పుస్తకాలు భద్రతకు ముప్పుట - కేరళ జైలు ఉత్తర్వులు

పుస్తకాలు

17-01-2022

కేరళ జైళ్లలో ఖైదీలు పుస్తకాలు చదివితే భద్రతకు ముప్పుని వామపక్ష ప్రభుత్వం భయపడుతోందా ?

కేరళలోని త్రిస్సూర్‌లో అత్యంత భద్రతతో కూడిన వియ్యూర్ సెంట్రల్ జైలులో ఖైదీలు తమ దగ్గర ఉంచుకునే పుస్తకాల సంఖ్యను పరిమితం చేసే కొత్త నిబంధన తీసుకువచ్చారు అధికారులు . దీంతో చదువుకునే, పరిశోధన చేసే విద్యార్థులైన ఖైదీలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు .

"పుస్తకం భద్రతకు ముప్పు కలిగించే విషయం" కాబట్టి ఖైదీ తన వద్ద ఐదు కంటే ఎక్కువ పుస్తకాలను ఉంచుకోకూడదని తాజా ఆర్డర్ లో భద్రతా అధికారి పేర్కొన్నారు.

పుస్తకాలు చదవడం, తమ దగ్గర ఉంచుకోవడం భద్రతకు సవాలు విసిరే అంశాలుగా పరిగణించడం, ఖైదీలు తమ వద్ద ఉన్న పుస్తకాల సంఖ్యను పరిమితం చేయమని కోరడం ఖైదీల హక్కులను నియంత్రించే చట్టబద్ధమైన సూత్రాలను ఉల్లంఘించడమేనని చెబుతున్న నిపుణులు జైలు అధికారుల నిర్ణయాన్ని ఖండించారు.

నిషేధిత సీపీఐ (మావోయిస్టు) పార్టీతో సంబంధాలున్నాయన్న ఆరోపణలపై అరెస్టైన టీకే రాజీవన్‌ వియ్యూరు సెంట్రల్ జైలులో అండర్ ట్రయల్‌గా ఉన్నారు . 2016లో నిలంబూరులోని ఇరులై అడవిలో CPI (మావోయిస్ట్), దాని సాయుధ విభాగం పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (PLGA) నిర్వహించిన శిబిరాల్లో పాల్గొన్నారనే ఆరోపణలపై ఆయనపై చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం (UAPA) మరియు IPC యొక్క సంబంధిత సెక్షన్ల కింద అభియోగాలు మోపారు. .

నవంబర్ 20, 2020న అరెస్టయినప్పటి నుండి జైలులో ఉన్న రాజీవ్ ప్రస్తుతం అకడమిక్ రీసెర్చ్‌లో నిమగ్నమై ఉన్నారని, వీలైనంత ఎక్కువగా తన పరిశోధన విషయానికి సంబంధించిన పుస్తకాలు మరియు పీరియాడికల్స్ చదవాలని అతని న్యాయవాది తుషార్ నిర్మల్ సారథి చెప్పారు.

నవంబర్ 27, 2021న జైలులో ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీ 8 సంచికలతో సహా 26 పుస్తకాలను తన స్నేహితుడు డెలివరీ చేసినప్పటికీ, వాటిని అధికారులు తనకు అందజేయలేదని ట్రయల్ కోర్టుకు చేసిన ఫిర్యాదులో రాజీవ్ ఆరోపించారు.

ʹకేరళ జైలు, కరెక్షనల్ సర్వీసెస్ చట్టం, ఇతర నిబంధనల ప్రకారం, ఖైదీలు బయటి నుండి పుస్తకాలు తెప్పించుకోవడానికి , తమ దగ్గర ఉంచుకోవడానికి అర్హులు. వలస పాలన కాలం నుండి పుస్తకాలు ఉంచుకోవడం,చదవడం అనే స్వేచ్ఛ ఖైదీలకు హక్కుగా ఉంది, అది తరువాత రాజ్యాంగం ద్వారా సమర్థించబడింది, ʹఅని రాజీవ్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

"ఒక ఖైదీకి రాజ్యాంగంలో పొందుపరచబడిన అన్ని ప్రాథమిక హక్కులకు అర్హత లేకపోవచ్చు , కానీ స్వతంత్ర పౌరునితో సమానంగా ఆలోచించే, చదివే. అధ్యయనం చేసే హక్కు ఖైదీకి ఉంటుంది" అని రాజీవ్ ఫిర్యాదులో పేర్కొన్నారు .

ఈ పిటిషన్ పెండింగ్‌లో ఉన్న సమయంలోనే , వియ్యూరు జైలులో ఖైదీలు ఒకేసారి ఉంచుకోగల పుస్తకాల సంఖ్యను మరింత పరిమితం చేస్తూ 6 జనవరి 2022న భద్రతా అధికారి ఒక ఉత్తర్వు జారీ చేశారు,

"ఆ ఆర్డర్ ప్రకారం, ఖైదీలు ఒకేసారి ఐదు కంటే ఎక్కువ పుస్తకాలు ఉంచుకోకూడదు. ఖైదీలందరూ ఈ పరిమితికి మించిన పుస్తకాలను సంక్షేమ అధికారికి అప్పగించాలని ఆదేశించారు. ఇది ప్రస్తుతం ఉన్న అన్ని చట్టపరమైన సూత్రాలకు విరుద్ధం, ఈ విషయం భారత సుప్రీంకోర్టు కూడా గతంలో చెప్పింది ʹ అని రాజీవ్ లాయర్ సారథి అన్నారు.

జైళ్ల డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఎస్ సంతోష్, సెక్యూరిటీ అధికారి ఆదేశాన్ని సమర్థిస్తూ, " ఎక్కువ పుస్తకాలు భద్రతకు ముప్పు కలిగిస్తాయి " అని "ఖైదీలు ఏదైనా పుస్తకాలలో దాచవచ్చు" అని అన్నారు.

అయితే, జైలులో పుస్తకాల విషయంపై న్యాయపరమైన వివరణ భిన్నంగా ఉంటుంది. 1963లో బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం, పుస్తకాల్లో జ్ఞానాన్ని తప్ప మరేమీ దాచిపెట్టలేము, పుస్తకాల ద్వారా జ్ఞానం తప్ప మరేమీ అందించలేము.

1963లో దివంగత CPI నాయకుడు AB బర్ధన్, మాజీ రక్షణ మంత్రి జార్జ్ ఫెర్నాండెజ్‌లు జైల్లో అపరిమిత సంఖ్యలో పుస్తకాలను చదవడం, ఉంచుకోవడం ఒక చట్టబద్ధమైన హక్కుగా పోరాడి సాధించారు.

ఫెర్నాండెజ్, బర్ధన్ ఇద్దరూ 1962-1963 లో నాగ్‌పూర్‌లోని సెంట్రల్ జైలులో వివిధ ఆరోపణలపై ఉన్నారు. జైలులో అపరిమిత సంఖ్యలో పుస్తకాలను ఉంచే హక్కును కోరుతూ బాంబే హైకోర్టుకు ఉమ్మడి అభ్యర్థనతో వారిద్దరూ ఒకే రకమైన వేర్వేరు పిటిషన్లను దాఖలు చేశారు.
బర్ధన్‌ దగ్గర 12 పుస్తకాలకన్నా ఎక్కువ ఉండకూడదని, ఫెర్నాండెజ్ దగ్గర 6 పుస్తకాలకన్నా ఎక్కువ ఉండకూడదని జైలు సూపరింటెండెంట్ వేరు వేరు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా జైలు అధికారులు లేవనెత్తిన వాదనలను కొట్టివేసిన న్యాయస్థానం.. పిటిషనర్లకు కావాల్సినన్ని పుస్తకాలు ఉంచుకునే హక్కును కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది .

ఖైదీ ఆలోచనా స్వేచ్ఛను కోల్పోకూడదని ఈ సందర్భంగా కోర్టు పేర్కొంది. ʹనాగరిక పౌరుడి స్వేచ్ఛపై ఉన్న అన్ని పరిమితులలో, జ్ఞానం, నేర్చుకోవడం , ఆనందంగా ఉండడాన్ని వ్యతిరేకించడం ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్థించబడదు. మనస్సు, ఆలోచన, జ్ఞానాన్ని పెంపొందించుకోవడం వీటిని అడ్డుకోవడం సాధ్యం కాదు. ʹ అని కోర్టు తీర్పు చెప్పింది.

తీర్పులో, జస్టిస్ అభయంకర్, జస్టిస్ వీజీ వాగ్లేలతో కూడిన బాంబే హైకోర్టు డివిజన్ బెంచ్ "అద్భుత జ్ఞానం గల పుస్తకాలు, విశ్వవ్యాప్తంగా ప్రశంసలు వచ్చిన పుస్తకాలు జైలు గదులలో వ్రాయబడ్డాయి" అని పేర్కొంది .

"బర్ధన్ పార్టీ అయినా సిపిఐ రెండవ అతిపెద్ద మిత్రపక్షంగా ఉన్న కేరళ వామపక్ష ప్రభుత్వం తమ సొంత నాయకులు నిర్దేశించిన సూత్రాలను కూడా మరచిపోవడం విడ్డూరం" అని సారథి అన్నారు.కేరళలోని త్రిస్సూర్‌లో అత్యంత భద్రతతో కూడిన వియ్యూర్ సెంట్రల్ జైలులో ఖైదీలు తమ దగ్గర ఉంచుకునే పుస్తకాల సంఖ్యను పరిమితం చేసే కొత్త నిబంధన తీసుకువచ్చారు. దీంతో చదువుకునే, పరిశోధన చేసే విద్యార్థులైన ఖైదీలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు .

"పుస్తకం భద్రతకు ముప్పు కలిగించే విషయం" కాబట్టి ఖైదీ తన వద్ద ఐదు కంటే ఎక్కువ పుస్తకాలను ఉంచుకోకూడదని తాజా ఆర్డర్ లో భద్రతా అధికారి పేర్కొన్నారు.

(thefederal.com సౌజన్యంతో )

Keywords : kerala, cpm, left front government, jail, prison, viyyur, cpi maoist, TK Rajeev, PLGA
(2024-04-18 23:38:32)



No. of visitors : 430

Suggested Posts


ʹఅవును ఆ అంకులే అందర్నీ కొట్టాడుʹ న్యాయమూర్తి ముందు ఓ ఐపీఎస్ కు షాకిచ్చిన ఏడేళ్ళ బాలుడు

ఇంతలో అక్కడికి వచ్చిన ఓ ఏడేళ్ళ బాలుడు. ʹఈ అంకులే అందర్నీ కొట్టాడు , మర్నాడు పేపర్లో కూడా ఈ అంకుల్ ఫోటో వచ్చిందిʹ అని ఆ ఐపీఎస్ అధికారి వైపు వేలు చూపిస్తూ న్యాయమూర్తికి చెప్పాడు. ఊహించని ఆ బాలుడి సాక్ష్యంతో ఒక్క సారి షాక్ తిన్నఆ అధికారి ʹనేను కొట్టానాʹ అని ఆ బాలుడిని ప్రశ్నించాడు. వెంటనే ఆ పిల్లాడు అవును నువ్వే కొట్టావు అని మరింత గట్టిగా చెప్పడంతో..

తన తల్లిని క్రిమినల్ గా చూయించిన‌ సినిమా పై మావోయిస్టు దంపతుల కూతురు పోరాటం

తన తల్లిని క్రిమినల్ అని ప్రచారం చేస్తున్న ఓ సినిమా పై ఓ యువతి చేస్తున్న పోరాటమిది. ప్రజలకోసం తన జీవితాన్ని ఫణంగా పెట్టి పోరాటం చేస్తున్న తన తల్లిని క్రిమినల్ గా చూయించడంపై పోరాడుతున్న ఆయువతి పేరు అమిరూప్ షైనా... విప్లవ ప్రజానీకానికి సుపరిచితమైన పేరు....

కేరళలో మావోయిస్టు దేవరాజ్ అంత్యక్రియలు - అడ్డుకున్న బీజేపీ, పోలీసులు

కేరళ నిలంబదూర్ లో పోలీసు కాల్పుల్లో అమరులైన మావోయిస్టు పార్టీ నాయకులు కామ్రేడ్ కుప్పు దేవరాజ్అంత్యక్రియలు శుక్రవారం కోజికోడ్ లో జరిగాయి. వందలాదిమంది విప్లవ అభిమానులు అమర కామ్రేడ్ కు.....

Lynching of tribal youth Madhu : CPI (Maoist) calls for protest

CPI (Maoist) has issued a statement calling for protests against the lynching of tribal youth Madhu in Attapadi. The statement issued by party spokesperson Jogi on Monday said the incident reflects the cruel racist onslaught by Malayalis against the tribal community which must be resisted by all progressive forces.

The Courageous leader Comrade Kuppu Devraj - Maoist Central Committee

We send late but deep Condolences to the families of our beloved Comrades Devaraj and Ajitha. Comrade Devraj was 62 and Comrade Ajitha 52. We call upon all the masses, democrats, patriots and citizens of the country to condemn the brutal killing and fight against such atrocities. The presentfake encounter was conducted by the present Brahmanic....

Four districts in Kerala on high alert as Maoists form new combat unit

The Communist Party of India-Maoist (CPI-Maoist) cadres have formed a new ʹcombat and operationalʹ unit at the Kerala-Tamil Nadu-Karnataka ʹtri-junction....

మావోయిస్టు పార్టీ నేత అమరుడు కుప్పు దేవరాజ్ వీడియో

కేరళలో నిలంబదూర్ ప్రాంతంలో పోలీసుల ʹఎన్కౌంటర్లోʹ అమరుడైన మావోయిస్టు పార్టీ నేత కుప్పు దేవరాజ్ వీడియో ఒకటి ప్రచారంలోకి వచ్చింది. అటవీ ప్రాంతంలో పీఎల్జీఏ కామ్రేడ్స్ ను ఉద్దేశించి దేవరాజ్ మరో మావోయిస్టు నేత మాట్లాడుతున్న దృశ్యాలు ఈ వీడియోలో కనపడుతున్నవి.....

మావోయిస్టు పార్టీ నాయకత్వంలో తీవ్రమవుతున్న భూపోరాటాలు

అక్కడ మావోయిస్టు పార్టీ నాయకత్వంలో ప్రజలు వ‍ందలాది ఎకరాలు స్వాధీనం చేసుకుంటున్నారు. అనేక గ్రామాల ప్రజలు ఆ భూములను సమానంగా పంచుకుంటున్నారు. ఈ మధ్య జరిగిన ఎన్కౌ‍ంటర్ స్థలంలో పోలీసులకు దొరికిన కొన్ని వీడియోల్లో...

దళిత నటి విషాద గాథ‌ !

అప్పుడే రెండో ఆట చూడడానికి.. తనను తాను తెర పై చూసు కోడానికి వచ్చిన రోజీపై దాడి చేశారు. భయంతో పరుగులు తీసి రోజీ ఒక పూరి గుడిసెలో ఆశ్రయం పొందింది. ఆమె ధైర్యం తమ కులాధిపత్యానికి చేటు కలిగిస్తుందనే మూర్ఖులు... ఆమెని వెంబడించి ఆ ఇంటిని దహనం చేశారు. ఇంటివాళ్ళు ప్రాణభయం తో పారిపోయారు

Resisting police and BJP, several human rights activists pay homage to Maoist leader Kuppu Devaraj

Human right activists and Maoist sympathisers bid adieu to slain leader of CPI (Maoist) Kuppu Devaraj in Kozhikode district of Kerala, resisting opposition from the Kerala police and BJP workers. Police denied permission to the human rights activists to lay the body.....

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


పుస్తకాలు