బీజేపీకి ఓటు వేయకండి, ఈ నెల 31 న ʹద్రోహదినంʹ పాటించండి -SKM పిలుపు
16-01-2022
సంయుక్త్ కిసాన్ మోర్చా SKM ప్రకటన పూర్తి పాఠం
-ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కినందుకు నిరసనగా జనవరి 31న దేశవ్యాప్త ʹద్రోహ దినంʹ పాటించాలని సంయుక్త్ కిసాన్ మోర్చా పిలుపు
-లఖింపూర్ ఖేరీ హత్యాకాండలో బిజెపి సిగ్గులేనితనం, స్పందనారాహిత్యానికి వ్యతిరేకంగా సంయుక్త్ కిసాన్ మోర్చా శాశ్వత మోర్చా ఏర్పాటు చేస్తుంది; మిషన్ ఉత్తరప్రదేశ్ కొనసాగుతుంది
-ఫిబ్రవరి 23- 24 తేదీలలో కార్మిక సంఘాలు ప్రకటించిన దేశవ్యాప్త సమ్మెను సంయుక్త్ కిసాన్ మోర్చా బలపరుస్తుంది, మద్దతు ఇస్తుంది
-సంయుక్త్ కిసాన్ మోర్చా పేరు ఎన్నికల్లో ఉపయోగించబడదు; ఎన్నికలలో పాల్గొనే రైతు సంఘాలు, నాయకులు సంయుక్త్ కిసాన్ మోర్చాతో వుండరు
ఈరోజు ఢిల్లీలోని సింఘు సరిహద్దులో జరిగిన సంయుక్త్ కిసాన్ మోర్చా సమావేశంలో, మోర్చా కార్యక్రమాలు, భవిష్యత్తు దిశకు సంబంధించి అనేక ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నారు. డిసెంబర్ 9వ తేదీ ప్రభుత్వ లేఖ ప్రకారం మోర్చాలను ఉపసంహరించుకోవాలని నిర్ణయించుకున్న వాగ్దానాలలో ఏ ఒక్క హామీని కూడా భారత ప్రభుత్వం నెరవేర్చకపోవడం పట్ల SKM తన అసంతృప్తిని, తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది.
ఆందోళన సందర్భంగా పెట్టిన కేసులను వెంటనే ఉపసంహరించుకుంటామని హామీ ఇచ్చిన కేంద్రప్రభుత్వం, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. హర్యానా ప్రభుత్వం కొన్ని పత్రాలకు సంబంధించిన పనులు మాత్రమే చేసింది. మిగిలిన రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర ప్రభుత్వం నుంచి లేఖ కూడా అందలేదు. అమరులైన రైతు కుటుంబాలకు పరిహారం ఇచ్చే విషయంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టలేదు. పరిహార మొత్తం, స్వభావానికి సంబంధించి హర్యానా ప్రభుత్వం ఎటువంటి ప్రకటన చేయలేదు. MSP సమస్యపై, ప్రభుత్వం కమిటీ ఏర్పాటును ప్రకటించలేదు లేదా కమిటీ స్వభావం, దాని ఆదేశం గురించి ఎటువంటి సమాచారం ఇవ్వలేదు.
రైతులకు చేస్తున్న ఈ ద్రోహానికి నిరసనగా జనవరి 31న దేశ వ్యాప్తంగా ద్రోహ దినాన్ని పాటించాలని, జిల్లా, తాలూకా స్థాయిలో పెద్దఎత్తున నిరసన ప్రదర్శనలు నిర్వహించాలని SKM నిర్ణయించింది.
లఖింపూర్ ఖేరీ హత్యాకాండలో ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీల నిర్లజ్జాపూర్వక వైఖరిని బట్టి వారికి ప్రజల జీవితం పట్ల ఏమాత్రం గౌరవం లేదనే విషయం స్పష్టమవుతోంది. సిట్ నివేదికలో కుట్ర జరిగిందని ఒప్పుకున్నప్పటికీ.. ఈ ఘటనకు ప్రధాన సూత్రధారి అజయ్ మిశ్రా తేనిని కేంద్ర మంత్రివర్గంలో కొనసాగించడం రైతుల గాయాలపై ఉప్పురాసినట్లుగా వుంది. మరోవైపు, ఈ ఘటనలో రైతులను ఇరికించి అరెస్టు చేయడానికి ఉత్తరప్రదేశ్ పోలీసులు చురుగ్గా పనిచేస్తున్నారు. దీన్ని వ్యతిరేకిస్తూ లఖింపూర్ ఖేరీలో సంయుక్త్ కిసాన్ మోర్చా శాశ్వత మోర్చాను ప్రకటించనుంది. ʹమిషన్ ఉత్తరప్రదేశ్ʹ కొనసాగుతుందని, దీని ద్వారా ఈ రైతు వ్యతిరేక రాజకీయాలకు గుణపాఠం చెబుతామని స్పష్టం చేసింది.
ఫిబ్రవరి 23- 24 తేదీలలో, దేశంలోని కేంద్ర కార్మిక సంఘాలు నాలుగు కార్మిక వ్యతిరేక కోడ్లను ఉపసంహరించుకోవడం, రైతుల ఎంఎస్పి సమస్యలపై, ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చాయి. SKM గ్రామీణ సమ్మె రూపంలో ఈ పిలుపును సమర్థిస్తుంది, మద్దతు ఇస్తుంది.
పంజాబ్ ఎన్నికలలో పార్టీలను ఏర్పాటు చేయడం ద్వారా అభ్యర్థులను నిలబెట్టడానికి కొన్ని SKM భాగస్వామ్య సంస్థల ప్రకటనకు సంబంధించి, SKM మొదటి నుండి కూడా, ఏ రాజకీయ పార్టీ తన పేరు, బ్యానర్ లేదా వేదికను ఉపయోగించకూడదనే పరిమితిని ఉంచిందని స్పష్టం చేసింది. ఎన్నికలకు కూడా ఇదే నిబంధన వర్తిస్తుంది. సంయుక్త్ కిసాన్ మోర్చా పేరు లేదా బ్యానర్ లేదా వేదికను ఎన్నికల్లో ఏ పార్టీ లేదా అభ్యర్థి ఉపయోగించకూడదు. సంయుక్త్ కిసాన్ మోర్చాతో సంబంధం ఉన్న ఏ రైతు సంస్థ లేదా నాయకుడు, ఎన్నికల్లో పోటీ చేసినా, ఎన్నికల్లో ఏ పార్టీలోనైనా కీలక పాత్ర పోషించినా, సంయుక్త్ కిసాన్ మోర్చాలో ఉండరు. అవసరమైతే, ఈ అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఏప్రిల్ నెలలో ఈ నిర్ణయం సమీక్షించబడుతుంది.
జారీ చేసినవారు
డాక్టర్ దర్శన్ పాల్,
హన్నన్ మొల్లా,
జగ్జిత్ సింగ్ దల్లేవాల్,
జోగిందర్ సింగ్ ఉగ్రహన్,
శివకుమార్ శర్మ (కాక్కా జీ),
యుధ్వీర్ సింగ్,
యోగేంద్ర యాదవ్
సంయుక్త్ కిసాన్ మోర్చా
ఇమెయిల్: samyuktkisanmorcha@gmail.com
15 జనవరి 2022
Keywords : SKM, Samyukta Kisan Morcha, Farmers protest, Drohadinam, betrayed, No vote to BJP: Samyukta Kisan Morcha set to restart stir from Lakhimpur
(2024-04-23 07:16:51)
No. of visitors : 311
Suggested Posts
| అవార్డులను వాపస్ చేయడానికి రాష్ట్రపతి భవన్ వైపు మార్చ్ చేసిన క్రీడాకారులు
- అడ్డుకున్న పోలీసులురైతు చట్టాల విషయంలో కేంద్రం ప్రవర్తిస్తున్న తీరును నిరసిస్తూ క్రీడా రంగంలో వివిధ అవార్డులు అందుకున్న వారుఇవ్వాళ్ళ రాష్ట్రపతి భవన్ వైపు మార్చ్ నిర్వహించారు. |
| తీవ్రమైన రైతుల ఉద్యమం - రాజకీయ ఖైదీలను రిలీజ్ చేయాలని డిమాండ్ఢిల్లీ సరిహద్దుల్లోని టిక్రీ వద్ద భారతీయ కిసాన్ యూనియన్ (ఏక్తా ఉగ్రహాన్) ఆద్వర్యంలో జరిగిన ఈ కార్యక్రంలో రాజకీయ ఖైదీలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అక్రమ అరెస్టుకు గురై జైళ్ళలో ఉన్న వరవరరావు, సుధా భరద్వాజ్, ఆనంద్ తేల్తుంబ్డే, గౌతమ్ నవాలఖా తో సహా ఎల్గర్ పరిషథ్ కేసులో ఉన్న వారందరినీ విడుదల చేయాలని అదే విధంగా ఢిల్లీలో అక్రమ కేసులు బనాయించి అరెస్టు చే |
| రైతు ఉద్యమానికి మద్దతుపలికిన బాలీవుడ్ ప్రముఖులపై ఐటీ దాడులు
దేశంలో కొనసాగుతున్న రైతుల ఉద్యమానికి మద్దతుపలికిన బాలీ వుడ్ ప్రముఖుల ఇళ్ళపై ఆదాయపు పన్ను శాఖ రైడ్స్ నిర్చహించింది. నిర్మాత, దర్శకుడు అనురాగ్ కాశ్యప్, హీరోయిన్ తాప్సీ పన్ను ఇళ్ళపై ఈ రోజు ఆదాయపు పన్ను శాఖ రైడ్స్ నిర్చహించింది. |
| ఈ ఫోటో తీసిన జర్నలిస్టుపై దాడి - ప్రభుత్వ వాహనంలో వచ్చిన అగంతకులు
ఆ ఫోటో తీసిన జర్నలిస్టు రవి చౌదరిపై ఈ రోజు దాడి జరిగింది. ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్ లో గంగా కాలువ రోడ్డులో ఓ ప్రభుత్వ వాహనంలో వచ్చిన కొందరు అగంతకులు తనపై దాడి చేశారని రవి తెలిపాడు. |
| ఈ నెల 27న రైతు సంఘాల భారత్ బంద్ - విజయవంతం చేయాలని మావోయిస్టు పార్టీ పిలుపు
గత 10 మాసాల రైతాంగ ఉద్యమంలో అపూర్వ స్థాయిలో 5 సెప్టెంబర్ నాడు ముజఫర్ నగర్ లో భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) సహ సంయుక్త కిసాన్ మోర్చాతో పాటు కేంద్ర సాగు చట్టాలను వ్యతిరేకిస్తున్న అనేక రైతు సంఘాల పిలుపుపై జరుపతల పెట్టిన కిసాన్ మహా పంచాయత్ తో బెంబేలు పడిన ఉత్తర ప్రదేశ్ అదిత్యనాథ్ యోగీ సర్కార్ దానిని |
| దేశంలో ప్రజాపోరాటాలు ఆగవు... వాటికి నాయకత్వం వహించకుండా ఏశక్తీ మమ్మల్ని అడ్డుకోలేదు - మావోయిస్టు పార్టీ ప్రకటన
ప్రజా వీరులు గేంద్ సింగ్, బాబూరావు సడ్మెక్, గుండాదుర్, బిర్సాముండా, సిద్ధ-కానో, జ్యోతిబా ఫూలే, భగత్ సింగ్, రామరాజు, కొంరంభీం, బాబా సాహెబ్ అంబేడ్కర్, పెరియార్ మున్నగు అనేక మంది మహనీయుల పేర్లు ఉచ్ఛరించడానికైనా నైతిక అర్హతలేని బ్రాహ్మణీయ హిందుత్వ శక్తులు వారిని ముందు పెట్టి శాహీన్ బాగ్ నుండి సిల్గేర్ వరకు ప్రజా పోరాటాలను నెత్తురుటేరులలో ముంచడాన్ని మా పార్టీ |
| ఎర్ర కోట వద్ద జరిగిన హింస బీజేపీ కుట్రే - మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రకటన మోదీ ప్రభుత్వం తెచ్చిన మూడు రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోనూ, దేశవ్యాప్తంగానూ ఐక్యంగా, దృఢ సంకల్పంతో నిరంతరాయంగా పోరాడుతున్న రైతులకు భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) మరొకసారి విప్లవాభినందనలతో లాల్ సలాం చెబుతున్నది. |
| రైతాంగ ఉద్యమానికి మద్దతు ప్రకటించిన క్రాంతికారీ జనతన సర్కార్
నిరంతరం విస్తరిస్తున్న, తీవ్రతరం అవుతున్నదేశవ్యాప్త రైతు ఉద్యమాన్ని దెబ్బ తీయడానికి కేంద్ర ప్రభుత్వం జనవరి 26 న ఎర్రకోట కుట్రను అమలు చేసింది, దీనిని జనతన ప్రభుత్వం తీవ్రంగా ఖండిస్తున్నది. |
| ఉల్లిగడ్డలు తినకపోతే చస్తారా -మంత్రి గారి దబాయింపువాళ్ళ పొరపాట్లను ఎత్తి చూపితే పాలకులకు ఆవేశం పొంగుకొస్తుంది. వాళ్ళను ప్రశ్నలడిగితే చిర్రెత్తుకొస్తుంది. అడిగిన వారినే దబాయిస్తారు. బెదిరిస్తారు. ఈ మంత్రి కూడా అదే చేశారు..... |
| కెనడాలోని పాఠశాలల్లో భారత్ రైతు ఉద్యమ పాఠ్యాంశాలు... తొలగించాలని భారత్ లేఖభారత దేశంలో సాగుతున్న రైతుల ఉద్యమం గురించి కెనడాలోని కొన్ని పాఠశాలల్లో పాఠ్యాంశాలు ప్రవేశపెట్టడాన్ని భారత ప్రభుత్వం వ్యతిరేకింది. ఆ పాఠ్యాంశాలను వెంటనే తొలగించాలని కెనడాలోని భారత కాన్సులేట్ అంటారియో ప్రావిన్స్లోని |