include 'men';
?>
ఆ నిండైన సాహిత్య సామాజిక జీవితం రచయితలందరికీ ఆదర్శం - విరసం
(ప్రముఖ రచయిత్రి మహా శ్వేతా దేవి కి విప్లవ రచయితల సంఘం నివాళులు)
ʹరచయితలందరూ తమ తరానికి జవాబుదారులు; తమకు తాము జవాబు చెప్పుకోవాల్సిన వాళ్ళు... అంతస్సాక్షి ఉన్న రచయిత పీడిత ప్రజల పక్షాన దృఢంగా నిలవాలి.
అలా కాకపోతే ఆ రచయితల్ని నిర్దోషులుగా నిర్ణయించే ప్రశ్నే లేదు.ʹ
ʹనేను అభాగ్యుల పక్షాన నిలబడి నా శాయశక్తులా కలంతో పోరాటం
కొనసాగిస్తున్నాను. ఆవిధంగా నాకు నేను సంజాయిషీ చెప్పుకోవలసి వస్తే తల
దించుకోవలసిన అగత్యం ఏనాడూ కలగబోదుʹ
-మహాశ్వేతాదేవి
మహశ్వేతాదేవి (జనవరి 14, 1926- జులై 28, 2016) రచయితగా సమాజానికి అట్లా
బాధ్యత పడి, సామాజిక కార్యకర్తగా కూడా ప్రజల పక్షాన, ప్రజా పోరాటాల
పక్షాన జీవితమంతా దృఢంగా నిలిచారు. విప్లవ రచయితల సంఘం ఆమెకు వినమ్రంగా
జోహార్లర్పిస్తున్నది. ముఖ్యంగా రైతుకూలీల, ఆదివాసుల పక్షాన ఆమె
శక్తివంతమైన కలాన్ని నిలిపి వారి పోరాటాలకు మద్దతు తెలిపిన ఆమె ఆచరణను
గొప్పగా గుర్తుచేసుకుంటున్నది. ప్రభుత్వ కార్పొరేట్ అనుకూల ఆర్థిక
విధానాలకు వ్యతిరేకంగా, పచ్చని పంట పొలాల్ని అన్నం పెట్టే రైతుల నుండి
లాగేసుకుంటున్న విధానాన్ని ఆమె కడ వరకు నిరసించారు. ఇటీవలి ప్రజా
సంచలనాలు సింగూరు, నందిగ్రామ్, లాల్ గఢ్ పోరాటాలకు బాసటగా నిలిచారు.
రాజ్యహింసపై ఆగ్రహాన్ని ప్రకటించారు.
ఆమె అసంఖ్యాక రచనలు నిండైన సాహితీ జీవితాన్ని, నిబద్ధ సామాజిక
దృక్పథాన్ని, నిజాయితీని తెలియజేస్తాయి. ఆమె రచనల్లో, బహుశా ఆమె సామాజిక
జీవితంలోనే ʹహజర్ చురాషిర్ మాʹ (తెలుగులోకి ఒక తల్లి పేరుతో అనువాడమైంది)
ఒక కీలక మలుపు. అందులోని ప్రధాన ప్రాత్ర సుజాత మధ్యతరగతి సాంసారిక,
సంకుచిత పరిధి నుండి విశాల సమాజం వైపు తలుపు తెరిస్తుంది. కలకత్తా
వీధుల్లో విప్లవ విద్యార్థుల నెత్తురు ఏరులుగా పారిన డెబ్బైల రోజులవి.
తన బిడ్డ ఎవరికోసమైతే ప్రణమిచ్చాడో ఆ పీడిత సమూహంలో ఒక వాస్తవిక
జీవితాన్ని ఆ పాత్ర ఆవిష్కరించుకుంటుంది. మహాశ్వేతాదేవి పీడిత ప్రజల
జీవితాల్లోకి, వారిని దోపిడి పీడనలకు, సకల అణచివేతలకు కారణమైన సామాజిక
మూలాల్లోకి ప్రవేశించింది. ఆమె రచనా ప్రపంచం నిండా మహిళలు, దళితులు,
ఆదివాసీలు అనేక విధాల బాధా సర్పద్రష్టులుంటారు. వారు పీడితులే కాదు,
పోరాటకారులు. సమాజాన్ని మార్చే శక్తి వారికే ఉంది. ʹబషాయి టుడుʹ లాగా
ఎన్ని సార్లు ʹఎన్ కౌంటర్ʹ చేసినా మళ్ళీ మళ్ళీ పుడుతూనే ఉంటారు. ఆ చరిత్ర
నిర్మాతల వెంట ఉన్న సాహిత్య సాంస్కృతిక సంపదనే ఆమె తన రచనలకు స్ఫూర్తిగా
తీసుకున్నది. అటు వంటి మూలవాసులది కాక ʹఎవరిదీ అడవిʹ అని ఆమెసూటిగా
ప్రశ్నిస్తుంది. వివిధ సమూహాల అనేకానేక అణచివేతల దుఃఖం, ఆగ్రహం,
సహానుభూతి, ఉద్యమ స్ఫూర్తిని నిండా నింపుకున్న ఆమె రచనలు ఎప్పటికీ నిలిచి
ఉంటాయి. ఆమె అమరత్వం నేడు ఆదివాసుల, దళితుల, మహిళలపై అమలవుతున్న
వ్యవస్తీకృత హింస, ఆధిపత్య హిందూ మతోన్మాద హింస, సామ్రాజ్యవాద నిరంకుశ
దళారీ దోపిడీ విధానాలు అమలుచేస్తున్న రాజ్యం ప్రజలపై చేసే యుద్ధం
వీటన్నిటినీ ప్రశ్నించమని చెబుతున్నది. శక్తి ఉన్నంతవరకూ ఆమె ఆదివాసుల
పక్షాన నిలిచి నిరసించిన ఆపరేషన్ గ్రీన్ హంట్ ను వ్యతిరేకించడం నేడు
రచయితల ముందున్న కర్తవ్యం. ఆ మహా రచయితకు మనమిచ్చే నివాళి.
మహాశ్వేతాదేవికి అరుణారుణ జోహార్లు
-వరలక్ష్మి
కార్యదర్శి, విరసం
Keywords : mahaswetha devi, virasam, writer, bengal, struggle
(2024-03-16 01:14:55)
No. of visitors : 3059
Suggested Posts
| కలకత్తాలో జరుగుతున్న చారుమజుందార్ శత జయంతి ఉత్సవాల్లో విరసం కార్యదర్శి పాణి స్పీచ్ నక్సల్బరీ లేకపోతే భారత పీడిత ప్రజానీకానికి విప్లవ దారే లేకుండా పోయేది. కమ్యూనిస్టు రాజకీయాలు చర్చించుకోవడానికే తప్ప వర్గపోరాట బాట పట్టకపోయేవి. ఆ నక్సల్బరీ దారిని చూపినవాడు చారు మజుందార్. విప్లవ పార్టీకి వ్యూహాన్ని, ఎత్తుగడలను ఒక సాయుధ పోరాట మార్గాన్ని చూపించిన వాడు చారు మజుందార్. |
| ఆదివాసి.. లంబాడా వివాదం - ఎం.రత్నమాలమహారాష్ట్ర ప్రభుత్వం లంబాడాలను ఆదివాసి తెగగా గుర్తించడం లేదు కనుక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లంబాడాలను ఆదివాసి షెడ్యూల్డు తెగగా ప్రకటించడంతో దీన్ని అవకాశంగా తీసుకుని మహారాష్ట్ర నుంచి ఆదిలాబాద్ (పాత) జిల్లాకు లంబాడాల వలసలు పెద్ద ఎత్తున వెల్లువలా సాగాయి..... |
| మహాశ్వేతా దేవి - మన తెలంగాణ సాగర హారంః వరవర రావుమన మహా సాగరహారం ʹచలో హైదరాబాద్ అంటూ తెలంగాణ మార్చ్ చేసిన సెప్టెంబర్ 30, 2012 మహత్తర మధ్యాహ్నం మహాశ్వేతాదేవి కూడా మన ఊర్లో ఉన్నారు. ఆ రోజు ఆమెను మన మధ్యకు తెచ్చుకొని ఉంటే.... |
| సెప్టెంబర్ 17 - ఇండియన్ యూనియన్ సైనిక దురాక్రమణ దినం - వరవరరావు1947 ఆగస్ట్ 15న విలీనానికి అంగీకరించకుండా షరతులు విధిస్తూ వచ్చిన నిజాంను నెహ్రూ - పటేల్ ప్రభుత్వం సగౌరవంగా, సాదరంగా చర్చలకు ఆహ్వానించింది. అప్పటికే నిజాంను వ్యతిరేకిస్తూ వీరోచిత పోరాటం నడుపుతున్న కమ్యూనిస్టులను మాత్రమే కాదు, కనీసం కాంగ్రెస్ ను కూడా ఈ చర్చల్లో భాగం చేయలేదు.... |
| అమరుడు బొజ్జా తారకం — ʹనది పుట్టిన గొంతుకʹ - వరవరరావుగోదావరి తెలంగాణలో ప్రవేశించిన నిజామాబాద్ కు 1968లో వచ్చిన తారకం గారు ఇక్కడి మట్టిలోని ఎరుపులోనూ, ఇక్కడి నీళ్లలోని ప్రవాహ గుణంలోనూ కలగలిసిపోయారు. 1968 నుంచి 78 దాకా ఒక దశాబ్దం పాటు విప్లవోద్యమాలకు, విప్లవ సాహిత్యానికి నిజామాబాద్ చిరునామా బొజ్ఞాతారకం.... |
| ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ పోరాటానికి విరసం మద్దతుఅట్టడుగున ఉన్న మనిషికి ఫలితాలు అందినప్పుడే సామాజిక న్యాయం జరిగినట్టు లెక్క. మాదిగ, డక్కలి, చిందు, మాష్టి, బుడగజంగం, దాసరి, బేగరి కులాలకు ఈ నాటికీ ఎస్సీ రిజర్వేషన్ ఫలాలు అందడం లేదు.... |
|
ʹఅన్నలు మల్లొస్తరు బిడ్డా.. ఆల్లొస్తే వాళ్ళకు గిన్ని మంచి నీల్లో, తిండో పెట్టాలనే బతుకుతాన్నʹఅందుకే అంత నిర్బంధంల కూడా నా కొడుకు అంత్యక్రియలకు వచ్చిన జనాలకు మా ఖిలా వరంగల్ సరిపోలె. ఎక్కడోల్లను అక్కడ అరెస్ట్ చేసినా వచ్చిండ్రు. ఎవరో నక్సలైట్ అట, చిన్న పిల్లగాడేనట, బలే తెలివికల్లోడట అని అనుకుంట జనాలు వచ్చిండ్రు. పద్దెనిమిది నిండి పందొమ్మిది పడగానే చంపేసిండ్రు. |
| కాగడాగా వెలిగిన క్షణం... అమరుడు యెం యెస్ ఆర్ కోసం ... నారాయణ స్వామిఎంత ప్రాణం శ్రీనుది బక్క పలుచగా ఉండేటోడు – ఎక్కడన్న సరిగ్గా తిన్నడో లేదో శరీరం లో బలం సత్తువ ఉన్నదో లేదో – ఆ దుర్మార్గులు పట్టుకొని చిత్రహింసలు పెడుతుంటే ఆ లేత శరీరం ఎంత గోస పడిందో ఎంత హింసకు గురైందో ఎంత అల్లల్లాడిందో – ఆ క్రూరులు చంపేయ్యబోతుంటే, చివరికి మేఘే ఢాకా తార లో సుప్రియ అరిచినట్టు నాకు బతకాలని ఉంది నాకు చావాలని లేదు నాకు బతకాలని ఉంది.... |
| ఉత్తేజకరంగా సాగిన విరసం సాహిత్యపాఠశాల
అంతకుముందు అంతర్జాతీయ శ్రామికవర్గ పతాకావిష్కరణతో కార్యక్రమాలను ప్రారం భించారు. అమరుడు పులి అంజన్న తల్లి సైదమ్మ ఎర్ర జెండాను, సీనియర్ విరసం సభ్యురాలు రత్నమాల విప్లవ రచయితల సంఘం జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా అమరుడు శేషయ్య సోదరుడు సాంబయ్య, అమరుడు వివేక్ తండ్రి యోగానంద్ అమరుల స్థూపాన్ని ఆవిష్క రించారు. |
| ʹఅరుణోదయʹ పై పోలీసుల దాడిని ఖండించిన విరసం తెలంగాణ ఉద్యమంలో ఆట పాటతో ఆరుణోదయ కళాకారులు గ్రామ గ్రామాన తిరిగి ప్రజల్లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని రగిలించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తమ వంతు కృషి చేశారు. ఆ సంస్థ కార్యాలయాన్ని దౌర్జన్యంగా మూసేయడం అత్యంత నిరంకుశమైన...... |
| కేసీఆర్ కుటుంబానికి చెందిన అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్ |
| రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్ |
| నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు |
| 24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే ! |
| డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు |
| ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ |
| హుస్నాబాద్ స్తూపం స్థలాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక
|
| కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు |
| 5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన |
| ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా? |
| తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
|
| అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
|
| పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన |
| వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2) |
| వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1) |
| విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్ |
| హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ |
| అనారోగ్యంతో ఉన్న మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు |
| మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన |
| మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ ! |
| సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ |
| తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శన్ స్తూపావిష్కరణ |
| గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది -మావోయిస్టు పార్టీ |
| గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం |
more..