include 'men';
?>
సంయుక్త్ కిసాన్ మోర్చా (SKM) ఎన్నికలలో పోటీ చేయదు
26-12-2021
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోమని సంయుక్త్ కిసాన్ మోర్చా (ఎస్కేఎం) స్పష్టం చేసింది. పంజాబ్లోని SKM లేదా 32 సంస్థల ఉమ్మడి ఫోరమ్ పేరును ఎన్నికల కోసం ఏ వ్యక్తి లేదా సంస్థ ఉపయోగించకూడదని ప్రకటించింది.
కేంద్రం వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసనలకు నాయకత్వం వహించిన రైతు సంఘాల ఉమ్మడి వేదిక సంయుక్త్ కిసాన్ మోర్చా (SKM), 2022లో జరగబోయే పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోదని శనివారం స్పష్టం చేసింది. ఈ సమాచారాన్ని మోర్చాకు చెందిన 9 మంది సభ్యుల సమన్వయ కమిటీ నాయకులు జగ్జిత్ సింగ్ దల్లెవాల్, డాక్టర్ దర్శన్ పాల్ తెలియచేశారు.
దేశవ్యాప్తంగా 400లకు పైగా విభిన్న భావజాల సంఘాల వేదికగా ఉన్న SKM కేవలం రైతుల సమస్యలపైనే ఏర్పడింది. ఎన్నికలను బహిష్కరించాలని తాము పిలుపునివ్వడం లేదని, ఎన్నికల్లో పోటీ చేయాలనే అవగాహన కూడా తమకు లేదని SKM నాయకులు స్పష్టం చేశారు. ʹʹప్రభుత్వం నుంచి తమ హక్కులు సాధించుకొనేందుకు ప్రజలు SKM ఏర్పాటు చేసుకున్నారు. మూడు వ్యవసాయ చట్టాల రద్దు తరువాత పోరాటాన్ని వాయిదా వేసాము, మిగిలిన డిమాండ్లపై 2022 జనవరి 15న జరిగే సమావేశంలో తీర్మానం చేస్తాముʹʹ అని తెలిపారు.
ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడిగా పాల్గొనేందుకు పంజాబ్లో ఉన్న 32 సంస్థలకు ఏకాభిప్రాయం కుదరలేదని, ఎన్నికల్లో పాల్గొనే వ్యక్తులు లేదా సంస్థలు సంయుక్త్ కిసాన్ మోర్చా లేదా 32 సంస్థల పేర్లను ఉపయోగించరాదని నిర్ణయించినట్లు వారు తెలిపారు. అలా చేస్తే క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామన్నారు.
ఎన్నికల్లో పాల్గొనే రైతు సంఘాలు, నాయకులు SKMలోనే ఉండవచ్చా లేదా అనే దానిపై జనవరి 15న జరగనున్న జాతీయ సమావేశం తుది నిర్ణయం తీసుకుంటుంది.
కేంద్ర ప్రభుత్వ మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సంయుక్త్ కిసాన్ మోర్చా (SKM) లో చేరిన పంజాబ్కు చెందిన 22 రైతు సంఘాల బృందం పంజాబ్లో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే సంయుక్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తామని చండీగఢ్లో ప్రకటించింది. కొత్త పార్టీకి సంయుక్త సమాజ్ మోర్చా (SSM) అని పేరు పెట్టారు.
అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు, పంజాబ్లోని కొన్ని రైతు సంఘాలతో ఏర్పడిన ʹసంయుక్త సమాజ్ మోర్చాʹకు, తమకు ఎలాంటి సంబంధం లేదని సంయుక్త కిసాన్ మోర్చా స్పష్టం చేసింది. ʹʹSKM ఏ రాజకీయ పార్టీ తన బ్యానర్ లేదా వేదికను ఉపయోగించకూడదనే తన విధానానికి కట్టుబడి ఉంది. SKM పేరును ఎన్నికల కోసం ఉపయోగించుకునే ఏ ప్రయత్నమైనా మోర్చా క్రమశిక్షణను తీవ్రంగా ఉల్లంఘించడమే అవుతుంది. జనవరి 15న జరగనున్న SKM జాతీయ సమావేశం ఎన్నికల్లో పాల్గొనే రైతు సంఘాలు, నాయకులు SKMలోనే ఉండవచ్చా లేదా అనే దానిపై తుది నిర్ణయం తీసుకుంటుంది.ʹʹ అని SKM నాయకులు తెలిపారు.
.
అదే సమయంలో, పంజాబ్ నుండి క్రాంతికారి కిసాన్ యూనియన్ (డా. దర్శన్పాల్), BKU క్రాంతికారి (సూర్జిత్ ఫూల్), BKU సిద్ధుపూర్ (జగ్జిత్ దల్లెవాల్), ఆజాద్ కిసాన్ కమిటీ దోబా (హర్పాల్ సంఘా), జై కిసాన్ ఆందోళన్ (గురుబక్ష్ బర్నాలా) వంటి అనేక పెద్ద సంస్థల నాయకులు , దాసుహా గన్న సంఘర్ష్ కమిటీ (సుఖ్పాల్ దఫర్), కిసాన్ సంఘర్ష్ కమిటీ పంజాబ్ (ఇందర్జిత్ కోట్బుధా), లోక్ భలై ఇన్సాఫ్ వెల్ఫేర్ సొసైటీ (బల్దేవ్ సిర్సా), కీర్తి కిసాన్ యూనియన్ పంజాబ్ (హర్దేవ్ సంధు) అసెంబ్లీ ఎన్నికలలో పోటీకి వ్యతిరేకంగా స్పష్టమైన వైఖరిని తీసుకున్నాయి. ప్రజా పోరాటాన్ని కొనసాగిస్తామని ఈ సంస్థలు ప్రకటించాయి.
పంజాబ్లోని అతిపెద్ద రైతు సంఘాలలో ఒకటైన భారతీ కిసాన్ యూనియన్ (ఏక్తా ఉగ్రహన్) ఎన్నికలలో తాము ఏ విధంగానూ పాల్గొనబోమని ఖరాఖండిగా ప్రకటించింది. ఎన్నికలను బహిష్కరించాలనే పిలుపుని కూడా వారు ఇవ్వలేదు.
పాలకుల ఓటు రాజకీయాలలో చిక్కుకోకుండా పోరాడుతున్న రైతు సంఘాలు రైతుల సమస్యలపై దృష్టి సారించాలని సంస్థ పేర్కొంది. రాష్ట్ర అధ్యక్షుడు జోగీందర్ సింగ్ ఉగ్రహన్, ప్రధాన కార్యదర్శి సుఖ్దేవ్ సింగ్ కోక్రి కాలా మాట్లాడుతూ.." పార్లమెంట్, అసెంబ్లీల్లో కూర్చోవడం ద్వారా రైతుల హక్కులు, ప్రయోజనాలను కాపాడలేమని వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న పోరాటం రుజువు చేసింది" అని అన్నారు. ʹʹసామూహిక, సాముదాయిక స్థాయిలో బహిరంగ పోరాటం ద్వారా మాత్రమే సాధించవచ్చు. ఇప్పటికీ మూడు వ్యవసాయ చట్టాలు మాత్రమే రద్దు చేయబడ్డాయి, అయితే MSP, మొత్తం రుణమాఫీ వంటి ప్రధాన సమస్యలు పెండింగ్లో ఉన్నాయి. అవి ఇంకా పరిష్కారం కాలేదు. ఈ సమస్యల పరిష్కారం కోసం రైతులు ఎల్లప్పుడూ సామూహిక పోరాటాలపైనే ఆధారపడాలి.ʹʹ అని జోగీందర్ సింగ్ ఉగ్రహన్ అన్నారు.
Keywords : farmers protest, samyukta kisan morcha, farm laws, elections in punjab
(2024-03-24 12:05:32)
No. of visitors : 877
Suggested Posts
| అవార్డులను వాపస్ చేయడానికి రాష్ట్రపతి భవన్ వైపు మార్చ్ చేసిన క్రీడాకారులు
- అడ్డుకున్న పోలీసులురైతు చట్టాల విషయంలో కేంద్రం ప్రవర్తిస్తున్న తీరును నిరసిస్తూ క్రీడా రంగంలో వివిధ అవార్డులు అందుకున్న వారుఇవ్వాళ్ళ రాష్ట్రపతి భవన్ వైపు మార్చ్ నిర్వహించారు. |
| తీవ్రమైన రైతుల ఉద్యమం - రాజకీయ ఖైదీలను రిలీజ్ చేయాలని డిమాండ్ఢిల్లీ సరిహద్దుల్లోని టిక్రీ వద్ద భారతీయ కిసాన్ యూనియన్ (ఏక్తా ఉగ్రహాన్) ఆద్వర్యంలో జరిగిన ఈ కార్యక్రంలో రాజకీయ ఖైదీలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అక్రమ అరెస్టుకు గురై జైళ్ళలో ఉన్న వరవరరావు, సుధా భరద్వాజ్, ఆనంద్ తేల్తుంబ్డే, గౌతమ్ నవాలఖా తో సహా ఎల్గర్ పరిషథ్ కేసులో ఉన్న వారందరినీ విడుదల చేయాలని అదే విధంగా ఢిల్లీలో అక్రమ కేసులు బనాయించి అరెస్టు చే |
| రైతు ఉద్యమానికి మద్దతుపలికిన బాలీవుడ్ ప్రముఖులపై ఐటీ దాడులు
దేశంలో కొనసాగుతున్న రైతుల ఉద్యమానికి మద్దతుపలికిన బాలీ వుడ్ ప్రముఖుల ఇళ్ళపై ఆదాయపు పన్ను శాఖ రైడ్స్ నిర్చహించింది. నిర్మాత, దర్శకుడు అనురాగ్ కాశ్యప్, హీరోయిన్ తాప్సీ పన్ను ఇళ్ళపై ఈ రోజు ఆదాయపు పన్ను శాఖ రైడ్స్ నిర్చహించింది. |
| ఈ ఫోటో తీసిన జర్నలిస్టుపై దాడి - ప్రభుత్వ వాహనంలో వచ్చిన అగంతకులు
ఆ ఫోటో తీసిన జర్నలిస్టు రవి చౌదరిపై ఈ రోజు దాడి జరిగింది. ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్ లో గంగా కాలువ రోడ్డులో ఓ ప్రభుత్వ వాహనంలో వచ్చిన కొందరు అగంతకులు తనపై దాడి చేశారని రవి తెలిపాడు. |
| ఈ నెల 27న రైతు సంఘాల భారత్ బంద్ - విజయవంతం చేయాలని మావోయిస్టు పార్టీ పిలుపు
గత 10 మాసాల రైతాంగ ఉద్యమంలో అపూర్వ స్థాయిలో 5 సెప్టెంబర్ నాడు ముజఫర్ నగర్ లో భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) సహ సంయుక్త కిసాన్ మోర్చాతో పాటు కేంద్ర సాగు చట్టాలను వ్యతిరేకిస్తున్న అనేక రైతు సంఘాల పిలుపుపై జరుపతల పెట్టిన కిసాన్ మహా పంచాయత్ తో బెంబేలు పడిన ఉత్తర ప్రదేశ్ అదిత్యనాథ్ యోగీ సర్కార్ దానిని |
| దేశంలో ప్రజాపోరాటాలు ఆగవు... వాటికి నాయకత్వం వహించకుండా ఏశక్తీ మమ్మల్ని అడ్డుకోలేదు - మావోయిస్టు పార్టీ ప్రకటన
ప్రజా వీరులు గేంద్ సింగ్, బాబూరావు సడ్మెక్, గుండాదుర్, బిర్సాముండా, సిద్ధ-కానో, జ్యోతిబా ఫూలే, భగత్ సింగ్, రామరాజు, కొంరంభీం, బాబా సాహెబ్ అంబేడ్కర్, పెరియార్ మున్నగు అనేక మంది మహనీయుల పేర్లు ఉచ్ఛరించడానికైనా నైతిక అర్హతలేని బ్రాహ్మణీయ హిందుత్వ శక్తులు వారిని ముందు పెట్టి శాహీన్ బాగ్ నుండి సిల్గేర్ వరకు ప్రజా పోరాటాలను నెత్తురుటేరులలో ముంచడాన్ని మా పార్టీ |
| ఎర్ర కోట వద్ద జరిగిన హింస బీజేపీ కుట్రే - మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రకటన మోదీ ప్రభుత్వం తెచ్చిన మూడు రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోనూ, దేశవ్యాప్తంగానూ ఐక్యంగా, దృఢ సంకల్పంతో నిరంతరాయంగా పోరాడుతున్న రైతులకు భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) మరొకసారి విప్లవాభినందనలతో లాల్ సలాం చెబుతున్నది. |
| రైతాంగ ఉద్యమానికి మద్దతు ప్రకటించిన క్రాంతికారీ జనతన సర్కార్
నిరంతరం విస్తరిస్తున్న, తీవ్రతరం అవుతున్నదేశవ్యాప్త రైతు ఉద్యమాన్ని దెబ్బ తీయడానికి కేంద్ర ప్రభుత్వం జనవరి 26 న ఎర్రకోట కుట్రను అమలు చేసింది, దీనిని జనతన ప్రభుత్వం తీవ్రంగా ఖండిస్తున్నది. |
| ఉల్లిగడ్డలు తినకపోతే చస్తారా -మంత్రి గారి దబాయింపువాళ్ళ పొరపాట్లను ఎత్తి చూపితే పాలకులకు ఆవేశం పొంగుకొస్తుంది. వాళ్ళను ప్రశ్నలడిగితే చిర్రెత్తుకొస్తుంది. అడిగిన వారినే దబాయిస్తారు. బెదిరిస్తారు. ఈ మంత్రి కూడా అదే చేశారు..... |
| కెనడాలోని పాఠశాలల్లో భారత్ రైతు ఉద్యమ పాఠ్యాంశాలు... తొలగించాలని భారత్ లేఖభారత దేశంలో సాగుతున్న రైతుల ఉద్యమం గురించి కెనడాలోని కొన్ని పాఠశాలల్లో పాఠ్యాంశాలు ప్రవేశపెట్టడాన్ని భారత ప్రభుత్వం వ్యతిరేకింది. ఆ పాఠ్యాంశాలను వెంటనే తొలగించాలని కెనడాలోని భారత కాన్సులేట్ అంటారియో ప్రావిన్స్లోని |
| కేసీఆర్ కుటుంబానికి చెందిన అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్ |
| రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్ |
| నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు |
| 24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే ! |
| డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు |
| ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ |
| హుస్నాబాద్ స్తూపం స్థలాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక
|
| కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు |
| 5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన |
| ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా? |
| తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
|
| అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
|
| పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన |
| వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2) |
| వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1) |
| విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్ |
| హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ |
| అనారోగ్యంతో ఉన్న మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు |
| మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన |
| మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ ! |
| సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ |
| తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శన్ స్తూపావిష్కరణ |
| గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది -మావోయిస్టు పార్టీ |
| గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం |
more..