నిజాం రాజు గొప్పవాడా... దుర్మార్గుడా... ఒక పరిశీలన - ఎన్ వేణు గోపాల్

నిజాం

నిజాం పాలన గురించి తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కె చంద్రశేఖర రావు చేసిన వ్యాఖ్య, ఆ తరువాత ఆయన ఆయన సహచరులు దాన్ని సమర్ధించుకుంటున్న తీరు, వివిధ రాజకీయ పక్షాల స్పందన మన రాజకీయరంగంలోని దివాళా కోరుతనానికి అర్ధం పడుతున్నాయి. హైదరాబాదు రాజ్య చివరి పాలకుడు మీర్ ఉస్మాన్ ఆలీఖాన్ వర్ధంతి సందర్భంగా ఒక రాజకీయ మర్యాదగా హాజరు కావడం, మిగిలిన గతకాలపు పాలరులందరినీ గౌరవించినట్టి గౌరవించడం ఒక ఎత్తు కాని ఆపాలకుడికి సంబంధించిన చరిత్ర లోని దుర్మార్గాలు స్పష్టంగా కనబడుతుండగా వాటిని విస్మరించి చచ్చినవాడి కళ్ళు చారెడేసి అవి స్తోత్రపాఠాలు చదవడం, ఆ పాలకుడిపై ప్రజలు సాగించిన మహోజ్వల పోరాటాన్ని తక్కువచేసి మాట్లాడడం ఒక అనవసరపు దురదృష్టపు వ్యవహారం

అసలు ఒక పాలన గురింది మాట్లాడేటప్పుడు ఆ పాలకుడి మంచిచెడులు, ఇస్తాయిష్టాలు, అభిరుచులు ప్రధానంగా చర్చ జరిగితే ఇంత దురదృష్టకరంగానే ఉండక తప్పదు. ఎందుకంటే ప్రతిపాలకుడిలోనూ మంచీచెడూ ఉంటాయి. మంచి ప‌నుల ఉదాహరణలు ఎన్ని ఇవ్వవచ్చునో చెడ్డపనుల ఉదాహరణలు అంతకు కొన్నిరెట్ల చూపించవచ్చు. కోట్లాది మందిని చంపిన అడాల్ఫ్ హిట్లర్ కు కూడ ఇవాను ప్రేమించిన ఆర్ద్ర‌ హృదయం ఉండిందనీ చూపవచ్చు. కొన్నివేలమందిని రెండు సంవత్సరాలపాటుచీకటి కొట్లలో విచారణ లేకుండా నిర్భధించిన ఇందిరాగాంధీ తన కొడికు ఒకరోజు నిర్బంధానికి గురయితేనే కంటతడి పెట్టిందనీ చూపవచ్చు. అందువల్ల సమస్య ఆ వ్యక్తులదీ వారి మంచి చెడులదీ వారి సున్నుతత్వాతలదీ కాదు.

ఒక పాలన గురించి చర్చించేటప్పుడు ఆ పాలన ప్రజల పట్ల ఎలా ఉన్నదో చర్చించాలి. అది ప్రజల సమస్యలకు పరిష్కారాలు చూపించిందా, కొత్త సమస్యలు సృష్టించిందా చూడాలి. ప్రజల శ్రమ సృష్టించిన సంపదలో మంచి పాలన ఇస్తాననే పేరుతో ఎంత వాటాను తీసుకుంది, అది న్యాయమైన వాటానేనా, లేక దొంగలదోపిడీనా చర్చించాలి. రాజ్యంలో ఉత్పత్తి అయిన సంపదను ఏయే వర్గాల మధ్య ఏ విధంగా పంపిణీ చేసిందీ విశ్లేషించాలి, అంటే ఒక పాలన గురించి జరిగే చర్చ రాజకీయార్థిక చర్చగా జరగాలి, కాని దురధృష్టవశాతూ మీర్ ఉస్మాన్ అలీఖాన్ పాలన గురించి ఒక రాజకీయార్థిక చర్చగా జరగవలసినదల్లా శుష్క రాజకీయవివాదంగా, అదికూడ భావోద్వేగాలు రెచ్చగొట్టిదిగానో, ఎన్నికలలో నాలుగు వోట్ల ఎక్కువ సంపాదించుకునే ఎత్తుగడగానో జరుగుతోంది.
మీర్ ఉస్మాన్ అలీఖాన్ పాలన (1911౫0)లో, ఆ మాటకొస్తే ఆయన తండ్రి మహబూబ్ అలీఖాన్ పాలన (1869-1911) లో హైదరాబాదు రాజ్యంలో చాల ఆధునిక సౌకర్యాలు వచ్చినమాట నిజమే ఆధునిక ఆసుపత్రి, ఆధునిక తంతి తపాలా సౌకర్యాలు, రైల్వేలతో సహా ఆధునిక రవాణా సౌకర్యాలు దేశీయభాషలో ఉన్నత విద్యను కూడ బోధించిన ఆధునిక విశ్వవిద్యాలయం వంటివన్నీ చివరి ఇద్దరి నిజాముల పాలనలో వచ్చాయి. కానీ ఇవేవీ ఆ పాలకులు తమ ప్రజల పట్ల‌ చేసిన మెహర్భానీ కాదు. అవి చేయడం వాళ్ల గొప్పతనమేమీ కాదు. నిజానికి అటువంటి సౌకర్యాలు కల్పించడం, ప్రజాజీవితాన్ని మెరుగుపరచడం పాలకుల బాధ్యత "రహదారులు వేయించెను, రహదారులపక్కన చెట్లనాటించెను. సత్రములు కట్టించెను" అని అశోకుడి కాలంనుంచీ రాజల బాధ్యతగా చెప్పకుంటున్న పనులనే ఆధునిక కాలంలోకి అనువర్తింపజేస్తే కల్పించవలసిన సౌకర్యాలనే నిజాం ప్రభువులు కల్పించారు గాని అదనంగా తమ జేబుల్లోంచి ఏమీ తీసిపెట్టలేదు. కనుక ఆ సౌకర్యాలను చూపి నిజాం ప్రభువులను కీర్తించనక్కరలేదు. ఇటువంటి పనులనే ప్రపంచంలో నియంతలుగా పేరు తెచ్చుకున్న ప్రభువులు ఆ పేరు లేకపోయినా నియంతృత్వమే చలాయించిన ప్రభువులు అందరూ చేశారు.

అట్లాగే భగవంతుడిచ్చిన తాగునీటిపై పన్ను ఏమిటని ప్రశ్నించడం గానీ, ఉరిశిక్షల అమలుపై సంతకం పెట్టకపోవడంగాని, మతసామరస్యాన్ని పరిరక్షించడం గాని అన్నీవ్యక్తిగతంగా ఉస్మాన్ అలీఖాన్ మంచితవానికి చిహ్నాలే కావచ్చు కాని అస‌లు వ్యక్తిగత మంచిచెడులు చర్చనీయాంశమే కాదు. అట్లాగే యాబై సంవత్సరాల పాలనలో చివరి రెండు సంవత్సరాలు మాత్రమే రజాకార్ల దుర్మార్గాలో, రైతాంగ సాయుధ పోరాటం మీద నిర్బంధం సాగిందనడం కూడ కాలవ్యవధి ద్వారా దుర్మార్గాల ప్రభావం తగ్గుతుందనుకునే అమాయకత్వమే అపుతుంది ప్రపంచ చరిత్రలో నరహంతకులని పేరుపడ్డవాళ్లందరూ తమ జీవితకాలం మొత్తంలో హింసాదౌర్జ‌న్యాలకు పాల్పడిన కాలం అతితక్కువే కావచ్చు.

ఇంతకూ మీర్ ఉస్మాస్ అలీఖాన్ పాలనను రాజకీయార్ధిక ప్రమాణాలతో అంచనా కట్టినప్పుడు అది నూటికి నూరుపాళ్ళు ప్రజావ్యతిరేక పాలన అని తేలుతుంది. ఎందుకంటే ఆయన పాలనాకాలంలో అమలయిన రాజకీయార్థిక విధానాలన్నీ అవి అమలయిన పద్ధతి అంతా ప్రజల మీద అన్యాయాన్నీ దౌర్జన్యాన్నీ పీడననూ రుద్దాయి. ఆయన పైన వలసవాదానికి కింద భూస్వామ్యానికీ మధ్య వారధిగా, ఒక నిచ్చెనమెట్ల దోపిడీ వ్యవస్థను కాపాడిన రాజుగా ఉన్నాడేగాని, ప్రజానుకూల రాజగాలేడు. మిగిలిన రాజలది కూడ అటువంటి పాలనే కాదా అంటే అది వేరే చర్చ, ఇక్కడ అది అప్రస్తుతం. పైన బ్రిటిష్ పాలకులకు ʹవిశ్వాసపాత్రుడయిన మిత్రుడుʹగా వలసవ్యతిరేకులమీదికి సైన్యాలను నడిపి, వలసవాదులకు తన భూభాగాన్ని ముక్కలుముక్క‌లుగా తుంచి ఇచ్చి ఆయన ప్రజాజీవనాన్ని అల్లకల్లోలంచేశారు కిండ పాయోగాలు, ఉమ్రాలు, సంస్థానాలు, ఎస్టేట్ల మత్తేదారు, జాగీర్దార్లు, దేశముఖ్ లు, దేశ్ పాండ్యాలు లాంటి ఒక నిరంకుశ భూస్వామ్య నిర్మాణం ప్రజలను ఎంతగా పీల్చి పిప్పి చేసినా పట్టించుకోకుండా వారి ఇష్ణారాజ్యం నడవనిచ్చాడు. ప్రజలమీద దాదాపు వంద రకాల పన్నుల వసూలు చేసుకునే అధికారాన్ని దొరలకు ఇచ్చాడు. ఆ దొరలనుంచి తనకు క్రమం తప్పకుండా నజరానాలు, కప్పాలు వస్తే చాలున్నట్టు ప్రవర్తించాడు. మొత్తం రాజ్యంలో ఉన్న భూమిలో పదోవంతు తన సొంత ఖర్చులకోసం సర్చ్ ఎ ఖాన్గా కెటాయించుకున్నాడు. అలా ప్రపంచంలోకెల్లా రెండో పెద్ద ధనవంతుడిగా పేరు మోశాడు. ప్రజల నెత్తుటితో పోగుపడిన ఆ సంపదలో నుంచి అప్పుడప్పుడు ఏవో కొన్ని మెతుకులు రాల్చినట్టు కొన్ని ప్రజోపయోగకర నిర్మాణాలు చేశాడు. ఆ నిర్మాణాలలో కూడ హైదరాబాదును మినహా మరే ప్రాంతాన్నీ పట్టించుకోలేదు. విశ్వవిద్యాలయాన్ని నిర్మించినప్పటికీ రాజ్యంలో నాలుగుశాతం నిరక్షరాస్యత ఉంటే, ప్రజలు తెలివిమీరి తన దౌర్జన్యపాలనను ఎదిరించకుండా ఉండాలని ప్రాథమిక విద్యావ్యాప్తి మీద ఆంక్షలు విధించాడు. బ్రిటిష్ వారు ఆనకట్టలు కట్టినట్టే ఇక్కడా ఆనకట్టలు కట్టి ఉండవచ్చు గాని, బ్రిటిష్ వారిలాగే ప్రజాచైతన్యవికాసం జరగకుండా కూడ ఆంక్షలు, నిర్బంధాలు, దమనకాండ కొనసాగించాడు. మొత్తం మీద ఆనాటి హైదరాబాదు రాజ్యప్రజలు ఎదుర్కొన్న భూస్వామ్య దోపిడీ పీడనలకు వనరూ పోషకుడూ అయిన మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ను ప్రజారంజకుడయిన ప్రభువుగా గుర్తించడం చరిత్రకే అవమానం.
- ఎన్ వేణు గోపాల్, వీక్షణం ఎడిటర్

నవంబర్ 30, 2007 న సూర్య పత్రికలో ప్రచురించబడినది

Keywords : nizam, telangana, kcr, trs, mim, venu gopal,
(2024-04-27 18:19:06)



No. of visitors : 5620

Suggested Posts


ʹమావోయిస్టు పార్టీ సభ్యుడవడం నేరంకాదని సుప్రీం కోర్టు చెప్పిందిʹ

ఎవరైనా మావోయిస్టు రాజకీయాలు కలిగి ఉన్నప్పటికీ, మావోయిస్టు పార్టీ సభ్యుడైనప్పటికీ, చివరకు మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడైనప్పటికీ ప్రత్యేకమైన నేరం చేశాడని మీరు రుజువు చేస్తే తప్ప శిక్షించడానికి వీలులేదని స్పష్టం చేసిన బోం

విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్

సెప్టెంబర్ 17 న హైదరాబాద్ రాజ్య (తెలంగాణ) విమోచన జరిగిందనే ఒక కట్టుకథ కొంతకాలంగా ప్రచారంలో ఉంది. తమ మతవిద్వేషాలు రెచ్చగొట్టే కార్యక్రమంలో భాగంగా సంఘ పరివారం, భారతీయ జనతాపార్టీ ఈ కట్టుకథను పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాయి. ʹమావైపు లేకపోతే వాళ్లవైపు ఉన్నట్టేʹ అని ప్రపంచాన్ని బెదిరించిన జార్జి బుష్ లాగ ʹదీన్ని విమోచనం అనకపోతే రజాకార్ల వైపు ఉన్నట్టేʹ.

అక్రమ నిర్బంధానికి పదేళ్ళు! - ఎన్. వేణు గోపాల్ (Part-1)

వాళ్లు గదిలోకి వస్తూనే, మేం ఎవరమో, ఏం చేస్తున్నామో కూడ కనుక్కోకుండానే మామీద పడ్డారు. కళ్లకు గంతలు కట్టారు. చేతులు వెనక్కి విరిచి కట్టారు. మేం జర్నలిస్టులమనీ, రచయితలమనీ చెపుతున్నా పట్టించుకోకుండా పోలీసు మార్కు ప్రవర్తన రుచి చూపించి ఒకటి రెండు దెబ్బలు వేశారు. జీపుల్లోకి తోశారు. ఔరంగాబాద్ లోనే ఉన్న వాళ్ల రహస్య స్థావరానికి తీసుకుపోయారు....

తెలంగాణొస్తే ఏమొచ్చింది ? - ‍ ఎన్.వేణు గోపాల్

ʹతెలంగాణొస్తే ఏమొచ్చిందా, చూడండిʹ అని తెలంగాణ ప్రభుత్వ సమర్థకులు సోషల్‌ మీడియాలో మాటిమాటికీ కాలు దువ్వుతున్నారు. సంక్షేమ పథకాల గురించి ఊదర కొడుతున్నారు. నిండిన చెరువులు, మత్తడి దూకుతున్న చెరువులు, కనుచూపు మేర విస్తరించిన పంట పొలాలు, చిరునవ్వుల ముఖాలు ఫొటోలు ప్రదర్శిస్తున్నారు. అయితే ఎంత కర్కోటక పాలనలోనైనా ఏవో కొన్ని సంక్షేమ పథకాలు ఉంటాయి, ఇటువంటి ప్రదర్శ

ʹసామాజిక స్మగ్లర్లు కోమటోళ్ళుʹ వివాదం - ఎన్. వేణుగోపాల్

అణచివేతకు గురైన కులాల మీద, శూద్ర కులాల మీద, దళిత కులాల మీద ఇంకా దుర్మార్గమైన, నీచమైన, నిందార్థపు వ్యాఖ్యలు, సామెతలూ ఎన్నో ఉన్నాయి. అవి హిందూ పవిత్ర గ్రంథాలనబడేవాటికి కూడ ఎక్కాయి. మత ఆమోదాన్ని కూడ పొందాయి. వాటిని ఎవరూ ఎప్పుడూ ఖండించి, ఆ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా, భాషను సంస్కరించుకోవడానికి ఉద్యమం జరపలేదు. ఇవాళ ఒక మాట తమను అవమానించిందని వీథికెక్కుతున్న....

ఎవరివీ ప్రపంచ తెలుగు మహాసభలు - ఎన్. వేణు గోపాల్

తెలంగాణ వాదులలో అధికార పీఠాలు ఎక్కినవారు ఇప్పుడు మాట మారుస్తుండవచ్చు గాని అప్పుడు మాత్రం తెరాస నాయకులతో సహా ఎందరో తెలంగాణ వాదులు ఆ తిరుపతి తెలుగు మహాసభలకు వ్యతిరేకంగా మాట్లాడారు, నిరసన ప్రదర్శనలు జరిపారు. తెలంగాణ జాగృతి సంస్థతో పాటు తెలంగాణ రచయితల వేదిక, తెలంగాణ జర్నలిస్టుల ఫోరం, తెలంగాణ ధూం ధాం వంటి ఎన్నో సంస్థలు బహిష్కరణ పిలుపునిచ్చాయి.....

ప్రపంచ తెలుగు మహాసభలు ఏం సాధించాయి ? - ‍ ఎన్. వేణు గోపాల్

తెలుగు భాష మీద , తెలుగు సాహిత్యం మీద, తెలుగు చరిత్ర మీద, తెలుగు సంస్కృతి మీద ఎటువంటి గౌరమూ, శ్రద్ద లేకుండా కేవలం తమ ప్రాపకం పెంచుకోవడానికి తమకీర్తిని చాటుకోవడానికి విచ్చలవిడిగా డబ్బులు వెదజల్లి అందులో ముడుపులు కైంకర్యం చేయడానికి ఈ సభలు జరిగాయి...

అబ‌ద్ధాల కేసులో అన్యాయ‌మైన తీర్పు - ఎన్.వేణుగోపాల్

ఆ వాదనలన్నీ విన్నతర్వాత కూడ న్యాయమూర్తి ప్రాసిక్యూషన్ అబద్దపు వాదనలనే ఆమోదిస్తూ, చట్టంలో నిర్దేశించిన గరిష్ట శిక్షను ఎట్లా విధించారో అర్థమవుతుంది. వర్గ సమాజంలో న్యాయస్థానం అనేది పాలకవర్గపు చేతిలో పనిముట్టగా, వ్యవస్థ పరిరక్షణకు సాధనంగా పని చేస్తుందనే అవగాహన అందరికీ తెలిసిన నిజమే గాని, ఈ తీర్పు చదివితే ఆ అవగాహన ఎట్లా నూటికి నూటయాభై పాళ్ల వాస్తవమైనదో.....

వీక్షణం పై పాలకుల దుర్మార్గపు ప్రచారాన్ని ఖండిద్దాం ... ప్రజా పత్రికకు అండగా నిలబడదాం

వీక్షణం, రాజకీయార్థిక సామాజిక మాసపత్రిక గత పదిహేడు సంవత్సరాలుగా నిరంతరాయంగా ప్రజాపక్షం వహిస్తున్నందుకు, ప్రభుత్వాల ప్రజావ్యతిరేక నిర్ణయాలను, విధానాలను విమర్శనాత్మకంగా పరిశీలించి, ప్రజలకు తెలియజేస్తున్నందుకు పాలకుల కన్నెర్రకు గురవుతున్నది.

అక్రమ నిర్బంధానికి పదేళ్ళు! - ఎన్.వేణుగోపాల్ (Part-2)

మాట్లాడుకోవడం మానవ సహజం. అది నేరం కాదు. తప్పు కాదు. మనిషిని మాట్లాడకుండా ఆపగల అధికార శక్తి ఏదీ లేదు. మాట్లాడడాన్ని నేరంగా ప్రాసిక్యూషన్ చిత్రించినా దాన్ని నేను అంగీకరించను. మనిషిగా తోటి మనుషులతో మాట్లాడకుండా ఉండబోను. మనిషిని మనిషిగా గౌరవించే మానవీయ వ్యవస్థ కోసం నా శక్తిమేరకు కృషి చేయకుండా ఉండబోను....

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


నిజాం