include 'men';
?>
అదానీ కంపెనీకోసం చట్ట సవరణ - 500 కోట్ల నజరానా
అదానీ కంపెనీకి 500 కోట్ల లబ్ది చేకూర్చడం కోసం మోడీ సర్కార్ చట్టాన్నే సవరించింది.
ఓ కంపెనీకి ప్రయోజనం చేకూర్చేలా ప్రభుత్వం తీసుకున్న చర్యల వెనుక హేతుబద్ధతను తెలియజేయాలంటూ 15 రోజుల క్రితం ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీ పంపిన ప్రశ్నావళికి ఆర్థికమంత్రిత్వశాఖ, పరిశ్రమలు,వాణిజ్యశాఖ కు చెందిన ఉన్నతాధికారుల నుంచి ఎటువంటి సమాధానమూ రాలేదు. ప్రధాని నరేంద్రమోడీకి అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ సన్నిహితుడన్న విషయం తెలిసిందే.
ఎస్ఈజెడ్లకు లబ్ది చేకూర్చేలా అందుకు సంబంధించిన 2005 చట్టానికి 2016 ఆగస్టులో వాణిజ్యశాఖ ఓ నిబంధనను చేర్చింది. ప్రత్యేకించి అదానీ పవర్ లిమిటెడ్(ఏపీఎల్)కు రూ.500 కోట్లమేర కస్టమ్స్ సుంకా లను వెనక్కి ఇచ్చేందుకే ఆ నిబంధనను చేర్చినట్టుగా ఈపీ డబ్ల్యూ పరిశోధనలో వెలుగు చూసింది. విద్యుత్ ప్రాజెక్ట్ కోసం దిగుమతి చేసుకున్న ముడి సరుకుల నిమిత్తం తాము చెల్లించిన కస్టమ్స్ సుంకాలను వెనక్కి ఇవ్వాలంటూ ప్రభుత్వాన్ని ఏపీఎల్ కోరింది. వాస్తవానికి రూ.1000 కోట్ల కస్టమ్స్ సుంకాన్ని ఏపీఎల్ చెల్లించాల్సి ఉండగా.. 2015 మార్చి వరకూ ఎలాంటి చెల్లింపులూ జరరపకపోవడంతో బకాయి అలాగే ఉన్నది. మరోవైపు వాణిజ్యశాఖ గతంలో ఏ కంపెనీకి కూడా సుంకాలను వెనక్కి ఇవ్వలేదన్నది గమనార్హం.
ఇండోనేషియా నుంచి బొగ్గును ఏపీఎల్ దిగుమతి చేసుకుంటోంది. ఇండోనేషియా నుంచి బొగ్గు దిగుమతి చేసుకుంటున్న రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోసా పవర్ సప్లరు, ఎస్సార్ గ్రూప్తోపాటు ఏపీఎల్ కంపెనీలు గత కొంతకాలంగా రెవెన్యూ నిఘా డైరెక్టరేట్(డీఆర్ఐ) పరిశీలనలో ఉన్న విషయం తెలిసిందే. ఇండోనేషియా నుంచి బొగ్గు దిగుమతి చేసుకుంటున్న ఈ కంపెనీలు వాస్తవ ధరకన్నా ఎక్కువ ధరను చూపిస్తూ ఆ భారాన్ని విద్యుత్చార్జీల రూపంలో వినియోగదారులపై పడేలా చేస్తున్నట్టు డీఆర్ఐ తన నివేదికను 2016 మార్చిలో ఆర్థికశాఖకు సమర్పించింది. విద్యుత్ ప్లాంట్ల పరికరాల విషయంలోనూ అదానీ కంపెనీతోపాటు ఎస్సార్ గ్రూప్ కంపెనీ ఎక్కువ ధరలను చూపినట్టు ఆ నివేదికలో డీఆర్ఐ పేర్కొన్నది. ఇప్పుడు కస్టమ్స్ సుంకాలు చెల్లించకుండానే వాటిని తిరిగి వెనక్కి ఇవ్వాలంటూ ప్రభుత్వాన్ని కోరింది.
గుజరాత్లోని ముంద్రాలో ఏర్పాటయ్యే బొగ్గు ఆధారిత పవర్ప్లాంట్ కోసం దేశంలోనే మొదటిసారి సూపర్ క్రిటికల్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నట్టు ఏపీఎల్ చెబుతోంది. ప్రారంభ దశలో 660 మెగావాట్లను ఇక్కడ ఉత్పత్తి చేయనున్నట్టు తెలిపింది. అదానీ పోర్టు ప్రత్యేక ఆర్థికమండలి(ఏపీఎస్ఈజెడ్) ప్రాంతంలో ఏర్పాటు చేసే ముంద్రా పవర్ ప్లాంట్లో మొత్తం తొమ్మిది యూనిట్లలో విద్యుత్ను ఉత్పత్తి చేయాలన్నది ప్రణాళిక. వాటిలో నాలుగు యూనిట్లు 330 మెగావాట్ల చొప్పున, ఐదు యూనిట్లు 660 మెగావాట్ల చొప్పున విద్యుత్ను ఉత్పత్తి చేయనున్నట్టు ఆ కంపెనీ చెబుతోంది. 15,000 హెక్టార్ల ప్రాంతంలో విస్తరించిన ఏపీఎస్ఈజెడ్ బహుళ ప్రాజెక్టులతో కూడిన పారిశ్రామిక కేంద్రం. ఇందులో ఎస్ఈజెడ్ కోసం కేటాయించింది 6,456 హెక్టార్లు.
నిబంధనలను సవరించినతీరు
రూ.506 కోట్ల రిఫండ్ కోసం ఏపీఎస్ఈజెడ్ డెవలప్మెంట్ కమిషనర్కు దరఖాస్తు పెట్టుకున్నట్టు గుజరాత్లోని ఏపీఎస్ఈజెడ్కు చెందిన సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. తమ దరఖాస్తుకు కస్టమ్స్ అధికారుల నుంచి ఆమోదం లభించేలా సెజ్ నిబంధన 47కు మార్పులు చేసినట్టు ఆయన చెప్పారు. 2016, ఆగస్టు 5న సెజ్ నిబంధన 47కు సబ్రూల్-5ను చేరుస్తూ కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది.
పన్నుల విషయంలో మిగతా ప్రాంతాలకులేని కొన్ని వెసులుబాట్లు సెజ్ల విషయంలో ఉన్నాయి. కస్టమ్స్ సుంకాలుసహా పలు పన్నులను మినహాయిస్తూ చట్టాన్ని రూపొందించారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించే ఉద్దేశంతో సెజ్ల నుంచి జరిపే ఎగుమతులు,దిగుమతులకు ఈ మినహాయింపులు కల్పించారు. ఇప్పుడు ఈ నిబంధనను సవరించి సెజ్ల నుంచి గృహావసరాలకు విద్యుత్ను సరఫరా చేసే ప్లాంట్లకు కూడా వర్తింపజేశారు. సవరించిన నిబంధన ద్వారా అదానీ కంపెనీకి అనూహ్య లబ్ది చేకూరనున్నది. ఇప్పటికే ఆ కంపెనీ బకాయి పడ్డ రూ.1000 కోట్ల కస్టమ్స్ సుంకం మినహాయింపు కోసం కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అవకాశం కల్పించింది.
Keywords : adani, modi, SEZ, delhi, 500 crores, bjp
(2024-04-11 18:38:25)
No. of visitors : 1106
Suggested Posts
| లెనిన్ ఎవరూ..!?భగత్సింగ్ వంటి యువకిశోరాల వర్థంతులనాడు దండులు వేసి దండం పెట్టడమే తప్ప ఏనాడైన ఆయన చరిత్రను చదివుంటే లెనిన్ కొంతలో కొంతైనా అర్థమయ్యేవాడు. పాతికేళ్ళు కూడా నిండని కొంతమంది యువకులు, ఆ లెనిన్ నుండి ఆయన సారధ్యం వహించిన సోవియట్ యూనియన్ నుంచి స్ఫుర్తిని పొందబట్టే ʹహిందూస్తాన్ రిపబ్లిక్ అసోషియేషన్ʹ |
| నువ్వు హిందువా ముస్లింవా అంటూ జర్నలిస్టు ప్యాంట్ విప్పి చూశారు...ఢిల్లీలో కొన సాగుతున్న అరాచకం
రెండు రోజులుగా దాడులతో, హింసతో అట్టుడుకుతోంది. ఈశాన్య ఢిల్లీలో అనేక ఇళ్ళు షాపులు తగలబడుతున్నాయి. సీఏఏ కు వ్యతిరేకంగా రెండు నెలలుగా శాంతియుతంగా ఆందోళనలు జరుగుతున్నాయి. |
| ఆజాదీ నినాదాలతో దద్దరిల్లిన ఢిల్లీ రాంజాస్ కాలేజ్ఢిల్లీ రాంజాస్ కాలేజ్ విద్యార్థులపై ఏబీవీపీ మూక చేసిన దాడికి నిరసనగా వేలాదిమంది విద్యార్థినీ విద్యార్థులు ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ మాజీ అధ్యక్షుడు కన్హయ్య మాట్లాడారు.... |
| Statement by Sudha Bharadwaj on false allegations aired on Republic TV I have been informed that Republic TV aired a programme on 4 July 2018, presented by anchor and MD Arnab Goswami as ʹSuper Exclusive Breaking Newsʹ. |
| ఎమ్మెల్యే మనోడే.. ఎవ్వరూ ఏం చేయలేరు..వారిని తగులబెట్టండి...ʹఎమ్మెల్యే మనతో ఉన్నారు.. ఎవ్వరూ మనల్ని ఏం చేయలేరు.. వారిని తగలబెట్టండి..ʹ అక్బర్ఖాన్ను, అతని స్నేహితుడిని కొడుతూ గోరక్షకులు చేసిన వ్యాఖ్యలివి. ఈ ఘటనలో ప్రాణాలతో బయటపడిన అక్బర్ఖాన్ స్నేహితుడు అస్లామ్ పోలీసులకు రాతపూర్వకంగా ఇచ్చిన ఫిర్యాదులో ఈ విషయాలను పేర్కొన్నాడు.
|
| ఈ చిన్నారుల ఆకలి కేకల సాక్షిగా... వాళ్ళను మనమే హత్య చేశాం !అమ్మా ఆకలి అన్నా అన్నం పెట్టలేని స్థితిలో అమ్మ...బాబూ ఓ ముద్దేయండంటూ రోడ్డు మీద బోరుమన్నా పట్టించుకోని జనం... మూడు రోజుల పాటు ఆకలితో ఏడ్చీ ఏడ్చీ ఆ ముగ్గురు చిన్నారులు చనిపోయారు. |
| అవును,దళిత బాలిక కాబట్టే అత్యాచారం చేసి హత్య చేశాం -ఒప్పుకున్న పూజారి,ఇతర నిందితులుఢిల్లీ శ్మశానవాటికలో ఒక పూజారి, మరో ముగ్గురితో కలిసి తొమ్మిదేళ్ల దళిత బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన ఘటనలో... బాలిక దళితురాలైనందునే ఆమెపై అత్యాచారం చేసినట్లు నిందితులు ఒప్పుకున్నారు. |
| ఏబీవీపీకి భయపడను - అమర జవాను కూతురుʹనేను ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్ ను . ఏబీవీకి భయపడను. నేను ఒంటరిని కాను దేశంలో ప్రతి స్టూడెంట్ నాతో ఉన్నాడుʹ. అని రాసి ఉన్న ప్ల కార్డ్ ను పట్టుకొని ఉన్న తన ఫోటోను ఫేస్ బుక్ లో పోస్ట్ చేసింది గుర్ మెహర్.... |
| మేం ప్రశ్నిస్తాం, తర్కిస్తాం, వాదిస్తాం, విభేదిస్తాం..ఇదే జేఎన్యూ ప్రత్యేకత - ఉమర్ ఖలీద్మిత్రులారా! నాలోని భావోద్వేగాన్ని ఎలా మాటల్లోకి మల్చాలో అర్థం కావడం లేదు. గత నెలాపదిహేను రోజులుగా వేగంగా జరిగిపోయిన సంఘటనలను ఒక క్రమంలో అర్థం చేసుకోవడానికి నేనింకా ప్రయత్నిస్తూనే ఉన్నాను. |
| కేజ్రీవాల్ పై మారణాయుధాలతో దాడిఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పై పంజాబ్ లో మారణాయుధాలతో దాడి జరిగింది అయితే ఈ దాడి నుంచి ఆయన త్రుటిలో తప్పించుకున్నారు.... |
| కేసీఆర్ కుటుంబానికి చెందిన అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్ |
| రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్ |
| నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు |
| 24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే ! |
| డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు |
| ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ |
| హుస్నాబాద్ స్తూపం స్థలాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక
|
| కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు |
| 5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన |
| ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా? |
| తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
|
| అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
|
| పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన |
| వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2) |
| వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1) |
| విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్ |
| హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ |
| అనారోగ్యంతో ఉన్న మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు |
| మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన |
| మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ ! |
| సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ |
| తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శన్ స్తూపావిష్కరణ |
| గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది -మావోయిస్టు పార్టీ |
| గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం |
more..