కేంద్ర ప్రభుత్వ కమిటీ పై నమ్మకం లేదన్న పంజాబ్ - విచారణ‌ కమిటీ ఏర్పాటు చేసిన సుప్రీం

కేంద్ర

10-01-2022

Prime Minister Narendra Modi ప్రధాని నరేంద్ర మోడీ పంజాబ్ పర్యటనలో security breach భద్రతా లోపంపై సుప్రీంకోర్టు రిటైర్డ్‌ జడ్జి నేతృత్వంలో విచారణ కమిటి ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. ఈ అంశంపై సోమవారం నాడు సుప్రీం కోర్టులో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. కేంద్రం తరపున సొలిసిటర్ జనరల్, పంజాబ్ ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపించారు.

వాదనల సందర్భంగా పంజాబ్ ప్రభుత్వం తరపున వాదించిన అడ్వకేట్ జనరల్ స్పందిస్తూ, కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన విచారణ కమిటీపై తమకు నమ్మకం లేదని, స్వతంత్ర విచారణ కమిటీ ఏర్పాటు చేయాలని కోరారు. సుప్రీంకోర్టులో విచారణకు ముందే పంజాబ్‌ అధికారులను దోషులుగా చిత్రీకరిస్తూ.. షోకాజ్‌ నోటీసులు ఇచ్చారని ధర్మాసనానికి ఏజీ తెలియజేశారు.

ఏజీ వాదనలపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ స్పందిస్తూ.. దోషులుగా చిత్రించి చర్యలు తీసుకుంటూ.. షోకాజ్‌ నోటీసులు ఇచ్చిన తర్వాత తాము విచారణ చేపట్టాల్సిన అవసరం ఏముందని కేంద్రాన్ని ప్రశ్నించారు.

అయితే ప్రధాని భద్రతకు సంబంధించిన విషయంపై ఎస్‌పీజీ చట్టం ప్రకారం సంబంధిత అధికారులను ప్రశ్నించే అధికారం కేంద్రానికి ఉందంటూ సొలిసిటర్‌ జనరల్‌ సమాధానం ఇచ్చారు. అంతేకాకుండా ప్రధాని పర్యటన ముందుగానే ఖరారైందని, వాతావరణ పరిస్థితుల దృష్ట్యానే రోడ్డు మార్గాన్ని ఎంచుకున్నారని, ఆ విషయం కూడా ముందుగానే రాష్ట్ర ఏజన్సీలకు సమాచారం ఇచ్చినట్లు ఎస్‌జీ తెలిపారు. ప్రధాని వాహనశ్రేణికి ముందు ఉన్న సెక్యూరిటీ వాహనం 100 మీటర్ల సమీపానికి వచ్చే వరకు పంజాబ్‌ అధికారులు రోడ్డు క్లియర్‌గా ఉందని తప్పుడు సమాచారం ఇచ్చారని సొలిసిటర్ జనరల్ పేర్కొన్నారు.

ప్రధాని భద్రత వ్యవహారం కాబట్టే తమ ముందుకు వచ్చిన పిటిషన్‌ను విచారణకు తీసుకున్నామని, అయితే కేంద్రం ముందుగానే ఫలానా అధికారులు బాధ్యులు అంటూ చర్యలకు ఉపక్రమిస్తే ఇక తాము విచారణ చేపట్టేది ఏముంటుందని సీజేఐ ఎన్వీ రమణ ప్రశ్నించారు. పంజాబ్ అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేయడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. తమ భయం నిజమైందని, ఇప్పటికే 7 షోకాజ్ నోటీసులు జారీ చేశారని ధర్మాసనానికి పంజాబ్‌ అడ్వకేట్‌ జనరల్‌ వివరించారు. విచారణ జరగకుండా, కనీసం తమ అభిప్రాయాన్ని వెల్లడించే అవకాశం కూడా లేకుండానే తమ రాష్ట్ర అధికారులకు కేంద్రం షోకాజ్‌ నోటీసులు ఇచ్చిందని చెప్పారు. కేంద్రానికి చెందిన ఏ ఏజెన్సీ విచారణ చేపట్టినా వాస్తవాలు వెలుగులోకి రావని, స్వతంత్ర కమిటీని ఏర్పాటు చేయాలని కోరారు. ఒకవేళ రాష్ట్ర అధికారులు దోషులుగా తేలితే తనను, తన ప్రభుత్వ అధికారులను ఉరితీయాలంటూ పంజాబ్ అడ్వకేట్ జనరల్ వాదించారు. వాదనలు విన్న ధర్మాసనం.. విచారణ కమిటీలో పంజాబ్‌కు ప్రాతినిధ్యం ఉంటుందని చెప్పడంతో ఏజీ అంగీకారం తెలిపారు.

సుప్రీంకోర్టు రిటైర్డ్‌ జడ్జి నేతృత్వంలో ఏర్పాటు చేసే ఈ విచారణ కమిటీలో సభ్యులుగా చండీగఢ్ డీజీపీ, హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్, ఎన్ఐఏకు చెందిన ఐజీ, ఐబీ అధికారులు కూడా ఉంటారని, కమిటీలో పంజాబ్ నుంచి కూడా ప్రతినిధ్యం ఉంటుందని సీజేఐ ఎన్వీ రమణ వెల్లడించారు.

Keywords : Prime Minister security breach, Supreme Court, punjab, PM security breach: SC to form probe panel headed by retired judge
(2024-04-19 22:01:11)



No. of visitors : 509

Suggested Posts


The Punjab remembers the immortal contribution of Shaheed Bhagat Singh

SALUTE THE CONFERENCE AND RALLY OF PUNJAB STUDENTS UNION AND NAUJWAN BHARAT SABHA IN FEROZEPUR WHICH CARRIED ON THE LEGACY OF THE IMMORTALS MARTYRS BHAGAT SINGH,SUKHDEV AND RAJGURU...

అగ్రకులోన్మాదం:దళితుడిని పెళ్ళి చేసుకున్నందుకు కూతురును హత్య చేసిన తండ్రి!

పంజాబ్ లోని రోహతక్ లో జాట్ కులానికి చెందిన రమేశ్ కుటుంభం రెండేళ్ళ వయసున్న అమ్మాయిని దత్తత తీసుకున్నారు. ఆమె పేరు మమత. ఇప్పుడు ఆ అమ్మాయికి 18 ఏళ్ళు. ఆమె దళిత యువకుడైన సోంబీర్ ను ప్రేమించింది.

Students Oppose Fee Hike - Police Brutally attacked on Students

Tension prevailed on the Punjab University campus as students protest the senate approval of the ʹenhancement in fee structure of various courses being taught at University Campus and at its Regional Centresʹ...

At least 66 Panjab University students booked on sedition charges for protesting fee hike

At least 66 students of Panjab University have been booked on sedition charges for protesting against the fee hike in the campus. Following an outcry over the move, a senior officer of Chandigarh Police....

Release Professor Saibaba Now ! Call from Jalandhar, Punjab

It has also reflected how the state has sharpened itʹs fascist fangs like never before bowing to the dictates of pro corporate international policies.In areas of Jharkhand,Chattisgarh and Chandrapur virtual fascism is perpetrating the judicial system.....

PUNJAB: రైతుల నిరసనలలో చిక్కుకుపోయిన ప్రధాని - అర్దాంతరంగా పర్యటన రద్దు

రైతుల నిరసనల కారణంగాప్రధానినరేంద్ర మోడీ ఇవ్వాళ్ళ పంజాబ్ పర్యటనను అర్దాంతరంగా ముగించుకొని వెనుదిరిగారు.

SKM: ప్రధాని ప్రాణాలకు ముప్పు అనేది కల్పితం,దుష్ప్రచారం - సంయుక్త కిసాన్ మోర్చా

బుధవారం నాడు పంజాబ్ లో ప్రధాని పర్యటన రద్దుకు సంబంధించి సంయుక్త కిసాన్ మోర్చా ఓ ప్రకటన విడుదల చేసింది.

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


కేంద్ర