యాప్ ల ద్వారా ముస్లిం మహిళలపై లైగిక వేధింపులు - రాష్ట్రపతికి మహిళా సంఘాల లేఖ
03-01-2022
రాష్ట్రపతికి మహిళా సంఘాల సంయుక్త వినతి పత్రం
తేదీ: 3 జనవరి 2022
శ్రీ రామానంద్ కోవింద్ గారికి,
రాష్ట్రపతి
ముస్లిం మహిళలపై లైంగిక వేధింపులకు బహిరంగంగా ప్రేరేపించినవారికి కఠినమైన శిక్షను విధించాలి
గౌరవనీయులైన రాష్ట్రపతి గారికి,
దురదృష్టవశాత్తూ ఒక సంవత్సరం లోపలే రెండవసారి అత్యంత అసహ్యకరమైన స్త్రీ ద్వేషాన్ని మేం చూసాం. మొదట, 2021 జూలైలో, ప్రముఖ ముస్లిం మహిళలు, జర్నలిస్టులు, రచయితలు, కార్యకర్తలు మొదలైన వారిని ʹవేలంʹ వేయడానికి ఉద్దేశించిన ʹసుల్లి డీల్స్ʹ అనే యాప్ను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అన్యాయం, అవినీతికి వ్యతిరేకంగా రాసిన, నిరసన తెలిపిన ధైర్యస్థులైన ముస్లిం మహిళలను అవమానపరచడానికి, భయపెట్టడానికి చేసిన ఈ చర్యకు బాధ్యులైన వారిపై యుపి, ఢిల్లీల్లో ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి, అయితే, దురదృష్టవశాత్తు, బాధ్యులపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు.
విచారకరంగా, ఈ నిష్క్రియాత్మకత, మైనారిటీలకు వ్యతిరేకంగా జరుగుతున్న నేరపూరిత చర్యలకు పరిపాలనలోని విభాగాలు, న్యాయవ్యవస్థ కూడా ప్రేక్షకులుగా మిగిలిపోయే ధోరణిలో భాగం.
ద్వేషపూరిత ప్రసంగాలైనా, భౌతిక దాడులైనా, ప్రార్థనా సమావేశాలను నిరోధించినా, క్రైస్తవులు, ముస్లింలు వంటి మైనారిటీ వర్గాలకు చెందిన వారు ఎక్కడ బాధితులైనప్పటికీ, పోలీసులు, పరిపాలన, న్యాయస్థానాలు కూడా మౌనం వహిస్తాయి.
భౌతికంగా అక్కడే ఉన్నప్పటికి తరచుగా పోలీసులు జోక్యం చేసుకోరు లేదా ఒకవేళ చేసుకుంటే అది నేరస్థులకు సహాయం చేయడానికి, ప్రోత్సహించడానికే. తత్ఫలితంగా, ద్వేషం, హింసలను బోధించే వారికి మరింత క్రూరత్వానికి పాల్పడే ధైర్యం వస్తుంది. ʹసుల్లి ఒప్పందాలకుʹ బాధ్యులైన వారిపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో, ఏడాది చివరలో ఇలాంటి మరో యాప్ ʹబుల్లి బాయిʹ సోషల్ మీడియాలో కనిపించింది.
ఢిల్లీలో పోలీసులకు ఫిర్యాదు చేసిన ఇస్మత్ అరా, రేడియో ఉద్యోగి సైమా వంటి అనేక మంది ప్రముఖ ముస్లిం మహిళలు, పేర్లను మాత్రమే కాకుండా, వారి ఫోటోలను బహిర్గతం చేసిన సైట్లో మహిళలను వేలం వేయడం గురించి కూడా మాట్లాడారు.
నజీబ్ తల్లి ఫాతిమా అమ్మీ పేరు కూడా రాశారు. ఈ నీచమైన ప్రవర్తనపై వ్యతిరేకత వెల్లువెత్తుతోంది. యాప్ వెనుక ఉన్న గిట్హబ్ వినియోగదారుడిని ʹబ్లాక్ʹ చేశామని ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. కానీ ఇది చాలా బలహీనమైన, చాలని ప్రతిస్పందన.
పితృస్వామ్యం ప్రబలంగా ఉన్న దేశంలో మహిళలు అన్ని రంగాలలో అసమానతలకు, అంతులేని హింసకు గురవుతారు, ముస్లిం మహిళలను లక్ష్యంగా చేసుకుని ఈ బహిరంగ లైంగిక వేధింపులకు పాల్పడడాన్ని సహించలేము, సహించకూడదు.
క్రైస్తవ, ముస్లిం వర్గాలకు చెందిన వారు భౌతిక, మాటల హింసను ఎదుర్కోవడమే కాకుండా, హిందూ మత పెద్దలుగా పిలుచుకునేవారు ఎలాంటి శిక్షల భయం లేకుండా, వారిపై మారణహోమ దాడులు చేయాలని పిలుపిస్తూ బహిరంగ సభలు నిర్వహిస్తున్న తరుణంలో ఈ తాజా దారుణం జరిగిందని మీకు గుర్తు చేయాలనుకుంటున్నాం.
వివిధ మహిళా సంఘాల సభ్యులమైన మేము , ఈ నీచ, నేరపూరిత ప్రవర్తనకు బాధ్యులైన వారికి తగిన శిక్ష విధించేలా జోక్యం చేసుకోవడానికి మీ వద్ద ఉన్న అన్ని సాధనాలను ఉపయోగించాలని అత్యున్నత రాజ్యాంగ అధికారంగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాము. తక్షణ, సానుకూల ప్రతిస్పందన కోసం ఎదురు చూస్తున్నాం.
నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఉమెన్ NFIW- అనీ రాజా
ఆల్ ఇండియా డెమాక్రటిక్ ఉమెన్స్ అసోసియేషన్ AIDWA- మరియం ధవళే
ఆల్ ఇండియా ప్రోగ్రెసివ్ ఉమెన్స్ అసోసియేషన్ AIPWA- కవిత కృష్ణన్
ప్రగతిశీల మహిళా సంఘటన్ PMS- పూనమ్ కౌశిక్
ఆల్ ఇండియా మహిళా సాంస్కృతిక్ సంఘటన్ AIMSS- ఛబి మొహంతి
Keywords : Joint Memorandum from Womenʹs Organisations to President, sexual abuse, Sulli Dealsʹ app, Ismat Ara
(2024-04-24 22:54:37)
No. of visitors : 729
Suggested Posts
| బుల్లిబాయ్ యాప్ కేసులో ప్రధాన నిందితుడి అరెస్టు
దేశంలో తీవ్ర సంచలనం సృష్టించిన బుల్లిబాయ్ యాప్ కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న నీరజ్ బిష్ణోయ్ని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే అరెస్టుకు ముందు సోషల్ మీడియాలో |
| ఇద్దరు ʹబుల్లీబాయ్ʹ నిందితుల అరెస్టు నరనరాన ద్వేషం,విషం, మతోన్మాదం నింపుకున్న ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. |
| Bulli Bai:బుల్లీబాయ్ యాప్ కేసు - ఉత్తరాఖండ్ లో మూడో నిందితుడి అరెస్టుʹబుల్లి బాయిʹ యాప్ కేసులో ఉత్తరాఖండ్కు చెందిన మరో విద్యార్థిని ముంబై సైబర్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. బుధవారం తెల్లవారుజామున ఉత్తరాఖండ్ రాష్ట్రానికి చెందిన మయాంక్ రావల్ (21) అనే విద్యార్థిని అరెస్టు చేసినట్లు సైబర్ అధికారి ఒకరు తెలిపారు. |