కామ్రేడ్ సి. రామ్మోహ‌న్‌కు విర‌సం నివాళి

కామ్రేడ్

09-03-2022

ప్ర‌జా ఉద్య‌మాల స్నేహితుడు, పాల‌మూరు అధ్య‌య‌న వేదిక నాయ‌కుడు కామ్రేడ్ సి. రామ్మోహ‌న్ మృతికి విర‌సం నివాళి అర్పిస్తోంది. మంగ‌ళ‌వారం (08-03-22) ఉద‌యం హైద‌రాబాద్‌లో త‌న 74వ ఏట అనారోగ్యంతో ఆయ‌న మ‌ర‌ణించారు. తొలిత‌రం విర‌సం నాయ‌కుల్లో ఆయ‌న ఒక‌రు. కార్య‌వ‌ర్గ స‌భ్యునిగా సంస్థ‌లో చాలాకాలం ప‌నిచేశారు. అటు భావ‌జాలానికీ, ఇటు కార్య‌క్షేత్ర స‌మ‌స్య‌లకీ మ‌ధ్య ఆలోచ‌న‌లు సాగించే ఆయ‌న పూర్తిగా ఆచ‌ర‌ణ‌వాది. ఒక ప్ర‌యాణ‌మో, కొద్ది అడుగుల న‌డ‌కో, కొంత సంభాష‌ణో రామ్మోహ‌న్‌తో సాగించిన‌వారికి ఆయ‌న వ్య‌క్తిత్వంలోని ఈ విల‌క్ష‌ణ‌త అనుభ‌వంలోకి వ‌స్తుంది. మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లా గ‌ద్వాలలో 1985లో విర‌సం సాహిత్య పాఠ‌శాల జ‌రిగింది. పాల‌మూరు లేబ‌ర్ అనే అంశంపై ఈ పాఠ‌శాల‌లో రామ్మెహ‌న్ చేసిన ప్ర‌సంగం సామాజిక స‌మ‌స్య‌ల అధ్య‌య‌నానికి ఒక న‌మూనా లాంటిది. మాన‌వ జీవితానికి సంబంధించిన చాలా లోతైన అంశాల‌ను ఆ పాఠం త‌డిమింది. విష‌యం, విశ్లేష‌ణ వ‌ల్ల‌నే కాకుండా.. వ్య‌క్తీక‌ర‌ణ వ‌ల్ల, ఆయ‌న‌కు ఉన్న ఉప‌న్యాస సామ‌ర్థ్యం వ‌ల్ల కూడా గ‌ద్వాల పాఠ‌శాల కొండ‌గుర్తుగా రామ్మోహ‌న్‌ను ఈరోజున అనేక‌మంది గుర్తు చేసుకొంటున్నారు.

గ‌త కొన్నేళ్లుగా ఆయ‌న విర‌సం నిర్మాణ స‌మావేశాల‌కు హాజ‌రు కాలేక‌పోయినా, చివ‌రి దాకా విర‌సం ఆశ‌యాల కోసం, విప్ల‌వ సాహిత్యోద్య‌మ క‌ర్త‌వ్యాల కోసం దృఢ‌మైన మార్క్సిస్టు లెనినిస్టుగా కొన‌సాగారు. అన్నిర‌కాల ఆధిప‌త్య‌, వివ‌క్ష‌పూరిత‌ సంబంధాల‌కు ఆయ‌న తొలినుంచీ వ్య‌తిరేకి. ఈ క్ర‌మంలో ఫాసిజంపై ఆయ‌న‌ది తిరుగులేని పోరాటం. పాత సంస్థానాల‌తో నిండి ఉండే పాల‌మూరు ప్రాంతంలోని విద్యాల‌యాలు సంఘ్ ప‌రివార్ శ‌క్తుల ఆధిప‌త్యంలో ఉండేవి. అయితే.. ఈ శ‌క్తుల‌కు రామ్మోహ‌న్ ఒక విల‌న్‌. త‌మ శ్రేణుల్లో ఆయ‌న గురించి ఈ శ‌క్తులు ఇలాంటి ప్ర‌చార‌మే చేసేవి. తాను పాఠాలు చెప్పే విద్యాల‌యంలో త‌న‌ను తాను క‌మ్యూనిస్టుగా ప్ర‌క‌టించుకుని ప్ర‌త్యామ్నాయ రాజ‌కీయాలను రామ్మోహ‌న్ ధైర్యంగా ప్ర‌చారం చేసేవారు. ఇలా ప్ర‌చారం చేయ‌డం పాల‌క‌వ‌ర్గాల‌కూ, ఫాసిస్టుల‌కూ కంట‌గింపుగా ఉండేది. ఈ నేప‌థ్యం నుంచే విర‌సంలోకి, అక్క‌డినుంచి పాల‌మూరు అధ్య‌య‌న వేదిక‌లోకి ఆయ‌న ప్ర‌యాణం కొన‌సాగింది.

తొలినుంచీ సిద్ధాంత అధ్య‌య‌నాన్నీ, ఆచ‌ర‌ణ‌నూ మేళ‌వించిన జీవ‌న శైలి ఆయ‌న‌ది. పాల‌మూరు అధ్య‌య‌న వేదిక హైద‌రాబాద్ క‌మిటీ బాధ్య‌త‌ల్లో భాగంగా అనేక క్షేత్ర‌స్థాయి అధ్య‌య‌నాల్లో రామ్మోహ‌న్ చురుగ్గా పాల్గొన్నారు. తాను ఎక్క‌డ ఉంటే అక్క‌డ ఒక ఆహ్లాద‌క‌ర వాతావ‌ర‌ణం ఆవ‌రించేది. తాను చేసే చ‌ర్చ‌ల్లో, సాగించే ఆలోచ‌న‌ల్లో, క‌ల‌బోసుకునే అభిప్రాయాల్లోని మృదుత్వం, పాటించే ప్ర‌జాస్వామిక మ‌ర్యాదలే దీనికి కార‌ణం. ఈ ల‌క్ష‌ణ‌మే ఆయ‌న‌ను వ్య‌క్తుల‌కు, వేదిక‌ల‌కు స్నేహ‌శీలిని చేశాయి. ఆంధ్ర‌ప్ర‌దేశ్ టీచ‌ర్స్ ఫెడ‌రేష‌న్‌లో ఒక టీచ‌రుగా త‌న వృత్తిగ‌త బాధ్య‌త‌గా మాత్ర‌మే ఆయ‌న కొన‌సాగ‌లేదు. శ్ర‌మ సంస్కృతి, పోరాట అవ‌స‌రాన్ని ప‌రిచ‌యం చేస్తూ ఉపాధ్యాయుల‌కు ఆరోగ్య‌క‌ర‌మైన భావ‌జాలాన్ని అందించ‌డాన్నీ త‌న క‌ర్త‌వ్యంగా పెట్టుకుని ప‌నిచేశారు. నిబ‌ద్ధ ప్ర‌జా ఆచ‌ర‌ణతో కూడిన జీవితం గ‌డిపిన ఆ ఆద‌ర్శ కామ్రేడ్‌కు విర‌సం జోహార్లు అర్పిస్తోంది.

అర‌స‌విల్లి కృష్ణ‌, అధ్య‌క్షుడు
రివేరా, కార్య‌ద‌ర్శి
విప్ల‌వ ర‌చ‌యిత‌ల సంఘం
08-03-22

Keywords : rammohan, virasam, martyr, teacher, mahabubnagar
(2024-04-14 19:47:09)



No. of visitors : 639

Suggested Posts


కలకత్తాలో జరుగుతున్న చారుమజుందార్ శత జయంతి ఉత్సవాల్లో విరసం కార్యదర్శి పాణి స్పీచ్

నక్సల్బరీ లేకపోతే భారత పీడిత ప్రజానీకానికి విప్లవ‌ దారే లేకుండా పోయేది. కమ్యూనిస్టు రాజకీయాలు చర్చించుకోవడానికే తప్ప వర్గపోరాట బాట పట్టకపోయేవి. ఆ నక్సల్బరీ దారిని చూపినవాడు చారు మజుందార్. విప్లవ పార్టీకి వ్యూహాన్ని, ఎత్తుగడలను ఒక సాయుధ పోరాట మార్గాన్ని చూపించిన వాడు చారు మజుందార్.

ఆదివాసి.. లంబాడా వివాదం ‍- ఎం.రత్నమాల

మహారాష్ట్ర ప్రభుత్వం లంబాడాలను ఆదివాసి తెగగా గుర్తించడం లేదు కనుక ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం లంబాడాలను ఆదివాసి షెడ్యూల్డు తెగగా ప్రకటించడంతో దీన్ని అవకాశంగా తీసుకుని మహారాష్ట్ర నుంచి ఆదిలాబాద్‌ (పాత) జిల్లాకు లంబాడాల వలసలు పెద్ద ఎత్తున వెల్లువలా సాగాయి.....

మహాశ్వేతా దేవి - మన తెలంగాణ సాగర హారంః వరవర రావు

మన మహా సాగరహారం ʹచలో హైదరాబాద్ అంటూ తెలంగాణ మార్చ్ చేసిన సెప్టెంబర్ 30, 2012 మహత్తర మధ్యాహ్నం మహాశ్వేతాదేవి కూడా మన ఊర్లో ఉన్నారు. ఆ రోజు ఆమెను మన మధ్యకు తెచ్చుకొని ఉంటే....

సెప్టెంబర్ 17 - ఇండియన్ యూనియన్ సైనిక దురాక్రమణ దినం - వరవరరావు

1947 ఆగస్ట్ 15న విలీనానికి అంగీకరించకుండా షరతులు విధిస్తూ వచ్చిన నిజాంను నెహ్రూ - పటేల్ ప్రభుత్వం సగౌరవంగా, సాదరంగా చర్చలకు ఆహ్వానించింది. అప్పటికే నిజాంను వ్యతిరేకిస్తూ వీరోచిత పోరాటం నడుపుతున్న కమ్యూనిస్టులను మాత్రమే కాదు, కనీసం కాంగ్రెస్ ను కూడా ఈ చర్చల్లో భాగం చేయలేదు....

అమరుడు బొజ్జా తారకం — ʹనది పుట్టిన గొంతుకʹ - వరవరరావు

గోదావరి తెలంగాణలో ప్రవేశించిన నిజామాబాద్ కు 1968లో వచ్చిన తారకం గారు ఇక్కడి మట్టిలోని ఎరుపులోనూ, ఇక్కడి నీళ్లలోని ప్రవాహ గుణంలోనూ కలగలిసిపోయారు. 1968 నుంచి 78 దాకా ఒక దశాబ్దం పాటు విప్లవోద్యమాలకు, విప్లవ సాహిత్యానికి నిజామాబాద్ చిరునామా బొజ్ఞాతారకం....

ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ పోరాటానికి విరసం మద్దతు

అట్టడుగున ఉన్న మనిషికి ఫలితాలు అందినప్పుడే సామాజిక న్యాయం జరిగినట్టు లెక్క. మాదిగ, డక్కలి, చిందు, మాష్టి, బుడగజంగం, దాసరి, బేగరి కులాలకు ఈ నాటికీ ఎస్సీ రిజర్వేషన్ ఫలాలు అందడం లేదు....

ʹఅన్నలు మల్లొస్తరు బిడ్డా.. ఆల్లొస్తే వాళ్ళకు గిన్ని మంచి నీల్లో, తిండో పెట్టాలనే బతుకుతాన్నʹ

అందుకే అంత నిర్బంధంల కూడా నా కొడుకు అంత్యక్రియలకు వచ్చిన జనాలకు మా ఖిలా వరంగల్ సరిపోలె. ఎక్కడోల్లను అక్కడ అరెస్ట్ చేసినా వచ్చిండ్రు. ఎవరో నక్సలైట్ అట, చిన్న పిల్లగాడేనట, బలే తెలివికల్లోడట అని అనుకుంట జనాలు వచ్చిండ్రు. పద్దెనిమిది నిండి పందొమ్మిది పడగానే చంపేసిండ్రు.

కాగడాగా వెలిగిన క్షణం... అమరుడు యెం యెస్ ఆర్ కోసం ... నారాయణ స్వామి

ఎంత ప్రాణం శ్రీనుది బక్క పలుచగా ఉండేటోడు – ఎక్కడన్న సరిగ్గా తిన్నడో లేదో శరీరం లో బలం సత్తువ ఉన్నదో లేదో – ఆ దుర్మార్గులు పట్టుకొని చిత్రహింసలు పెడుతుంటే ఆ లేత శరీరం ఎంత గోస పడిందో ఎంత హింసకు గురైందో ఎంత అల్లల్లాడిందో – ఆ క్రూరులు చంపేయ్యబోతుంటే, చివరికి మేఘే ఢాకా తార లో సుప్రియ అరిచినట్టు నాకు బతకాలని ఉంది నాకు చావాలని లేదు నాకు బతకాలని ఉంది....

ఉత్తేజకరంగా సాగిన విరసం సాహిత్యపాఠశాల‌

అంతకుముందు అంతర్జాతీయ శ్రామికవర్గ పతాకావిష్కరణతో కార్యక్రమాలను ప్రారం భించారు. అమరుడు పులి అంజన్న తల్లి సైదమ్మ ఎర్ర జెండాను, సీనియర్ విరసం సభ్యురాలు రత్నమాల విప్లవ రచయితల సంఘం జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా అమరుడు శేషయ్య సోదరుడు సాంబయ్య, అమరుడు వివేక్ తండ్రి యోగానంద్ అమరుల స్థూపాన్ని ఆవిష్క రించారు.

ʹఅరుణోదయʹ పై పోలీసుల దాడిని ఖండించిన విరసం

తెలంగాణ ఉద్యమంలో ఆట పాటతో ఆరుణోదయ కళాకారులు గ్రామ గ్రామాన తిరిగి ప్రజల్లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని రగిలించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తమ వంతు కృషి చేశారు. ఆ సంస్థ కార్యాలయాన్ని దౌర్జన్యంగా మూసేయడం అత్యంత నిరంకుశమైన......

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


కామ్రేడ్