include 'men';
?>
కామ్రేడ్ రాజ్ కిషోర్ కు విప్లవ జోహార్లు
01-01-2022
కామ్రేడ్ రాజ్ కిషోర్ బీహార్ రాష్ట్రానికి చెందిన విప్లవ సాహిత్య, సాంస్కృతికోద్యమ ప్రధాన నాయకులలో ఒకరు. ఆయన తన 89వయేట, డిసెంబర్ 23న తీవ్ర అనారోగ్యంతో మరణించారు.
1983 లో విరసం చొరవతో అఖిల భారత విప్లవ సాంస్కృతిక సమితి (ఏఐఎల్ఆర్సి) ఏర్పడిరది. అదే సంవత్సరం అక్టోబర్ 14, 15 తేదీలలో ఏఐఎల్ఆర్సి ప్రథమ జాతీయ మహాసభలు ఢిల్లీలో జరిగాయి. ఈ మహాసభల్లో బీహార్ రాష్ట్రం నుండి పాల్గొన్న ప్రతినిధులలో కామ్రేడ్ రాజ్ కిషోర్ ఒకరు. ఆ రాష్ట్రం నుండి రెండు విప్లవ సాహిత్య సాంస్కృతిక సంస్థలు ఏఐఎల్ఆర్సిలో భాగస్వామ్యం అయ్యాయి. వాటిల్లో ఒకటి, క్రాంతికారీ బుద్ధిజీవి సంఘం (కెబియస్), రెండోది క్రాంతికారీ సాంస్కృతిక సంఘం (కెఎస్ఎస్). వీటిల్లో కెబియస్ తరఫున కామ్రేడ్ రాజ్ కిషోర్ ఏఐఎల్ఆర్సి కార్యవర్గంలో సభ్యులుగా ఎన్నికయ్యారు. 2002 జనవరి 13, 14 తేదీలలో హైదరాబాద్లో ఏఐఎల్ఆర్సి 8వ మహాసభలు జరిగాయి. అందులో కామ్రేడ్ రాజ్ కిషోర్ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు.
ఏఐఎల్ఆర్సిలో చేరడానికి పూర్వం ఆయన బీహార్లో క్రాంతికారీ నవజన్వాదీ సాంస్కృతిక సంఘం బాధ్యతలు నిర్వహించారు. బీహారీ జన జీవితంతో పెనవేసుకుపోయిన వ్యక్తిత్వం ఆయనది. ఆజానుబాహు విగ్రహం. నిత్యం నవ్వు తొణికిసలాడే ముఖం. అక్షరాలా ప్రసన్నవదనుడు. చూపులకు సున్నితత్వంలేని వ్యక్తిగా అనిపించినప్పటికీ ప్రజలపట్ల అతి సున్నితమైన స్పందన ఆయన జీవలక్షణం. ఎవరినైనా మనసారా ప్రేమించి, నోరారా పలకరించేవాడు. గొప్ప వక్త, కంచుకంఠం. ఆయన నినాదాలిచ్చే ప్రత్యేకమైన తీరు ప్రజల్ని ఎంతగానో ప్రభావితం చేసేది. వీటన్నింటికిమించి గొప్ప కార్యదక్షత. మార్క్సిజం, లెనినిజం, మావో ఆలోచనా విధానంతో చివరికంటా కొనసాగారు. బీహార్ రాష్ట్రంలో జరిగిన అనేకానేక రాజకీయ, సాంఘిక, సాంస్కృతిక ఉద్యమాలలో అత్యంత చురుకైన పాత్ర పోషించారు. ఆ రాష్ట్రంలోని అగ్రకుల పెత్తందారీ భూస్వామ్య శక్తులకు వ్యతిరేకంగా అణగారిన ప్రజలు నిరంతరం చేసిన పోరాటాలతో మమేకం అయ్యారు. ఆ క్రమంలో ఆయన కుల వర్గ పోరాటాలు జమిలిగా కొనసాగాల్సిన ఆవశ్యకతను అర్థం చేసుకున్నారు. తన కుల చిహ్నమైన ʹసింగ్ʹ పదాన్ని తన పేరు నుండి వదులుకుంటున్నానని, ఇక నుండి రాజ్ కిషోర్గా కొనసాగుతానని బహిరంగ సభలో ప్రకటించారు.
కెబియస్ నాయకుడుగా, ఏఐఎల్ఆర్సి కార్యవర్గ సభ్యుడుగా దేశంలోని విభిన్న ప్రాంతాలలో జరిగిన అనేక సభలలో సెమినార్లలో పాల్గొన్నారు. ఒకవైపు ఏఐఎల్ఆర్సిలో కొనసాగుతూనే మరోవైపు అఖిల భారత ప్రజాప్రతిఘటనా వేదిక, రివల్యూషనరీ డెమోక్రాటిక్ ఫ్రంట్ సంస్థల తరఫున కూడా దేశమంతటా పర్యటించి ప్రజల్ని ఉత్తేజితుల్ని చేశారు. 1998లో పాట్నాలో ఏఐఎల్ఆర్సి తరఫున మహిళా సమస్యలపట్ల మార్క్సిస్టు వైఖరికి సంబంధించిన జాతీయ సెమినార్ను నిర్వహించడంలో కీలకపాత్ర వహించారు.
కామ్రేడ్ రాజ్ కిషోర్ ప్రసంగాలలో స్థానిక వాస్తవిక పరిస్థితుల చిత్రణతోపాటు జాతీయ, అంతర్జాతీయ రాజకీయాల చిత్రణ కూడా వుండేది. సమస్యలను మార్క్సియన్ తాత్విక దృక్పథం నుండి విశ్లేషిస్తూ ప్రసంగించేవారు. బీహారీ ప్రజల భాషలో సరళంగా ప్రసంగించి ప్రజల్ని చైతన్యవంతుల్ని చేయడం ఆయనకు అబ్బిన గొప్ప కళ. కేవలం ఒక ఆలోచనాపరుడుగానో వక్తగానో మిగిలిపోకుండా ప్రజా ఉద్యమాలలో నిరంతరం ఆచరణలో మునిగితేలినవాడు రాజ్ కిషోర్. ఎన్నడూ ఎలాంటి రాజ్య నిర్బంధానికి వెరవలేదు. ఆయన కార్యాచరణను అడ్డుకోవడానికి పాలకవర్గాలు చేసిన ప్రయత్నాలను, ఆయన భాగస్వామ్యం వహించిన ఉద్యమం ప్రజా సహకారంతో తిప్పికొట్టింది. ఒక దశలో పోలీసులు ప్రయోగించిన చిత్రహింసల ఫలితంగా ఒక కాలు విరిగి కూడా ఆయన తన కార్యకలాపాల నుండి వెనకంజ వేయలేదు. కొద్దికాలం నుండి ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తెలిసింది.
విరసంపట్ల గాఢమైన అభిమానాన్ని ప్రేమను ప్రదర్శించేవాడు. విరసంతో నిత్య సంభాషణలో వుండేవాడు. తెలుగులో వచ్చిన విప్లవ కథలు, కవితలను స్థానిక భాషలోకి అనువాదం చేయించడంలో చొరవ చూపేవారు. అలా దాదాపు మూడు దశాబ్దాలకు పైగా విరసానికి సన్నిహితుడుగా స్నేహితుడుగా విరసం బలపడడాన్ని కాంక్షించిన శ్రేయోభిలాషిగా వున్న కామ్రేడ్ రాజ్ కిషోర్ అకాల మరణం మాకెంతైనా బాధాకరం. ఆయనకు వినమ్రపూర్వక జోహార్లు.
సిఎస్సార్ ప్రసాద్
(vasanthamegham.com లో పోస్ట్ చేసిన ఆర్టికల్)
Keywords : raj kishor, bihar, virasam, ailrc, kbs, kss
(2024-04-24 22:55:22)
No. of visitors : 671
Suggested Posts
| కలకత్తాలో జరుగుతున్న చారుమజుందార్ శత జయంతి ఉత్సవాల్లో విరసం కార్యదర్శి పాణి స్పీచ్ నక్సల్బరీ లేకపోతే భారత పీడిత ప్రజానీకానికి విప్లవ దారే లేకుండా పోయేది. కమ్యూనిస్టు రాజకీయాలు చర్చించుకోవడానికే తప్ప వర్గపోరాట బాట పట్టకపోయేవి. ఆ నక్సల్బరీ దారిని చూపినవాడు చారు మజుందార్. విప్లవ పార్టీకి వ్యూహాన్ని, ఎత్తుగడలను ఒక సాయుధ పోరాట మార్గాన్ని చూపించిన వాడు చారు మజుందార్. |
| ఆదివాసి.. లంబాడా వివాదం - ఎం.రత్నమాలమహారాష్ట్ర ప్రభుత్వం లంబాడాలను ఆదివాసి తెగగా గుర్తించడం లేదు కనుక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లంబాడాలను ఆదివాసి షెడ్యూల్డు తెగగా ప్రకటించడంతో దీన్ని అవకాశంగా తీసుకుని మహారాష్ట్ర నుంచి ఆదిలాబాద్ (పాత) జిల్లాకు లంబాడాల వలసలు పెద్ద ఎత్తున వెల్లువలా సాగాయి..... |
| మహాశ్వేతా దేవి - మన తెలంగాణ సాగర హారంః వరవర రావుమన మహా సాగరహారం ʹచలో హైదరాబాద్ అంటూ తెలంగాణ మార్చ్ చేసిన సెప్టెంబర్ 30, 2012 మహత్తర మధ్యాహ్నం మహాశ్వేతాదేవి కూడా మన ఊర్లో ఉన్నారు. ఆ రోజు ఆమెను మన మధ్యకు తెచ్చుకొని ఉంటే.... |
| సెప్టెంబర్ 17 - ఇండియన్ యూనియన్ సైనిక దురాక్రమణ దినం - వరవరరావు1947 ఆగస్ట్ 15న విలీనానికి అంగీకరించకుండా షరతులు విధిస్తూ వచ్చిన నిజాంను నెహ్రూ - పటేల్ ప్రభుత్వం సగౌరవంగా, సాదరంగా చర్చలకు ఆహ్వానించింది. అప్పటికే నిజాంను వ్యతిరేకిస్తూ వీరోచిత పోరాటం నడుపుతున్న కమ్యూనిస్టులను మాత్రమే కాదు, కనీసం కాంగ్రెస్ ను కూడా ఈ చర్చల్లో భాగం చేయలేదు.... |
| అమరుడు బొజ్జా తారకం — ʹనది పుట్టిన గొంతుకʹ - వరవరరావుగోదావరి తెలంగాణలో ప్రవేశించిన నిజామాబాద్ కు 1968లో వచ్చిన తారకం గారు ఇక్కడి మట్టిలోని ఎరుపులోనూ, ఇక్కడి నీళ్లలోని ప్రవాహ గుణంలోనూ కలగలిసిపోయారు. 1968 నుంచి 78 దాకా ఒక దశాబ్దం పాటు విప్లవోద్యమాలకు, విప్లవ సాహిత్యానికి నిజామాబాద్ చిరునామా బొజ్ఞాతారకం.... |
| ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ పోరాటానికి విరసం మద్దతుఅట్టడుగున ఉన్న మనిషికి ఫలితాలు అందినప్పుడే సామాజిక న్యాయం జరిగినట్టు లెక్క. మాదిగ, డక్కలి, చిందు, మాష్టి, బుడగజంగం, దాసరి, బేగరి కులాలకు ఈ నాటికీ ఎస్సీ రిజర్వేషన్ ఫలాలు అందడం లేదు.... |
|
ʹఅన్నలు మల్లొస్తరు బిడ్డా.. ఆల్లొస్తే వాళ్ళకు గిన్ని మంచి నీల్లో, తిండో పెట్టాలనే బతుకుతాన్నʹఅందుకే అంత నిర్బంధంల కూడా నా కొడుకు అంత్యక్రియలకు వచ్చిన జనాలకు మా ఖిలా వరంగల్ సరిపోలె. ఎక్కడోల్లను అక్కడ అరెస్ట్ చేసినా వచ్చిండ్రు. ఎవరో నక్సలైట్ అట, చిన్న పిల్లగాడేనట, బలే తెలివికల్లోడట అని అనుకుంట జనాలు వచ్చిండ్రు. పద్దెనిమిది నిండి పందొమ్మిది పడగానే చంపేసిండ్రు. |
| కాగడాగా వెలిగిన క్షణం... అమరుడు యెం యెస్ ఆర్ కోసం ... నారాయణ స్వామిఎంత ప్రాణం శ్రీనుది బక్క పలుచగా ఉండేటోడు – ఎక్కడన్న సరిగ్గా తిన్నడో లేదో శరీరం లో బలం సత్తువ ఉన్నదో లేదో – ఆ దుర్మార్గులు పట్టుకొని చిత్రహింసలు పెడుతుంటే ఆ లేత శరీరం ఎంత గోస పడిందో ఎంత హింసకు గురైందో ఎంత అల్లల్లాడిందో – ఆ క్రూరులు చంపేయ్యబోతుంటే, చివరికి మేఘే ఢాకా తార లో సుప్రియ అరిచినట్టు నాకు బతకాలని ఉంది నాకు చావాలని లేదు నాకు బతకాలని ఉంది.... |
| ఉత్తేజకరంగా సాగిన విరసం సాహిత్యపాఠశాల
అంతకుముందు అంతర్జాతీయ శ్రామికవర్గ పతాకావిష్కరణతో కార్యక్రమాలను ప్రారం భించారు. అమరుడు పులి అంజన్న తల్లి సైదమ్మ ఎర్ర జెండాను, సీనియర్ విరసం సభ్యురాలు రత్నమాల విప్లవ రచయితల సంఘం జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా అమరుడు శేషయ్య సోదరుడు సాంబయ్య, అమరుడు వివేక్ తండ్రి యోగానంద్ అమరుల స్థూపాన్ని ఆవిష్క రించారు. |
| ʹఅరుణోదయʹ పై పోలీసుల దాడిని ఖండించిన విరసం తెలంగాణ ఉద్యమంలో ఆట పాటతో ఆరుణోదయ కళాకారులు గ్రామ గ్రామాన తిరిగి ప్రజల్లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని రగిలించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తమ వంతు కృషి చేశారు. ఆ సంస్థ కార్యాలయాన్ని దౌర్జన్యంగా మూసేయడం అత్యంత నిరంకుశమైన...... |
| కేసీఆర్ కుటుంబానికి చెందిన అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్ |
| రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్ |
| నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు |
| 24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే ! |
| డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు |
| ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ |
| హుస్నాబాద్ స్తూపం స్థలాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక
|
| కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు |
| 5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన |
| ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా? |
| తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
|
| అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
|
| పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన |
| వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2) |
| వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1) |
| విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్ |
| హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ |
| అనారోగ్యంతో ఉన్న మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు |
| మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన |
| మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ ! |
| సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ |
| తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శన్ స్తూపావిష్కరణ |
| గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది -మావోయిస్టు పార్టీ |
| గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం |
more..