తన కొడుకు రాసిన నవలను ఆవిష్క‌రించిన కిషన్ జీ తల్లి మధురమ్మ‌

తన

మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ సాధన రాసిన రాగో నవల ఇవ్వాళ్ళ అమరుడు మల్లోజుల కోటేశ్వర్ రావు అలియాస్ కిషన్ జీ తల్లి మధురమ్మ పెద్దపల్లి లోని తన ఇంట్లో ఆవిష్కరించింది. ఈ కార్యక్రమంలో విప్లవ రచయిత వరవరరావు, హేమలత, రాగో నవల ప్రచురణకర్త‌ బాల్ రెడ్డి పాల్గొన్నారు.


(రాగో నవల‌ ముందు మాట‌)
భారతదేశంలో సుమారు పదకొండు కోట్ల మంది ఆదివాసులు జీవిస్తున్నారు. భారతదేశంలో వర్గ సమాజం రూపొందుతున్న క్రమం నుండి ఆదివాసులు పోరాటాలు చేస్తూనే ఉన్నారు. ఆధిపత్య శక్తులకు లొంగిపోయిన ఆదివాసులు వాళ్ళ ఆర్థిక హోదాను బట్టి కులహోదాను సంతరించుకున్నాయంటారు కోశాంబి. ఈ పోరాటాల చరిత్ర అట్లా ఉంచితే - ఈ ఘర్షణ లొంగుబాట్లలో ఆదివాసి జీవితంలో మనిషిని అణచిపెట్టే ఖాయిదాలు (సంప్రాదాయాలు) అనేకం వచ్చాయి. ఫలితంగా ఈ ఆదివాసులు సమస్త పీడనలను, దోపిడీని ఎదురించాలంటే తమతో తాము - సమస్త పీడలను కాపాడే రాజ్యంతో పాటు యుద్ధం చేయవల్సిందే. అలాంటి యుద్ధంలో ఆదివాసులను సమీకరించడం కోసం
దండకారణ్యంలో 1980 నుండి విప్లవకారులు కృషి చేస్తున్నారు.

ఈ క్రమంలో ఎదురైన అనుభవాలను తమకు సాధ్యమైన రీతిలో సాహిత్యీకరించ డానికి అలాంటి పనిలో ఉన్నవాళ్ళు నిరంతరం కృషి చేస్తున్నారు. అలాంటి సాహిత్యకారుల్లో అనేక వ్యాసాలు, సరిహద్దు, రాగో (గోండి భాషలో రామచిలుక) రాసిన సాధన కృషి చెప్పుకోదగినది.

సమస్త కళలు, సాహిత్యం అస్థిత్వంలో ఉన్న అధికార రాజ్యపు భావజాలంతోనే నిండి ఉంటాయి. ప్రజాపోరాటాల నేపథ్యంలోనే ప్రజా సాహిత్యం వస్తుంది. ప్రజా పోరాటాల స్థాయియే ప్రజా సాహిత్యపు తీరుతెన్నులను నిర్ణయిస్తుంది. ప్రజా పోరాటాలను గుర్తించి నడిపించే శక్తులే ఇలాంటి సాహిత్యాన్ని ఆదరిస్తారు. ఈ స్థాయి, సందర్భము అర్థం కాకుంటే సాహిత్యం గురించి విడిగా ఆలోచించి చాలా మంది గాభరపడుతారు.

సాధన రచయితగానే కాకుండా అతను సాహిత్యం ద్వారా అన్వేషించిన ప్రశ్నలు, చెప్పిన అనుభవాలు బహుశా సాహిత్యం చదివే చాలా మందికి కొత్త.

ఆదివాసుల గురించి వచ్చిన సాహిత్యం మిగతా సాహిత్యంతో పోల్చుకుంటే చాలా తక్కువ. అందుక్కారణం వాళ్ళు అనేక సంవత్సరాలుగా సభ్య సమాజానికి దూరంగా ఉండడమే. బీహార్‌ ముండా ఆదివాసుల గురించి మహాశ్వేతాదేవి ఒరిస్సాలోని జాతావుల గురించి గోపీనాథ్‌ మహంతి లాంటి వాళ్ళు నవలలు రాశారు. ఈ సాహిత్యం వ్యక్తులుగా ఆదివాసి జీవితాన్ని దర్శించిన తీరు తెలుపుతుంది.

కాని 1980 తరువాత అడవి ప్రాంతాల్లోకి విస్తరించిన ప్రజాపోరాటాలు ఆదివాసి జీవితంలోని సమస్య వైరుధ్యాలను అధ్యయనం చేయవల్సి వచ్చింది. ఈ అధ్యయనపు నేపథ్యంలోనే - సాహు - అల్లం రాజయ్య గోండుల జీవితం మీద కొమురం భీం నవల వచ్చింది. ఈ నవల ఆదివాసి ప్రాంతంలోని రాజ్యాన్ని, దోపిడిని చర్చించింది. ఈ దోపిడి రాజ్యంతో ఆదివాసులు సాగించిన పోరాటంలోని వైఫల్యాలను విశ్లేషించింది. అంతకన్నా భిన్నంగా నడుపాల్సిన పోరాట ఆవశ్యకతను గుర్తించింది.

ఆదిలాబాదు జిల్లాలో ఆదివాసులను దోపిడి చేయడానికి బయటి శక్తులెట్లా చొరబారి నిలదొక్కుకున్నాయో వసంతరావుదేశ్‌ పాండే నవల అడివి చర్చించింది. సాహు రాసిన అనేక కథలు, పాటలు, వ్యాసాలు జరుగుతున్న ఆదివాసి పోరాటాలను ఎప్పటికప్పుడు చిత్రించాయి.

అడవిలో వెన్నెల కథా సంకలనం ఇలాంటి కథలతో వచ్చింది.పులి ఆనంద్‌ మోహన్‌ నవల వసంతగీతం ఆదివాసి జీవితానికి - మైదాన ప్రాంతంలోని ఆదివాసియేతర జీవితానికి ఉండే సంబంధాన్ని, రాజ్యం తన సమస్త అంగాలతో ఈ రెండు ప్రాంతాలల్లోన్ని జనాన్ని ఏ విధంగా అణచి వేస్తున్నదో? అక్కడ కాలూనుతున్న పోరాటాలు ఎంత చిన్నవైనా దోపిడి యంత్రాంగం ఏ విధంగా కదిలిపోగలదో ఇరుపక్షాల చరిత్రను చిత్రీకరించింది.

సాధన నవల సరిహద్దు 1985 తర్వాత కాలానికి సంబంధించినది. 1985 తరువాత విప్లవ ఆచరణలో వచ్చిన అధ్యయనం ఈ నవలలో కనిపిస్తుంది. ఈ నవలలో సాధన ఆదివాసియేతర - ఆదివాసి అనుభవాల సారాంశం ఈ నవల నిండా కన్పిస్తుంది. విప్లవ సాంప్రదాయిక సాహిత్యంలో ఉండే కాల్పనికత - బోధనల నుండి జఠిలమైన యాతన, పీడనల సమాజంలోని అనేక అంశాలను ఇంకా లోతుగా అధ్యయనం చేయాలని ఈ నవల ప్రతిపాదిస్తుంది. రూపం, భాష తదితర విషయాలల్లో సరిహద్దు నవల సాధన మొదటి నవల.సాధన రెండో నవల రాగో. ఒక రకంగా సరిహద్దు నవల కొనసాగింపులాగా కనిపిస్తుంది ఈ నవల. పాత్రలు కూడా చాలా వరకు రెండు నవలల్లో ఒకే పాత్రలు. కాని ఈ నవల వస్తువులో రూపంలో పూర్తిగా భిన్నమైనది.

రాగో యుక్త వయస్కురాలైన మాడియా గోండు యువతి. గోండుల్లో ఉన్న ఆచారం ప్రకారంగా రాగో చిన్నపిల్లగా ఉన్నప్పుడే రాగో తండ్రి పిల్ల నిస్తానని ఒక బీద యువకున్ని లామడే (ఇల్లరికం) తెచ్చుకున్నాడు. రాగో శారీరకం గానే కాక, మానసికంగా కూడా ఆ యువకున్ని ఇష్టపడలేదు. అదే గ్రామంలోని మరొక పెళ్ళయిన యువకునితో రాగోకు సంబంధం కలిసింది (బహు భార్యాత్వం ఉంది). పెళ్ళి కాదంటే రాగో తండ్రి లామడే యువకునికి అన్ని సంవత్సరాలకు జీతం కట్టాలి - బలవంతపు పెళ్ళి నుండి తప్పించుకొని కోరుకున్న వాని ఇల్లుసొచ్చింది అతను ఉంచుకుంటే ఆ యువకుడికి జీతం ఇచ్చుకోవాలి. కోరుకున్నవాడు భయపడ్డాడు. రాగోను పశువును బాదినట్లు బాదుతూ మళ్ళీ తీసుకవచ్చారు. రాగో ఈ దుర్మార్గమైన ఖాయిదాను ఖాతరు చెయ్యదలచుకోలేదు. తప్పించుకున్నది. అడవిలో చెట్లు పుట్టలు పట్టి తిరిగింది. చివరకు స్నేహితురాలు ఇల్లు చేరుకున్నది. మళ్ళీ తండ్రికి దొరికింది. మళ్ళీ తన్నులు గుద్దులు. మళ్ళీ రాగో తప్పించుకున్నది.

ఈసారి మాడియా మనుషులేకాదు మనుషులంతా దుర్మార్గులేనని వ్యక్తులుగా మంచివాళ్ళుగానే ఉన్నా? తనలాగే పెనుగులాడినా చివరకు ఖాయిదా వాతబడి మనుషులపట్ల ముఖ్యంగా స్త్రీలపట్ల దుర్మార్గంగా ప్రవర్తిస్తారని ఆలోచించింది. అడివిలో తిరుగుతూ తనకు పరిచయమున్న సమస్త మానవ సంబంధాల గురించి ఆలోచించింది. ఆ విధంగా దారితెన్ను కానకుండా తిరుగుతున్న దశలో దళంతో కలిసి - అక్కడి నుండి రాగో దళ జీవితంలో ఊపిరి సలుపకుండా తిరుగుతుంది. తనొక్కతే అనుభవించిన క్షోభ - స్వేచ్ఛ కోసం పడిన ఆరాటం మాడియా స్త్రీలందరిలోనూ చూస్తుంది. ఈ బాధలు ఖాయిదాల స్వరూప స్వభావాలు - అవి మొత్తం ఆదివాసి జీవితంలో పెనవేసుకపోయిన తీరు అర్థం చేసుకుంటుంది. పార్టీ సభ్యత్వము, తండ్రి రాగోను ఆమోదించడంతో నవల ముగుస్తుంది.

ఈ నవల రాగో లేవనెత్తిన ప్రశ్నల రూపంలో ఆదివాసి ఖాయిదాలకు సంబంధించినట్టు కన్పించినా ఇవి ప్రపంచ ప్రజలవి. ముఖ్యంగా ప్రపంచ జనాభాలో సగ భాగంగా ఉన్న స్త్రీలకు సంబంధించినవి.

సకల మానవ సృష్టిని, వ్యక్తీకరణను నియంత్రించే క్రమంలోనే రాజ్యం తనను తాను నిలబెట్టుకున్నది. రాజ్యం తన మనుగడ కోసం వ్యక్తుల వ్యక్తిత్వాన్ని, వ్యక్తీకరణను నియంత్రించే నిర్మాణ రూపాలను రూపొందించుకున్నది. అలాంటి నిర్మాణ రూపంలో చాలా పురాతనమైనది, సంక్లిష్టమైనది, జటిలమైనది ఇంతవరకు జరిగిన వర్గపోరాటాల్లో కూడా మిగిలి ఉన్నది కుటుంబం. అయితే రాజ్యంతో మానవులు జరిపిన పోరాటాల చరిత్ర తెలిసినంతగా మానవులు కుటుంబంతో జరిపిన పోరాటాల చరిత్ర (ఒక్క టాల్‌స్టాయ్‌ అన్నా కెరీనా తప్ప) ముఖ్యంగా భారతీయులకు కొత్త. ఉత్పత్తి, పునరుత్పత్తి, లింగ భేదాలతో పాటు అనేక పీటముళ్ళతో ఈ చరిత్ర నిండి ఉన్నది. అయినా అనివార్యంగా ఈ కుటుంబంతో, కుటుంబంలో మానవులు ఎడతెగని ఒంటరి పోరాటాలు చేస్తున్నారు. మనం ఇప్పటి దాకా చూసిన అన్ని రకాల సమాజాలల్లో ఈ పోరాటం కొనసాగుతూనే ఉన్నది. కుటుంబం పురుషుల కన్నా స్త్రీలను దాదాపు సంపూర్ణంగా అణచివేసింది.

కుటుంబంలో జరిగిన భయంకర యుద్ధంలో స్త్రీలదే ప్రధాన పాత్ర.రాగో ప్రశ్నలన్నీ ఇట్లాగా నిర్మితమై కొనసాగుతున్న కుటుంబానికి సంబంధించినవి. రాగో రామచిలుకలాగా స్వేచ్ఛగా ఆకాశంలో ఎగురాలనుకున్నది. మనిషిని మనిషి చేరుకోవడానికి ఉన్న సమస్త అడ్డంకులను ప్రశ్నించింది.

అయితే ఇలాంటి స్వేచ్ఛకు వ్యక్తీకరణకు సంబంధించిన రాగో దళంలో చేరడంతో అన్ని ప్రశ్నలకు జవాబు దొరికిందా? మహా అయితే ప్రశ్నలు మరింత జటిలమయ్యాయి. దళంలో తిరిగి విప్లవ కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా మనుషుల సమస్త బంధనాలు త్రెంచేయగలమని రాగో తనకు తాను జవాబు చెప్పుకున్నదా? దళంలో ఉండే ఇతర సభ్యులందరికి ఇలాంటి ప్రశ్నలున్నాయి. తీరిక లేని దళ కార్యక్రమంలో తిర్గడానికి - ప్రజాపోరాటాలు నిర్ణయించడానికి మధ్య చర్చించని అగాధం - చాలా ముఖ్యమైనవి.

ఒక్క మాటలో చెప్పాలంటే సమస్త ఉద్రిక్తతలతో యాతనలతో విసిగి వేసారి జనం తమ సంపూర్ణ వ్యక్తీకరణ కోసం, స్వేచ్ఛ కోసం పోరాడడానికి సిద్ధపడతారు. ఇలాంటి స్వేచ్ఛను ఆర్తితో పట్టించుకొని నూతన ప్రజాస్వామిక విప్లవాచరణలో ఓపికగా నడిపించగల్గినప్పుడే సమస్త పీడనలు పోవడానికి మార్గం సుగమమౌతుంది.అడవిలో ఒంటరిగా తిరుగుతూ రాగో వేసిన ప్రశ్నలు నిజానికి దళం ముందు చెప్పనేలేదు. బహుశా ఆ వొత్తిడిని తట్టుకోలేక దారీతెన్నూ కానక దొరికిన దారిలో నడిచిందేగాని అదే అసలైన దారి అని పూర్తిగా నమ్మలేదు. అట్లని అంతకన్నా రాగోను మనిషిగా ఇదివరకు పరిగణించిన వారూలేరు.

రాగోలాగే మనుషులంతా ఎగురాలనే తీవ్రమైన అన్వేషణలో ఉన్నారు. వెతుకులాటలో ఉన్నారు...
తన్ను తాను తెలుసుకోవడమే కాదు. తనలాంటి వాళ్ళను తనతో పాటు రాగో తీసుకపోగలదా?
ప్రపంచం అతలాకుతలంగా ఉన్న ఈ సంక్షుభిత సమయంలో భవిష్యత్తు రాగో మీద ఆధారపడి ఉన్నది.

- యస్‌. పి. వసంత
(ముందుమాట )
ప్రతులకు:
మలుపు 2-1-1/5, నల్లకుంట, హైదరాబాద్‌-500044
ఇమెయిల్‌ : malupuhyd@gmail.com

Keywords : raago, kishanji, maoists, adivasi, struggle
(2024-04-22 05:10:29)



No. of visitors : 2941

Suggested Posts


శృతిని అత్యాచారం చేసి, హింసలు పెట్టి చంపారు - వరవరరావు

వరంగల్ జిల్లాలో మంగళవారంనాడు ఎన్ కౌంటర్ జరిగినట్టు పోలీసులు చెబుతున్నది అబద్దమని శృతిని విద్యాసాగర్ లను పోలీసులు పట్టుకొని చిత్రహింసలు పెట్టి చంపారని విప్లవ రచయిత వరవరరావు ఆరోపించారు....

అది ఎన్‌కౌంట‌ర్ కాదు - అత్యాచారం చేసి చంపేశారు : నిజ‌నిర్థార‌ణ బృందం

హిడ్మే ఒంటిపై దుస్తులను తొల‌గించి... సామూహిక అత్యాచారానికి పాల్ప‌డ్డారు. శరీర భాగాల‌న్నింటినీ క‌త్తుల‌తో కోశారు. ఆ త‌రువాత చాతీపై, క‌డుపులో తూటాల వ‌ర్షం కురిపించారు. మృత‌దేహాన్ని సుక్మా ప‌ట్ట‌ణానికి త‌ర‌లించారు. 14వ తేది విష‌యం తెలుసుకున్న గ్రామ‌స్తులు....

శ్రుతి పాడిన పాట దోపిడి గుండెల్లో తూట !

శ్రుతి.... చిన్నప్పటినుండే విప్లవ భావాలతో పెరిగింది. సమాజాన్ని నిశితంగా గమనిస్తూ, సమాజాన్ని చదువుతూ పెరిగింది. వేదికలెక్కి సమాజాన్ని చైతన్య పరిచే పాటలు పాడింది. ఎమ్ టెక్ చదివిన శ్రుతి తన తండ్రి సుదర్శన్ చెప్పినట్టు అమెరికాకు కాకుండా అడవిలోకి....

రాజ్యం పెంచి పోషించిన ప్రజా హంతకుడు నయీం - మావోయిస్టు పార్టీ

హంతక ప్రభుత్వాల పోలీసు యంత్రాంగం ఎస్ఐబి డైరెక్షన్లో ఎంతో మంది ప్రజలను, పౌరహక్కుల నేతలను, ఉద్యమకారులను కిరాతకంగా చంపిన ప్రజా హంతకుడు నయీం చావు వార్త పీడిత ప్రజలకు పండుగ వంటిదే కాకుంటే తనను పెంచి, పోషించి ఎన్నో చీకటి హత్యలకు ఆయుధంగా వాడుకున్న దోపిడీ పాలక వర్గం చేతిలో కన్నా ప్రజల చేతిలో నయినాం ఖతం అయితే ప్రజలు ఎక్కువగా సంతోషపడేవాళ్ళు...

చీప్ లిక్కర్ తో గ్రామజ్యోతిని వెలిగిస్తారా - మావోయిస్టు జగన్ ప్రశ్న

ప్రభుత్వం హరితహారం లో మొక్కలు నాటడం కోసం ఆదివాసులను భూముల్లోంచి వెళ్ళగొడతోందని జగన్ మండి పడ్డారు. ఒక వైపు ప్రజలను చీప్ లిక్కర్ లో ముంచి తేల్చే కుట్రలు చేస్తూ మరో వైపు గ్రామ జ్యోతి కార్యక్రమాన్ని మొదలు పెట్టడం పై జగన్ మండి పడ్డారు. చీప్ లిక్కర్ తో గ్రామ జ్యోతిని వెలిగిస్తారా

ఫేస్ బుక్ మిత్రుడి ఎన్ కౌంటర్ !

సార్ మీరు నాకు తెలుసు... మీరు నాఫేస్ బుక్ ఫ్రెండ్ సార్..... దండకారణ్యంలో భుజానికి తుపాకీ వేసుకొని తీక్షణంగా పరిసరాలను పరీక్షిస్తూనే మరో చేత్తో వంట చేస్తున్న.. ప్రతిక్షణం యుద్దం మధ్యలో జీవిస్తున్న ఓ మావోయిస్టు గెరిల్లా ఆమాట అనడంతో నేను షాక్ తిన్నాను.....

నక్సల్బరీ రాజకీయాలను ఎత్తి పట్టండి - ‍మావోయిస్టు పార్టీ నేత గణపతి పిలుపు

నేడు దేశంలో బ్రాహ్మణవాద శక్తులు ప్రభుత్వాన్ని పాలిస్తున్న నేపథ్యంలో దేశంలో అసహన పరిస్థితులు నెలకొన్నాయని, వాటికి వ్యతిరేకంగా మేథావులను, కార్మిక, శ్రామిక, ప్రజాస్వామ్య వర్గాలను, దళితులను, మైనారిటీ మతాలను, విద్యార్థులను సంఘటితం చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని గణపతి చెప్పారు.....

ఈ విప్లవ యోధుడి అమరత్వానికి 21 యేండ్లు !

అది 1996 జూన్ 23 ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల దగ్గర నస్పూర్ కాలానిలో ఓ ఇల్లు.... ఆ ఇంటిని 500 మంది పోలీసులు చుట్టుముట్టారు. ఎలాంటి హెచ్చరికలు లేవు... లొంగి పొమ్మన్న మాటలు లేవు. ఏక పక్షంగా తూటాల వర్షం కురిపించిడం....

జనతన రాజ్యంలో నక్సల్బరీ వేడుకలు... 80 వేల మందితో సభ‌ (వీడియో)

మావోయిస్టు పార్టీ ద‌క్షిణ బ‌స్త‌ర్ డివిజ‌న్ క‌మిటీ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించిన న‌క్స‌ల్బ‌రీ వేడుక‌లు ప్ర‌పంచానికి ఇప్ప‌డు కొత్త ఆశనిస్తున్నాయి. ఒక్క‌రిద్ద‌రు కాదు.. దాదాపు 80 వేల మంది ఆదివాసీలు. సుశిక్షితులైన ప్ర‌జా విముక్తి గెరిల్లాలతో క‌లిసి క‌దంతొక్కారు.

ఈ నెల 26 న తెలంగాణ బంద్ కు మావోయిస్టు పార్టీ పిలుపు

గొల్లగూడెం ఎన్ కౌంటర్ కు నిరసనగా ఈ నెల 26 న తెలంగాణ బంద్ ను జయప్రదం చేయాలని సీపీఐ మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ పిలుపునిచ్చారు. మహారాష్ట్రా గడ్చిరోలి జిల్లా, వెంకటాపురం పోలీస్ స్టేషన్ పరిధి గొల్లగూడెం అడవుల్లో...

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


తన