వాట్సప్ లోదైవ దూషణ చేశాడని యువకుడికి మరణ శిక్ష !
మతాలన్నీ శాంతినే ప్రబోధిస్తాయని మత పెద్దలు చెబుతుంటారు. కానీ ప్రపంచంలో ఇప్పుడు మతంపేరుతో మారణ హోమంజరుగుతోంది. మతం పేరుతో హత్యలు, దాడులు అనేక రకాల అరాచకాలు సాగుతున్నాయి. భారత్ లో పాలకుల అండతో మాతోన్మాద శక్తులు ఆపని చేస్తోంటే పాకిస్తాన్ లో ఆ పని ఏకంగా చట్టమే చేస్తోంది.
పాకిస్తాన్ లో ఓ వ్యక్తి తన స్నేహితుడికి వాట్సప్లో ఓ పద్యాన్ని పంపాడని, అందులో దైవదూషణ ఉందని నదీమ్ జేమ్స్ మసిహ్ అనే క్రైస్తవుడిపై కేసు నమోదైంది. దీంతో ఆయనకు అక్కడి న్యాయస్థానం మరణశిక్ష విధించింది. ఈ కేసును జేమ్స్ స్నేహితుడు యాసిర్ బషీరే వేయడం గమనార్హం.
ఈ తీర్పుపై డిఫెన్స్ లాయర్ మీడియాతో మాట్లాడుతూ.. తన క్లయింట్ జేమ్స్ అమాయకుడని చెప్పారు. జేమ్స్ ఓ ముస్లిం బాలికతో సన్నిహితంగా ఉంటున్నాడని, ఈ కారణంగానే అతడిపై తప్పుడు అభియోగాలు మోపారని అన్నారు. ఈ తీర్పును లాహోర్ హైకోర్టులో సవాల్ చేస్తామని తెలిపారు.
తమ మతానికి వ్యతిరేకంగా మాట్లాడారనే పేరుతో పాకిస్థాన్లో మత ఛాందసవాదుల దాడులకు, హత్యలకు గురైన సంఘటనలు కోకొల్లలు. దీంతో తనపై నేరారోపణ రాగానే జేమ్స్ ఇంటి నుంచి పారిపోయి, కొన్ని రోజులకి పోలీసులకు లొంగిపోయాడు. లాహోర్కు 200 కిలోమీటర్ల దూరంలోని గుజరాత్ జైల్లోనే అతడిని న్యాయస్థానం విచారించింది.
పాకిస్థాన్లో మైనారిటీలపై దాడులు ఎప్పటినుంచో జరుగుతున్నాయి. దైవదూషణకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ పదేపదే దాడులు జరుగుతున్నాయి. భారత్, పాక్ లతో సహా ప్రపంచవ్యాప్తంగా మత మైనారిటీలపై జరుగుతున్న దాడులకు అంతులేకుండా పోతోంది.
Keywords : pakistan,court, Capital punishment , religion, india
(2023-09-28 08:17:32)
No. of visitors : 2458
Suggested Posts
| భారత మాతకు పాకిస్తాన్ బిడ్డ రాసిన ఉత్తరంప్రియమైన భారత్ మాతా నేను నీ సోదరుడి బిడ్డను. సరిహద్దులకు ఈవల కరాచీ నుండి ఈ లేఖ రాస్తున్నాను. చాలా ఏళ్ళ క్రితమే నువ్వూ నీ తమ్ముడూ విడిపోయారు కానీ నాలో ఇప్పటికీ నీరక్తమే ప్రవహిస్తోంది. |
| What Pakistani Girls think about INDIAWatch This Video What Pakistani Girls think about India and What the Pakistani Schools Teaching to the Students |
| దేవుడు లేడన్నందుకు ఓ విద్యార్థిని దారుణంగా కొట్టి చంపారువందల మంది చుట్టుముట్టి కర్రలతో, ఇనుప రాడ్ లతో, రాళ్ళతో విచక్షణా రహితంగా కొట్టి చిత్ర హింసలు పెట్టి చంపారు. శరీరంపై బుల్లెట్ గాయం కూడా ఉంది. దాడిలో 4 వేల మంది పాల్గొన్నారు. దాడి చేస్తున్నంతసేపూ ఆవేశ పూరితంగా నినాదాలు చేశారు..... |
| అమ్మాయిలు పొట్టి బట్టలు వేసుకోవడం వల్లే కరోనా వచ్చింది - మత పెద్ద మూర్ఖపు కామెంట్లు
కరోనా లాంటి వైరస్ ల విజృంభణకు అమ్మాయిలు కురచ దుస్తులు ధరించడమే కారణమట ! పాకిస్తాన్ కు చెందిన మతాధికారి తారిక్ జమీల్ ఈ విచిత్ర వ్యాఖ్యలు చేశారు. ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సమక్షంలోనే ఆయన ఈ మాటలు మాట్లాడాడు. |
| అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
|
| పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన |
| వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2) |
| వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1) |
| విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్ |
| హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ |
| అనారోగ్యంతో ఉన్న మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు |
| మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన |
| మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ ! |
| సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ |
| తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శన్ స్తూపావిష్కరణ |
| గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది -మావోయిస్టు పార్టీ |
| గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం |
| మణిపూర్ లో ప్లాటినం, క్రోమైట్, నికెల్ వంటి ఖనిజ సంపదను దోచుకోవడానికే కుకీల ఊచకోత -మావోయిస్టు పార్టీ |
| యాభై ఏళ్ల నక్సల్బరీ: కవిత్వంలో అమరత్వం...జూలై 28 - వరవరరావు |
| నేటి నుంచి అమర వీరుల సంస్మరణ వారం ప్రారంభం - ఘనంగా జరపాలని మావోయిస్ట్ పార్టీ పిలుపు
|
| త్వరలో...అమరులైన మావోయిస్ట్ పార్టీ సీసీ మెంబర్స్ జీవిత చరిత్రల పుస్తకాలు విడుదల |
| భారత విప్లవోద్యమ నాయకుడు కటకం సుదర్శన్ అమర్ రహే! |
| RSS, BJP లకు వ్యతిరేకంగా పోరాడుదాం, మహిళా రెజ్లర్లకు మద్దతుగా నిలబడదాం... విప్లవ ఆదివాసీ మహిళా సంఘం
|
| పాలకులకు లొంగిపోయిన విప్లవద్రోహి గజ్జెల సత్యం రెడ్డిని ఎండగట్టండి... మావోయిస్టు పార్టీ ప్రకటన |
| మేడే సందర్భంగా మావోయిస్టు పార్టీ లేఖ |
| అసలు మనుస్మృతి లో ఏముంది? -ఎన్. వేణుగోపాల్ |
| పోలీసులు విమానాల ద్వారా బాంబు దాడులు చేస్తున్నారు, హిడ్మా క్షేమం -మవోయిస్టు పార్టీ ప్రకటన |
| కామ్రేడ్ సిసాన్ స్మృతిలో జనవరి 16న దేశవ్యాప్త కార్యక్రమాలకు మావోయిస్టు పార్టీ పిలుపు!
|
| కాకలు తీరిన యోధుడు కామ్రేడ్ ఎస్.ఎల్.ఎన్ మూర్తి - మావోయిస్టు పార్టీ |
more..