include 'men';
?>
తెలంగాణ ఆత్మగౌరవం...ఎన్టీఆర్ అవార్డు -ఎన్.వేణుగోపాల్
ప్రభుత్వాలు ఇచ్చే అవార్డుల మీద పెద్దగా గౌరవం లేనివాణ్ని. అత్యవసరమైతే తప్ప తెలంగాణ ప్రభుత్వ విధానాల మీద మాట్లాడగూడదని, భక్తుల నోట్లో నోరు పెట్టగూడదని నిర్ణయించుకుని చాలరోజులయింది. కాని మహాఘనతవహించిన తెలంగాణ ప్రభుత్వం సినిమారంగానికి అవార్డులు ఇవ్వబోతున్నదని, వాటిలో ప్రధానమైన అవార్డు ఎన్టీ రామారావు పేరు మీద ఇవ్వబోతున్నదని విని నిస్సహాయ ఆగ్రహంతో రాస్తున్నాను. ఇంత క్రూర పరిహాసం మీద ఒక్క మాటయినా మాట్లాడకపోవడం తెలంగాణ బిడ్డగా చేయగూడని ద్రోహమని భావించి, ఈ రెండు ముక్కలు రాస్తున్నాను. ఒక అనుభవం పంచుకుంటున్నాను. తెలంగాణ ప్రభుత్వం చేసే ప్రతి పనీ మంచిదేనని వందిమాగధ స్తోత్రాలు పఠించేవాళ్లు ఇది చదవనక్కరలేదు. మీ పని మీరు చూసుకోవచ్చు.
ఎన్టీ రామారావు మొదటి ఏడాది పాలన అలా ఉంచి, ఆ తర్వాతి ఐదు సంవత్సరాల పాలన, మళ్లీ ఏడాది పాలన తెలంగాణకు చీకటి రోజులు. అలా రెండోసారి ఎన్నికైన తర్వాతనే ఆయన ఆంధ్రప్రదేశ్ లో ʹఆట-పాట-మాట బంద్ʹ అని ప్రకటించి తెలంగాణలో రాజ్యాంగ ప్రాథమిక హక్కులను రద్దు చేశాడు. వారానికి రెండు ఎన్ కౌంటర్లలో వందలాది మంది తెలంగాణ బిడ్డలను చంపించాడు. తెలంగాణ భూమినీ, నీటినీ, వనరులనూ కొల్లగొట్టే బహిరంగ, రహస్య విధానాలు ఎన్నో అమలు చేశాడు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని అవమానపరిచే ప్రత్యక్ష, పరోక్ష చర్యలు ఎన్నో చేశాడు. తెలంగాణ ప్రజలకు కాసు బ్రహ్మానందరెడ్డి, జలగం వెంగళరావు, నారా చంద్రబాబు నాయుడు, వై ఎస్ రాజశేఖర్ రెడ్డి, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఎంత శత్రువులో ఎన్టీ రామారావు అంతకు సమానమైన, లేదా ఇంకా ఎక్కువ శత్రువు. అందుకే తెలంగాణ ఉద్యమ సమయం అంతటిలోనూ ప్రజలు, రాజకీయ నాయకులు కూడ ఎన్టీ రామారావు పట్ల ఆగ్రహం ప్రదర్శించారు. చివరికి తెలంగాణ ఏర్పడిన కొత్తలో శంషాబాద్ విమానాశ్రయంలో దేశీయ విభాగానికి ఎన్టీ రామారావు పేరు పెట్టాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేసినప్పుడు స్వయంగా కె చంద్రశేఖర రావు కూడ "పరాయి రాష్ట్రం వాడి పేరు మాకెందుకు" అన్నారు.
ఇక్కడ నా అనుభవం ఒకటి పంచుకోవాలి. 2011 మొదట్లో అప్పటి ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ లో ఒక పెద్ద తెలంగాణ బహిరంగ సభ జరిగింది. ఆ సభ జరిగిన ప్రభుత్వ జూనియర్ కాలేజి గ్రౌండ్స్ కు అంతకు ముందునుంచే ఎన్టీ రామారావు స్టేడియం అని పేరు ఉంది. దాదాపు స్థానిక రాజకీయ నాయకులందరూ కూడ పాల్గొన్న ఆ సభలో నేను ఒక వక్తను. నేను మాట్లాడుతూ నా వెనుక బానర్ మీద ఎన్ టి రామారావు స్టేడియం అనేది చూపుతూ, "ఇదే నిర్మల్ లో మన వనరుల మీద మన అధికారం కోరుతూ బ్రిటిష్ వ్యతిరేకంగా పోరాడిన రాంజీ గోండును ఆయనతో పాటు మరెందరో యోధులను ఉరి తీశారు. ఆ ఉరుల మర్రి నిన్న మొన్నటిదాకా ఉండేది. ఇక్కడ ఏదైనా ఉంటే రాంజీ గోండు పేరు మీద ఉండాలి గాని ఎన్టీఆర్ పేరు మీద ఉన్నదంటే తెలంగాణ ఏం కోల్పోయిందో అర్థమవుతుంది" అన్నాను. (నిజానికి ఆ వేదికతో నాకు ఒక భావోద్వేగ అనుబంధం ఉంది. రాడికల్ విద్యార్థి సంఘం జిల్లా మహాసభల సందర్భంగా 1983 జనవరిలో నేను మొట్టమొదటి బహిరంగ సభ ఉపన్యాసం చేసింది ఆ వేదిక మీదనే. ఎన్టీ రామారావు అప్పుడప్పుడే ముఖ్యమంత్రి అయ్యాడో, కాబోతున్నాడో! ఆ సభకు వెళ్లే ముందే నేను ఫ్రీడం స్ట్రగుల్ ఇన్ హైదరాబాద్ సంపుటాలు చదివి రాంజీ గోండు పోరాటంతో ప్రభావితుణ్నయి ఉన్నాను. ఆ 1983 సభలో కూడ నేను రాంజీ గోండు గురించి మాట్లాడాను).
నా మాటలు ఇంకా అయిపోకముందే సభలోనుంచి కొందరు యువకులు వేదిక మీదికి పరుగెత్తుకొచ్చి, ఎన్టీ రామారావు స్టేడియం అనే బానర్ ను చింపేశారు. ఆ చర్యను సభ అంతా ఆమోదించింది. వేదిక మీద అప్పటికి తెలుగుదేశం పార్టీ నాయకుడిగా కూచుని ఉన్న ఎస్ వేణుగోపాలాచారి కోపంగా, నిరసనగా మాట్లాడకుండానే, పెద్దపెద్దగా అరుస్తూ వేదిక దిగిపోయాడు..ఆ సభలో కొన్ని వేల మంది ఉన్నారు గనుక ఎవరైనా మిత్రులు ఈ విషయాలు గుర్తు తెచ్చుకోగలరు...
ఆరు సంవత్సరాల తర్వాత ఆ ఎన్టీరామారావు పేరు మీద మన తెలంగాణ ప్రభుత్వం అవార్డు ప్రకటించనున్నది! ఆ వేణుగోపాలాచారి తెలంగాణ ప్రభుత్వం తరఫున ఢిల్లీలో రాయబారి!
నటుడుగా ఎంతో కొంత నేను కూడ అభిమానించే ఎన్టీఆర్ భాషలోనే చెప్పాలంటే, "ఔరా ఏమి విధి వైపరీత్యము"!!!!!
-ఎన్.వేణుగోపాల్, వీక్షణం ఎడిటర్, రచయిత
Keywords : ntr, kcr, telangana, n.venugopal, ntraward, nt ramarao, ktr, harishrao, latest news
(2024-01-29 21:11:30)
No. of visitors : 1719
Suggested Posts
| గూడ అంజన్నకు జోహార్లు !ʹఊరు మనదిరా.. ఈ వాడ మనదిరాʹ పాటతో అంజయ్యకు గుర్తింపు వచ్చింది. ఆయన రాసిన ఈ పాట తెలంగాణా ప్రతి పల్లె, ప్రతి ఇల్లు పాడుకుంది. ఆ పాట ప్రతి పల్లెలో సంఘం ఏర్పాటుకు మార్గమయ్యింది. ఈ ఊరు మనది... ఈ వాడ మనది.... దొర ఎవడురో అంటూ విప్లవకారుల నాయకత్వంలో తెలంగాణా పల్లెలు దొరల గడీల మీద... |
| విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్తెలంగాణను విముక్తి చేయడానికి వచ్చిందని చెప్పబడుతున్న సైన్యం 1948 సెప్టెంబర్18 నుంచి1951 అక్టోబర్ దాకా వేల మంది తెలంగాణ రైతుకూలీలను, పోరాటయోధులను కాల్చిచంపింది. నైజాం సైన్యాలు, రజాకార్లు చేసిన హత్యల కన్న, 1948 సెప్టెంబర్ తర్వాత కేంద్రప్రభుత్వ సైనిక బలగాలు చేసిన హత్యలు,అకృత్యాలు ఎక్కువ.... |
|
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్సెప్టెంబర్ 17, 1948 ని ʹహైదరాబాద్ విమోచన దినంʹ అని అభివర్ణిస్తే చరిత్ర మాత్రం ఫక్కున నవ్వుతుంది. ఏ ఒక్క చారిత్రక కోణం నుంచి చూసినా అది తెలంగాణ విమోచన కాదు. కావడానికి అవకాశం లేదు. ఎక్కువలో ఎక్కువ అది హైదరాబాద్ రాజ్యాన్ని భారత ప్రభుత్వ పాలన... |
| జైళ్ళలో పేదలే మగ్గుతున్నారు... ప్రజలకు పోలీసులతో ఎలాంటి లాభం లేదు... తెలంగాణ ఐపీఎస్ అధికారి
ʹభారత దేశం జైళ్ళలో 90 శాతం పేదలే మగ్గుతున్నారు. కొంతమందికి కనీసం ఎందుకు అరెస్ట్ అయ్యామో.. ఏ కేసులో అరెస్ట్ అయ్యి జైల్కు వచ్చామో కూడా తెలియదుʹʹ ఈ మాటలన్నది హక్కుల సంఘాల కార్యకర్తలు కాదు. కమ్యూనిస్టులు కాదు. మావోయిస్టులసలే కాదు. ఓ ఐపీఎస్ అధికారి ఈ మాటలు మాట్లాడారు. |
| కామ్రేడ్ మారోజు వీరన్న స్థూపాన్ని కాపాడుకుందాం - విరసంకామ్రేడ్ మారోజు వీరన్న స్మృతి చిహ్నాన్ని తొలగించాలని తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ప్రజల కనీస అవసరాలు తీర్చలేని పాలకులు విధ్వంసకర అభివృద్దిని శరవేగంగా ముందుకు తీసుకొనిపోతున్నారు.... |
| సమైక్య సభలో తెలంగాణను నినదించిన శ్రీనివాస్ గౌడ్ ను తెలంగాణ ప్రభుత్వం సస్పెండ్ చేసిందిసమైక్య గూండాల చేతుల్లో దెబ్బలు తిని నెత్తురోడుతూ కూడా జై తెలంగాణ అని నినదించిన చేగోను... లాఠీలతో చితకబాదుతున్నా... ఆగకుండా తెలంగాణను నినధించిన పోలీసు శ్రీనివాస గౌడ్ నుమర్చి పోగలమా ? తన నేల తల్లి విముక్తి కోసం ఉద్యోగాన్ని లెక్క చేయకుండా నినాదాలు చేసి.... |
| ʹనా భర్తను పోలీసులు కొట్టి చంపారుʹరాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట పోలీసులు కరీంనగర్ జిల్లా బావుపేటకి చెందిన వెంకటేశ్ ను దొంగతనం చేశాడనే పేరుతో అరెస్ట్ చేశారు. జులై 13 న కోర్టులో హాజరుపరచగా వెంకటేశ్ నుకోర్టు జ్యుడిషియల్ కస్టడికి ఆదేశించింది. ఆరోగ్యంబాగా లేదని చెప్పి వెంకటేష్ ను.... |
| ఉస్మానియా గుండె నిండా... ఈ దేశపు విప్లవ జెండాఉస్మానియాలో ఆరెస్యూ నాయకులైన రాంచందర్, మల్లోజుల కోటేశ్వర్ రావు, పటేల్ సుధాకర్, సంతోష్ రెడ్డి ఎలియాస్ మహేష్ , ఆ తర్వాత కాలంలో మావోయిస్టు పార్టీ నాయకత్వంలో ప్రత్యామ్నాయ రాజకీయాలతో భారత దేశంలో సాగుతున్న విప్లవానికి నాయకత్వం వహించినవారు... దేశ విప్లవంలో తమ ప్రాణాలను త్యాగం చేసిన మారోజు వీరన్న, దామోదర్ రెడ్డి, విజయ కుమార్, రామేశ్వర్ లు ఉస్మానియా... |
| మార్చ్13 ఎంఆర్పిఎస్ బంద్ ను విజయవంత చేయండి - మావోయిస్టు పార్టీ ప్రకటనఇరవయ్యేళ్లకు పూర్వమే ముఖ్యమంత్రి నివాసాన్ని లక్షలాది మందితో ముట్టడించడం మొదలు గాంధీభవన్ ముట్టడి, పెరేడ్ గ్రౌండ్స్లో మెరుపు సమ్మె, కలెక్టరాఫీసుల ముందు ధర్నాలు, పాలకవర్గాల ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా భారతీ మాదిగ స్మృతిలో ఊరేగింపు వంటి ఎన్నో మిలిటెంట్ ఉద్యమాలు నిర్వహించారు. |
| కెసిఆర్ రెండేళ్లపాలన - విద్యారంగం - వరవరరావు
ఒక తెలంగాణ కవి తెలంగాణ ప్రభుత్వాధినేతను గరుత్మంతునితో పోల్చాడు. చూపు బహు తీక్షణం అని, రెండు కండ్ల తార్మికుడని, ఈ గరుత్మంతుని ముక్కు అంత పెద్దదని ఎంత ఎత్తుకు ఎదిగినా గూడు లేని తెలంగాణ గుడ్డుమీదే ధ్యాస అని అభివర్ణించాడు. |
| కేసీఆర్ కుటుంబానికి చెందిన అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్ |
| రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్ |
| నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు |
| 24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే ! |
| డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు |
| ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ |
| హుస్నాబాద్ స్తూపం స్థలాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక
|
| కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు |
| 5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన |
| ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా? |
| తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
|
| అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
|
| పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన |
| వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2) |
| వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1) |
| విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్ |
| హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ |
| అనారోగ్యంతో ఉన్న మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు |
| మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన |
| మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ ! |
| సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ |
| తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శన్ స్తూపావిష్కరణ |
| గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది -మావోయిస్టు పార్టీ |
| గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం |
more..