పౌరహక్కుల సంఘం పత్రికా ప్రకటన.
14/11/2025
తెలంగాణ రాష్ట్రం ములుగు జిల్లా పస్రా వద్ద మూడు రోజుల కింద అరెస్ట్ చేసిన ఆజాద్ అశోక్ లను వెంటనే కోర్టులో హాజరుపరచాలి.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సీపీఐ (మావోయిస్టు) కార్యదర్శి కొయ్యడ సాంబయ్య ఎలియాస్ ఆజాద్ , గోదావరిఖని చెందిన సికాస ఆర్గనైజర్ అశోక్ లను ములుగు జిల్లా పసరా వద్ద మూడు రోజుల క్రితం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇంతవరకు కోర్టు ముందు వారిని ప్రవేశ పెట్టలేదు. వారిని చిత్రహింసలు గురి చేస్తున్నారని మాకు అనుమానాలు ఉన్నాయి .ఆ ఇద్దరికి ప్రాణ హాని ఉంది. తక్షణం ఆ ఇద్దరిని కోర్టు ముందు ప్రవేశపెట్టాలని పౌర హక్కుల సంఘం తెలంగాణ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తున్నది.
ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్, అధ్యక్షుడు
ఎన్ నారాయణరావు,కార్యదర్శి
పౌరహక్కుల సంఘం
తెలంగాణ రాష్ట్ర కమిటీ

తెలంగాణలో ఉద్యమకారులకు NIA నోటీసులు
పాట్నా జైలులో CPI(మావోయిస్టు) పోలిట్బ్యూరో సభ్యుడు ప్రమోద్ మిశ్రా ఆమరణ నిరాహార దీక్ష
‘అప్రతిహత’ విప్లవ గాథ – ముసాఫిర్
అరెస్టును లొంగుబాటుగా చూపించడంలో మర్మమేంటి?
తల్లికి మావోయిస్టు పార్టీ నాయకుడు పాక హనుమంతు @ గణేష్ లేఖ
ఏ మార్గాన్ని అనుసరించాలి? 