include 'men';
?>
సాహిత్యం ద్వారా దండకారణ్యంలో వర్గపోరాట పరివర్తనా క్రమాన్ని చెప్పిన నర్మద -పాణి
10-04-2022
సుప్రసిద్ధ విప్లవ కథా రచయిత్రి నిత్య(నర్మద, నిర్మల) శనివారం ఉదయం మహారాష్ట్రలో చనిపోయింది. జూన్ 12, 2019 న తన సహచరుడు కిరణ్ తో పాటు హైదరాబాదులో అరెస్టయినట్లు పత్రికల్లో వచ్చింది. కాన్సర్ తో బాధపడుతున్న నర్మద వైద్యం కోసం వచ్చి అరెస్టయింది. అప్పటి నుంచి మహారాష్ట్ర జైలులో ఉన్నది. ఆరోగ్యం విషమించడంతో చికిత్స పొందుతూ మరణించింది.
నిత్య చాలా కొద్ది కథలే రాసింది. అందులో చాయ్గ్లాస్ ఆమె ప్రాతినిధ్య కథ. నిజానికి అది దండకారణ్య సాహిత్యంలోనే పేరెన్నకగన్నది. చలనాన్ని, మార్పును అత్యంత కళాత్మకంగా, ప్రతిభావంతంగా చిత్రించిన కథ అది. మార్క్సిస్టు మేధావి ముదునూరి భారతి గారు సాహిత్యంలో సమాజ చలనాన్ని విశ్లేషించిన ఒక పత్రంలో నిత్య రాసిన చాయ్ గ్లాస్ను ఒక ఉదాహరణగా తీసుకున్నారు. ఎందరో సామాజిక పరిశీలకులు దండకారణ్యంలో వర్గపోరాట పరివర్తనా క్రమాన్ని చెప్పడానికి చాయ్గ్లాస్ కథను సాహిత్య సాధనంగా తీసుకున్నారు.
సాహిత్యంలో శిల్ప చర్చ చేయడానికి కూడా సాహిత్య విమర్శకులు ఆ కథను ఉదాహరణగా చెబుతారు. భారతదేశంలోనే అతిపెద్ద మహిళా ఉద్యమం దండకారణ్యంలో సాగుతున్నది. దానికి నాయకత్వం వహిస్తున్నది దండకారణ్య క్రాంతికారీ మహిళా సంఘం. దాని నాయకురాలు కా. నర్మద.
విప్లవోద్యమమే కళాభరితం. అందునా పితృస్వామ్యానికి వ్యతిరేకంగా మహిళ భాగస్వామ్యం దాన్ని మరింత సౌందర్యాత్మకం చేస్తుంది. నర్మదలాంటి మహిళల నాయకత్వంలో.. విప్లవ, విప్లవ కథా నిర్మాణం కూడా ఒక కొత్త కళాత్మక ప్రపంచాన్ని దండకారణ్యంలో రూపుగట్టిస్తున్నాయి.
దండకారణ్య మహిళా రచయిత్రలు నైనా, సుజాత కథలతోపాటు నిత్య కథలను కూడా కలిపి విరసం సామాన్యుల సాహసం అనే సంకలనం గతంలో అచ్చేసింది. ఆ పుస్తకం వచ్చాక నర్మద చాయ్గ్లాస్ పాఠకులకు మరింతగా అందుబాటులోకి వచ్చింది.
ఆమె కథలకంటే ఎక్కువగా వ్యాసాలు రాసింది. అంతకంటే ఎక్కువగా పితృస్వామ్య వ్యతిరేకంగా మహిళా ఉద్యమం ఎలా ఉండాలో నిర్మించి చూపించింది. ఆమెకు నివాళి.
పాణి
Keywords : narmada, nirmala, cpi maoist, virasam, pani, martyr,
(2024-04-19 22:00:08)
No. of visitors : 810
Suggested Posts
0 results
| కేసీఆర్ కుటుంబానికి చెందిన అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్ |
| రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్ |
| నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు |
| 24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే ! |
| డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు |
| ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ |
| హుస్నాబాద్ స్తూపం స్థలాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక
|
| కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు |
| 5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన |
| ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా? |
| తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
|
| అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
|
| పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన |
| వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2) |
| వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1) |
| విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్ |
| హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ |
| అనారోగ్యంతో ఉన్న మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు |
| మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన |
| మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ ! |
| సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ |
| తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శన్ స్తూపావిష్కరణ |
| గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది -మావోయిస్టు పార్టీ |
| గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం |
more..