గోడు వెళ్ళబోసుకున్న అన్నదాత - ఆత్మహత్య చేసుకోమన్న కేంధ్రమంత్రి

గోడు

అప్పుల బాధతో దేశంలో రోజుకు సగటున 46 మంది రైతులు తనువు చాలిస్తున్నారు. కానీ పాలకులు మాత్రం రైతుల పట్ల చాలా నిర్లక్ష్యంగా, కించపర్చే ధోరణిలో వ్యవహరిస్తున్నారు. ఆత్మహత్య ఫ్యాషనైందని ఒకరంటే, తాగు డు వల్లే రైతులు చనిపోతున్నారని మరొక రంటున్నారు. తాజాగా ఓ కేంద్ర మంత్రి మరో అడుగు ముందుకు వెళ్లి, తన గోడు చెప్పుకుంటున్న ఓ రైతును ʹవెళ్లి చావు పోʹ అని కసురుకున్న దిగ్భ్రాంతికరమైన సంఘటన రాజస్థాన్‌లోని టోంక్‌లో జరిగింది. కేంధ్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి సంజీవ్‌ బలియాన్‌ భారతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థ సోమ వారం ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చారు. ఆ కార్యక్రమానికి వచ్చిన గిరిరాజ్‌ జాట్‌ అనే రైతు లేచి మంత్రి ముందు తన గోడు వెళ్లబోసుకోసాగాడు. కరెంటు తీగలు తెగిపోవడంతో తమ గ్రామం అరనియా కాకడ్‌లో గత 15 రోజులుగా కరెంటు సరఫరా లేదని, నీళ్లు లేక తన తోటలోని పండ్ల చెట్లు ఎండిపోయాయని చెప్పాడు. వ్యవసాయ మంత్రి సహాయం అందించకపోతే తాను ఆత్మహత్య చేసుకోవాల్సి వస్తుందని గిరిరాజ్‌ ఆవేదన వెల్లబుచ్చాడు. దాంతో మంత్రి గారికి కోపం నషాలానికెక్కింది. ʹవెళ్లు, ఆత్మహత్య చేసుకో పోʹ అని విసురుగా మాట్లాడారు. మంత్రి జవాబుతో అక్కడున్న అధికారులు కూడా విస్మయానికి లోనయ్యారు. ఆ తర్వాత అధికారులు హడావుడిగా గిరిరాజ్‌ను అక్కడి నుంచి దూరంగా తీసుకెళ్లారు. మంత్రి జవాబుతో ఆ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన టోంక్‌ ప్రాంత రైతులకు తమకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అందదనే విషయం అర్థమైంది. ఈ వ్యవహారంతో నిరాశకు లోనైన పరమేశ్వర్‌ గుర్జర్‌ (45) అనే రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పరమేశ్వర్‌ కూడా సోమవారం జరిగిన కార్యక్రమానికి హాజరైన వాడే. ఈ మధ్య పడ్డ వడగళ్ల వానతో అతని పంట దెబ్బతిన్నదని మృతుడి కుటుంబ సభ్యులు చెప్పారు. అప్పుల భారం విపరీతంగా పెరిగిపోవడమే అతని ఆత్మహత్యకు కారణమని వారన్నారు. స్వయంగా కేంద్ర వ్యవసాయ మంత్రికే రైతుల గురించి పట్టింపు లేనప్పుడు రైతులకు దిక్కేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి మాటలతో తాను తీవ్రంగా బాధపడ్డట్టుగా పరమేశ్వర్‌ తమతో చెప్పాడని కూడా వారన్నారు. సోమవారం నాటి మంత్రి వ్యాఖ్యల తర్వాతే ఆయనీ నిర్ణయం తీసుకొని ఉండొచ్చని వారు అనుమానం వ్యక్తం చేశారు.

Keywords : Central Minister, Sanjeev Baliyan, Rajasthan, agriculcher minister, Farmer,
(2024-04-15 06:20:57)



No. of visitors : 1497

Suggested Posts


ఈ డెడ్ బాడీలు ఉగ్రవాదులవే...ఫేక్ ఫోటోలతో అబద్దపు ప్రచారం...

ఇక నిన్న సాయంత్రం నుండి కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో ప్రచారంచేశారు. వాట్సప్, ఫేస్ బుక్ ల్లో ఆ ఫోటోలను విస్త్రుతంగా ఇప్పటికీ ప్రచారం చేస్తున్నారు. కొందరు అమాయకంగా నమ్మి షేర్లు చేస్తుండగా మరి కొందరు కావాలనే ఈ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. ధ్వంసమైన ఇళ్ళు, వందలాది శవాలు, శవ ఊరేగింపు , శవాల మూకుమ్మడి ఖననం మొదలైన ఫోటోలున్నాయి.

బీజేపీ గెలుపుకు ఎమ్ ఐ ఎమ్ సహాయం ?

బీహార్ లో బీజేపీ గెలవాలనిఎమ్ ఐ ఎమ్ కోరుకుంటుందా ? తాను 40 సీట్లకు పోటీ చేయడం ద్వారా కాంగ్రెస్, జేడీయూ,ఆర్జేడీ ల ఓట్లను చీల్చి బీజేపీ గెలుపుకు మార్గం సుగుమం చేస్తోందా ? అవుననే అంటున్నాయి....

Congress, BJP, CPI(M) join hands in Sikkim

Setting aside ideological differences, the Congress, the BJP and the CPI (M) have joined hands in Sikkim to fight Chief Minister Pawan Kumar Chamlingʹs Sikkim....

బీజేపీకి ఓటు వేయకండంటూ లేఖ రాసి ఆత్మహత్య చేసుకున్న‌ రైతు !

ʹబీజేపీకి ఓటు వేయకండి..మళ్ళీ ఆ పార్టీకే ఓటు వేస్తే అందరినీ టీ అమ్ముకునేలా చేస్తుందిʹ అని సూసైడ్ లెటర్ రాసి ఓ వృద్ద రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఉత్తరాఖండ్ హరిద్వార్‌ జిల్లాకు చెందిన

విద్వేష‌ రాజకీయాలను ఓడించండి - 200 పైగా రచయితల విఙప్తి

ప్రముఖ రచయితలు అరుంధతీరాయ్, ఆనంద్ తేల్తుంబ్డే, రొమిల్లా థాపర్, గిరీష్ కర్నాడ్, ఓల్గా, నయనతార సెహగల్, కేఎన్ పణిక్కర్ వంటి 210 మంది రచయితలు దేశ రాజధాని ఢిల్లీలో సమావేశమై ఓ ప్రకటన విడుదల చేశారు.

కలిసి పోటీ చేద్దాం - కాంగ్రెస్ కు బీజేపీ పిలుపు

జాతీయ స్థాయిలో బద్ద శతృవులుగా ఉన్న బీజేపీ,కాంగ్రెస్ పార్టీలు కలిసి పోటీ చేయడమా ! ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. కలిసి పోటీ చేద్దాం రమ్మంటూ బీజేపీ కాంగ్రెస్ ను పిలిచింది....

BJP Worker Avinash Kumar Das Shot Dead In Patna: CCTV Footage

Avinash Kumar was out for a morning walk near Daldali Road when he was shot dead at about 7 am. The CCTV camera at a nearby temple was an eyewitness to the ghastly crime.....

ఎంఐఎంకు బీజేపీ ఆర్థిక సహాయం - రాజ్ థాక్రే

ఎంఐఎంకు బీజేపీ ఆర్థిక సహాయం అందిస్తున్నదని మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధ్యక్షుడు రాజ్ థాక్రే ఆరోపించారు. ఇతర పార్టీల ఓట్లు చీల్చి తాను లాభపడటం కోసం బీజేపీ.. ఎంఐఎం ను పావుగా వాడుతోందని....

యువతులగురించి నీచంగా మాట్లాడిన‌ బీజేపీ ఎంపీ

ఛత్తీస్‌గఢ్‌లోని కోబ్రా పార్లమెంటు నియోజక వర్గం ఎంపీ బన్సీలాల్‌ మహతో యువతులు, బాలికల గురించి జుగుస్సాకరంగా మాట్లాడాడు, బాలికలపై ఆయన చేసిన లైంగిక వ్యాఖ్యలు ఇప్పుడు పెనుదుమారం రేపుతున్నాయి.....

బీజేపీ అధిష్ఠానంపై పార్టీ అగ్రనేతల ఫైర్

బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమికి బాధ్యులెవరో తేల్చాలంటూ ఆ పార్టీ అగ్ర నేతలు ఎల్‌కే అద్వానీ, మురళీమనోహర్ జోషి, శాంతకుమార్, యశ్వంత్ సిన్హా మంగళవారం రాత్రి ఓ ఉమ్మడి....

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


గోడు