విప్లవ సాంస్కృతికోద్యమ నాయకులు రాజ్ కిశోర్ కు అరుణాంజలి -మావోయిస్టు పార్టీ ప్రకటన
19-01-2022
బీహార్ కు చెందిన విప్లవ సాహితీ-సాంస్కృతికోద్యమ నాయకులు రాజ్ కిశోర్ గత సంవత్సరం డిశంబర్ 22 నాడు మరణించారు. ఆయనకు అరుణాంజలి ఘటిస్తూ సీపీఐ మావోయిస్టు కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ ఓ ప్రకటన విడుదల చేశారు.
ప్రకటన పూర్తి పాఠం....
నక్సల్బరీ ప్రజ్వలనానికి స్పందించిన బిహార్ తొలితరం సాహితీ-సాంస్కృతికోద్యమ నాయకులు కామ్రేడ్ రాజ్ కిశోర్ తన 89వ యేట 2021డిసెంబర్ 22 ఉదయం తుదిశ్వాస విడిచారు. భారత నూతన ప్రజాస్వామిక విప్లవానికి, ప్రత్యేకించి విప్లవ సాహితీ-సాంస్కృతికోద్యమానికి దాదాపు 4 దశాబ్దాల పాటు అవిరళ సేవలందించిన కామ్రేడ్ రాజ్ కిశోర్కు భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) కేంద్రకమిటీ తలవంచి వినమ్రంగా అరుణాంజలి ఘటిస్తోంది. ఆయన కుటుంబ సభ్యుల, బంధుమిత్రుల, అయన సహచర సాహితీ-సాంస్కృతిక మిత్రుల దుఃఖంలో పాలుపంచుకుంటోంది. కామ్రేడ్ రాజ్ కిశోర్ కలలు గన్న సమతా-సామ్యవాద సమాజం కోసం చివరి ఊపిరి వరకు పోరాడతామని ప్రతిజ్ఞ చేస్తున్నది. అందుకోసం భారత నూతన ప్రజాస్వామిక విప్లవంలో భాగం కావాల్సిందిగా యావత్తు భారత పీడిత ప్రజలకు మా కేంద్రకమిటీ పిలుపునిస్తోంది.
కామ్రేడ్ రాజ్ కిశోర్ బిహార్లోని క్రాంతికారీ నవజన్ వాదీ సాంస్కృతిక్ సంఘ్ నాయకులుగా పనిచేసారు. ఆ రాష్ట్రంలో విప్లవ సాంస్కృతికోద్యమంలో తొలి నుండి పనిచేస్తూ విశేష సేవలు అందించారు. రాష్ట్ర విప్లవ సాహిత్య, సాంస్కృతికోద్యమానికి మార్గదర్శక నాయకులుగా అభివృద్ధి చెందారు. ఆయన అఖిల భారత విప్లవ సాంస్కృతిక సమితి (ఆల్ ఇండియా లీగ్ ఫర్ రెవల్యూషనరీ కల్చర్-ఏఐఎల్ ఆర్సీ) వ్యవస్థాపక నాయకులు. క్రాంతికారీ నవజవాదీ సాంస్కృతిక్ సంఘ్ ను ఏఐఎల్ ఆర్ సీలో సభ్య సంఘంగా భాగం చేయడంలో ముఖ్యపాత్ర నిర్వహించారు. 1983లో ఢిల్లీలో జరిగిన ఏఐఎల్ ఆర్ సీ వ్యవస్థాపక మహాసభల్లో పాల్గొన్నారు. అల్ ఇండియా పీపుల్స్ రెసిస్టెన్స్ ఫోరం (ఏఐపీఆర్ఎఫ్), రెవల్యూషనరీ డెమొక్రటిక్ ఫ్రంట్ (ఆర్డీఎఫ్)లలో కూడా ఆయన చేరి పనిచేసారు.
ఏఐఎల్ ఆర్ సీ అధ్యక్షులుగా, ఏఐపీఆర్ఎఫ్, ఆర్డీఎఫ్ నాయకులుగా దేశమంతా పర్యటించారు. కామ్రేడ్ రాజ్ కిశోర్ తన పేరులో కుల చిహ్నమైన సింగ్ ను వదులుకుంటున్నానని, తనను రాజ్ కిశోర్
అని పిలవాలని బహిరంగ ప్రకటన చేసారు. ఆయన ప్రముఖ వక్త. బిహార్లోనూ, దేశవ్యాప్తంగా జరిగిన అసంఖ్యాకమైన సభల్లో, సమావేశాల్లో ఆయన పాల్గొన్నారు. భారత పీడిత వర్గాలను, పీడిత సామాజిక సెక్షన్లను, పీడిత జాతులను మూడు మహా పర్వతాలు - సామ్రాజ్యవాదం, భూస్వామ్యం, దళారీ నిరంకుశ పెట్టుబడిదారీ విధానం - ఎక్కి తొక్కుతున్నాయనీ, భారత ప్రజల మూలుగలను పీల్చి పిప్పి చేస్తున్నాయనీ, ఈ మూడు మహా పర్వతాలను కూలదోసి, దీర్ఘకాల ప్రజాయుద్ధ పంథాలో విప్లవాన్ని విజయవంతం చేయడంలో దేశంలో నిజమైన ప్రజాస్వామిక వ్యవస్థను స్థాపించడమే దేశ ప్రజల విముక్తికి ఏకైక మార్గమనే భారత నూతన ప్రజాస్వామిక విప్లవ సందేశాన్ని విశాల ప్రజారాశులకు, మేధావులకు అందించిన ప్రముఖ విప్లవ మేధావి ఆయన.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏఐఎల్ ఆర్ సీ, ఏఐపీఆర్ఎఫ్ లపై నిషేధం విధించినా ఆయన ఏమాత్రం భయపడలేదు. తన విప్లవ లక్ష్యానికి మరింతగా అంటిపెట్టుకుని తన విప్లవాచరణను కొనసాగించారు. ఆర్డీఎఫ్ లో పని చేసే క్రమంలో దానిని కూడా నిరంకుశ ప్రభుత్వాలు నిషేధించాయి. విప్లవ భావాలు కలిగి వున్నందుకు ఆయన పలు మార్లు జైలుకు పోవాల్సి వచ్చింది. ఇవేవీ ఆయనలో విప్లవ భావాలను సడలించలేకపోయాయి. కామ్రేడ్ రాజ్ కిశోర్ ఒకటి రెండు సంవత్సరాలుగా అనారోగ్యంతో ఉన్నారు. పక్షవాతంతో కదలలేని స్థితిలో, కొద్దికాలంగా మాట కూడ రాని స్థితిలో కూడా చివరి శ్వాస వరకు విప్లవోద్యమ స్ఫూర్తిని ఎత్తిపట్టారు.
భారత పీడిత ప్రజలారా! సాహితీ-సాంస్కృతిక కార్యకర్తలారా! భారత విప్లవ మేధావి కామ్రేడ్ రాజ్ కిశోర్ దేశ ప్రజలకూ, భారత విప్లవానికి చేసిన సేవల్ని ఎత్తిపట్టండి. అయన చూపిన విప్లవ మార్గంలో విప్లవ సాహితీ-సాంస్కృతికోద్యమాన్ని కొనసాగించండి. భారత నూతన ప్రజాస్వామిక విప్లవ విజయానికై దీర్ఘకాల ప్రజాయుద్ధ పంథాలో ముందుకు సాగండి. దేశంలో సమతా-సామ్యవాద సమాజ స్థాపన కోసం నడుం బిగించడమే అయనకు అర్పించే నిజమైన నివాళి.
అభయ్.
అధికార ప్రతినిధి,
కేంద్ర కమిటీ,
సీపీఐ (మావోయిస్టు)
Keywords : bihar, raj kishor, ailrc, aiprf, rdf, cpi maoist, cultural activist
(2024-04-24 22:49:48)
No. of visitors : 434
Suggested Posts
| పాలకులకు లొంగిపోయిన విప్లవద్రోహి గజ్జెల సత్యం రెడ్డిని ఎండగట్టండి... మావోయిస్టు పార్టీ ప్రకటనవిడుదల తర్వాత ఆర్.టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూ ద్వారా ఆయన తన లొంగుబాటునూ, రాజకీయ పతనాన్ని నిస్సిగ్గుగా బయటపెట్టుకున్నాడని ,మావోయిస్టు పార్టీ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ అధికార ప్రతినిధి వికల్ప్ అన్నారు. |
| జంపన్నలేఖకు మావోయిస్టు అభయ్ జవాబు - లేఖ విడుదల చేసిన మావోయిస్టు పార్టీ
జూన్ 18న సీ.పీ.ఐ (మావోయిస్టు) అధికార ప్రతినిధిగా నేను ʹకొరోనాతో మావోయిస్టుల మరణం ఒక బూటకం, అది కేవలం పోలీసుల సృష్టిʹ అనే పత్రికా ప్రకటనను ఇచ్చాను. ఇందులో జంపన్నపై ʹవిప్లవ రాజకీయాల నుండి హీనాతిహీనంగా దిగజారిపోయిన |
| PLGA సావనీర్ విడుదల చేసిన మావోయిస్టు పార్టీ - అభయ్ ఆడియో ప్రకటనపీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ PLGA ఏర్పడి 20 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా సీపీఐ మావోయిస్టు ఓ సావనీర్ విడుదల చేసింది. 20 ఏళ్ళ వేడుకల సందర్భంగా ఈ సావనీర్ విడుదల చేసినట్టు |
| అమ్మా! నను మన్నించు.. తల్లి మరణంపై మావోయిస్టు నాయకుడు వేణుగోపాల్ లేఖ!మల్లోజుల కుటుంబంతో, పెద్దపల్లి పట్టణంతో వందేళ్ల నీ రుణం తీర్చుకున్నావా అమ్మా! నీ కడుపున పుట్టిన ఆరుగురి సంతానంలో నేనే చివరివాన్ని తల్లీ. నిను చివరి వరకు ఏడ్పించిన వాన్నీ నేనే అమ్మా. |
| పోలీసు చిత్రహింసల వల్ల రెండేళ్ళు కోమాలో ఉండి అంతిమ శ్వాస విడిచిన చింతన్ దా కు విప్లవ జోహార్లు -మావోయిస్టు పార్టీసీపీఐ (మావోయిస్టు) కేంద్రకమిటీ సభ్యులు కామ్రేడ్ నరేంద్ర సింగ్ (అశోదా, చింతన్ దా) ఒక పట్టణంలోని ఆసుపత్రిలో 2020 జనవరి 6న అంతిమశ్వాస విడిచారు. ఆయన దీర్ఘకాలికంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. 2018 నుంచి కోమాలో ఉన్నారు. ఆయన వయసు 74 సంవత్సరాలు. |
| Chhattisgarh:ఆయుధాలు వదిలి చర్చలకు రావాలన్న సీఎం పిలుపుకు మావోయిస్టుల జవాబుమావోయిస్టులు ఆయుధాలు వదిలేసి చర్చలకు రావాలని చత్తీస్ గడ్ ముఖ్యమంత్రి భూపేష్ భగేల్ మాట్లాడిన నేపథ్యంలో ఆ పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది. తాము కూడా చర్చలకు సిద్దమే అని |
| 11 మంది రేపిస్టుల విడుదలపై మావోయిస్టు పార్టీ ప్రకటన2002 గుజరాత్ అల్లర్లలో బిల్కిస్ బానో ను అత్యాచారం చేసి 14 మందిని హత్య చేసిన దోషులను గుజరాత్ ప్రభుత్వం విడుదల చేయడాన్ని CPI (మావోయిస్ట్) కేంద్ర కమిటీ ఖండిస్తోంది. |
| మా నాయకత్వానికి కరోనా సోకి, లొంగిపోతున్నారన్న ప్రచారం ఓ కట్టుకథ -మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రకటనఅనేక మంది మావోయిస్టులకు కరోనా సోకిందని, అందువల్ల అనేక మంది మావోయిస్టులు లొంగిపోనున్నారని పోలీసులు చేస్తున్న ప్రచారాన్ని మావోయిస్టు పార్టీ తీవ్రంగా ఖండించింది. ఇలాంటి కథలు సృష్టించడంలో ఉభయ తెలుగు రాష్ట్రాల పోలీసు బాస్ లు మహా నేర్పరులని ఆ పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. |
| గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది -మావోయిస్టు పార్టీ గద్దర్ మరణం మమ్మల్ని తీవ్రంగా భాదకు గురి చేసింది. మా సంతాపాన్ని, కుటుంబానికి మా సానుభూతి తెలియ జేస్తున్నాము. |
| భారతదేశాన్ని ఫాసిస్టు నాజీకరణ చేసే ప్రయత్నంలో భాగమే ʹఅగ్నిపథ్ʹ -మావోయిస్ట్ పార్టీ
భారత సైన్య త్రివిధ బలగాలలోకి యువతను కాంట్రాక్టు పద్దతిలో భర్తీ చేసుకోవాలన్న కేంద్ర ప్రభుత్వ నూతన ʹఅగ్నిపథ్ʹ పథకాన్ని, అందుకు వ్యతిరేకంగా పది రాష్ట్రాలకు వ్యాపించిన, బిహార్ రాష్ట్రంలో రైల్వేల ధ్వంసం మొదలయిన సంఘటనలతో జరుగుతున్న ప్రజల అందోళనలపై తెలంగాణా రాష్ట్రం సికిందరాబాద్ ప్రాంతంలో కాల్పులలో వరంగల్ కు చెందిన రాకేష్ అనే వ్యక్తి మరణానికి, |