పౌరహక్కుల సంఘం పత్రికా ప్రకటన.
14/11/2025
తెలంగాణ రాష్ట్రం ములుగు జిల్లా పస్రా వద్ద మూడు రోజుల కింద అరెస్ట్ చేసిన ఆజాద్ అశోక్ లను వెంటనే కోర్టులో హాజరుపరచాలి.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సీపీఐ (మావోయిస్టు) కార్యదర్శి కొయ్యడ సాంబయ్య ఎలియాస్ ఆజాద్ , గోదావరిఖని చెందిన సికాస ఆర్గనైజర్ అశోక్ లను ములుగు జిల్లా పసరా వద్ద మూడు రోజుల క్రితం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇంతవరకు కోర్టు ముందు వారిని ప్రవేశ పెట్టలేదు. వారిని చిత్రహింసలు గురి చేస్తున్నారని మాకు అనుమానాలు ఉన్నాయి .ఆ ఇద్దరికి ప్రాణ హాని ఉంది. తక్షణం ఆ ఇద్దరిని కోర్టు ముందు ప్రవేశపెట్టాలని పౌర హక్కుల సంఘం తెలంగాణ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తున్నది.
ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్, అధ్యక్షుడు
ఎన్ నారాయణరావు,కార్యదర్శి
పౌరహక్కుల సంఘం
తెలంగాణ రాష్ట్ర కమిటీ

ఆపరేషన్ కగార్ కు వ్యతిరేకంగా జర్మనీ,టర్కీ లలో కార్యక్రమాలు
Comrade Thota Seetharamaiah – An Unsung Hero of the Indian Revolution
కామ్రేడ్ తోట సీతారామయ్య – భారత విప్లవంలో ఓ అన్సంగ్ హీరో!
Global Solidarity Call to EndState Militarization and Extrajudicial Killings in Resource-RichAdivasi Regions in India
హిడ్మాను పట్టించింది ఆ నలుగురే – మావోయిస్టు పార్టీ ప్రకటన
కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, మురళిల అమరత్వం… గణపతి స్మారకోపన్యాసం 