మోడీ విద్వేష ప్రసంగం పట్ల సుప్రీం మాజీ న్యాయమూర్తి ఆగ్రహం

మోడీ

19-01-2022

ఔరంగజేబ్‌, శివాజీ పేర్లను ఉపయోగించి మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రధాని మోడీ చేసిన ప్రసంగాన్ని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఆర్‌.ఎఫ్‌. నారిమన్‌ ఖండించారు. అలాగే విద్వేషపూరిత ప్రసంగాలు చేసేవారిపట్ల మౌనం వహించడం సరికాదని ఆయన అన్నారు. ఇటువంటి ప్రసంగాలు చేసిన వారికి కనీస శిక్ష విధించేలా ప్రస్తుత చట్టాలను సవరించాలని అన్నారు. మొఘల్‌ చక్రవర్తి ఔరంగ జేబుని ఆక్రమదారుడిగా చెడ్డ వ్యక్తిగా పేర్కొనడం, లౌకిక నేతగా శివాజీని పేర్కొనడం ద్వారా మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రధాని మోడీ వ్యాఖ్యానించడం సరికాదని జస్టిస్‌ నారిమన్‌ పేర్కొన్నారు. జనవరి 14న డిఎం. హరీష్‌ స్కూల్‌ ఆఫ్‌ లా ( ముంబయి) ప్రారంభోత్సవం సందర్భంగా నారిమన్‌ ఈ వ్యాఖ్యలు చేశారు.

గత ఏడాది డిసెంబర్‌ 13న వారణాసిలో మోడీ మాట్లాడుతూ, ఆక్రమణదారులైన ముస్లింలకు వ్యతిరేకంగా మంచి హిందూ పాలకులను నిలబెట్టే లక్ష్యంతో బిజెపి పనిచేస్తోందని అన్నారు. ఆక్రమణ దారులు వారణాశి నగరంపై దాడులు చేశారని, ధ్వంసం చేసేందుకు యత్నించారని .. ఔరంగజేబు దాడులు ఇందుకు సాక్ష్యాలుగా నిలుస్తాయని అన్నారు. బెదిరింపులతో పరిపాలనను మార్చాలని చూశారని .. మూఢత్వంతో మన సంస్కృతిని నాశనం చేయాలని చేయాలని చూశారని అన్నారు. అయితే ప్రపంచంతో పోలిస్తే.. భారత గడ్డ విభిన్నతను ప్రదర్శిస్తుందని.. మొఘలుల చక్రవర్తి ఔరంగజేబు లాంటి వారు వస్తే.. మహారాష్ట్ర యోధుడు శివాజీ లాంటి వారు పుట్టుకొస్తారని మోడీ పేర్కొన్నారు. ఇలా మత విద్వేశాలు రెచ్చగొట్టేలా మోడీ మాట్లాడటం పట్ల నారిమన్ అసంత్రుప్తి వ్యక్తం చేశారు.

మన రాజ్యాంగంలోని సోదరభావానికి ప్రధానమైన విలువ ఉందని, మన చర్యలు సోదరభావాన్ని పెంచేలా ఉండాలని నారిమన్‌ పేర్కొన్నారు. అక్బర్‌ లౌకికత్వాన్ని కాపాడటంలో ప్రసిద్ధి పొందారని, లేకుంటే బాబర్‌ను ఎంచుకోవచ్చని అన్నారు. సహనశీలతను, సోదరభావాన్ని పెంచేందుకు కృషి చేయాలంటూ బాబర్‌ హుమమూన్‌కి రాసిన లేఖను నారిమన్‌ ఈ సందర్భంగా చదివివినిపించారు. ప్రతి కమ్యూనిటీకి వారి సిద్ధాంతాల ప్ర కారం న్యాయం చేయాలని, ఆవులని బలి ఇవ్వకూడదని ఆ లేఖలో బాబర్‌ సూచించారు. దురదృష్టవశాత్తు అధికార పార్టీలోని ఇతర ఉన్నతస్థాయి అధికారులు కూడా విద్వేషపూరిత ప్రసంగాలను చేయడమే కాకుండా వాటిని ఆమోదిస్తున్నారని అన్నారు. ఇటీవల హరిద్వార్‌లో జరిగిన ధర్మసంసద్‌ కార్యక్రమాన్ని ప్రస్తావించారు.

ఈ చర్యలు రాజ్యాంగ విరుద్ధమే కాదు. క్రిమినల్‌ చట్టం ప్రకారం శిక్షార్హమని అన్నారు. ఐపిసిలోని 153(ఎ), 505(సి) ప్రకారం నేరంగా పరిగణించబడతాయని అన్నారు. విద్వేషపూరిత ప్రసంగాలు చేసిన వారికి కనీస శిక్ష విధించేలా సంబంధిత‌ చట్టాల్లో సవరణలు చేయాలని పార్లమెంట్‌కి ప్రతిపాదించారు. మూడేళ్ల వరకు జైలు శిక్ష విధించవచ్చు కానీ ఆచరణలో ఇది సాధ్యం కాదని .. ఎందుకంటే శిక్ష విధించడం జరగదని అన్నారు. మన రాజ్యాంగంలో ఉన్నటువంటి చట్టాలను పటిష్టం చేయాలనుకుంటే విద్వేషపూరిత ప్రసంగాలు చేసేవారికి కనీస శిక్ష విధించేలా చట్టాలను సవరించాలని సూచించారు. తమ ప్రభుత్వానికి ఇబ్బందికరమని భావించిన యువత, విద్యార్థులు, కమెడియన్‌లు ఇలా ఎవరిపైనైనా దేశద్రోహ చట్టాన్ని ప్రయోగించి జైలు పాలు చేయడం పట్ల నారిమన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

Keywords : R FNariman, narendra modi, varanasi, ourangajeb, shivaji
(2024-04-19 22:00:59)



No. of visitors : 508

Suggested Posts


హిప్నాటిజం చేసి డబ్బులు దోచుకున్నాడు !

మోసం చేయడానికి ఉన్న అనేక మార్గాల్లో ఇప్పుడు హిప్నటిజం కూడా చేరింది. ఓ బ్యాంకు మేనేజర్ ను హిపటైజ్ చేసిన ఓ అగంతకుడు 93 వేల రూపాయలు తీసుకొని పరారయ్యాడు....

కస్టడీలో ముద్దాయిని ఎలా కొట్టి చంపాడో వివరించిన మాజీ డీసీపీ

రట్టును శారీరకంగా చాలా హింసించాను. అతడి వ్యక్తిగత శరీర భాగాలతో సహా దేహంలో ఏ భాగాన్ని విడిచిపెట్టలేదు. సరిగా చెప్పలంటే కుక్కను కొట్టినట్లు కొట్టాను. దాంతో అతడు మరణించాడు. వెంటనే ఈ విషయం గురించి నా పై అధికారులకు తెలియజేశాను. ఈ లోపు పోలీస్‌ స్టేషన్‌ బయట గందరగోళం ప్రారంభమయ్యింది

LOOKING BACK AT 50 YEARS OF A PEOPLEʹS MOVEMENT

The Naxalbari movement began 50 years ago, and is still on. ʹNowhere else in the world will you find a continued class struggle that has lasted so many years,ʹ said Vara Vara Rao, the famous Telugu poet and writer, speaking on ʹ50 Years of Naxalbari, Looking Back, Looking Forwardʹ.....

హిందూత్వ తీవ్రవాదుల హిట్‌ లిస్టులో దభోల్కర్‌ కుమార్తె

పూణేలో హత్యకు గురైన ప్రముఖ హేతువాది నరేంద్ర దబోల్కర్‌ కుమార్తె ముక్తా దభోల్కర్‌ కూడా హిందూత్వ తీవ్రవాదుల హిట్‌ లిస్టులో ఉన్నట్టు మహారాష్ట్ర తీవ్రవాద వ్యతిరేక కార్యకలాపాల బృందం (ఏటీఎస్‌) తెలిపింది.

చెట్లు నరకొద్దన్నందుకు పోలీసుల దాడి...38 మందిపై కేసు

ముంబైలోని ఆరే కాలనీలో మెట్రో ప్రాజెక్టు పేరుతో చెట్లు కొట్టేయడానికి వ్యతిరేకంగా కొంత కాలంగా పర్యావరణ ప్రేమికులు శాంతియుతంగా ఉద్యమిస్తున్నారు. నిన్న (10/05/2019) అర్దరాత్రి చెట్లు మెట్రో ప్రాజెక్టు అధికారులు వర్కర్స్ అక్కడికి చేరుకొని చెట్లు నరికివేయడం మొదలుపెట్టారు. దాంతో నిరసన తెలపడానికి పర్యావరణ కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. పోలీసులు వారిపై దుర్మ

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


మోడీ