include 'men';
?>
జనం పక్షాన నిలబడ్డవాడు దేశద్రోహి అయ్యాడా : ఉమర్ ఖలీద్ తండ్రి ఎస్క్యూఆర్ ఇల్యాసీ
ఉమర్ ఖలీద్ ఎక్కడున్నాడో పోలీసులకే తెలియాలి. టైమ్స్ నౌతో ఇంటర్వూ నుంచి వెళ్లేటప్పుడు చివరి సారి నేను ఉమర్తో మాట్లాడాను. ఇంటికి రమ్మని అడిగాను. కానీ తాను జేఎన్యూ వెళ్తానని చెప్పాడు. అప్పటి నుంచి ఉమర్తో మాకు ఎలాంటి కాంటాక్ట్ లేదు. ప్రస్థుతం దేశంలో నెలకొన్న వాతావరణం నేపథ్యంలో ఉమర్ భద్రత పట్ల మాకు చాలా ఆందోళనగా ఉంది. ఇలాంటి స్థితిలో ఏ తల్లిదండ్రులకైనా ఖచ్చితంగా ఆందోళన ఉంటుంది. ప్రస్థుతం నేనలాంటి ఆందోళనలో ఉన్నాను.
నిజానికి ఉమర్ విషయంలో మీడియా తీసుకున్న వైఖరి చూసి నేను ఆందోళన చెందుతున్నాను. ఎలా తన వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారో? ఎలా తనని దేశ ద్రోహిగా చిత్రిస్తున్నారో? చూస్తే ఆందోళన కలుగుతోంది. ఏ మనిషి తన జీవితమంతా దేశం కోసం ఆలోచించాడో... ఏ మనిషి దళితుల కోసం, ఆదివాసీల కోసం నిలబడడ్డాడో... ఏమనిషి దేశం కోసం పనిచేయాలని విదేశీ స్కాలర్షిప్ ని సైతం వదులు కున్నాడో... ఏమనిషైతే పాస్పోర్ట్ కూడా తీసుకోలేదు.. ఇప్పుడా మనిషి పాకిస్తాన్కి వెళ్లాడని నిందలు వేస్తున్నారు. ఏ మనిషి దళితుల పక్షాన పోరాడుతున్నాడో... ఏ మనిషి రైతుల కోసం పోరాడుతున్నాడో... ఆదివాసీల జీవితాన్నే తన పరిశోధనాంశంగా ఎంచుకొని పీహెచ్డీ చేస్తున్నాడో... వాళ్ల సమస్యల్ని... వాళ్ల కష్టాల్ని ప్రపంచంముందుంచాలనుకున్నాడో.. అలాంటి మనిషిని దేశ ద్రోహి అంటున్నారు? అలాంటి మనిషి దేశం నుంచి పారిపోయాడంటున్నారు? అలాంటి మనిషి దేశద్రోహులతో కలిసిపోయాడంటున్నారు? ఆశ్చర్యకరంగా ఉంది. ఏ పనినైతే.. చట్టాలు.. న్యాయస్థానాలు చేయాలో ఆ పనిని మీడియా చేస్తోంది. మీడియానే విచారణ జరుపుతోంది. తీర్పులు చెబుతోంది.. ఉమర్ని దోషిగా చిత్రించేందుకు యత్నిస్తోంది. ఉమర్ పారిపోయేవాడైతే... తను దేశద్రోహే అయితే.. టీవీ ఛానల్కి వచ్చి తన అభిప్రాయాల్ని వ్యక్తం చేసేవాడా? చర్చించేవాడా?
అది... ఉమర్ ఖాలీద్ భాష కాదు.. అలాంటి మాటలు ఉమర్ మాట్లాడడు... అక్కడ చాలా మంది విద్యార్థులు ఉన్నారు. ఏబీవీపీ వాళ్లు ఉద్దేశ్య పూర్వకంగా అలాంటి నినాదాలిచ్చారని వీడియోలు రుజువు చేస్తున్నాయి. అయినా... ఉమర్ని టార్గెట్ చేయడం విషాదం. దేశంలో ద్వేషాన్ని పెంచుతున్నారు. భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. ఉమర్కి కాశ్మీర్ ప్రాంతంపై కాదు.. అక్కడి ప్రజలపై ప్రేమ. ఆ ప్రజల కష్ట నష్టాల పట్ల అతని ఆందోళన. వాళ్లను మనతో నిలుపుకోవాలని అతని తపన.
అఫ్జల్ గురు కేసు విషయంలో న్యాయ నిపుణులు, రాజకీయ ప్రముఖులెందరో తీర్పు పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. అలా మాట్లాడడం దేశానికి వ్యతిరేకంగా మాట్లాడడమే అయితే.. వాళ్లపై ఎందుకు విచారణ జరపలేదు. కానీ ఎందుకు ఇప్పుడు ఉమర్ని మాత్రమే చూపిస్తున్నారు? నినాదాలివ్వడం దేశ ద్రోహం కాదని న్యాయనిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వాటినేవీ పట్టించుకోకుండా... స్వయంగా తీర్పులు చెబుతున్నారు. ఉమర్ ఇక్కడి న్యాయ వ్యవస్థ నుంచి చట్టం నుంచి తప్పించుకు తిరగడం లేదు. ఎలాంటి వాతారణాన్ని సృష్టిస్తున్నారు. కొడతామంటున్నారు.. చంపుతామంటున్నారు. ఈ వాతారణం ఎవరినైనా ఆందోళనకు గురిచేస్తుంది.
నాకు ఈ దేశ న్యాయవ్యవస్థపై నమ్మకం ఉంది. ఉమర్ ఎక్కడ ఉన్నా బయటకు రావాలి. ఎవరు తప్పు చేశారో తేలాలి? ఎవరు దేశానికి వ్యతిరేకంగా పనిచేశారో వాళ్లని శిక్షించాలి. న్యాయవ్యవస్థను తేల్చనీయండి.
(న్యూస్ 24 ఇంటర్వ్యూలో జేఎన్యూ విద్యార్థి ఉమర్ ఖలీద్ తండ్రి ఎస్క్యూఆర్ ఇల్యాసీ అభిప్రాయాలు సంక్షిప్తంగా)
అనువాదం: క్రాంతి
Keywords : JNU, Umar Khalid, SQR Ilayasi, Hindutva, Avaninews,
(2024-03-16 01:23:13)
No. of visitors : 2521
Suggested Posts
| Solidarity with the women complainants of SRFTI,JNU in their fight against sexual harassmentOn behalf of JNUSU and undersigned organizations we extend our solidarity and revolutionary greetings to the women complainants of SRFTI Kolkata, who have been fighting against cases |
| మనిషిని వెతుక్కుంటూ అతను వెళ్ళి పోయాడు...విద్రోహి సాధారణ విద్యార్థి మాత్రమే కాదు.. అతనో కవి.. సాంస్కృతిక కార్యకర్త. క్యాంపస్ లోపల, బయట... ఎక్కడ ఏ పోరాటం జరిగినా అక్కడ ప్రత్యక్షమవుతాడు. కవితా ప్రవాహాన్ని వెంట మోసుకెళ్తాడు. అలుపెరగని ఆ కవితాఝురికి ʹబ్రెయిన్ డెడ్ʹ బ్రేక్ వేసింది....
|
| పోలీసుల దుర్మార్గం - విద్యార్థులు, ప్రొఫెసర్లపై దుర్మార్గమైన దాడి.. ఫోటోలు తీసిన మహిళా జర్నలిస్టుకు లైంగిక వేదింపులువిద్య ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా, విద్యార్థినులపై లైంగికవేధింపులకు పాల్పడుతున్న ప్రొఫెసర్ అతుల్ జోహ్రీని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ జేఎన్యూ విద్యార్థులు, ఉపాధ్యాయులు చేపట్టిన పార్లమెంట్ మార్చ్పై పోలీసులు దుర్మార్గంగా విరుచుకుపడ్డారు. |
| దేశద్రోహం కేసు : JNU విద్యార్థి నేతలపై చార్జ్ షీట్ తిరస్కరించిన కోర్టుజవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ (JNU) విద్యార్థి సంఘం మాజీ నాయకుడు కన్హయ్య కుమార్, ఉమర్ ఖలీద్, అనిర్బన్ భట్టాచార్య మరో ఏడుగురు కశ్మీరీ విద్యార్ధులపై రాజద్రోహం కేసులో ఢిల్లీ పోలీసులు దాఖలు చేసిన చార్జ్ షీట్ ను కోర్టు తిరస్కరించింది. |
| జేఎన్యూ పై మళ్ళీ ఎర్రజెండా రెపరెపలు... విద్యార్థి సంఘం ఎన్నికల్లో లెఫ్ట్ ఘనవిజయంఢిల్లీ జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీపై మళ్ళీ లెఫ్ట్ ఫ్రంట్ తన జెండా ఎగిరేసింది. పాలకుల మద్దతుతో సంఘీల విద్యార్థి సంఘం ఏబీవీపీ చేసిన కుట్రలను ఓడించిన జేఎన్యూ విద్యార్థులు మళ్ళీ SFI, DSF, AISA, AISF లతో కూడిన లెఫ్ట్ ఫ్రంట్ నే గెలిపించారు. |
|
JNUపై 50 మంది ముసుగులు ధరించిన గూండాల దాడి,విద్యార్థులు,ప్రొఫెసర్లకు తీవ్ర గాయాలు - ఇది ఏబీవీపీ పనే అని విద్యార్థుల ఆరోపణఢిల్లీలోని జవహర్ లాల్ యూనివర్సిటీలోకి చొరబడి 50 మంది ముసుగులు ధరించిన గూండాలు జేఎన్యూ విద్యార్థులపై, ప్రొఫెసర్లపై రాడ్లతో, కర్రలతో, రాళ్ళతో దుర్మార్గమైన దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో అనేక మంది తీవ్ర గాయాలయ్యాయి. |
| Proud of Kanhaiya, Khalid, Anirban, says Prof Saibaba ʹI am proud of my students Kanhaiya Kumar, Umar Khalid and Anirban Bhattacharya, who are striving for the people of the countryʹ beamed alleged naxal think-tank Prof G N Saibaba... |
| A Statement by Umar Khalid and Anirban Bhattacharya in the context of the Chargesheet the people of the country have been dealing with these sanghi Thugs of Hindustan long enough now. Itʹs been five years, nearly. They know by now that it would be raining lies as it gets closer to the elections |
| ʹఈ రోజు నా కూతురిపై దాడి జరిగింది... రేపు మీ పైనా జరుగుతుందిʹʹఈరోజు నా కూతురిపై దాడి జరిగింది. రేపు మిమ్మల్ని కూడా కొడతారు. నాపై కూడా దాడి జరగొచ్చు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రమాదకర పరిస్థితులు పొంచి ఉన్నాయి. మాకు చాలా భయంగా ఉందిʹ అంటూ జేఎన్యూ విద్యార్థి సంఘం అధ్యక్షురాలు ఆయిషీ ఘోష్ తండ్రి ఆందోళన వ్యక్తం చేశారు. |
| మీడియా దుర్నార్గం: జేఎన్యూ విద్యార్థి ఐసిస్ సింపతైజర్ అని మొదటిపేజీలో.. అది ఫేక్ న్యూస్ అని లోపలి పేజీల్లో..మీడియా ద్వారా సంఘ్ పరివారం మరో నీచమైన కుట్రకు తెరలేపింది. నజీబ్ వ్యక్తిత్వ హననానికి పాల్పడింది. జీ టీవీ , టైమ్స్ ఆఫ్ ఇండియా మరికొన్ని మీడియా సంస్థలు నజీబ్ గురించి అబద్దపు కథనాలు ప్రచురించి బురదచల్లే ప్రయత్నం చేశాయి. లేని పోలీసు రిపోర్ట్ ను ఉన్నట్టు నమ్మించే ప్రయత్నం చేశాయి.... |
| కేసీఆర్ కుటుంబానికి చెందిన అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్ |
| రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్ |
| నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు |
| 24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే ! |
| డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు |
| ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ |
| హుస్నాబాద్ స్తూపం స్థలాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక
|
| కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు |
| 5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన |
| ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా? |
| తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
|
| అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
|
| పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన |
| వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2) |
| వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1) |
| విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్ |
| హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ |
| అనారోగ్యంతో ఉన్న మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు |
| మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన |
| మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ ! |
| సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ |
| తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శన్ స్తూపావిష్కరణ |
| గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది -మావోయిస్టు పార్టీ |
| గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం |
more..