చ‌త్తీస్‌ఘ‌డ్ జైల్లో నిజ‌నిర్థార‌ణ‌ -న‌జీర్‌

చ‌త్తీస్‌ఘ‌డ్

(తెలంగాణ విద్యార్థి వేదిక నాయకుడు నజీర్ రాసిన తన జైలు జీవిత అనుభవాలతో కూడిన ఈ వ్యాసం ʹనడుస్తున్న తెలంగాణ మాసపత్రికʹ ఆగస్ట్ సంచికలో ప్రచురించబడినది)

దేశానికి స్వాతంత్య్రం వచ్చిందని చెప్పుకుంటూ 70 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్న సందర్భంలో ఉన్నాం. దేశ పాలకులు ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక దేశంగా భారతదేశాన్ని వర్ణిస్తారు. కానీ, వాస్తవంలో ఎట్లాంటి పరిస్థితులు ఈ దేశంలో నెలకొని ఉన్నాయి. ప్రజాస్వామ్యబద్ధ, రాజ్యాంగ పాలన నడుస్తోందా? ఈ దేశంలో అమలవుతున్నది ప్రజాస్వామ్యమో, ఫాసిజమో తెల్సుకోవాలంటే, ఛత్తీస్‌ఘడ్‌ రాష్ట్రంలో ఆదివాసులపై జరుగుతున్న ప్రత్యక్ష ప్రభుత్వ యంత్రాగాల దాడులను చర్చించవలసిందే. వారిపై జరుగుతున్న హింస, దాడులు, అత్యాచారాలు, హత్యల గురించి మాట్లాడాల్సిందే. పుస్తకాల్లో చెబుతున్నట్లుగా, పాలకులు పదే పదే వల్లె వేస్తున్నట్లుగా ప్రజల కొరకు, ప్రజల చేత, ప్రజలే ఎన్నుకొన్న దానిని ప్రజాస్వామ్యం అంటున్నారు. కానీ, ఇక్కడ అమలులో మాత్రం ప్రజలను హత్యలు చేయడానికి, ప్రజలను అత్యాచారాలు చేయడానికి, ప్రజలను విధ్వంసం చేయడానికి ప్రజాస్వామ్యాన్ని ఉపయోగిస్తున్నారు.

గత సంవత్సరం డిసెంబర్‌ నెలలో ఛత్తీస్‌ఘడ్‌ రాష్ట్రంలో ఆదివాసీ ప్రజానీకంపై జరుగుతున్న దారుణాలకు సంబంధించి, హక్కుల ఉల్లంఘనకు సంబంధించి, ప్రధానంగా మావోయిస్టుల పేరు మీద ఆదివాసీలను ఎన్‌కౌంటర్‌ చేస్తున్న విషయాలను తెలుసుకోవాలనుకున్నాం. తెలంగాణ ప్రజాస్వామిక వేదిక (టీిడీిఎఫ్‌) ఆధ్వర్యంలో నిజనిర్ధారణ బృందంగా ఛత్తీస్‌ఘడ్‌ రాష్ట్రానికి మేం బయల్దేరాం. డిసెంబర్‌ 24వ తారీఖున హైద్రాబాద్‌ నుంచి భద్రాచలం బస్సులో చేరుకున్నాం. 25వ తారీఖున భద్రాచలం నుంచి మోటార్‌ సైకిళ్లపై మా ప్రయాణాన్ని ప్రారంభించాం.

భద్రాచలం దాటి పర్ణశాల చేరుకోగానే, మేం వెళ్లాలను కున్న ఛత్తీస్‌ఘడ్‌లోని నిజనిర్ధారణ ప్రదేశంలో అడుగు పెట్టకముందే తెలంగాణ, ఛత్తీస్‌ఘడ్‌ పోలీసులు మమ్మల్ని చుట్టుముట్టారు. ఏమీ అడగకుండానే మా ఫోన్లు లాక్కున్నారు. భౌతిక దాడికి దిగుతూ బలవంతంగా వారి వాహనాలలోకి ఎక్కించారు. తెలంగాణ పోలీసులు దగ్గరుండి ఛత్తీస్‌ఘడ్‌ పోలీసులకు తెలంగాణ భూభాగం నుంచి అప్పచెప్పారు. ఒక్కసారిగా పరాయి దేశపు భూభాగంలోకి ప్రవేశించిన అనుభవం కల్పించారు. దుమ్ముగూడెం పోలీస్‌స్టేషన్‌కు తీసుకువెళ్తామని చెప్పి, ఛత్తీస్‌ఘడ్‌ రాష్ట్రంలోని కుంట పోలీస ్‌స్టేషన్‌కు తరలించారు. ఆ రోజు మొత్తం మానసిక వేదనకు గురిచేశారు. మమ్మల్ని వివరాలు అడిగిన ఇన్‌స్పెక్టర్‌ నేను యూనివర్సిటీ విద్యార్థినని చెప్పగానే ఉస్మానియా, జేఎన్‌యులలో చదువుతున్న విద్యార్థులు దేశద్రోహులు అన్నాడు. అందరిని జైల్లో వేయాలి. భావప్రకటన, స్వేచ్ఛ, సమానత్వం, రాజ్యాంగ విలువలు అంటూ లొల్లి చేస్తరు అన్నాడు. నిజనిర్ధారణకు వెళ్లిన మా వద్ద ఒక జతబట్టలు, ఒక నోట్‌ పుస్తకం, పెన్ను ఉన్నవి. వాటి స్థానంలో మా బ్యాగులలోకి విప్లవ సాహిత్యం, కరపత్రాలు, ఒక లక్ష రూపాయల పాతనోట్లు పెట్టారు.

ఛóత్తీస్‌ఘడ్‌ రాష్ట్రంలో అడుగు అడుగునా ప్రజాస్వామ్య ఉల్లంఘన, ప్రజలపై తీవ్రమైన హింస, ఆదివాసీలపై దాడులు, హత్యలు, మహిళలపై అత్యాచారాలు వాటిని చూడటానికి బస్తర్‌ పర్యటించిన ఢిల్లీ ప్రొఫెసర్‌పై హత్యానేరాలు మోపిన తప్పుడు చరిత్రకు కొనసాగింపుగానే మాపై ఛత్తీస్‌ఘడ్‌ పబ్లిక్‌ సెక్యూరిటీ యాక్ట్‌ కింద సుక్మా కోర్టు ముందు ప్రవేశపెట్టారు. ఛత్తీస్‌ఘడ్‌ రాష్ట్రంలో అడుగుపెట్టక ముందే అది దేశ సరిహద్దు దాటడంగా మారిపోయింది. నిజ నిర్ధారణకు వెళ్లిన మమ్మల్ని ఛత్తీస్‌ఘడ్‌ ప్రజల భద్రతకు ప్రమాదకరమైన వ్యక్తులుగా మార్చారు. దేశపౌరులు దేశ భూభాగంలో ఎక్కడి నుంచైనా, ఎక్కడికైనా ప్రయాణించే, స్థిరనివాసం ఏర్పర్చుకొనే, నచ్చిన వృత్తి స్వీకరించే స్వేచ్ఛ రాజ్యాంగంలో ఉంది అని మాకంటే బాగా తెలిసిన న్యాయమూర్తి ఛత్తీస్‌ఘడ్‌ రాష్ట్రంలోకి రావడానికి అనుమతి తీసుకున్నారా? అన్నాడు. బెయిల్‌ పిటిషన్‌ తిరస్కరించి జైలుకు తరలించారు. ఆదివాసుల జీవించే హక్కును తుడిచేయడం అడవిబిడ్డలపై అఘాయిత్యాలు, ప్రకృతి సంపద విధ్వంసం, ఖనిజ వనరుల దోపిడీ ఇవన్నీ ఆటంకం లేకుండా కొనసాగించడం కోసం, ఆదివాసీలను అడవి నుంచి తరమివేయడం కోసం ప్రభుత్వాలు ఆపరేషన్‌ గ్రీన్‌హంట్‌, మిషన్‌ బస్తర్‌లు ప్రకటించుకున్నవి. ఈ అప్రజాస్వామిక పాలనను, రాజ్యాంగ వ్యతిరేక విధానాలను దేశ ప్రజల ముందు చర్చ చేస్తామని భయపడి నిజనిర్ధారణకై బయల్దేరిన మా ఉద్ధేశానికి తప్పుడు అర్థం కల్పిస్తూ తెలంగాణ, ఛత్తీస్‌ఘడ్‌ ప్రభుత్వాలు సంయుక్తంగా జైల్లో పెట్టాయి.

మేము రెండు మూడు రోజులు అక్కడి ఆదివాసీ గూడాలను తిరగాలనుకున్నాం. ఆ ప్రజలను కలిసి వాస్తవాలు సేకరించాలనుకున్నాం. కానీ, ఆరు నెలలకు పైగా సుక్మా జైల్లో ఉండటం వలన మొత్తం బస్తర్‌లోని ఏడు జిల్లాల పరిస్థితి అర్థమయింది. మేము అనుకున్న వాటికంటే ఎక్కువ విషయాలు తెలుసుకున్నాం. ఆ రాష్ట్ర ప్రభుత్వం బస్తర్‌లో చేస్తున్న దారుణాలు తప్పుడు కేసులతో జైల్లోకి వస్తున్న ఆదివాసీల రూపంలో మా ముందుకు వచ్చాయి.

మేం జైల్లోకి వెళ్లిన సమయానికి కొద్దిరోజుల ముందే నోట్ల రద్దు నిర్ణయం జరిగివుండడం వలన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సరైన నగదు లేక ప్రజా జీవితం స్తంభించిపోయింది. మోడీ ప్రభుత్వం చేసిన చర్య వలన డబ్బుల కోసం బ్యాంకుల దగ్గర లైన్లలో నిలబడ్డవారు వందల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. కానీ, బస్తర్‌ ప్రాంతంలో ఆదివాసీలు దాచుకున్న పాత రూ.500, రూ.1000 నోట్లు మార్చుకోవడానికి బ్యాంకుల వద్దకు వెళ్లితే కేవలం రూ.1500 రూపాయలు మార్చుకోవడానికి వచ్చిన మాడవి అందాను ఇవి మావోయిస్టుల డబ్బులు అంటూ అరెస్ట్‌చేసి, వారి డబ్బులు మారుస్తున్నవని నేరం మోపి జైల్లో వేశారు.

జైల్లో ఉన్న ఖైదీలలో 99 శాతం మంది అటవీ ప్రాంతంలోని ఆదివాసీలే. ఆదివాసీల రక్షణ కొరకు రాజ్యాంగ షెడ్యూల్‌ 5 గానీ, పెసా యాక్ట్‌గానీ, 1/70 యాక్ట్‌ గానీ అమలు జరగదు. ఆదివాసీలు పోలీసులకు చిక్కితే మాత్రం వారిపై తప్పకుండా 302, 307, 148, 147, 146, 120బి, 3, 4, 5 ఎక్స్‌ప్లోజివ్‌ యాక్ట్‌, 25, 27 ఆర్మ్స్‌ యాక్ట్‌లు తప్పకుండా

ఉంటాయి. వీటితో పాటు 7, 8 కేసులు వారిపై మోపబడుతున్నాయి. జైల్లో ఉన్న ఆదివాసీలది ఒక్కొక్కరిదీ ఒక్కో వ్యథ. ఒక్కో దీన గాథ.

ఏ రాత్రి, ఏ తెల్లవారుజామున భద్రత బలగాలు గూడాలను చుట్టుముడతాయో అన్న భయం. వారి గుడిసెలను తగలబెట్టి, కోళ్లు, పందులు, మేకలు అన్నింటిని కోసుకు తింటారన్న ఆందోళన, ఆదివాసీ మహిళలపై దారుణమైన అత్యాచారాల ఘటనలతో తెలవారుతుందిక్కడ. జైల్లో ఉన్న ఆదివాసీలు వారి గూడాలపై జరుగుతున్న దాడులు ఎలా

ఉంటాయో వివరించారు. వారి మాటల్లో... ʹʹపోలీస్‌ భద్రత బలగాలు ఒక్క గ్రామాన్ని రాత్రి వెళ్లి చుట్టుముడతారు. తెల్లవారు జామున గూడెం మీద ఆకస్మికంగా దాడి, దొరికినవారిని దొరికినట్లుగా చితకబాదుతారు. కుటుంబాలను పట్టుకొని భర్తను సుక్మా జైలుకు, భార్యను జగ్దల్‌పూర్‌ జైలుకు, బిడ్డలను అంబికాపూర్‌ జైలుకు తరలిస్తారు. జైలుకు వెళ్లిన కొద్ది రోజులలోనే తోంపాల్‌ దగ్గర ఒక గూడెం నుంచి 27 మందిని తీసుకువచ్చారు. ఆ గూడెం జనాభా 42మంది. పోలీసులు ఆ గూడాన్ని మొత్తం ఖాళీ చేయించారు.

1. చితంకుప్ప స్టేషన్‌ పరిధి నుంచి జైల్లోకి వచ్చిన ʹమాసాʹ తన ఒంటి మీద గాయాలను చూపిస్తూ... ʹఅడవిలో పట్టుకొని కొట్టారు. పోలీస్‌ ఠాణాలో కొట్టారు. జైల్లో కొట్టారు. తమ మీద జరుగుతున్న భౌతికదాడిని ఎవరు ప్రశ్నిస్తారనిʹ వాపోతున్నాడు.

2. కుకానార్‌ నుంచి వచ్చిన లక్మా ..ʹఅర్థరాత్రి మా గుడిసె మీద పోలీసులు పడి లాక్కొచ్చారు. నా భార్య చనిపోయింది. ఇద్దరూ పసిపిల్లలు ఉన్నారు. వారికి తిండి పెట్టే వారెవ్వరూ లేరు. నేను బయటకు వెళ్లేవరకు బతుకుతారో లేదోʹ అన్న అతడి వేదనకు అంతులేదు.

3. పండించిన వడ్లను బియ్యం పట్టించుకోవడానికి చర్ల వెళ్లిన నగేష్‌ను అటుగా వచ్చిన పోలీసులు బస్‌స్టాండ్‌ నుంచి మాట్లాడుదాం రమ్మంటూ తీసుకువెళ్లి కుంట పోలీస్‌స్టేషన్‌లో పెట్టి, భద్రత బలగాల మీద దాడి చేసాడంటూ కేసుపెట్టారు.

4. జెగురుగొండకు చెందిన గంగ ఉదయం వాగులో స్నానం చేద్దామని పోయాడు. తుపాకీ పేలుళ్ల్ల చప్పుడు వినిపించటంతో భయపడి ఊరివైపు పరుగెత్తాడు. ఆ కాల్పుల్లో ఎడమ చేతినుంచి తూటా దూసుకెళ్లింది. పోలీసులు పట్టుకొచ్చి కేసు పెట్టారు.

ఈ విధంగా పదుల సంఖ్యలో జైల్లోకి వస్తుండేవారు. పోలీస్‌స్టేషన్‌లో రోజుల తరబడి అక్రమంగా నిర్బంధించి

ఉంచుతున్నారని తెలుస్తుండేది. 12 సంవత్సరాల పిల్లల దగ్గర్నుంచి ముసలి వాళ్ల వరకు ఆదివాసీలు జైల్లో మగ్గుతున్నారు. చింతల్నార్‌, చింతకుప్ప నుంచి 8 మందిని తీసుకొచ్చారు. వారంతా కూడా ఎప్పుడో జరిగిన సంఘటనలలో హంతకులుగా, పోలీసు బలగాలపై దాడులు చేసిన వారిగా కోర్టు ముందు ప్రవేశపెట్టారు. అందులో చైతు 59 సంవత్సరాల ఆదివాసీ. తన వయస్సు మళ్లిన భార్య ఆరోగ్యం బాగోలేక ఆసుపత్రికి తీసుకువచ్చాడు. మందులు కొనడానికి సుక్మా వస్తే పోలీస్‌స్టేషన్‌కు తీసుకువెళ్లారు. అతనిని కొన్ని పేర్లు అడిగారు. ʹనా భార్య హాస్పిటల్‌లో ఉంది. తన దగ్గర ఎవరూ లేరుʹ అన్నా వినకుండా వారం రోజుల తర్వాత జైలుకు పంపారు.

5. బుర్కపాల్‌ నుంచి సోమ్లు 13 నెలలు జగ్దల్‌పూర్‌ జైల్లో విచారణ ఖైదీగా ఉన్నాడు. 2017 ఫిబ్రవరిలో రిలీజ్‌ అయి గూడెం వెళ్లాడు. ఇంట్లో అతడి అరెస్ట్‌తో అంతా ఆగమయ్యింది. విడిపించుకోవడానికి రూ.30 వేల అప్పు అయ్యింది. అప్పు తీర్చడం కోసం కూలీ పనికి ఆంధ్రకు పోయాడు. మూడు నెలల తర్వాత రూ.12 వేలతో ఇంటికి బయల్దేరాడు. మార్గమధ్యలోనే బుర్కపాల్‌ క్యాంప్‌ దగ్గర అతనిని పట్టుకొని వారి రోజులు తీవ్రంగా కొట్టి డబ్బులు లాక్కొని సుక్మా జైల్లో పడవేశారు.

ఈ విధంగా జైల్లో మగ్గుతున్న వారంతా అక్రమ కేసులలో ఉన్నవారూ, అన్యాయాలకు బలవుతున్నవారే.

ఛత్తీస్‌ఘడ్‌ను రాజకీయ ఖైదీల రాజధానిగా మారుస్తున్నారు. ఒరిస్సా రాష్ట్రం మల్కన్‌గిరి నుంచి 18 సంవత్సరాలు నిండని 20 మంది పిల్లలను పట్టుకువచ్చి మావోయిస్టులుగా సుక్మా జైల్లోకి తోసారు. ఆంధ్రప్రదేశ్‌ చింతూరు నుంచి పట్టుకొస్తున్నారు.

వీరందరూ నెలలు, సంవత్సరాల తరబడి జైల్లోనే మగ్గిపోతున్నారు. వీరు ఏ జైల్లో ఉన్నారో వారి కుటుంబ సభ్యులకు చాలా రోజుల వరకు తెలియదు. వారిని వెతుక్కుంటూ ఛత్తీస్‌ఘడ్‌లోని జైళ్లన్నీ తిరగవల్సిందే. ఏదో ఒక జైల్లో వారి సంబంధీకులు కలుస్తారు. చింతకుప్ప దగ్గర నుంచి వెంకటయ్యను, అతని అల్లుణ్ణి, కొడుకులను, తమ్ముడిని పట్టుకొచ్చారు. వెంకటయ్య, అల్లుణ్ణి, తమ్ముడు సుక్మా జైల్లో

ఉన్నారు. కొడుకులు ఏ జైల్లో ఉన్నారో ఆచూకీ లేదు. కోర్టు వాయిదాకు వెళ్లినప్పుడల్లా జడ్జీని వేడుకుంటాడు. తన కొడుకులు ఎక్కడ ఉన్నారో తెల్సుకోవాలని.

వాళ్లకు ఎటువంటి న్యాయ సహాయం అందలేదు. వారికి న్యాయసేవ చేయడం కోసం ప్రయత్నిస్తున్న వారిని ʹలారీలతో గుద్ది చంపుతామని, రోడ్లపై ఆక్సిడెంట్లను చేసి చంపుతామనిʹ అక్కడి పోలీసులు బహిరంగ ప్రకటనలు చేస్తున్నారు. కానీ, మరొకవైపు జిల్లా జడ్జీలు జైల్లో ఉన్న ఖైదీలతో మీకు న్యాయ సహాయం అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటిస్తున్నారు. న్యాయ సహాయం చేస్తున్నవారిని చంపుతామని ప్రకటనలు వస్తుంటే స్పందించకపోవడం ఆశ్చర్యంగా ఉంది.

అంతర్జాతీయ న్యాయస్థానంలో పాకిస్తాన్‌ దగ్గర ఖైదీగా ఉన్నటువంటి కుల భూషణ్‌ కోసం మానవ హక్కుల నేపథ్యంలో వాదన చేస్తున్న భారత ప్రభుత్వం తన సొంత ప్రజల హక్కులను నిరాటంకంగా హరించివేస్తున్నది.

ఈ నేపథ్యంలో అక్కడి ప్రభుత్వ యంత్రాంగంలో భాగమైన వారు కూడా ఈ దారుణాలపై స్పందించకుండా ఉండలేకపోతున్నారు.

రాయపూర్‌ సెంట్రల్‌ జైలు డిప్యూటీ జైలర్‌ వర్ష డొంగ్రే బస్తర్‌ పరిస్థితులపై స్పందించింది. ఆమె మాటలలోనే ʹʹ ఒకసారి మనం అందరం మన చుట్టూ ఏం జరుగుతుందో పరిశీలనగా చూడాల్సిన అవసరం ఉందని నాకు అనిపిస్తుంది. నిజనిజాలు మనకు ఎదురుపడతాయి. ఆదివాసీల అడవిని, నీళ్లని, భూమిని దోచటం కోసం ఊర్లకు ఊర్లను తగలబెట్టి వారిని నిర్వాసితులను చేస్తున్నారు. ఆదివాసీ మహిళలపై అత్యాచారాలు చేస్తున్నారు. వారు మావోయిస్టులా కాదా అని తెలుసుకోవడం కోసం స్థనాలు పిండుతున్నారు. టైగర్‌ ప్రాజెక్టుల పేరు మీద ఆదివాసీ జీవితాలను విధ్వంసం చేస్తున్నారు. ఇందులో నక్సలైట్లను ఏరివేయడం మాత్రమే కాదు. ప్రకృతి వనరుల దోపిడీ దాగి వుంది.

అంతేకాకుండా తను జగదల్‌పూర్‌ జైల్లో పని చేస్తున్నప్పుడు 14 నుంచి 16 సంవత్సరాల అమ్మాయిలను మహిళా పోలీసులను బయటకు పంపి, చేతుల మీద, రొమ్ముల మీద కరెంట్‌ షాక్‌ ఇచ్చేవారని చెప్పింది. మావోయిస్టుల ఏరివేత పేరు మీద దేశాన్ని కాపాడుతున్నాం అనేవారు, వారి బిడ్డలను చెల్లెలను చెరిచివేస్తుంటే, వారి గుడిసెలను తగలబెడుతుంటే, తప్పుడు కేసులు పెడుతుంటే ఆదివాసీలకు న్యాయం ఎక్కడ దొరుకుతుంది? ఎవరైనా ఈ ఆదివాసీ సమస్యను ప్రశ్నిస్తే వారు మానవ హక్కుల కార్యకర్తలైనా, పత్రికా విలేకర్లైనా, లాయర్లైనా వారిని కూడా తప్పుడు కేసులు బనాయించి మావోయిస్టులుగా ముద్ర వేసి జైల్లో పెడుతున్నారు.

ఇలా జరుగుతుంటే ఈ ఆదివాసీ ప్రజానీకం ఎవరి మీద విశ్వాసం పెట్టాలి? జైల్లో దుర్భర పరిస్థితులు వారి ఆరోగ్యాలను పాడు చేస్తున్నాయి. వారికి పురుగుల అన్నం, నీళ్ల చారు ఇస్తున్నారు. ఇదేమని ప్రశ్నిస్తే కొట్టడానికి కూడా జైలు అధికారులు వెనుకాడటం లేదు.

ఇక్కడ ప్రజాస్వామ్యం ఉందా? చట్టబద్ధ పాలన ఉందా? అడవిని నమ్ముకొని జీవిస్తున్న ఆదివాసీలు ఎవరిని విశ్వసించాలి. కూలీ, నాలీ చేసుకొని బతికే తమని అక్రమ కేసుల్లో ఇరికించిన పోలీస్‌ వ్యవస్థనా? బెయిల్‌ లేకుండా విచారణ దశలోనే సంవత్సరాల తరబడి పట్టించుకోని న్యాయ వ్యవస్థనా? తమ కాళ్ల కింద ఖనిజ వనరులను కొల్లగొట్టడానికి విధ్వంసం సృష్టిస్తూ నిర్వాసితులని చేస్తున్న ప్రభుత్వాలనా?

మధ్యతరగతి బుద్ధిజీవులు మౌనం వీడాలి. అప్రజాస్వామిక, అన్యాయమైన పాలనను ఖండించండి. ప్రజాస్వామ్యాన్ని బతికించడం కోసం ఉద్యమించాలి. ఆదివాసీలకు అండగా నిలవాలి. ప్రజలపై ప్రకటించిన గ్రీన్‌హంట్‌ యుద్ధాన్ని నిలిపివేసే వరకు పోరాడాలి.

-న‌జీర్‌, ఓయూ విద్యార్థి, తెలంగాణ విద్యార్థి వేదిక నాయకుడు

Keywords : chattisgarh, adivasi, police, army, attacks, maoists
(2024-04-08 06:06:08)



No. of visitors : 1807

Suggested Posts


సుక్మా అటాక్ పై మావోయిస్టు నేత వికల్ప్ ఆడియో ప్రకటన

ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో సీఆర్‌పీఎఫ్‌ జవాన్లపై తాము జరిపిన దాడి ప్రజా ఉద్యమాలను కాపాడుకోవడానికేనని సీపీఐ మావోయిస్టు పార్టీ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ అధికార ప్రతినిధి వికల్ప్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు ఆయన విడుదల చేసిన ఆడియో ప్రకటనలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసులపై...

A week after Sukma encounter, Maoists release photographs of modern weapons Possessed from CRPF

A week after the Sukma encounter, which killed 12 personnel of Central Reserve Police Force (CRPF), the Maoist Party released a press statement carrying an image of assembled modern weapons they looted from the dead CRPF personnel....

బాలికల బట్టలిప్పించి.. కరెంటు షాక్‌ ఇచ్చారు.. అది బయటపెట్టిన అధికారిణిని మాయం చేశారు !

14 నుంచి 16 సంవత్సరాల వయసున్న గిరిజన బాలికలను పోలీసు స్టేషన్‌లో వివస్త్రలను చేసి హింసించడం నేను కళ్లారా చూశాను. వారి శరీర భాగాలకు కరెంటు షాక్‌ ఇస్తూ పోలీసులు క్రూరంగా ప్రవర్తించారు. మైనర్లపై వాళ్లు థర్డ్‌ డిగ్రీని ఎందుకు ప్రయోగించారు?. ఆ బాలికలను తక్షణ వైద్యం చేయించాలని నేను ఆదేశాలు ఇచ్చాను....

అది ఎన్ కౌంట‌ర్ కాదు, మావాళ్ల‌ను వెంటాడి చంపేశారు‍: బోరుమ‌న్న ఆదివాసీలు

సుకుమా జిల్లా కుంటా బ్లాక్ కన్నాయి గూడెంపై ఆర‌వ తేది తెల్ల‌వారుజామున వంద‌లాది మంది పోలీసులు విరుచుకుప‌డి దొరికిన వారిని దొరికిన‌ట్టు ఊచ‌కోత కోశారు. ఆదివాసీల‌ను దుర్మార్గంగా పిట్ట‌ల్ని కాల్చిన‌ట్టు కాల్చేశారు.

I wrote on Facebook what I witnessed in Bastar: suspended jailer Varsha Dongre

varsha Dongre, the suspended assistant jail superintendent of the Raipur Central Jail in Chhattisgarh, has sent a 376-page reply to a show cause notice from her superior, deputy jail superintendent RR Rai...

छत्तीसगढ़ के वन कर्मियों का कारनामा : 46 बैगा आदिवासी परिवारों को किया बेघर

मुख्यमंत्री के गृहजिला कवर्धा में वन अमले, राजस्व, पुलिस ने बैगा आदिवासियों के आशियाने को उझाड दिया, समान घरो के बाहर फेंक दिए गए, बैगा आदिवासी महिला,बच्चो, बुढो को पिकप में भरकर अन्यंत्र जगह छोड़ दिया गया यहाँ तक उनके साथ जानवरों जैसा मारपीट भी किया गया.

Sukma Police offers reward for Naxal attack perpetrators

Sukma District Police on Friday released posters declaring they would reward anyone who could provide information on the Naxalites who were behind the recent attack on a platoon of...

Anti-Naxal forces stab 13-year old boy to death with bayonets after branding him as Maoist

A 13-year-old Somaru Pottam was allegedly stabbed to death by security forces engaged in anti-Naxalite operations in Bastar region of Chhattisgarh. Father of the Adivasi boy, Kumma Pottam, has filed a petition in the Chhattisgarh High Court seeking justice.....

పాలకుల గ్రీన్ హంట్... ‍ఎదిరిస్తూ పోరాడుతున్న ఆదివాసులు.. డాక్యుమెంటరీ

పోలీసులు, అర్ద మిలటరీ బలగాలు మరో దేశం మీద దాడి చేసిన విధంగా ఈ దేశ ప్రజలపై దాడి చేస్తున్నారు. ముఖ్యంగా ఈ పదిహేనేళ్ళుగా కొనసాగుతున్న దాడి అత్యంత తీవ్రమైనదే కాక దుర్మార్గమైనది. గ్రీన్ హంట్ పేరుతో పాలకులు చేస్తున్న దాడిని ప్రజల సహకారంతో విప్లవకారులు ఎప్పటికప్పుడు తిప్పికొడుతూనే ఉన్నారు.

The Maoists are extend their movement to new areas

The Maoists are trying to extend their "movement" to new areas and they stepped up their activities along the shared borders of....

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


చ‌త్తీస్‌ఘ‌డ్