అమానుషంగా అమ్మాయిలను కొట్టారు...వాళ్ళ మీదే కేసులు పెట్టారు...బేటీ బచావ్...బేటీ పడావ్..అంటే ఇదేనా ?

విద్యార్థినులపై దాడి చేసి నెత్తురోడేట్టు అమానుషంగా కొట్టిన పోలీసులపై చర్యలు తీసుకోవల్సింది పోయి బాధితులపైనే కేసులు పెట్టారు. ఉత్తర ప్రదేశ్ లోని బెనారస్ హిందూ యూనివర్సిటీకి చెందిన 1000 మంది విద్యార్థులపై ఇవ్వాళ్ళ కేసు నమోదయ్యింది. విద్యార్థినులపై దాడి చేసిన దుండగులపై చర్యలు లేవు. న్యాయమడిగినందుకు విద్యార్థినులను తరిమితరిమి కొట్టిన పోలీసులపై చర్యలు లేవు. కానీ గాయపడి రోదిస్తున్న విద్యార్థులమీద మాత్రం కేసులు నమోదయ్యాయి. ఇదీ యోగీ ఆదిత్యానాథ్ అహంకారపూరిత అరాచక పరిపాలన.

యూనివర్సిటీలో మొదటి సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థినిపై శుక్రవారంనాడు ముగ్గురు గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు. అక్కడే ఉన్న సెక్యూరిటీ సిబ్బంది దుండగులను అడ్డుకోక పోగా తమకే సంబంధంలేనట్టు అక్కడి నుండి వెళ్ళి పోయారు. ఈ ఘటనపై చర్యలు తీసుకోవాలని విద్యార్థునీ విద్యార్థులు ఆందోళనకు దిగారు. తమకు యూనివర్సిటీలోనే భ‌ధ్రత కరువయ్యిందని భద్రత కల్పించాలంటూ నినదించిన విద్యార్థినులపై పోలీసులు పాశవికంగా దాడి చేశారు. విద్యార్థినులను తరిమి తరిమి కొట్టారు. మగ పోలీసులు యువతులను దారుణంగా కొట్టారు.

విద్యార్థినులను చితకబాదుతున్న చిత్రాలకు సంబంధించి వీడియోలు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తుండడంతో ఆగ్రహించిన ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్‌ యోగి సదరు పోలీసులపై చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించాల్సిందిపోయి ఎవరు తమ సెల్‌ఫోన్‌లో ఈ వీడియోను తీసి సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేశారో పట్టుకొని వాళ్ళను అరెస్టు చేయాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. ఇదంతా జాతీయ వ్యతిరేకులు, నరేంద్ర మోడీ రాజకీయ వ్యతిరేక శక్తులు ఉద్దేశపూర్వకంగా ఆందోళన చేస్తున్నాయని ఆయన ఆరోపించారు.

ఉత్తర ప్రదేశ్‌ ఎన్నికల తర్వాత మోడీ మొదటిసారి శనివారం నాడు తన పార్లమెంట్‌ నియోజక వర్గంలో పర్యటించేందుకు వారణాసి వస్తున్న సందర్భంగానే బనారస్‌ హిందూ యూనివర్సిటీలో ఈ సంఘటన‌ జరగడంతో విద్యార్థినీ విద్యార్థులు మోడీకి తమ సమస్యలను చెప్పుకోవదానికి సిద్దమయ్యారు. దాంతో ఆదిత్యానాథ్ కు కోపమొచ్చింది. యూనివర్సిటీ నిండా పోలీసులను మోహరించాడు. ప్రధాన పర్యటన రూటును మార్చారు. ఆదిత్యనాథ్‌ యోగి ఆదేశం మేరకు ప్రశాంతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థినుల‌పై పోలీసులు తమ లాఠీ ప్రతాపం చూపారు.

పర్యవసానంగా యూనివర్శిటీ క్యాంపస్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సెప్టెంబర్‌ 28వ తేదీ నుంచి యూనివర్శిటీని దసరా సెలవులు ఉండగా, మూడు రోజుల ముందుగా, అంటే సోమవారం నుంచి సెలవులు ప్రకటించారు. విద్యార్థినీ విద్యార్థులను హాస్టళ్లను ఖాళీచేసి వెళ్లిపోవాల్సిందిగా అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఇంత గొడవ జరుగుతున్న ప్రధాని మోడీ తమ భద్రత గురించి ఒక్క మాట కూడా మాట్లాడక పోవడం అన్యాయమని యూనివర్శిటీ విద్యార్థినులు ఆరోపిస్తున్నారు. మోడీ మగాళ్ల ఆధిపత్యవాదనే విషయం దీనివల్ల నిజమేమోనని అనిపిస్తుందని వారన్నారు. శనివారమంతా ఆవుల ఆరోగ్య పరీక్షలను పర్యవేక్షిస్తూ మూగజీవుల హక్కులను పట్టించుకున్న మోడీ, తమ గురించి ఎందుకు పట్టించుకోరని, ఓటు హక్కులేని ఆవులకంటే ఓటు హక్యు, రాజ్యాంగ హక్కులు కలిగిన తాము తీసిపోయామా? అని వారు ప్రశ్నిస్తున్నారు.

ఇజ్జత్‌ ఘర్‌ నినాదంతో మహిళల మానరక్షణకు మరుగుదొడ్లు అత్యవసరమంటూ చెబుతున్న మోదీ, తమ మాన, ప్రాణాల మీద జరుగుతున్న దాడులను ఎందుకు పట్టించుకోరని విద్యార్థి నాయకురాలు వందనా సింగ్‌ సోషల్‌ మీడియా ద్వారా ప్రశ్నించారు. విద్యార్థినులపై పోలీసులు జరిపిన పాశవిక దాడికి సంబంధించిన వీడియోలు ఇప్పటికీ ʹబీహెచ్‌యూ బజ్‌ʹ పేరిట సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. బేటీ బచావ్...బేటీ పడావ్..అంటే ఇదేనా ? అని బెనారస్ హిందూ యూనివర్సిటీ విద్యార్థునులు వేస్తున్న‌ ప్రశ్న ఈ ʹమోడీలుʹ అసలు వినదల్చుకున్నారా ?

Keywords : benaras hindu university, BHU, Administration Registers, FIRs Against 1,000 Students, Arson, After Thrashing, Lathicharge
(2024-04-24 18:59:58)



No. of visitors : 2866

Suggested Posts


అది రామరాజ్యం... ఆవులకేమో అంబులెన్సులు... పిల్లల‌కేమో చావుకేకలు !

ఆవులకు ఏమైనా అయితే రక్షించడానికి, వాటిని ఆఘమేఘాలమీద ఆస్పత్రికి తరలించడానికి అంబులెన్స్ లు ప్రారంభించారు. ఇంత గొప్పగా జరుగుతున్న యోగీ మహరాజ్ పాలనలో గోరఖ్ పూర్ లోని ప్రభుత్వ ఆస్పత్రిలోఆక్సీజన్ లేక‌ 63మంది చిన్నారుల‌ ప్రాణాలు పోయాయి. ప్రభుత్వం బాకీ పడ్డ 60 లక్షల రూపాయలు ....

అనుకున్నంతయ్యింది...బీజేపీ నేత కూతురును పెళ్ళి చేసుకున్న దళిత యువకుడిపై దాడి జరిగింది

నాన్నా నన్నూ అజిత్ ను చంపకండి ప్లీజ్ అంటూ ఉత్తర ప్రదేశ్ ఎమ్మెల్యే కూతురు సాక్షి మిశ్రా వేడుకున్న వీడియో మీకు గుర్తుంది కదా.... తాను దళితుడిని పెండ్లి చేసుకున్నందుకు మమ్మ‌ల్ని చంపడానికి నాన్న గూండాలను పంపుతున్నాడని, పోలీసులు తమకు రక్షణ కల్పించాలని ఆమె విఙప్తి చేసింది. అయితే ఆ యువతి అనుకున్నంతా అయ్యింది. సాక్షాత్తూ హైకోర్టు ముందరే వీరిపై దాడి

రోహింగ్యాల పట్ల సానుభూతి చూపిన ప్రియాంకా చోప్రా దేశం విడిచి వెళ్ళిపోవాల్సిందే ‍- బీజేపీ నేత

రోహింగ్యా శరణార్థులను సందర్శించిన సినీ నటి ప్రియాంకా చోప్రా దేశం విడిచి వెళ్ళాలంటూ బీజేపీ నేత వినయ్ కటియార్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రోహింగ్యా శరణార్థులను సందర్శించడానికి వెళ్లిన వారెవరైనా దేశం విడిచి వెళ్ళిపోవాల్సిందేనంటూ ఆయన అన్నారు.

అది మనువాదపు కసాయి రాజ్యం ‍‍- ప్రేమంటే నరనరాన ద్వేషం

ఓ యుతి, ఓ యువకుడు జంటగా రోడ్డు మీద వెళ్తున్నారు. నవ్వుతూ తుళ్ళుతూ కబుర్లు చెప్పుకుంటూ వెళ్తున్న వాళ్ళను చూసి యాంటీ రోమియో స్క్వాడ్ ముసుగేసుకున్న మనువులకు మండింది. సంఘ్ పరివార్ పాలనలో మగ ఆడ కలిసి తిరగడ ఎంత పాపం ! ఆ పాపానికి ఒడిగట్టిన ఆ ఇద్దరినీ పట్టుకొని కొట్టారు, పోలీసులతో కలిసి యువకుడికి గుండు గీసి అవమానించారు....

యోగీ రాజ్యంలో దారుణం... ఆక్సిజన్ లేక 30 మంది చిన్నారుల మృతి !

ఆక్సిజన్‌ సరఫరా చేస్తున్న కంపెనీకి ప్రభుత్వం కట్టాల్సిన 66లక్షల రూపాయల బాకీ కట్టకపోవడం వల్ల ఆ కంపెనీ ఆక్సిజన్‌ పంపిణీని ఆపేసింది. ఫలితంగా ఇంతమంది చిన్నారుల ప్రాణాలు గాల్లో పోయాయి....

ముస్లిం మహిళలను గ్యాంగ్ రేప్‌ చేయండి.. బీజేపీ మహిళా మోర్చా చీఫ్ సునీత

ఇప్పుడు ముస్లింలకు ఒకే ఒక్క పరిష్కారం ఉంది. హిందూ సోదరులు పది మంది కలిసి గ్రూపుగా ఏర్పడి ముస్లిం మహిళలను గ్యాంగ్ రేప్ చేయాలి. తల్లులు, చెల్లెళ్లు ఎవరినీ వదలకూడదు. అందరినీ బహిరంగంగా వీధుల్లోకి లాక్కొచ్చిమరీ అత్యాచారం చేయాలి.

ఎముకలు విరిచారు...రాడ్లను దూర్చారు..గుడికి వెళ్ళిన మహిళపై పూజారి, అతని అనుచరుల గ్యాంగ్ రేప్

ఉత్తరప్రదేశ్‌లో మహిళలపై అత్యాచారపర్వాలు కొనసాగుతున్నాయి. హథ్రాస్‌ ఉదంతం మరవకముందే బదూన్‌లో మరో అమానుష ఘటన చోటుచేసుకుంది.

యోగీ రాజ్యం: ఆవును కాపాడటం కోసం మహిళను చంపేసిన పోలీసు

అది ఉత్తర ప్రదేశ్ లోని హర్రియా పట్టణం శనివారం నాడు వేగంగా వెళ్తున్న ఓ పోలీసు జీబు డ్రైవర్ కంట్రోల్ తప్పింది. ఆ జీబుకు ఎదురుగా ఓ ఆవు వస్తోంది. డ్రైవర్ కు ఆ సమయంలో తమ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యానాథ్, ఆయన శిష్యులైన గోరక్షకులు....

ఉన్నావ్ అత్యాచార బాధితురాలి హత్యకు కుట్ర...ఇద్దరి మరణం..బీజేపీ ఎమ్మెల్యేపై కేసు నమోదు

గతేడాది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌ అత్యాచార ఘటన బాధితురాలు ప్రయాణిస్తున్న కారును ఆదివారం ట్రక్కు ఢీకొనడంతో బాధిత యువతి బంధువులు ఇద్దరు మరణించారు. బాధితురాలితోపాటు ఆమె న్యాయవాది కూడా తీవ్రగాయాలపాలయ్యారు. అధికార బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్‌ సెంగార్‌ తనపై అత్యాచారం చేశాడని 19 ఏండ్ల‌ బాధితురాలు గతేడాది ఫిర్యాదు చేయగా

గాడిద పెండతో నకిలీ మసాలాలు తయారు చేస్తున్న హిందూ వాహిని నాయకుడి అరెస్ట్

ఉత్తరప్రదేశ్ లో నకిలీ మసాలాలు తయారు చేసే ఓ ఫ్యాక్టరీపై దాడి చేసి దాని యజమానిని అరెస్టు చేశారు. ఈ ఫ్యాక్టరీ హత్రాస్ జిల్లా నవీపూర్ లో ఉంది. అయితే ఇందులో రెండు అంశాలు బాగా ఆసక్తి కలిగిస్తాయి. ఒకటి ఆ మసాలాలు దేనితో తయారు చేస్తున్నారనేది కాగా మరొకటి తయారు చేయిస్తున్న ఫ్యాక్టరీ యజమాని ఎవరు అనేది..

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


అమానుషంగా