ఎన్కౌంటరే జరగలేదు..మావోయిస్టులు చనిపోలేదు ‍- మావోయిస్టు పార్టీ ఆడియో ప్రకటన‌


ఎన్కౌంటరే జరగలేదు..మావోయిస్టులు చనిపోలేదు ‍- మావోయిస్టు పార్టీ ఆడియో ప్రకటన‌

చత్తీస్గడ్ రాష్ట్రం సుకుమా జిల్లాలో తాము చేపట్టిన మూడురోజుల ఆపరేషన్ లో 20 మంది మావోయిస్టులు చనిపోయారని దంతెవాడ CRPF ఐజీ చేసిన ప్రకటన‌ అసత్యమని తేలిపోయింది. కొద్ది రోజుల క్రిత‍ం మావోయిస్టుల దాడిలో 20 మంది CRPF జవాన్లు చనిపోయిన నేపథ్యంలో ఈ దాడి జరిగిందని పోలీసులు ప్రతీకారం తీర్చుకున్నారని మీడియా మంగళవారంనాడు హోరెత్తించింది. అయితే అదంతా అసత్యమని అలాంటి ఎన్కౌంటరే జరగలేదని, మావోయిస్టులు ఎవ్వరూ చనిపోలేదని మావోయిస్టు పార్టీ దండకారణ్య కమిటీ ప్రకటించింది. తమ దాడిలో మనో స్థైర్యం కోల్పోయిన పోలీసుల కోసం సీఆర్‌ఫీఎఫ్ ఈ నాటకం ఆడుతుందని ఆ పార్టీ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ అధికార ప్రతినిధి వికల్ప్ ఒక ప్రకటనను ఆడియో రూపంలో మీడియాకు పంపారు. అయితే ఈ నెల ఈ నెల 13,14,15 తేదీల్లో వందలకొద్ది పోలీసులు గ్రామాలమీద దాడులు చేసింది మాత్రం నిజమని ఆయన అన్నారు. చిన్న గోట్కుల్, పెద్ద గోట్కుల్ గ్రామ శివారు నుంచే గాల్లోకి కాల్పులు జరుపుతూ అక్కడి ప్రజలను భయకంపితులను చేశారని , పోలీస్‌లను చూసి ప్రజలు అడవిలోకి పారిపోగా 16 ఇళ్లను తగులు బెట్టారని , దారిలో కనిపించిన తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన వారిని అరెస్ట్ చేసి హింసలకు గురిచేశారని, ప్రశ్నించిన వారిని చితకబాదారని, ఈ సంఘటనలో ఒక సామాన్యుడు చనిపోయాడని అతనికే కోబ్రా డ్రెస్ తొడిగి నక్సలైట్ అని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని వికల్ప్ వెల్లడించారు. పోలీసులకు చిత్తశుద్ది ఉంటే మీడియానూ, పౌరహక్కుల మేధావులను నిజనిర్ధారణకు అనుమతించాలని డిమాండ్ చేశారు.

Keywords : chattigarh, sukuma, crpf, encounter, police attack, maoists
(2023-11-28 04:56:23)



No. of visitors : 4381

Suggested Posts


ʹThere Was No Encounter.. No casualities from Maoistsʹ -maoist party audio statement

Maoist party rejects heavy encounter in Sukma district of Chhattisgarh. firing, encounter news are creation of rumour mills

హిడ్మా సరెండర్ అయ్యాడన్న ప్రచారం ఓ కట్టుకథ -వికల్ప్ ప్రకటన‌

సిపిఐ (మావోయిస్ట్) దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ (డికెఎస్‌జెడ్‌సి)సభ్యుడు, బెటాలియన్ కమాండర్ కామ్రేడ్ హిద్మా లొంగిపోయిన్నట్లు జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.

Search Engine

ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
మణిపూర్ లో ప్లాటినం, క్రోమైట్, నికెల్ వంటి ఖనిజ సంపదను దోచుకోవడానికే కుకీల ఊచకోత -మావోయిస్టు పార్టీ
యాభై ఏళ్ల నక్సల్బరీ: కవిత్వంలో అమరత్వం...జూలై 28 - వరవరరావు
నేటి నుంచి అమర వీరుల సంస్మ‌రణ వారం ప్రారంభం - ఘనంగా జరపాలని మావోయిస్ట్ పార్టీ పిలుపు
త్వరలో...అమరులైన మావోయిస్ట్ పార్టీ సీసీ మెంబర్స్ జీవిత చరిత్రల పుస్తకాలు విడుదల‌
భారత విప్లవోద్యమ నాయకుడు కటకం సుదర్శన్ అమర్ రహే! ‍
RSS, BJP లకు వ్యతిరేకంగా పోరాడుదాం, మహిళా రెజ్లర్లకు మద్దతుగా నిలబడదాం... విప్లవ ఆదివాసీ మహిళా సంఘం
more..


ఎన్కౌంటరే