌ పాలకులపై పోరాడుదాం

ఈ కార్మిక చట్టాలను రద్దు చేయడం అప్రజాస్వామ్యం మరియు రాజ్యాంగ విరుద్ధం. సంవత్సరాల పైబడి ఎన్నో త్యాగాలతో పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను ఈ విధంగా రద్దు చేయడం అంటే కార్మిక వర్గాన్ని బానిసత్వం లోకి నెట్టివేయడమే.

ʹఅవి ఎదురుకాల్పులు కాదు.. ఆదివాసీల హత్యలుʹ

చత్తిస్ ఘడ్ లోని కుంట బ్లాక్ లో జరిగిన ఎన్ కౌంటర్ నిజమైన ఎన్ కౌంటర్ కాదని అది కేవలం ఆదివాసీల హత్య కాండేనని భావిస్తున్నాం.చత్తిస్ ఘడ్ అటవీ ప్రాంతములో లక్షలాదిగా ఉన్న ఫారా మిలటరీ బలగాలు నిత్యం అడవిని జల్లెడ పడుతూ అనుమానంతో ఆదివాసీ యువతి యువకులను అదుపులోకి తీసుకుని చిత్రహింసలు పెట్టి హత్య చేసి ఎన్ కౌంటర్ గా ప్రకటిస్తున్నారు.

మంథని లో లాకప్ డెత్...పౌరహక్కుల సంఘం నిజ నిర్దారణ... విచారణకు ఆదేశించిన హైకోర్టు

పెద్దపల్లి జిల్లా మంథని పోలీస్‌స్టేషన్‌లో మంగళవారంనాడు రంగయ్య అనే వ్యక్తి మరణం ఆత్మహత్యగా పోలీసులు చెబుతుంటే అది ఆత్మహత్య కాదని దానిపై విచారణ జరిపించాలని పౌరహక్కుల సంఘం డిమాండ్ చేసింది. మరో వైపు దీనిపై తెలంగాణ హైకోర్టు వీచారణకు ఆదేశించింది.

ʹఅది ఎన్కౌంటర్ కాదు వేటాడి చంపారుʹ....విజయవాడ‌లో పౌరహక్కుల సంఘం సభ‌

విజయవాడలోని రాఘవయ్య పార్కు దగ్గరలోని మాకినేని బసవ పున్నయ్య విజ్ఞాన కేంద్రంలో ఆంధ్రప్రదేశ్‌ పౌరహక్కుల సంఘం ఆధ్వర్యంలో శనివారం ఒరిస్సా-మల్కన్‌గిరి ఎన్‌కౌంటర్‌ బూటకం అనే అంశంపై సభ జరిగింది. ఈ సభకు పౌరహక్కుల సంఘం రాష్ట్ర.....

ఆనంద్ తెల్ తుంబ్డే, గౌతమ్ నవలఖా అరెస్టులపై పౌరహక్కుల సంఘం ప్రకటన‌

14 ఏప్రిల్ 2020 న అంబేద్కర్ 129 వ జయంతి రోజున ప్రొపెసర్, విద్యావేత్త, విమర్శకుడు దళిత మేధావి మరియు హక్కుల నాయకుడైన ఆనంద్ తెల్ తుంబ్డే, ప్రముఖ జర్నలిస్టు మరియు హక్కుల నాయకుడైన గౌతమ్ నవలఖా లను భారత కేంద్ర ప్రభుత్వము ఈ రోజు అరెస్టు చేసి ముంబై మరియు ఢిల్లీలో ని NIA కార్యాలయాల్లో నిర్భందించడాన్ని పౌరహక్కుల సంఘం తెలంగాణ తీవ్రంగా ఖండిస్తుంది.

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


రోజు