ఆ తల్లి అడుగుతున్న ప్రశ్నకు జవాబు చెప్పగలమా ?
06-03-2022
ఆంధ్రప్రదేశ్ లో కొంత కాలంలో ఎన్ ఐ ఏ ప్రజా సంఘాల గొంతు నొక్కడమే లక్ష్యంగా పని చేస్తోంది. ఒక వైపు ఏపీ లోని ముంచంగిపుట్టు, పిడుగురాళ్ళ కేసులతో అనేక మంది కార్యకర్తలను జైళ్ళలొ పెట్టి 70 మందికి పైగా ప్రజా సంఘాల కార్యకర్తలపై కేసులు బనాయించిన పోలీసులు ఇప్పుడు కేరళలో ఎప్పుడో నమోదయిన ఓ కేసులో మరికొందరిని ఇరికిస్తున్నారు. ప్రగతిశీల కార్మిక సమాఖ్య సభ్యుడు ఆంజనేయులును వారం క్రితం ఆయన స్వస్థలం చిత్తూరు జిల్లా మదనపల్లెలో అదుపులోకి తీసుకుంని, కేరళ తీసుకెళ్లి రెండు రోజులపాటు విచారించి ఆ తర్వాత వదిలిపెట్టింది ఎన్ ఐ ఏ. ఆ కేసును విప్లవ రచయితల సంఘం నాయకులు పినాక పాణి, వరలక్ష్మిలపై కూడా బనాయించింది ఎన్ ఐ ఏ. వర;అక్ష్మి, పాణిల ఇళ్ళకు వెళ్ళి అనేక గంటలపాటు వాళ్ళిద్దరిని విచారించి కేరళలోని కోచికి రావాలని నోటీసులు ఇచ్చారు.
ఈ విషయంపై ఈ నెల 3వ తేదీన విప్లవ రచయితల సంఘం విడుదల చేసిన ప్రకటన....
విరసం పత్రికా ప్రకటన
03-03-2022
కేరళలో పాణి, వరలక్ష్మి పై ఎన్ఐఏ మరో కుట్ర కేసు..
కేరళలో ఎప్పుడో నమోదయిన ఓ కేసులో ఇప్పుడు ప్రజాసంఘాల నాయకులను ముద్దాయిలుగా చూపుతూ ఎన్ఐఏ అధికారులు ఎఫ్ఐఆర్ నమోదుచేశారు. ఆరుగురి పేర్లతో తయారైన ఈ ఎఫ్ఐఆర్లో విరసం కార్యవర్గ సభ్యులు పాణి, వరలక్ష్మి, ప్రగతిశీల కార్మిక సమాఖ్య సభ్యుడు ఆంజనేయుల పేర్లు ఉన్నాయి. ఇంకా..కేరళ, మహారాష్ట్రకు చెందిన ఇద్దరిని, పిడుగురాళ్ల పోలీస్ స్టేషన్ పరిధిలో రెండేళ్ల క్రితం ఓ కేసులో అరెస్టయిన చైతన్య అనే విద్యార్థినీ నిందితుడిగా పేర్కొన్నారు. వీరందరిపై ఉ.పా., నేరపూరిత కుట్ర తదితర క్రూర చట్టాలను మోపారు. ఇలాంటి టెర్రరిస్టు చట్టాలను మోపడం వారి జీవించే, భావ ప్రకటన స్వేచ్ఛని కాలరాసే ఫాసిస్టు చర్యే అవుతుంది. ఆంధ్రప్రదేశ్లో మరోసారి భారీస్థాయిలో అరెస్టులకు తెరతీసి..ప్రజాసంఘాల కదలికలను కట్టడి చేయడానికి జరుగుతున్న కుట్ర ఇది. ఈ కుట్రను విరసం ఖండిస్తోంది.
కేరళలో మావోయిస్టులపై నమోదయిన పాత కేసు ఇది. ఎన్ఐఏ ఇటీవల ఆ కేసు దర్యాప్తును కేరళ పోలీసుల నుంచి తన చేతుల్లోకి తీసుకుంది. వారం క్రితం ఆంజనేయులును ఆయన స్వస్థలం చిత్తూరు జిల్లా మదనపల్లెలో అదుపులోకి తీసుకుంది. కేరళ తీసుకెళ్లి రెండు రోజులపాటు విచారించి ఆ తర్వాత
వదిలిపెట్టింది. ఈ క్రమంలోనే తాజాగా కేరళ కేసులో ఎన్ఐఏ నమోదుచేసిన ఎఫ్ఐఆర్ వెలుగులోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో ముంచింగిపుట్టు కేసును అప్పటికే డీల్ చేస్తున్న అనుభవంతో తాజా ఎఫ్ఐఆర్ను ఎన్ఐఏ బాగా వండివార్చింది. ముంచింగిపుట్టు కేసులో ఉన్న పాణి, వరలక్ష్మిని కేరళ కేసులోనూ ఇరికించింది. భవిష్యత్తులో ప్రజాసంఘాలకు చెందిన మరికొందరినీ ఈ జాబితాలోకి చేర్చేందుకు వీలుగా ఇతరులు.. అంటూ ఎఫ్ఐఆర్లో కొంత ఖాళీ వదిలిపెట్టింది.
మహారాష్ట్ర కేంద్రంగా భీమాకోరేగావ్ కేసును సృష్టించి దేశమంతటా ఎన్ఐఏ భారీఎత్తున అరెస్టులకు పాల్పడటం మనం చూశాం. ఇప్పుడు కేరళ కేంద్రంగా అదే ప్రయోగాన్ని మరోసారి మొదలుపెట్టినట్టు కనిపిస్తోంది. మూడు రాష్ట్రాల వ్యక్తులను ఈ కేసులో నిందితులుగా చేర్చడం.. ఎఫ్ఐఆర్లో నమోదుచేసిన సెక్షన్ల తీవ్రత.. దీనినే సూచిస్తున్నాయి. సంజయ్ దీపక్ రావు అలియాస్ వికాస్, శ్రీకాంత్లను మహారాష్ట్ర, కేరళ వాసులుగా ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. అంతకుమించిన వివరాలు వీరి గురించి అందులో లేవు. మిగతా నలుగురిలో పాణి ఏపీ వ్యక్తి అని, వరలక్ష్మి ఏపీకి చెందిన రివల్యూషనరీ రైటర్స్ అసోసియేషన్ సభ్యురాలు అని పేర్కొన్నారు. చైతన్య, ఆంజనేయులను ఏపీ వ్యక్తులుగా ప్రస్తావించారు. ఈ ఆరుగురు వ్యక్తులు మరికొందరితో కలిసి నేరపూరిత కుట్ర చేశారట! పైగా వీరిలో ఎవరి నివాస వివరాలూ తెలియవని ఎఫ్ఐఆర్లో రాశారు.ఇళ్ల దగ్గర అదుపులోకి తీసుకుని ఎక్కడో అరెస్టు చూపుతూ పోలీసులు అల్లే కథలు మనకు తెలిసినవే. అక్రమంగా మోపిన వేర్వేరు కుట్ర కేసులను విరసం సీనియర్ సభ్యులు వరవరరావు, ప్రొ. సాయిబాబ ఇప్పటికే ఎదుర్కొంటున్నారు. కేరళలో నమోదైన ఎప్పటికేసునో ఎన్ఐఏ వెలికితీసి భారీ కుట్రకు మరోసారి తెగబడటాన్ని విరసం ఖండిస్తోంది. వరలక్ష్మి, పాణి, ఆంజనేయులు ల పై అక్రమంగా నమోదుచేసిన కుట్ర కేసును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది.
(తాజా కలం :ఈ రోజు రాత్రి ఎన్ఐఏ అధికారులు కామ్రేడ్ వరలక్ష్మి ఇంటికి వచ్చి విచారించి వెళ్లారు. త్వరలో కొచ్చి రావలసిందిగా సమాచారమిచ్చారు)
అరసవిల్లి క్రిష్ణ - అద్యక్షుడు,
రివేరా - కార్యదర్శి
విప్లవ రచయితల సంఘం.
ఈ ఇద్దరిపై గతంలో ముంచంగిపుట్టు కేసు కూడా బనాయించారు. వీళ్ళిద్దరి ఇళ్ళలో గతంలో కూడా గంటల కొద్దీ ఎన్ ఐ ఏ అధికారులు సోదాలు నిర్వహించారు. హార్డ్ డిస్క్ లు, సాహిత్యం తీసుకెళ్ళారు.
ఇప్పుడు మళ్ళీ అడిగిన ప్రశ్నలనే అడుగుతూ వేధించడం ఎందుకోసం ? దీనిపై విరసం వరలక్ష్మి ఫేస్ బుక్ లో ఓ పోస్ట్ పెట్టారు.
ʹʹముంచంగిపుట్టు అనే ఊరు ఒకటి ఉందని ఆ కేసు పెట్టేదాకా నాకు తెలీదు. కొచ్చి వెళ్లాల్సి వస్తుందని అక్కడ ఇంకో కేసు పెట్టేదాకా ఊహించనైనా లేదు. ఎక్కడో మారుమూల రాయలసీమలో చాలీ చాలని జీతంతో బతుకుతున్న నాకు ఈ ఊర్లలో ఈ కేసులతో సంబంధం ఏమిటి?
ఇప్పటికి మూడు సార్లు ఇంటరాగేషన్ అయింది. ఆడిగినవే అడిగి, చెప్పినవే చెప్పి.. అటుతిప్పి, ఇటుతిప్పి.. దీనికి అంతుపొంతూ లేదేమో. కేవలం దీనికోసమే నాలుగు రాష్ట్రాల పోలీసులు బోలెడు సమయం డబ్బు ఖర్చుపెట్టి తిరుగుతున్నారంటే విచిత్రంగా అనిపిస్తుంది.
మేము ఫలానా రాసామనో, ఫలానా మాట్లాడామనో, అట్లా మాట్లాడ్డం నేరమనో కేసు పెడితే అదో లెక్క. కేరళ పోలీసులు మనింటికి ఎందుకొచ్చినారు అని మా అమ్మ అడుగుతూ ఉంది. నువ్వు ఉండేదీ, ఉద్యోగం చేసేదీ ప్రొద్దుటూరులో అయితే అక్కడ కేసు పెట్టడమేమిటి అంటుంది. ఆమెకు చాలా ప్రశ్నలున్నాయి. లోకంలో ఎన్నో ఘోరాలు జరుగుతుంటే వాళ్ళెందుకు మీ ఎనకాల పడ్డారు అంటుంది.ʹʹ వరలక్ష్మి
అవును....లోకంలో ఎన్నో ఘోరాలు జరుగుతుంటే వాళ్ళెందుకు వీళ్ళ వెనకాల పడ్డారు ? వరలక్ష్మి అమ్మ అడుగుతున్న ఈ ప్రశ్నకు మనకైనా సమాధానం చెప్పే ధైర్యం ఉందా ?
Keywords : NIA, Kerala, Virasam, varalakshmi, pani, andhrapradesh,
(2024-04-24 22:40:05)
No. of visitors : 1034
Suggested Posts
| కలకత్తాలో జరుగుతున్న చారుమజుందార్ శత జయంతి ఉత్సవాల్లో విరసం కార్యదర్శి పాణి స్పీచ్ నక్సల్బరీ లేకపోతే భారత పీడిత ప్రజానీకానికి విప్లవ దారే లేకుండా పోయేది. కమ్యూనిస్టు రాజకీయాలు చర్చించుకోవడానికే తప్ప వర్గపోరాట బాట పట్టకపోయేవి. ఆ నక్సల్బరీ దారిని చూపినవాడు చారు మజుందార్. విప్లవ పార్టీకి వ్యూహాన్ని, ఎత్తుగడలను ఒక సాయుధ పోరాట మార్గాన్ని చూపించిన వాడు చారు మజుందార్. |
| ఆదివాసి.. లంబాడా వివాదం - ఎం.రత్నమాలమహారాష్ట్ర ప్రభుత్వం లంబాడాలను ఆదివాసి తెగగా గుర్తించడం లేదు కనుక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లంబాడాలను ఆదివాసి షెడ్యూల్డు తెగగా ప్రకటించడంతో దీన్ని అవకాశంగా తీసుకుని మహారాష్ట్ర నుంచి ఆదిలాబాద్ (పాత) జిల్లాకు లంబాడాల వలసలు పెద్ద ఎత్తున వెల్లువలా సాగాయి..... |
| మహాశ్వేతా దేవి - మన తెలంగాణ సాగర హారంః వరవర రావుమన మహా సాగరహారం ʹచలో హైదరాబాద్ అంటూ తెలంగాణ మార్చ్ చేసిన సెప్టెంబర్ 30, 2012 మహత్తర మధ్యాహ్నం మహాశ్వేతాదేవి కూడా మన ఊర్లో ఉన్నారు. ఆ రోజు ఆమెను మన మధ్యకు తెచ్చుకొని ఉంటే.... |
| సెప్టెంబర్ 17 - ఇండియన్ యూనియన్ సైనిక దురాక్రమణ దినం - వరవరరావు1947 ఆగస్ట్ 15న విలీనానికి అంగీకరించకుండా షరతులు విధిస్తూ వచ్చిన నిజాంను నెహ్రూ - పటేల్ ప్రభుత్వం సగౌరవంగా, సాదరంగా చర్చలకు ఆహ్వానించింది. అప్పటికే నిజాంను వ్యతిరేకిస్తూ వీరోచిత పోరాటం నడుపుతున్న కమ్యూనిస్టులను మాత్రమే కాదు, కనీసం కాంగ్రెస్ ను కూడా ఈ చర్చల్లో భాగం చేయలేదు.... |
| అమరుడు బొజ్జా తారకం — ʹనది పుట్టిన గొంతుకʹ - వరవరరావుగోదావరి తెలంగాణలో ప్రవేశించిన నిజామాబాద్ కు 1968లో వచ్చిన తారకం గారు ఇక్కడి మట్టిలోని ఎరుపులోనూ, ఇక్కడి నీళ్లలోని ప్రవాహ గుణంలోనూ కలగలిసిపోయారు. 1968 నుంచి 78 దాకా ఒక దశాబ్దం పాటు విప్లవోద్యమాలకు, విప్లవ సాహిత్యానికి నిజామాబాద్ చిరునామా బొజ్ఞాతారకం.... |
| ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ పోరాటానికి విరసం మద్దతుఅట్టడుగున ఉన్న మనిషికి ఫలితాలు అందినప్పుడే సామాజిక న్యాయం జరిగినట్టు లెక్క. మాదిగ, డక్కలి, చిందు, మాష్టి, బుడగజంగం, దాసరి, బేగరి కులాలకు ఈ నాటికీ ఎస్సీ రిజర్వేషన్ ఫలాలు అందడం లేదు.... |
|
ʹఅన్నలు మల్లొస్తరు బిడ్డా.. ఆల్లొస్తే వాళ్ళకు గిన్ని మంచి నీల్లో, తిండో పెట్టాలనే బతుకుతాన్నʹఅందుకే అంత నిర్బంధంల కూడా నా కొడుకు అంత్యక్రియలకు వచ్చిన జనాలకు మా ఖిలా వరంగల్ సరిపోలె. ఎక్కడోల్లను అక్కడ అరెస్ట్ చేసినా వచ్చిండ్రు. ఎవరో నక్సలైట్ అట, చిన్న పిల్లగాడేనట, బలే తెలివికల్లోడట అని అనుకుంట జనాలు వచ్చిండ్రు. పద్దెనిమిది నిండి పందొమ్మిది పడగానే చంపేసిండ్రు. |
| కాగడాగా వెలిగిన క్షణం... అమరుడు యెం యెస్ ఆర్ కోసం ... నారాయణ స్వామిఎంత ప్రాణం శ్రీనుది బక్క పలుచగా ఉండేటోడు – ఎక్కడన్న సరిగ్గా తిన్నడో లేదో శరీరం లో బలం సత్తువ ఉన్నదో లేదో – ఆ దుర్మార్గులు పట్టుకొని చిత్రహింసలు పెడుతుంటే ఆ లేత శరీరం ఎంత గోస పడిందో ఎంత హింసకు గురైందో ఎంత అల్లల్లాడిందో – ఆ క్రూరులు చంపేయ్యబోతుంటే, చివరికి మేఘే ఢాకా తార లో సుప్రియ అరిచినట్టు నాకు బతకాలని ఉంది నాకు చావాలని లేదు నాకు బతకాలని ఉంది.... |
| ఉత్తేజకరంగా సాగిన విరసం సాహిత్యపాఠశాల
అంతకుముందు అంతర్జాతీయ శ్రామికవర్గ పతాకావిష్కరణతో కార్యక్రమాలను ప్రారం భించారు. అమరుడు పులి అంజన్న తల్లి సైదమ్మ ఎర్ర జెండాను, సీనియర్ విరసం సభ్యురాలు రత్నమాల విప్లవ రచయితల సంఘం జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా అమరుడు శేషయ్య సోదరుడు సాంబయ్య, అమరుడు వివేక్ తండ్రి యోగానంద్ అమరుల స్థూపాన్ని ఆవిష్క రించారు. |
| ʹఅరుణోదయʹ పై పోలీసుల దాడిని ఖండించిన విరసం తెలంగాణ ఉద్యమంలో ఆట పాటతో ఆరుణోదయ కళాకారులు గ్రామ గ్రామాన తిరిగి ప్రజల్లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని రగిలించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తమ వంతు కృషి చేశారు. ఆ సంస్థ కార్యాలయాన్ని దౌర్జన్యంగా మూసేయడం అత్యంత నిరంకుశమైన...... |