మహోజ్వల చరిత్ర గల‌ కార్మిక సంఘంపై నిషేధం ఎత్తివేత - మావోయిస్టు ముద్ర తిరస్కరించిన హైకోర్టు

మహోజ్వల

24-02-2022

ʹమజ్దూర్ సంఘటన్ సమితి (MSS)ʹ అనే కార్మిక సంఘంపై నిషేధాన్ని ఎత్తివేస్తూ జార్ఖండ్ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. మజ్దూర్ సంఘటన్ సమితిని కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) ప్రజా సంఘంగా గా పరిగణించేందుకు ఎలాంటి ఆధారాలు లేవని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చంద్రశేఖర్ ఫిబ్రవరి 11న తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ట్రేడ్ యూనియన్ కమిటీ ఎలాంటి తీవ్రవాద లేదా అరాచక కార్యకలాపాలలో పాలుపంచుకున్నట్లు ఎవరూ ఎప్పుడూ ఫిర్యాదు చేయలేదని పేర్కొన్న కోర్టు ఈ విషయంలో ప్రభుత్వం పూర్తిగా బాధ్యతారాహిత్య వైఖరి అవలంభిస్తోందని అసహనం వ్యక్తం చేసింది.

ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్ అఫిడవిట్లో... 2008లో క్రాంతికారి కిసాన్ కమిటీ, నారీ ముక్తి సంఘ్, జార్ఖండ్ గ్రూప్ అవామ్, క్రాంతికారి సాంస్కృతిక మంచ్‌లను ప్రభుత్వం నిషేధించిందని, ఆ తర్వాతనే ఈ సంఘాల వ్యక్తులు. నక్సలైట్ల కోసం పని చేసే కొత్త సంఘాలను ఏర్పాటు చేశారని, వాటిలో మజ్దూర్ సంఘటన్ సమితి కూడా అత్యంత ముఖ్యమైన పాత్ర పోషించిందని పోలీసులు పేర్కొన్నారు. ఈ సంస్థ పేరుకు మాత్రమే కార్మిక సంఘం కానీ ట్రేడ్ యూనియన్ పనికి బదులుగా, ఇది నక్సల్ సంస్థలకు నాయకత్వం వహించేదని, మజ్దూర్ సంఘటన్ తరఫున పిటీషన్ వేసినవారు నక్సల్బరీ రైతాంగ ఉద్యమం యాభైవ వార్షికోత్సవాన్ని జరపడంతోపాటు మోతీలాల్ బాస్కే పోలీసు ఎన్‌కౌంటర్‌ను కూడా వ్యతిరేకించారని అఫిడవిట్లో రాశారు. వీరు నక్సలైట్లతో సంబంధమున్నవారని, ఈ సంఘ నాయకుడు దామోదర్ తురీ 2012లో నక్సల్ కేసులో తమిళనాడులో అరెస్టయ్యాడని. ఈ సంఘం నక్సలైట్ మద్దతుదారు వరవరరావుతో కూడా ప్రత్యక్ష సంబంధంలో ఉండిందని పోలీసులు అఫిడవిట్లో పేర్కొన్నారు.

అయితే మజ్దూర్ సంఘటన్ సమితికి భారత కమ్యూనిస్ట్ పార్టీ (మావోయిస్ట్)తో సంబంధమున్నదని రుజువు చేయడానికి పైన పేర్కొన్నవి తప్ప మరేమీ సాక్ష్యంగా చూపలేదని హైకోర్టు ఉత్తర్వులో పేర్కొంది.

సమైక్య బీహార్ రాష్ట్రంలో 1989 లో మజ్దూర్ సంఘటన్ సమితి (ఎంఎస్‌ఎస్) ఏర్పడింది. 2017 డిసెంబర్ 22న అప్పటి బీజేపీ ప్రభుత్వం ఎలాంటి ముందస్తు నోటీసు లేకుండా మజ్దూర్ సంఘటన్ సమితి (ఎంఎస్‌ఎస్)ని సీపీఐ (మావోయిస్ట్) ప్రజా సంఘం అని చెప్పి నిషేధించింది. ఆ సమయంలో, జార్ఖండ్ హోం శాఖ కార్యదర్శి SKG రహాటే, సిబ్బంది సంస్కరణ-అధికార భాషా సంస్కరణల శాఖ కార్యదర్శి నిధి ఖరే విలేఖరుల సమావేశంలో 1908 సెక్షన్ 16 ప్రకారం సమితిని నిషేధించామని ప్రకటించారు.

మజ్దూర్ సంఘటన్ సమితిపై నిషేధాన్ని ఉపసంహరించుకోవాలనే హైకోర్టు నిర్ణయం మజ్దూర్ సంఘటన్ సమితి (ఎంఎస్‌ఎస్)తో అనుబంధం ఉన్న కార్మికులు, వారి కార్యక్షేత్రానికి చెందిన యితర కార్మికులలో చాలా ఆనందాన్ని కలిగించింది. అనేక చోట్ల కార్మికులు పరస్పరం మిఠాయిలు తినిపించుకున్నారు. ఆర్డర్ సర్టిఫైడ్ కాపీ చేతిలోకి వచ్చాక‌ అన్ని చోట్లా విజయోత్సవ యాత్రలు నిర్వహిస్తామని మజ్దూర్ సంఘటన్ సమితి అప్పటి ప్రధాన కార్యదర్శి బచ్చా సింగ్ చెప్పారు. 4 రోజుల క్రితమే సర్టిఫైడ్ కాపీ కోసం దరఖాస్తు చేసుకున్నారు. (జన్‌చౌక్ దగ్గర ఆర్డర్ ఇ-కాపీ ఉంది)

మజ్దూర్ సంఘటన్ సమితి చరిత్ర
మన దేశంలో సరళీకరణ-ప్రైవేటీకరణ-ప్రపంచీకరణ విధానాలను తీసుకువస్తున్న సమయంలో బీహార్‌లో ఒక మూలన విప్లవ కార్మిక సంఘానికి పునాది పడింది. బీహార్ కార్మిక శాఖలో సీనియర్ న్యాయవాది సత్యన్నారాయణ భట్టాచార్య ʹమజ్దూర్ సంఘటన్ సమితిʹ పేరుతో ట్రేడ్ యూనియన్‌ను 1989లో 3113/89 నంబర్‌తో నమోదు చేశారు. మొదట్లో ఈ కార్మిక సంఘం కేవలం ధన్‌బాద్ జిల్లాలో మాత్రమే పని చేసేది. ధన్‌బాద్ జిల్లాలోని కత్రాస్ పరిసరాల్లోని BCCL కార్మికులలో సమితి కార్యకలాపాలు ప్రజాదరణ పొందాయి. ధన్‌బాద్ పరిసర జిల్లాలను కూడా అవి ప్రభావితం చేసాయి. కార్మిక సంఘం త్వరితంగా వ్యాప్తి చెందడం ప్రారంభించింది. 2000 సంవత్సర‍లో బీహార్ నుండి జార్ఖండ్ విడిపోయిన తర్వాత, ʹమజ్దూర్ సంఘటన్ సమితిʹ అతి తక్కువ కాలంలో మరింత ఎక్కువగా కార్మికులలో వ్యాపించడం ప్రారంభించింది.

క్రమంగా, మజ్దూర్ సంఘటన్ సమితి గిరిడి జిల్లాలోని రోలింగ్ ఫ్యాక్టరీ, స్పాంజ్ ఐరన్ కార్మికులలో ప్రవేశించింది. జైనుల ప్రపంచ ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శిఖర్జి (మధుబన్, గిరిడి)లో స్థాపించబడిన డజన్ల కొద్దీ జైన భవనాల్లో పనిచేసే కార్మికులతో పాటు,భక్తులను మోసుకెళ్ళే లేదా పల్లకీలలో మోసే వేలాదిమంది కార్మికుల మధ్య చాలా వేగంగా వ్యాపించింది. బొకారో జిల్లాలో, బొకారో థర్మల్ పవర్ ప్లాంట్, తెనుఘాట్ పవర్ ప్లాంట్, చంద్రపుర పవర్ ప్లాంట్ కార్మికులలో, ముఖ్యంగా కాంట్రాక్ట్ కార్మికులలో బలమైన స్థానాన్ని సంపాదించింది. దీనితో పాటు, బొకారో స్టీల్ ప్లాంట్ కారణంగా నిర్వాసిత్వ సమస్యను ఎదుర్కొంటున్న డజన్ల కొద్దీ నిర్వాసిత గ్రామాలలోని నిర్వాసితులను సమీకరించడంలో ఈ యూనియన్ విజయవంతమైంది. రాంచీ జిల్లా ఖలారీ సిసిఎల్‌ కార్మికుల మధ్య పని ప్రారంభించిన తరువాత, రోజువారీ కూలీలలో బలపడింది.

రాజధాని రాంచీకి చెందిన కొంతమంది న్యాయవాదులు, నిర్వాసిత నాయకులు కూడా ఈ యూనియన్‌లో చేరారు. గిరిడి లోని కాంట్రాక్టు కంపెనీ DLF, పూర్వ హజారీబాగ్ జిల్లాకు చెందిన రాజ్రప్ప CCL లలో కూడా విస్తరించింది. కోడెర్మలోని పీడబ్ల్యూడీ కార్మికుల్లో కూడా ఈ యూనియన్ పని మొదలైంది. సరాయ్‌కేలా-ఖర్సావా జిల్లాలోని చాండిల్‌లో నిర్వాసితుల మధ్య పని చాలా ఉత్సాహంతో ప్రారంభమైంది. బీహార్‌లోని గయా జిల్లాలోని గురారు షుగర్ మిల్లులో బలపడింది. పశ్చిమ బెంగాల్‌లోని పురూలియా జిల్లాలోని బాగ్ముండి, ఝాల్దాలో బీడీ కార్మికుల మధ్య కూడా ఈ సంఘం పనిని ప్రారంభించింది.

కార్మికులలో పెరుగుతున్న మజ్దూర్ సంఘటనా సమితి ప్రభావం, నిరంతర నిర్ణయాత్మక ఆందోళనల కారణంగా, ఈ యూనియన్ పైన త్వరలోనే ప్రభుత్వం గురి పెట్టింది. ఈ సంఘంపై భారత ప్రభుత్వం నిషేధించిన అప్పటి మావోయిస్టు కమ్యూనిస్ట్ సెంటర్ ఆఫ్ ఇండియా (MCCI) ఫ్రంటల్ ఆర్గనైజేషన్ అనే ఆరోపణలు చేసింది ప్రభుత్వం. నేతలపై పోలీసుల దమనకాండ కూడా బాగా పెరిగింది. యూనియన్ నాయకులు కొత్త ప్రాంతంలో సంస్థను విస్తరించడానికి ఎక్కడికి వెళ్లినా, ఈ యూనియన్‌ నక్సలైట్లదని పోలీసులు, దళారీ కార్మిక సంఘాలు చేస్తున్న ప్రచారం ఎంత ఎక్కువగా వుండేదంటే, ఈ యూనియన్‌లో చేరితే పోలీసుల అణచివేతను ఎదుర్కోవాల్సి వస్తుందని కార్మికులు భయపడేవారు .

ఏమైనప్పటికి, ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ సవాళ్లను ఎదుర్కొంటూ, సమితి మూడు రాష్ట్రాలలోకి (బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్) విస్తరించింది, ఆ తర్వాత 2003 సంవత్సరంలో జరిగిన మొదటి కేంద్ర సమావేశంలో సీనియర్ న్యాయవాది కా. సత్యనారాయణ భట్టాచార్య పాల్గొన్నారు. కేంద్ర అధ్యక్షులు, బొకారో థర్మల్ పవర్ ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికుడు కా. బచ్చా సింగ్ కేంద్ర ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. 2003 తర్వాత, సమితి కేంద్ర మహాసభ ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి జరిపేవారు. ఇది సమితి కార్యక్రమాలు, ఉద్యమం, సంస్థ విస్తరణల పై భారీ సానుకూల ప్రభావాన్ని చూపింది. మజ్దూర్ సంఘటన్ సమితి చివరి 5వ కేంద్ర సమావేశం 2015 ఫిబ్రవరి 21-22 తేదీలలో జార్ఖండ్‌లోని బొకారోలో జరిగింది.

సమితికి 2017 సంవత్సరం నిర్ణయాత్మకమైనది. ఆ సంవత్సరంలో, సభ్యత్వం లక్షల్లో ఉండింది. సంఘం జార్ఖండ్‌లోని అనేక ప్రాంతాలలోని కార్మికులలోకి బలంగా చొచ్చుకొని పోయింది. సమితి తప్ప వేరే కార్మిక సంఘం లేని ప్రాంతాలు కొన్ని వుండినాయి. ఈ సమయానికి సమితికి ధన్‌బాద్‌లోని కత్రాస్‌లో కేంద్ర కార్యాలయం, అలాగే గిరిడి, మధుబన్, బొకారో థర్మల్, లాల్పానియా, బొకారో స్టీల్ సిటీ, గురారు (బీహార్) మొదలైన అనేక ప్రదేశాలలో శాఖ కార్యాలయాలు సజావుగా నడుస్తున్నాయి. చాలా శాఖలకు సొంత బ్యాంకు ఖాతాలు కూడా ఉన్నాయి.

సమితి మధుబన్ (గిరిడి) శాఖ, 2015 మే 5 న మధుబన్‌లో ʹశ్రమజీవి హాస్పిటల్ʹను అప్పటి గిరిడి సివిల్ సర్జన్ డాక్టర్ సిద్ధార్థ సన్యాల్ ప్రారంభించారు. ఈ ఆసుపత్రిలో ప్రతిరోజూ వందలాది మంది కూలీలు ఉచితంగా చికిత్స పొందేవారు.

గొప్ప నక్సల్బరీ సాయుధ రైతాంగ తిరుగుబాటు 50 వ వార్షికోత్సవం అయిన 2017 సంవత్సరం సమితికి చాలా ముఖ్యమైనది. అదే సంవత్సరం రష్యాలో బోల్షివిక్ విప్లవ శతవార్షికోత్సవం కూడా. ఈ రెండు వార్షికోత్సవాలను మన దేశంలో అనేక రాజకీయ పార్టీలు, కార్మిక సంఘాలు, బహుజన సంఘాలు జరుపుకుంటున్నాయి. జార్ఖండ్‌లో కూడా, ʹగ్రేట్ నక్సల్బరీ రైతాంగ తిరుగుబాటు అర్ధ శతాబ్దపు ఉత్సవ కమిటీʹ ఏర్పడింది, ఇందులో మజ్దూర్ సంఘటన్ సమితితో పాటు డజన్ల కొద్దీ సంస్థలు పాల్గొన్నాయి. దాని బ్యానర్ క్రింద, అనేక చోట్ల విజయవంతమైన కార్యక్రమాలు కూడా జరిగాయి. ఇందులో RDF కేంద్ర అధ్యక్షుడు, ప్రముఖ విప్లవ కవి వరవరరావు కూడా పాల్గొన్నారు.

ఈ కార్యక్రమాలు సఫలమవడంతో, అప్పటి జార్ఖండ్‌లోని బిజెపి ప్రభుత్వం భయపడిపోయింది. దాంతో మరింత బలంగా మజ్దూర్ సంఘటన్ సమితి మావోయిస్టుల ఫ్రంటల్ సంస్థ అని చెప్పడం మొదలుపెట్టింది. ఇదిలా ఉండగా, 2017 జూన్ 9 న, ట్రేడ్ సమితి సభ్యుడు, డోలి కార్మికుడు మోతీలాల్ బస్కేను భయంకరమైన నక్సల్‌గా చూపించి CRPF కోబ్రా బలగం హత్య చేసింది. దీనికి వ్యతిరేకంగా, సమితి నేతృత్వంలో ఏర్పడిన ʹదమన్ విరోధి మోర్చాʹ ఆధ్వర్వ్యంలో గిరిడి జిల్లాలో ఆందోళన ఉప్పెన వెల్లువెత్తింది. గిరిడి జిల్లాలో ప్రారంభమైన ఈ ఉద్యమం రాష్ట్ర రాజధానికి చేరుకుంది. ఫలితంగా జార్ఖండ్ శాసనసభ నుంచి లోక్‌సభ, రాజ్యసభ వరకు ఈ బూటకపు ఎన్‌కౌంటర్ చర్చనీయాంశమైంది.

పైన పేర్కొన్న సమితి చేపట్టిన పై రెండు కార్యక్రమాలు జార్ఖండ్ ప్రభుత్వానికి నిద్రపట్టనివ్వలేదు, యిక రష్యా బోల్షివిక్ విప్లవం శతాబ్ది ఉత్సవాల వంతు వచ్చినప్పుడు, జార్ఖండ్‌లో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు, ʹసెంటేనల్ సెలబ్రేషన్స్ కమిటీ ఆఫ్ ది గ్రేట్ బోల్షివిక్ రివల్యూషన్ʹ (మహత్తర అక్టోబర్ విప్లవ శతవార్షికోత్సవ కమిటీ) ఏర్పడింది, ఇందులో సమితితో పాటు డజన్ల కొద్దీ సంస్థలు పాల్గొన్నాయి. ఈ సమితి బ్యానర్‌ కింద జార్ఖండ్‌లోని 17 చోట్ల అద్భుతమైన కార్యక్రమాలు నిర్వహించారు. ఇది 2017 నవంబర్ 30న రాంచీలో జరిగిన ఒక పెద్ద కార్యక్రమంతో ముగిసింది, ఇందులో ప్రముఖ విప్లవ కవి వరవరరావు ముఖ్య వక్తగా పాల్గొన్నారు.

ఈ మూడు కార్యక్రమాలతో జార్ఖండ్ ప్రభుత్వం సమితిపై దృష్టి మరల్చి కుట్రలు చేయడం ప్రారంభించిందని అప్పటి ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ బచ్చా సింగ్ అంటున్నారు. దీని ఫలితంగా, 2017డిసెంబర్ 22 న ఎటువంటి నోటీసు లేదా ముందస్తు సమాచారం లేకుండా, హఠాత్తుగా జార్ఖండ్ ప్రభుత్వ హోం శాఖ ముఖ్య కార్యదర్శి SKG రహాతే, నిధి ఖరేలు విలేఖరుల సమావేశం ఏర్పాటు చేసి సమితిని CPI (మావోయిస్ట్) ప్రజా సంఘం అని చెప్పి నిషేధాన్ని ప్రకటించారు. నిషేధం ప్రకటించిన తర్వాత హడావుడిగా తమ కార్యాలయాలన్నింటినీ సీజ్ చేశారని అప్పటి సమితి కేంద్ర కార్యదర్శి రఘువర్ సింగ్ చెబుతున్నారు. ʹక్రూర చట్టం UAPA కింద కేసు నమోదు చేసి డజన్ల కొద్దీ నాయకులను జైల్లో పెట్టారు. మా యూనియన్ బ్యాంకు ఖాతాలు, మా నేతలలో చాలా మంది వ్యక్తిగత బ్యాంకు ఖాతాలు కూడా స్తంభించాయి. కూలీలకు ఉచితంగా వైద్యం చేసిన ʹశ్రమజీవి ఆసుపత్రిʹని మందులతో పాటు జఫ్తు చేయడం అత్యంత బాధాకరం. మా నాయకులందరూ బెయిల్‌పై జైలు నుంచి బయటకు వచ్చినా, ఇప్పటికీ వారి వ్యక్తిగత బ్యాంకు ఖాతాలు స్తంభించిపోయాయి. శ్రమజీవి ఆసుపత్రి సహా అన్ని కార్యాలయాలను జఫ్తు చేశారు.ʹ

బొకారో థర్మల్‌లో సమితి ఏర్పడిన తర్వాత అక్కడి డివిసి పవర్‌ ప్లాంట్‌లో పనిచేస్తున్న సరఫరా కార్మికుల పరిస్థితి చాలా మెరుగుపడిందని ఆ సంస్థ అప్పటి కేంద్ర ఉపాధ్యక్షుడు, అప్పటి బొకారో థర్మల్‌ బ్రాంచ్‌ ప్రెసిడెంట్‌ కా. రజాక్‌ అన్సారీ చెబుతున్నారు. ఇంతకు ముందు అధికారులు సరఫరా కార్మికులతో తమ ఇంటి పనులు చేయించుకునేవారు, వారికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన కనీస వేతనాలు కూడా యిచ్చేవారు కాదు, వారికి గృహ వసతి కూడా ఏర్పాటు చేయలేదు. స్థానిక ప్రజలకు ఇక్కడ పని దొరికేది కాదు. కానీ, సమితి నేతృత్వంలోని కార్మికోద్యమం వల్ల కార్మికులు గౌరవప్రదమైన జీవితాన్ని పొందారు.

పోరాటాల ద్వారా కార్మికులకు క్రమబద్ధంగా బోనస్‌ను యిప్పించగలిగాం, అయితే సమితిని నిషేధించినప్పుడు, నా మీద కూడా కేసు పెట్టడంతో మా యింటి సభ్యులు, బంధువులు కూడా చాలా భయపడ్డారు అని బోకారో థర్మల్ బ్రాంచ్ కోశాధికారి సంజయ్ తురి వివరిస్తున్నారు.
కార్మిక నాయకుడు రామచంద్ర మహతో ʹసంస్థను నిషేధించినప్పుడు, కార్మికులు విషాదంలో మునిగితే కాంట్రాక్టర్లు, యాజమాన్యాలలో ఆనందం పెల్లుబికింది. వారు కార్మికుల దోపిడీని కొనసాగించారు, ఆ తర్వాత మేము ʹమజ్దూర్ ఏక్తా సంఘర్ష్ సమితిʹని ఏర్పాటు చేసాము, కానీ అది నమోదు అవలేదు కాబట్టి యాజమాన్యం దానికి ఎటువంటి ప్రాముఖ్యత ఇవ్వలేదు. అందుకని 2019లో ʹజార్ఖండ్ క్రాంతికారి మజ్దూర్ యూనియన్ʹలో చేరి కార్మికుల హక్కుల కోసం ఉద్యమిస్తూనే ఉన్నాం. ఇప్పుడు మా సంస్థకు పరిమితులు లేవు, మేము మళ్లీ మా యూనిట్‌గా ఏర్పడి కార్మిక ఉద్యమాన్ని ఒక కొత్త శిఖరానికి తీసుకెళ్తాముʹ అని ఆశా భావాన్ని వ్యక్తం చేశారు.

ʹమా సంస్థ నిషేధానికి గురైందని తెలియగానే మా అమ్మనే చనిపోయిందని అనిపించిందిʹ అని గిరిడి జిల్లాలోని మధుబన్ నివాసి, అప్పటి మజ్దూర్ సంఘటన్ సమితి నాయకురాలు ద్వారకా రాయ్ అంటున్నారు. ʹదాదాపు ఇక్కడ ఉన్న కార్మికులందరూ తమ సంరక్షకుడిని కోల్పోయినట్లుగా భావించారు. సమితిని నిషేధించిన వెంటనే మధుబన్‌లోని జైన్ భవనాల కార్మికుల దోపిడీ ప్రారంభమైంది. అన్ని భవనాలు/సంస్థల్లో కార్మికుల వేతనాలను తగ్గించారు, కార్మికుల తొలగింపు మొదలైంది. నన్ను కూడా తీసేశారు. పోలీసుల భయం కూడా ఎక్కువైంది, ఇక్కడ నుండి చాలా మంది నాయకులను అరెస్టు చేశారు, చాలా మందికి వారెంట్లు జారీ అయ్యాయి. అందరూ పారిపోవాల్సి వచ్చింది. నా పేరు మీద కూడా కేసు నమోదైంది, తర్వాత నాకు హైకోర్టు నుంచి ముందస్తు బెయిల్ వచ్చింది.ʹ

కరోనా కాలంలో ʹశ్రమజీవి హాస్పిటల్ʹ తాళాలు చూసి ఏడ్చేవాడినని మజ్దూర్ సంఘటన సమితి మధుబన్ శాఖ అప్పటి కార్యదర్శి తనురామ్ మహతో అన్నారు. అప్పట్లో వైద్యం అందక ప్రజలు చనిపోతుంటే కార్మికుల ఆస్పత్రిలో ఉంచిన మందులు పాడై, వృధా అయిపోతున్నాయి అని బాధగా అనిపించేది.
బొకారో థర్మల్ పవర్ ప్లాంట్‌లో పనిచేస్తున్న కార్మికుడు మోతీ తురి - ʹసంస్థపై నిషేధం తరువాత, మేము నిస్సహాయులయ్యాం. కానీ ఇప్పుడు మాకు మళ్లీ మద్దతు లభించింది. ఇప్పుడు శ్రామికుల్లో సంతోషం, దోపిడి చేసేవారు శోకంలో కూరుకుపోయారు.ʹ

మజ్దూర్ సంఘటన్ సమితితో అనుబంధం ఉన్న యువకుడు రంజిత్ కుమార్ ʹసంస్థను నిషేధించడంతో, స్నేహితులు, బంధువులందరూ నాకు దూరం అయ్యారు. వార్తాపత్రికలలో వచ్చిన ప్రతికూల వార్తలను చూసి, మా సంస్థపై వచ్చిన ఆరోపణలన్నీ నిజమని అందరూ నమ్మడం ప్రారంభించారు, కానీ ఈ నిర్ణయం వచ్చిన రోజు నుండి, నా స్నేహితులు, బంధువులతో చూడండి. మేమేమీ తప్పు చేయలేదు, మేము గెలిచాము అని సగర్వంగా చెబుతున్నాను.ʹఅన్నారు

అప్పటి సమితి కేంద్ర ప్రధాన కార్యదర్శి బచ్చా సింగ్ ʹమా ప్రజా కార్యక్రమాలతో విసిగిపోయిన జార్ఖండ్‌లోని అప్పటి బిజెపి ప్రభుత్వం ʹవిస్తాపనా విరోధి జన్‌వికాస్ ఆందోళన్ʹ (నిర్వాసిత్వ వ్యతిరేక ప్రజా అభివృద్ధి) కేంద్ర కన్వీనర్ కా. దామోదర్ తురీని కూడా లక్ష్యంగా చేసుకుంది. క్రూర చట్టం UAPA కింద కేసు నమోదు చేసి జైలుకు పంపింది అతని వ్యక్తిగత బ్యాంకు ఖాతాను కూడా నిలిపివేసారు. అతను బెయిల్‌ మీద విడుదలైనప్పటికీ, వ్యక్తిగత ఖాతా యింకా పనిచేయడం లేదు.ʹ అని వివరించారు.
ʹమా ఆఫీసులన్నింటికీ పోలీసులు తాళాలు వేశారు కానీ వాటి స్థితిగతులను పట్టించుకోకపోవడం వల్ల మా గిరిడి కార్యాలయం గేట్, కిటికీలు, బొకారో థర్మల్ కార్యాలయం సరిహద్దు గోడ గేట్లు, అనేక కిటికీలను ఎవరో ఎత్తుకెళ్లిపోయారు. కార్మికులు పైసా పైసా జోడించి తమ కార్యాలయాల్ని నిర్మించుకున్నారు. నష్టపరిహారం ఎవరు చెల్లిస్తారు?ʹ అని ప్రశ్నిస్తున్నారు.

ʹరాంచీ హైకోర్టు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. జార్ఖండ్ ప్రభుత్వ నియంతృత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా, మేము2018 ఫిబ్రవరి 9న రాంచీ హైకోర్టులో వేసిన రిట్ మీద నాలుగు సంవత్సరాల తర్వాత నిర్ణయం వెలువడిందని కా. బచ్చా సింగ్ అన్నారు. ఇప్పుడు వీలైనంత త్వరగా ప్రభుత్వం మా సహచరులందరిపై పెట్టిన నకిలీ కేసులను ఉపసంహరించుకోవాలి, మా అన్ని కార్యాలయాలకు తాళాలు తెరిచి, మా సంస్థతో పాటు మా నాయకుల బ్యాంకు ఖాతాలను యాక్టివేట్ చేయాలి. ఆర్డర్‌కు సంబంధించిన సర్టిఫైడ్ కాపీ అందిన వెంటనే ఆర్డర్ కాపీని అన్ని జిల్లాల డీసీ, ఎస్పీలకు అందజేసి కార్యాలయం, బ్యాంకు ఖాతా తెరవాలని డిమాండ్ చేస్తాం.ʹ అని తెలియచేసారు.

- రూపేష్ కుమార్ సింహ్, స్వతంత్ర జర్నలిస్టు.

తెలుగు అనువాదం పద్మ కొండిపర్తి

(janchowk.com సౌజన్యంతో)

Keywords : jharkhand, MSS, majdur sanghatan samthi, ranchi, high court, ban lift, Jharkhand High Court lifts ban on Mazdoor Sanghatan Samiti
(2024-04-14 19:47:07)



No. of visitors : 919

Suggested Posts


వేటకు వెళ్లిన ఆదివాసీ యువకులపై భద్రతా దళాలు కాల్పులు - ఒకరి మరణం, మరొకరికి తీవ్ర గాయాలు

జార్ఖండ్‌, లతేహర్ జిల్లాలోని గారు పోలీస్ స్టేషన్ పరిధిలోని కుకూ-పిరీ అడవిలో వేట కోసం వెళ్ళిన‌ ఆదివాసీ యువకుల పై భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో పిరి నివాసి 23 ఏళ్ల బ్రహ్మదేవ్ సింగ్ బుల్లెట్లు తగిలి అక్కడికక్కడే మరణించాడు, అదే గ్రామానికి చెందిన దీనానాథ్ సింగ్ గాయపడ్డాడు.

ʹమావోయిస్టు నాయకులను జైల్లో చిత్రహింసలకు గురిచేస్తున్నారుʹ

సీనియర్ మావోయిస్టు నాయకులు ప్రశాంత్ బోస్ @ కిష‌న్ దా, అతని సహచరి షీలా మరాండీలమి జైల్లో చిత్రహింసలకు గురిచేస్తున్నారని మావోయిస్టు పార్టీ ఆరోపించింది.

మావోయిస్టు పార్టీ కేంద్రకమిటీ స్టాఫ్ సభ్యుడు రవి అమరత్వం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌

భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) కేంద్రకమిటీ స్టాఫ్ సభ్యుడు (డివిజనల్ కమిటీ స్థాయి) మన ప్రియతమ కామ్రేడ్ రవి (జైలాల్) అమరత్వ వార్తను అనివార్య పరిస్థితులలో దాదాపు సంవత్సరంన్నర కాలం ఆలస్యంగా తెలియజేస్తున్నందుకు తీవ్రంగా చింతిస్తున్నాం.

అవును నేను మావోయిస్టునే..!

అభయ్ జాక్సన్ ఛత్తీస్ ఘడ్ రాష్ట్రానికి చెందిన ఓ ఆదివాసీ మేధావి. మారుమూల అటవీ గ్రామాన్నుండీ అతికష్టం మీద చదువుకొని ఢిల్లీ జె ఎన్ యు లో సోషల్ సైన్స్ మాస్టర్ డిగ్రీ చేసిన మేధావి.రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లు ప్రకారం అతనికి మంచి ఉద్యోగం, హోదా , సుఖవంతమైన జీవితం దొరికుండేవి.

Condemn arrest of Damodar Turi by Jharkhand Police - PPSC

Persecuted Prisonersʹ Solidarity Committee (PPSC) condemns the continued repression on activists and groups associated with peopleʹs struggles in Jharkhand by the police and administration. Damodar Turi, a member of the Central Committee of Visthapan Virodhi Jan Vikas Andolan (VVIVA), was arrested in the evening on 15" February 2018 from Ranchi.

Bajrang Dal activists killed my husband: Widow of man lynched in Jharkhand

The wife of the man who was lynched in Jharkhandʹs Ramgarh district on suspicion of carrying beef has alleged that the mob that beat her husband to death mostly included Bajrang Dal activists. ʹThey were rogues owing allegiance to the Bajrang Dal,ʹ Mariam Khatoon told....

Jharkhand: Tribals hold police, district officials hostage in late-night drama

Thousands of tribals armed with traditional weapons held several senior police and administrative officers hostage at Kanki Siladon, a tribal hamlet in Khunti district, through Thursday night.....

Former Jharkhand CM Hemant Soren calls police encounter with Maoist ʹfakeʹ, demands probe

The opposition parties have termed the encounter between police and Maoist guerrillas in Giridih earlier in June as "fake" and demanded a judicial probe. The encounter had claimed one life.....

ప్రభుత్వ హత్య : ఆధార్ కార్డు లేక రేషన్ కార్డు రద్దు... చిన్నారి ఆకలి చావు

జార్ఖండ్‌లోని సిమ్దేగా జిల్లా కరీమతి గ్రామానికి చెందిన 11 ఏళ్ల సంతోషి కుమారి తండ్రి మతిస్థిమితం కోల్పోవడంతో, తల్లి కొయిలీ దేవీనే పిల్లల్ని సాకుతోంది. ఆమెకు సంతోషితోపాటు మరో పాప కూడా ఉంది. దుర్భర పేదరికంలో జీవిస్తోన్న వారి కుటుంబానికి పౌరసరఫరాల శాఖ నుంచి అందే రేషన్‌ సరుకులే దిక్కు....

ఆ ఆదివాసీ యువకుడిది ఎన్ కౌంటర్ కాదు హత్యే, సీఆర్పీఎఫ్ అధికారే దోషి - 9 ఏండ్ల తర్వాత తేల్చిన సీఐడి

గ్రామానికి చేరుకున్న వెంటనే సిఆర్‌పిఎఫ్ జవాన్లు 20-22 మంది గ్రామస్తులను పట్టుకుని అందరి చేతులను వెనక్కు విరిచికట్టేసి, తమ వెంట తీసుకెళ్లి ఆ రాత్రి వారందరినీ వూరి బయట మైదానంలో వుంచి మర్నాడు జూన్ 29న తమ సామాన్లను బహదా అడవికి మోయించుకెళ్లారు. అక్కడ నుండి యింకా ముందుకు సామాను తీసుకెళ్లడానికి నిరాకరించడంతో మంగల్ హోన్‌హాగ్‌ను కాల్చి చంపారు.

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


మహోజ్వల