PUNJAB: రైతుల నిరసనలలో చిక్కుకుపోయిన ప్రధాని - అర్దాంతరంగా పర్యటన రద్దు
05-01-2022
రైతుల నిరసనల కారణంగాప్రధానినరేంద్ర మోడీ ఇవ్వాళ్ళ పంజాబ్ పర్యటనను అర్దాంతరంగా ముగించుకొని వెనుదిరిగారు.
హుస్సేనివాలాలోని జాతీయ అమరవీరుల స్మారక స్థూపాన్ని సందర్శించేందుకు ప్రధాని ఈరోజు తెల్లవారుజామున భటిండాకు చేరుకున్నారు. అక్కడి నుంచి ప్రధాని హెలికాప్టర్ ద్వారా ఫిరోజ్పూర్ లో జరిగే బీజేపీ ర్యాలీకి వెళ్లాల్సి ఉంది, కానీ వర్షం, వాతావరణం అనుకూలించని కారణంగా, రెండు గంటల దూరంలో ఉన్న స్పాట్కు రోడ్డు మార్గంలో వెళ్లాలని నిర్ణయించుకున్నారు. "డిజిపి పంజాబ్ పోలీసులు అవసరమైన భద్రతా ఏర్పాట్లను ధృవీకరించిన తర్వాత మోడీ రోడ్డు మార్గంలో ప్రయాణించారు" అని హోం మంత్రిత్వ శాఖ తెలిపింది.
ఓ 30 కిలోమీటర్లు ప్రయాణించాక మోడీ కాన్వాయ్ ఓ ఫ్లై ఓవర్ పైకి చేరుకుంది. అప్పటికే అక్కడ చేరిన వేలాది మంది రైతులు ʹగో బ్యాక్ మోడీʹ అంటూ రోడ్డుపై నిరసన తెలుపుతున్న కారణంగా ఫ్లై ఓవర్ జామ్ అయిపోయింది. ఒక వైపు పంజాబ్ పోలీసులు రైతులను చెదరగొట్టడానికి ప్రయత్నించినప్పటికీ సాధ్యం కాలేదు. దాంతో మోడీ కాన్వాయ్ దాదాపు 20 నిమిషాల పాటు ఫ్లై ఓవర్ పై చిక్కుకుపోయింది. నల్లటి టయోటా ఫార్చ్యూనర్లో ప్రధాని మోడీ ఉన్నారు ఆ కారు చుట్టూ స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (SPG) సిబ్బంది ఉన్నారు. కారు నుండి కేవలం కొన్ని అడుగుల దూరంలో, ఆందోళనకారులు, పోలీసులు ఉన్నారు. ఇక ముందుకు పోవడం సాధ్యంకాదని నిర్ణయించుకున్న ప్రధాని చివరకు తన కార్యక్రమాలను రద్దు చేసుకొని వెనక్కి మళ్ళారు.
కాగా "ప్రధానమంత్రి 15-20 నిమిషాల పాటు ఫ్లైఓవర్పై ఇరుక్కుపోయారు. ఇది ప్రధానమంత్రి భద్రతలో పెద్ద లోపం" అని హోం మంత్రిత్వ శాఖ ప్రకటన పేర్కొంది.
"పీఎం షెడ్యూల్, ప్రయాణ ప్రణాళిక పంజాబ్ ప్రభుత్వానికి చాలా ముందుగానే తెలియజేయబడింది. ప్రక్రియ ప్రకారం, వారు లాజిస్టిక్స్, భద్రతతో పాటు ఆకస్మిక ప్రణాళికను సిద్ధంగా ఉంచుకోవాలి. అలాగే ఆకస్మిక ప్రణాళికను దృష్టిలో ఉంచుకుని పంజాబ్ ప్రభుత్వం ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. రహదారి లో ఏదైనా అవాంచిత కదలికను పసిగట్టినప్పుడు ప్రధానిని సురక్షితంగా ఉంచడానికి అదనపు భద్రతను మోహరించాలి. అది జరగలేదు. ఇంత తీవ్రమైన భద్రతా లోపం కారణంగా, తిరిగి బటిండా విమానాశ్రయానికి వెళ్లాలని నిర్ణయించబడింది," అని హోం మంత్రిత్వ శాఖ తెలిపింది. హోం మంత్రిత్వ శాఖ పంజాబ్ ప్రభుత్వం నుండి వివరణాత్మక నివేదికను కోరింది.
మరో వైపు పంజాబ్ ప్రభుత్వంపై బీజేపీ మండి పడింది. ఇది "ఇటీవలి సంవత్సరాలలో ఇటువంటి భద్రతా లోపం ఏ భారత ప్రధాని విషయంలోనూ జరగలేదు" అని బిజెపి పేర్కొంది. పంజాబ్లోని అధికార కాంగ్రెస్ ప్రధానిని దెబ్బతీయడానికి ప్రయత్నిస్తోందనిఆ పార్టీ ఆరోపించింది.
బిజెపి చీఫ్ జెపి నడ్డా పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్జిత్ సింగ్ చన్నీపై వరుస ట్వీట్లలో విమర్షలు గుప్పించారు.
ʹʹపంజాబ్లో వేల కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించేందుకు వచ్చిన ప్రధాని పర్యటనకు విఘాతం కలగడం బాధాకరం... ర్యాలీకి ప్రజలు రాకుండా అడ్డుకోవాలని రాష్ట్ర పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు." అని నడ్డా ట్వీట్ చేశారు.
పంజాబ్ మంత్రి రాజ్కుమార్ వెర్కా భద్రతా ఉల్లంఘన ఆరోపణలను నిరాధారంగా పేర్కొన్నారు. "నిజమేమిటంటే, బిజెపి ర్యాలీ ఫ్లాప్ షో. ఈ విషయం తెలియగానే ప్రధాని తిరిగి వెనక్కి వెళ్ళాలని నిర్ణయించుకున్నారు" అని రాజ్కుమార్ వెర్కా అన్నారు.
కాంగ్రెస్ నాయకుడు రణదీప్ సింగ్ సూర్జేవాలా మాట్లాడుతూ, ʹʹబిజెపి చీఫ్ నడ్డ ఔచిత్యాన్ని కోల్పోయి మాట్లాడుతున్నారు" అని అన్నారు.
"ప్రధానమంత్రి ర్యాలీ కోసం 10,000 మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. SPG మరియు ఇతర ఏజెన్సీలతో కలిసి అన్ని ఏర్పాట్లు చేశారు. హర్యానా/రాజస్థాన్ నుండి బిజెపి కార్యకర్తల బస్సులన్నింటికీ కూడా ఒక రూట్ను రూపొందించారు. ప్రధానమంత్రి హుస్సేనివాలా వరకు రోడ్డు ప్రయాణం చేయాలని నిర్ణయించుకున్నారు. రోడ్డు మార్గంలో ప్రయాణించడం ప్రధాని అసలు షెడ్యూల్లో భాగం కాదు, ʹఅని సుర్జేవాలా అన్నారు.
Keywords : punjab, narendra modi, prime minister, farmers protest, After PM Stuck On Flyover, BJP Says Chief Minister Channi Ignored SOS
(2024-03-27 00:32:29)
No. of visitors : 904
Suggested Posts
| The Punjab remembers the immortal contribution of Shaheed Bhagat SinghSALUTE THE CONFERENCE AND RALLY OF PUNJAB STUDENTS UNION AND NAUJWAN BHARAT SABHA IN FEROZEPUR WHICH CARRIED ON THE LEGACY OF THE IMMORTALS MARTYRS BHAGAT SINGH,SUKHDEV AND RAJGURU...
|
| అగ్రకులోన్మాదం:దళితుడిని పెళ్ళి చేసుకున్నందుకు కూతురును హత్య చేసిన తండ్రి!పంజాబ్ లోని రోహతక్ లో జాట్ కులానికి చెందిన రమేశ్ కుటుంభం రెండేళ్ళ వయసున్న అమ్మాయిని దత్తత తీసుకున్నారు. ఆమె పేరు మమత. ఇప్పుడు ఆ అమ్మాయికి 18 ఏళ్ళు. ఆమె దళిత యువకుడైన సోంబీర్ ను ప్రేమించింది. |
| Students Oppose Fee Hike - Police Brutally attacked on StudentsTension prevailed on the Punjab University campus as students protest the senate approval of the ʹenhancement in fee structure of various courses being taught at University Campus and at its Regional Centresʹ... |
| At least 66 Panjab University students booked on sedition charges for protesting fee hikeAt least 66 students of Panjab University have been booked on sedition charges for protesting against the fee hike in the campus. Following an outcry over the move, a senior officer of Chandigarh Police.... |
| Release Professor Saibaba Now ! Call from Jalandhar, PunjabIt has also reflected how the state has sharpened itʹs fascist fangs like never before bowing to the dictates of pro corporate international policies.In areas of Jharkhand,Chattisgarh and Chandrapur virtual fascism is perpetrating the judicial system..... |
| SKM: ప్రధాని ప్రాణాలకు ముప్పు అనేది కల్పితం,దుష్ప్రచారం - సంయుక్త కిసాన్ మోర్చా
బుధవారం నాడు పంజాబ్ లో ప్రధాని పర్యటన రద్దుకు సంబంధించి సంయుక్త కిసాన్ మోర్చా ఓ ప్రకటన విడుదల చేసింది. |
| కేంద్ర ప్రభుత్వ కమిటీ పై నమ్మకం లేదన్న పంజాబ్ - విచారణ కమిటీ ఏర్పాటు చేసిన సుప్రీం
ప్రధాని నరేంద్ర మోడీ పంజాబ్ పర్యటనలో భద్రతా లోపంపై సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో విచారణ కమిటి ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. |