అది రామరాజ్యం... ఆవులకేమో అంబులెన్సులు... పిల్లలకేమో చావుకేకలు !
అది పశువుల రాజ్యం... అక్కడ మనుషులకు విలువ లేదు. పశువుల పేరుతో మనుషులను నరికి చంపుతారక్కడ... పాలకుల అండతో మధ్యయుగాల మతోన్మాద మూకలు కత్తులతో, బరిశెలతో ఊగిపోతుంటారక్కడ.... స్త్రీలు తాము చెప్పిన బట్టలే కట్టుకోవాలి... తాము చెప్పిన సమయానికే ఇండ్ల నుండి బైటికి తొంగి చూడాలి. ఎత్తిన తల దించకుండా నడవాలి. స్త్రీ పురుషులు కలిసి నడవకూడదు.... ప్రజలందరూ తాము చెప్పిన ఆహారాన్నె తినాలి. తరతరాలుగా వస్తున్న ఆహార అలవాట్లు అని తినబోయారో.... తరిమి తరిమి వెంటాడి వేటాడి కొట్టి చంపుతారు. స్త్రీలను బట్టలు ఊడదీసి ఊరేగిస్తారు. దళితులను చెట్లకు కట్టి కొట్టి కొట్టి చంపుతారు. వాళ్ళ దృష్టిలో ముస్లింలు అసలు మనుషులే కాదు. అది నరహంతకులు ఏలుతున్న రామరాజ్యం.
యోగీ ఆదిత్యానాథ్ ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన తర్వాత ఉత్తర ప్రదేశ్ ముఖ చిత్రమిది. ఆయన గురించి, ఆయన ప్రజలకు చేస్తున్న సేవల గురించి వీర భక్తులు మీడియాలో బాకాలు ఊదుతారు... సోషల్ మీడియాలు కథలు కథలుగా వర్ణిస్తారు. ఆయన రాగానే అక్కడ అవినీతి అంతమయ్యిదట ! ప్రభుత్వ ఉధ్యోగులు భయంతో వణికి పోతూ ఒళ్ళొంచి పని చేస్తున్నారట ! ప్రభుత్వ ఆస్పత్రుల్లో డాక్టర్లు... ఆఫీసుల్లో ఉద్యోగులు... బస్సులు నడిపే డ్రైవర్లు... ప్రజా సేవకోసం లైన్లు కట్టి మరీ పని చేస్తున్నారట ! ఎక్కడా అవినీతి, అన్యాయం అనేది జరగకుండా ( గో హత్యలు మాత్రమే జరుగుతూ ) యోగీ పాలన సాగుతోందట ! రాములవారైనట్టి యోగీ ఆదిత్యమహరాజ్ పాలనలో ఆవులను రక్షించడానికి ప్రత్యేక పథకాలు ప్రవేశ పెట్టారు. ఆవులు బాగుంటేనే దేశం బాగుంటుందని, ప్రజలకు ఆక్సీజన్ దొరుకుతందని రాష్ట్రమంతా ప్రచారం చేస్తున్నారు, మనిషి చనిపోయినా పర్వాలేదు కానీ ఆవు చనిపోతే మాత్రం ఊర్కోబోమని ఫర్మానా జారీ చేశారు. ఆవులకు ఏమైనా అయితే రక్షించడానికి, వాటిని ఆఘమేఘాలమీద ఆస్పత్రికి తరలించడానికి అంబులెన్స్ లు ప్రారంభించారు. ఇంత గొప్పగా జరుగుతున్న యోగీ మహరాజ్ పాలనలో గోరఖ్ పూర్ లోని ప్రభుత్వ ఆస్పత్రిలోఆక్సీజన్ లేక 63మంది చిన్నారుల ప్రాణాలు పోయాయి. ప్రభుత్వం బాకీ పడ్డ 60 లక్షల రూపాయలు కట్టక పోవడం వల్ల ఆక్సీజన్ సప్లై చేయాల్సిన కంపెనీ ఆక్సీజన్ సప్లై చేయలేదు. దాంతో చిన్నారుల ప్రాణాలు గాలిలో కలిసి పోయాయి. అదే ఆవుల ప్రాణాలైనట్టయితే ఈ పాటికి ఎంత మంది జైళ్ళకు పోయేవాళ్ళో. ఎంతమంది ప్రాణాలు కాశాయ మూకల చేతుల్లో బలయ్యేవో ! కానీ చనిపోయింది మనుషులు... అందులోనూ పాలకుల దృష్టిలో ఓటుకు తప్ప ఇంకెందుకూ పనికి రాని దళిత, బహుజన, మైనార్టీల పిల్లలు. ఈ దేశంలో పేదవాళ్ళుగా పుట్టినందుకు... శ్రమజీవులైన తల్లితండ్రులకు పుట్టినందుకు మరణమే శిక్ష అని అని భావిస్తున్న పాలకులున్న చోట పుట్టినందుకు వాళ్ళు పుట్టగానే చనిపోయారు... పాపం ఆవులుగా పుట్టుంటే బతికి ఉండే వాళ్ళు.
Keywords : UP, yogi adityanath, cow, modi, hindutva
(2022-06-27 20:12:39)
No. of visitors : 3568
Suggested Posts
| అనుకున్నంతయ్యింది...బీజేపీ నేత కూతురును పెళ్ళి చేసుకున్న దళిత యువకుడిపై దాడి జరిగింది
నాన్నా నన్నూ అజిత్ ను చంపకండి ప్లీజ్ అంటూ ఉత్తర ప్రదేశ్ ఎమ్మెల్యే కూతురు సాక్షి మిశ్రా వేడుకున్న వీడియో మీకు గుర్తుంది కదా.... తాను దళితుడిని పెండ్లి చేసుకున్నందుకు మమ్మల్ని చంపడానికి నాన్న గూండాలను పంపుతున్నాడని, పోలీసులు తమకు రక్షణ కల్పించాలని ఆమె విఙప్తి చేసింది. అయితే ఆ యువతి అనుకున్నంతా అయ్యింది. సాక్షాత్తూ హైకోర్టు ముందరే వీరిపై దాడి |
| రోహింగ్యాల పట్ల సానుభూతి చూపిన ప్రియాంకా చోప్రా దేశం విడిచి వెళ్ళిపోవాల్సిందే - బీజేపీ నేత రోహింగ్యా శరణార్థులను సందర్శించిన సినీ నటి ప్రియాంకా చోప్రా దేశం విడిచి వెళ్ళాలంటూ బీజేపీ నేత వినయ్ కటియార్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రోహింగ్యా శరణార్థులను సందర్శించడానికి వెళ్లిన వారెవరైనా దేశం విడిచి వెళ్ళిపోవాల్సిందేనంటూ ఆయన అన్నారు. |
| అది మనువాదపు కసాయి రాజ్యం - ప్రేమంటే నరనరాన ద్వేషంఓ యుతి, ఓ యువకుడు జంటగా రోడ్డు మీద వెళ్తున్నారు. నవ్వుతూ తుళ్ళుతూ కబుర్లు చెప్పుకుంటూ వెళ్తున్న వాళ్ళను చూసి యాంటీ రోమియో స్క్వాడ్ ముసుగేసుకున్న మనువులకు మండింది. సంఘ్ పరివార్ పాలనలో మగ ఆడ కలిసి తిరగడ ఎంత పాపం ! ఆ పాపానికి ఒడిగట్టిన ఆ ఇద్దరినీ పట్టుకొని కొట్టారు, పోలీసులతో కలిసి యువకుడికి గుండు గీసి అవమానించారు.... |
|
యోగీ రాజ్యంలో దారుణం... ఆక్సిజన్ లేక 30 మంది చిన్నారుల మృతి !ఆక్సిజన్ సరఫరా చేస్తున్న కంపెనీకి ప్రభుత్వం కట్టాల్సిన 66లక్షల రూపాయల బాకీ కట్టకపోవడం వల్ల ఆ కంపెనీ ఆక్సిజన్ పంపిణీని ఆపేసింది. ఫలితంగా ఇంతమంది చిన్నారుల ప్రాణాలు గాల్లో పోయాయి.... |
| అమానుషంగా అమ్మాయిలను కొట్టారు...వాళ్ళ మీదే కేసులు పెట్టారు...బేటీ బచావ్...బేటీ పడావ్..అంటే ఇదేనా ?
విద్యార్థినులపై దాడి చేసి నెత్తురోడేట్టు అమానుషంగా కొట్టిన పోలీసులపై చర్యలు తీసుకోవల్సింది పోయి బాధితులపైనే కేసులు పెట్టారు. ఉత్తర ప్రదేశ్ లోని బెనారస్ హిందూ యూనివర్సిటీకి చెందిన 1000 మంది విద్యార్థులపై ఇవ్వాళ్ళ కేసు నమోదయ్యింది.... |
| యోగీ రాజ్యం: ఆవును కాపాడటం కోసం మహిళను చంపేసిన పోలీసు అది ఉత్తర ప్రదేశ్ లోని హర్రియా పట్టణం శనివారం నాడు వేగంగా వెళ్తున్న ఓ పోలీసు జీబు డ్రైవర్ కంట్రోల్ తప్పింది. ఆ జీబుకు ఎదురుగా ఓ ఆవు వస్తోంది. డ్రైవర్ కు ఆ సమయంలో తమ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యానాథ్, ఆయన శిష్యులైన గోరక్షకులు.... |
| ముస్లిం మహిళలను గ్యాంగ్ రేప్ చేయండి.. బీజేపీ మహిళా మోర్చా చీఫ్ సునీతఇప్పుడు ముస్లింలకు ఒకే ఒక్క పరిష్కారం ఉంది. హిందూ సోదరులు పది మంది కలిసి గ్రూపుగా ఏర్పడి ముస్లిం మహిళలను గ్యాంగ్ రేప్ చేయాలి. తల్లులు, చెల్లెళ్లు ఎవరినీ వదలకూడదు. అందరినీ బహిరంగంగా వీధుల్లోకి లాక్కొచ్చిమరీ అత్యాచారం చేయాలి. |
| ఎముకలు విరిచారు...రాడ్లను దూర్చారు..గుడికి వెళ్ళిన మహిళపై పూజారి, అతని అనుచరుల గ్యాంగ్ రేప్
ఉత్తరప్రదేశ్లో మహిళలపై అత్యాచారపర్వాలు కొనసాగుతున్నాయి. హథ్రాస్ ఉదంతం మరవకముందే బదూన్లో మరో అమానుష ఘటన చోటుచేసుకుంది. |
| ఉన్నావ్ అత్యాచార బాధితురాలి హత్యకు కుట్ర...ఇద్దరి మరణం..బీజేపీ ఎమ్మెల్యేపై కేసు నమోదుగతేడాది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉత్తరప్రదేశ్లోని ఉన్నావ్ అత్యాచార ఘటన బాధితురాలు ప్రయాణిస్తున్న కారును ఆదివారం ట్రక్కు ఢీకొనడంతో బాధిత యువతి బంధువులు ఇద్దరు మరణించారు. బాధితురాలితోపాటు ఆమె న్యాయవాది కూడా తీవ్రగాయాలపాలయ్యారు. అధికార బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సెంగార్ తనపై అత్యాచారం చేశాడని 19 ఏండ్ల బాధితురాలు గతేడాది ఫిర్యాదు చేయగా |
| గాడిద పెండతో నకిలీ మసాలాలు తయారు చేస్తున్న హిందూ వాహిని నాయకుడి అరెస్ట్
ఉత్తరప్రదేశ్ లో నకిలీ మసాలాలు తయారు చేసే ఓ ఫ్యాక్టరీపై దాడి చేసి దాని యజమానిని అరెస్టు చేశారు. ఈ ఫ్యాక్టరీ హత్రాస్ జిల్లా నవీపూర్ లో ఉంది. అయితే ఇందులో రెండు అంశాలు బాగా ఆసక్తి కలిగిస్తాయి. ఒకటి ఆ మసాలాలు దేనితో తయారు చేస్తున్నారనేది కాగా మరొకటి తయారు చేయిస్తున్న ఫ్యాక్టరీ యజమాని ఎవరు అనేది.. |
| భారతదేశాన్ని ఫాసిస్టు నాజీకరణ చేసే ప్రయత్నంలో భాగమే ʹఅగ్నిపథ్ʹ -మావోయిస్ట్ పార్టీ
|
| వరవరరావుకు మళ్లీ కోవిడ్, ఆస్పత్రిలో చేరిక |
| ఆ తల్లిముందు దోసిళ్లతో.....ʹ - వరవరరావు |
| సిలంగేర్, హస్దేవ్, తికాయత్: దాడుల అంతర్ సంబంధం |
| చెర సాహిత్య సర్వస్వం పునర్ముద్రణ... మీ కాపీని ముందస్తుగా బుక్ చేసుకోండి.. |
| బ్రహ్మదేవ్ సింగ్ ను హత్య చేసిన భద్రతా దళాలపై ఏడాది తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు |
| పూంబాడ్ లో జరిగిన రాకెట్ దాడిపై ఆదివాసీల ఆగ్రహం
|
| జైలులో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన కబీర్ కళా మంచ్ కార్యకర్త సాగర్ గోర్ఖే
|
| మావోయిస్టు అగ్రనేత సందీప్ యాదవ్ @ రూపేష్ జీ అంతిమ యాత్రకు హాజరైన వేలాది ప్రజలు |
| శాంతియుత సిలంగేర్ పోరాటానికి ఏడాది: ఇంకా నెరవేరని డిమాండ్లు
|
| ప్రభుత్వం ఆదివాసులను హిందువులుగా గణించడానికి వ్యతిరేకంగా పోరాడండి - మావోయిస్టు పార్టీ పిలుపు
|
| యేడాది సిలింగేర్ ఏం చెబుతోంది? - ధరణి |
| ఆయన షోమా సేన్ కోసం ఎదురుచూస్తూనే ఉన్నాడు |
| ఛత్తీస్గఢ్ గ్రామాలపై వైమానిక బాంబు దాడులను ఖండించండి -కార్పొరేటీకరణ, సైనికీకరణ వ్యతిరేక వేదిక |
| శ్రీలంక పరిణామాలు – భారత సమాజానికీ పోలికలు |
| గౌతమ్ నవ్లాఖా కోసం ఆమె ఎదురుచూస్తూనే ఉంది - అజాజ్ అష్రఫ్ |
| త్వరలో రాబోతున్న పుస్తకం:మన కాలపు మహత్తర పోరాటం - సిలింగేర్ |
| అమ్మల దినం తల్లుల గుండెకోత|మమత |
| నాగరాజు హత్యను ఖండించిన ముస్లిం థింకర్స్ డయాస్ |
| Chhattisgarh:ఆయుధాలు వదిలి చర్చలకు రావాలన్న సీఎం పిలుపుకు మావోయిస్టుల జవాబు |
| Madhya Pradesh: ఇద్దరు గిరిజనులను కొట్టి చంపిన ʹగోరక్షకులుʹ |
| ఉత్తరప్రదేశ్ లో ఈ ఏడాది 10వ తరగతి, ఇంటర్ హిందీ పరీక్షల్లో 8 లక్షల మంది ఫెయిల్ |
| అదానీ కోసం అడవిని నరికేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం.....రక్షించుకోవడానికి ఆదివాసుల ఉద్యమం |
| ప్రపంచ విప్లవ పరిస్థితులపై మావోయిస్టు పార్టీ అంతర్జాతీయ వ్యవహారాల కమిటీ ప్రకటన
|
| హిందీ భాష మాట్లాడని వారు ఈ దేశం వదిలి వెళ్ళాలి - యూపీ మంత్రి భాషాహంకారం
|
more..