15 వాచ్ మెన్ ఉద్యోగాలకోసం 11వేల మంది... ఇంజనీర్లు, ఎంబీఏలు, పీజీలు. లా గ్రాడ్యుయేట్లు
29-12-2021
వాచ్ మెన్, ప్యూన్, డ్రైవర్ ఉద్యోగాల కోసం పీజీలు చేసిన వాళ్ళు, ఇంజనీర్లు, ఎంబీఏలు చేసిన వాళ్ళు, లా గ్రాడ్యుయేట్లు అక్కడ బారులు తీరారు. అది కూడా 15 ఉద్యోగాల కోసం 11 వేలమంది ఇంటర్వ్యూలకోసం వచ్చారు.
మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో 15 ప్యూన్లు, డ్రైవర్లు, వాచ్మెన్ ఉద్యోగాల కోసం ప్రభుత్వం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఆ ఉద్యోగాలకు కనీస అర్హత పదవ తరగతి గా నిర్ణయించింది ప్రభుత్వం.ఆ ఉద్యోగాల కోసం 11,000 మంది నిరుద్యోగులు శని, ఆదివారాలలో బారులు తీరారు. మధ్యప్రదేశ్ నుండే కాక ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుండి కూడా నిరుద్యోగులు వచ్చారు. వాచ్చినవాళ్ళలో అనేక మంది గ్రాడ్యుయేట్లు, పోస్ట్-గ్రాడ్యుయేట్లు, ఇంజనీర్లు, MBAలు మరియు సివిల్ జడ్జి ఆశావాదులు కూడా ఉన్నారు.
అభ్యర్థుల్లో ఒకరైన అజయ్ బాఘేల్ మాట్లాడుతూ.. "నేను సైన్స్ గ్రాడ్యుయేట్ని. ప్యూన్కు దరఖాస్తు చేశాను. పీహెచ్డీ చేసిన వారు ఇక్కడ లైన్లో ఉన్నారు.
లా గ్రాడ్యుయేట్ అయిన జితేంద్ర మౌర్య మాట్లాడుతూ.. ʹడ్రైవర్ పోస్టుకు దరఖాస్తు చేశాను.. జడ్జి పరీక్షకు కూడా ప్రిపేర్ అవుతున్నాను.. మాధవ్ కాలేజీలో ఉన్నా.. కొన్ని సార్లు పుస్తకాలు కొనేందుకు కూడా డబ్బులు లేని పరిస్థితి.. అందుకే.. నాకు ఈ ఉద్యోగం పనికి వస్తుందని అనుకున్నాను."
అల్తాఫ్ లాంటి కొందరు ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చారు. "నేను గ్రాడ్యుయేట్ ను ఉత్తరప్రదేశ్ నుండి ప్యూన్ ఉద్యోగం కోసం వచ్చాను" అని అతను NDTV కి చెప్పాడు.
కొద్ది రోజులక్రితం మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వ రిక్రూట్మెంట్ పై ఏమన్నాడంటే...
"ఏడాదిలో లక్ష మంది రిక్రూట్మెంట్ చేస్తాం. బ్యాక్లాగ్ పోస్టుల భర్తీకి ఎలాంటి తిరుగుండదు" అని కొద్దిరోజుల క్రితం ఆయన అన్నారు.
కానీ సంఖ్యలు వేరే రకంగా ఉన్నాయి. మధ్యప్రదేశ్లోని ఎంప్లాయిమెంట్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో మొత్తం నిరుద్యోగుల సంఖ్య 32,57,136. పాఠశాల విద్యాశాఖలో 30,600, హోంశాఖలో 9,388, ఆరోగ్యశాఖలో 8,592, రెవెన్యూ శాఖలో 9,530 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో దాదాపు లక్ష పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
గ్వాలియర్లో లాగా తక్కువ జీతంతో వచ్చే ప్రభుత్వ ఉద్యోగాల కోసం కూడా వేలల్లో హాజరవడానికి ఇదే కారణమని ఉద్యోగార్ధులు అంటున్నారు.
ప్రభుత్వం ఇటీవలి వీధి వ్యాపారుల పథకం కోసం దరఖాస్తులు ఆహ్వానించగా 15 లక్షల దరఖాస్తులొచ్చాయి. అందులో ఎంపికైన 99,000 మందిలో దాదాపు 90 శాతం మంది గ్రాడ్యుయేట్లు.
థింక్ ట్యాంక్ సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (CMIE) ప్రకారం, నవంబర్లో మధ్యప్రదేశ్లో నిరుద్యోగిత రేటు 1.7 శాతం మాత్రమే - ఇతర రాష్ట్రాలతో పోలిస్తే చాలా తక్కువ.
అయితే, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) ప్రకారం ఒక్క మధ్యప్రదేశ్లోనే గత ఏడాది నిరుద్యోగం కారణంగా 95 మంది మంది ఆత్మహత్యలు చేసుకున్నారు.
Keywords : madhyapradesh, Gwalior, 11,000 Applicants, Jobs, Chief Minister, Shivraj Singh Chauhan
(2024-03-24 12:05:19)
No. of visitors : 883
Suggested Posts
| ఆదివాసీ యువతిపై దాడి చేశారు...నగ్నంగా ఊరేగించారు..ఓ గుంపు ఓ ఆదివాసీ మహిళ పై అనాగరికంగా.... దుర్మార్గంగా... దాడి చేశారు. ఆమె పట్ల అతి నీచంగా ప్రవర్తించారు. మధ్య ప్రదేశ్ లో మంత్రగత్తె అనే నెపంతో ఓ యువతి పట్ల గ్రామస్తులు... |
| హద్దుల్లేని మత పిచ్చి - మూర్ఖత్వం అనంతం
బస్సో, రైలో, విమానమో నడుపుతున్నది ముస్లిం అని తెలిస్తే మధ్యలో గెంతెయ్యాలి . ఈవీఎం మెషీన్లని తయారుచేసేవాడు ముస్లిమో క్రిస్టియనో అయితే వోటేయ్యడం మానెయ్యాలి. ఇమిగ్రేషన్ కౌంటర్లో వున్నది ముస్లిమో, క్రిస్టియనో అయితే విమానమెక్కకుండా వెనక్కి వచ్చేయాలి. ఇంతకీ క్రిస్టియన్లు కనిపెట్టిన నడుపుతున్న ట్విట్టర్, పేస్బుక్ లను వాడడం మానెయ్యాలి. ముస్లిం దేశాల గాలి సోకకుం |
| లారీతో తొక్కించి జర్నలిస్ట్ ను హత్య చేసిన ఇసుక మాఫియాఈ అవినీతిలో ఉన్న ప్రజా ప్రతినిధుల పేర్లను పూర్తి ఆధారాలతో బయటపెడతానని ఆయన చెప్పారు కూడా. అయితే సోమవారం ఉదయం ఆయన విధులకు వెళ్తున్న క్రమంలో ఓ లారీ ఆయన్ని ఢీ కొట్టింది. వెంటనే లారీ డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా.. వారొచ్చి సందీప్ను ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. |
| CPI Maoist Extends Support to Peasants On Strike In Madhya PradeshExtending support to the farmersʹ strike in Madhya Pradesh and other states, Outlawed Communist Party of India (Maoist) have dropped pamphlets and put up banners expressing solidarity with the agitating peasants.... |
| దానమడిగినందుకు పసివాణ్ణి తన్నిన మంత్రిఓ వీధి బాలుడు దానం అడిగినందుకు ఆ మంత్రికి కోపమొచ్చింది. ఆ బాలుడిని కాలితో తన్ని వెళ్ళి పోయింది. మధ్యప్రదేశ్ ప్రభుత్వంలోని పశు సంవర్థకశాఖ మంత్రి కుసుమ్ మెహడేలే చేసిన ఈ అమానవీయ చర్య.... |
| బీజేపీకి వ్యతిరేకంగా వార్తలు రాసినందుకు జర్నలిస్టులపై దుర్మార్గం - అర్ద నగ్నంగా నిలబెట్టిన పోలీసులుమధ్యప్రదేశ్ లోని సిధి జిల్లాలో స్థానిక బీజేపీ శాసనసభ్యుడు కేదార్నాథ్ శుక్లాకు వ్యతిరేకంగా వార్తలు రాశారనే కోపంతో ఆయన ఆదేశాలతో పోలీసులు 8 మంది జర్నలిస్టులను అరెస్టు చేశారు. వాళ్ళందరినీ అర్దనగ్నంగా డ్రాయర్లమీద పోలీసు స్టేషన్ లో నిలబెట్టి ఫోటోలు తీశారు. దారుణంగా అవమానించారు. వారిపై అక్రమ కేసు బనాయించారు. |
| ఆర్ఎస్ఎస్ కు భజన చేస్తున్న పోలీసు అధికారులుప్రభుత్వ శాఖలను పూర్తిగా కాషాయమయం చేస్తున్నారంటూ విమర్శలు వినవస్తున్న నేపథ్యంలో ఆ విమర్షలను నిజం చేస్తూ మధ్యప్రదేశ్ నార్కోటిక్స్ విభాగం ఓ క్యాలెండర్ ప్రచురించింది. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, బీజేపీ అధ్యక్షుడు అమిత్షా కొటేషన్లతో పాటు వారి ఫోటోలను ఈ క్యాలెండర్లలో ప్రచురించి ఆర్ఎస్ఎస్ పై భక్తిని చాటుకున్నారు ఆ పోలిసు అధికారులు....
|
| Custodial Violence in MP:లాకప్ లో ఆదివాసులపై చిత్ర హింసలు, యువకుడి మృతి...భగ్గుమన్న ఆదివాసులుమధ్యప్రదేశ్ ,ఖార్గోన్లో పోలీసు కస్టడీలో ఓ ఆదివాసీ యువకుడిని తీవ్ర చిత్రహింసలు పెట్టి, హత్య చేసినందుకు నిరసనగా వేలాదిమంది ఆదివాసీలు నిరసన ప్రదర్శన నిర్వహించారు. |
| లాక్ డౌన్ నిబందనలు బేఖాతరు... ఓ స్వామీజీ అంత్యక్రియలకు హాజరైన ముఖ్యమంత్రి సహా వేలాది మంది జనంవ్ ప్రభాకర్ శాస్త్రి పూర్తి ఊపిరితిత్తులు, కిడ్నీ వ్యాధులతో బాధపడుతూ ఆదివారం చనిపోయారు ఆయన అంఅత్యక్రియలు అధికార లాంఛనాలతో జరిగాయి. ఆ అంత్యక్రియల్లో భౌతిక దూరం నిబంధనలను పక్కనపెట్టి వేలాదిగా జనం గుమికూడారు. అంతిమయాత్రలో ముఖ్యమంత్రి శివ్ రాజ్ సింగ్ చౌహాన్, బీజేపీ జాతీయ జనరల్ సెక్రటరీ కైలాశ్ విజయవర్గీయ, మధ్య ప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్, మాజీ ముఖ్యమంత్రి కమల్ |
| దళితుడు,RTI కార్యకర్తపై దుర్మార్గమైన దాడి - మూత్రం తాగించే ప్రయత్నం
మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ జిల్లాలోని ఒక గ్రామ పంచాయతీకి సంబంధించిన సమాచారం కోరినందుకు 33 ఏళ్ల దళిత సమాచార హక్కు (RTI) కార్యకర్తను ఏడుగురు వ్యక్తులు కొట్టి, బలవంతంగా మూత్రం తాగించారని |