ఉన్మాదుల ఇష్టారాజ్యానికి సమాజాన్ని వదిలేస్తారా?

ఉన్మాదుల


ప్రొఫెసర్‌ సూరేపల్లి సుజాతపై దాడికి ప్రభుత్వం సమాధానం చెప్పాలి.

ప్రభుత్వం అట్టహాసంగా తెలుగు మహాసభల వేడుక చేసి రోజులు కూడా కాలేదు. ఒక సామాజిక ఆచరణ మీద, భావప్రకటన మీద హేయమైన దాడి జరిగుతున్నది. అంతకు ముందే ప్రొఫెసర్‌ కంచె ఐలయ్య మీద దాడితో పాటు రాజ్యం, ఆధిపత్య కులాలు, సంఘపరివార్‌ కలిసి అమలు చేస్తున్న హింసను ప్రశ్నించి, నిరసన తెలిపిన రచయితల అరెస్టులతోనే ఆ వేడుకలు మొదలయ్యాయి. డిసెంబర్‌ 25న మనుస్మృతిని దహనం చేసి, ప్రజాస్వామ్యానికి విఘాతమైన కులాధిపత్య వ్యవస్థపై నిరసన తెలుపుతున్న విద్యార్థులను ఎ.బి.వి.పి, ఆర్‌.ఎస్‌.ఎస్‌ గూండాలు దాడి చేసి కొడితే పోలీసులు దాడి చేసిన వాళ్ల పక్షాన విద్యార్థులనే అరెస్టులు చేసారు. దాడి చేసిన వాళ్లు అంతటితో ఆగక ఈ విద్యార్థుల వెనక ప్రొఫెసర్‌ సూరేపల్లి సుజాత ఉన్నారని, వాళ్లంతా కలిసి భారతమాత బొమ్మను తగలబెట్టారని దుష్ప్రచార దాడి మొదలుపెట్టారు. సామాజిక మాధ్యమాల్లో బూతులు తిడుతూ అసభ్యరాతలు రాస్తున్నారు. ప్రొఫెసర్‌ సూరేపల్లి సుజాత చాలా కాలంగా ప్రజాసమస్యల మీద క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నారు. ఆమె ఆచరణ ఉన్నట్టుగానే ఆమె భావాలను బహిరంగంగా, సూటిగా వ్యక్తం చేస్తూ రచనలు చేస్తున్నారు. అనేక వేదికల మీద మాట్లాడుతున్నారు. ఈ విషయం చట్టానికి, ప్రభుత్వానికి తెలుసు. దాడి చేస్తున్న వాళ్లు ఎవరో కూడా తెలుసు. వాళ్లంత నిస్సకోచంగా దాడి చేస్తున్నారంటే తెలంగాణ సమాజానికి ఎటువంటి సంకేతం ఇస్తున్నట్టు? బాషా ఉత్సవాలు జరపడం కాదు. ఇటువంటి దాడుల పట్ల ప్రభుత్వం ఏ విధమైన చర్యలు తీసుకుంటుంది? ఉన్మాదుల స్వైర విహారానికి సమాజాన్ని వదిలేసి, విద్యార్థులపై, ప్రజాసంఘాల కార్యకర్తలపై అణచివేత ప్రయోగించడంలోనే రాజ్యం స్వభావం తెలిసిపోతోంది.
ప్రొఫెసర్‌ సూరేపల్లి సుజాత మీద తప్పుడు ఆరోపణలతో అబద్ధాలు ప్రచారం చేస్తూ సామాజిక మాధ్యమాల్లో జుగుప్సాకర రాతలు రాయడం సభ్యసమాజం తలదించుకునే విధంగా ఉంది. నిజానికిది కొత్త కూడా కాదు. సంఘపరివార్‌ అధికారంలోకి వచ్చాక ఈ తరహా ధోరణి రోజురోజుకూ పెచ్చరిల్లిపోతోంది. ఒక సమాజ సాంస్కృతిక విలువల పతనానికిది నిదర్శనం. దీనిని అడ్డుకోవాల్సిన బాధ్యత ప్రజాస్వామికవాదులందరి మీదా ఉంది. ప్రొఫెసర్‌ సూరేపల్లి సుజాతకు ప్రజాసంఘాలతో పాటు విరసం అండగా ఉంటుంది. కులవ్యవస్థ అంతరించాలని, దేశం ప్రజాస్వామికీకరణ చెందాలని తపన పడిన అంబేద్కర్‌ మనుస్మృతిని దహనం చేస్తే, ఇవాల కుహనా దేశభక్తులు అంబేద్కర్‌ జపం చేస్తూనే మనుస్మృతిని బతికిస్తున్నారు. వాళ్లు బతికిస్తున్నారు కాబట్టి మనువు చచ్చేదాకా తగలబెడుతూనే ఉంటాం. సంఘపరివార్‌ దృష్టిలో భారతమాత అంటే మనుస్మృతి పుస్తకం కావచ్చునేమోగాని, మాకు కోట్లాది శ్రామిక తల్లులలో భారతమాత ఉంటుంది. కుల, మత, వర్గ సంకెళ్లలో బంధీయై ఉన్న ఆమె విముక్తి కోసం పోరాడుతూనే ఉంటాం.

-వరలక్ష్మి,
కార్యదర్శి
విప్లవ రచయితల సంఘం

Keywords : surepalli sujatha, virasam, ktr, kcr, bjp, h9indutva, rss, abvp
(2024-04-05 05:25:01)



No. of visitors : 2139

Suggested Posts


కలకత్తాలో జరుగుతున్న చారుమజుందార్ శత జయంతి ఉత్సవాల్లో విరసం కార్యదర్శి పాణి స్పీచ్

నక్సల్బరీ లేకపోతే భారత పీడిత ప్రజానీకానికి విప్లవ‌ దారే లేకుండా పోయేది. కమ్యూనిస్టు రాజకీయాలు చర్చించుకోవడానికే తప్ప వర్గపోరాట బాట పట్టకపోయేవి. ఆ నక్సల్బరీ దారిని చూపినవాడు చారు మజుందార్. విప్లవ పార్టీకి వ్యూహాన్ని, ఎత్తుగడలను ఒక సాయుధ పోరాట మార్గాన్ని చూపించిన వాడు చారు మజుందార్.

ఆదివాసి.. లంబాడా వివాదం ‍- ఎం.రత్నమాల

మహారాష్ట్ర ప్రభుత్వం లంబాడాలను ఆదివాసి తెగగా గుర్తించడం లేదు కనుక ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం లంబాడాలను ఆదివాసి షెడ్యూల్డు తెగగా ప్రకటించడంతో దీన్ని అవకాశంగా తీసుకుని మహారాష్ట్ర నుంచి ఆదిలాబాద్‌ (పాత) జిల్లాకు లంబాడాల వలసలు పెద్ద ఎత్తున వెల్లువలా సాగాయి.....

మహాశ్వేతా దేవి - మన తెలంగాణ సాగర హారంః వరవర రావు

మన మహా సాగరహారం ʹచలో హైదరాబాద్ అంటూ తెలంగాణ మార్చ్ చేసిన సెప్టెంబర్ 30, 2012 మహత్తర మధ్యాహ్నం మహాశ్వేతాదేవి కూడా మన ఊర్లో ఉన్నారు. ఆ రోజు ఆమెను మన మధ్యకు తెచ్చుకొని ఉంటే....

సెప్టెంబర్ 17 - ఇండియన్ యూనియన్ సైనిక దురాక్రమణ దినం - వరవరరావు

1947 ఆగస్ట్ 15న విలీనానికి అంగీకరించకుండా షరతులు విధిస్తూ వచ్చిన నిజాంను నెహ్రూ - పటేల్ ప్రభుత్వం సగౌరవంగా, సాదరంగా చర్చలకు ఆహ్వానించింది. అప్పటికే నిజాంను వ్యతిరేకిస్తూ వీరోచిత పోరాటం నడుపుతున్న కమ్యూనిస్టులను మాత్రమే కాదు, కనీసం కాంగ్రెస్ ను కూడా ఈ చర్చల్లో భాగం చేయలేదు....

అమరుడు బొజ్జా తారకం — ʹనది పుట్టిన గొంతుకʹ - వరవరరావు

గోదావరి తెలంగాణలో ప్రవేశించిన నిజామాబాద్ కు 1968లో వచ్చిన తారకం గారు ఇక్కడి మట్టిలోని ఎరుపులోనూ, ఇక్కడి నీళ్లలోని ప్రవాహ గుణంలోనూ కలగలిసిపోయారు. 1968 నుంచి 78 దాకా ఒక దశాబ్దం పాటు విప్లవోద్యమాలకు, విప్లవ సాహిత్యానికి నిజామాబాద్ చిరునామా బొజ్ఞాతారకం....

ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ పోరాటానికి విరసం మద్దతు

అట్టడుగున ఉన్న మనిషికి ఫలితాలు అందినప్పుడే సామాజిక న్యాయం జరిగినట్టు లెక్క. మాదిగ, డక్కలి, చిందు, మాష్టి, బుడగజంగం, దాసరి, బేగరి కులాలకు ఈ నాటికీ ఎస్సీ రిజర్వేషన్ ఫలాలు అందడం లేదు....

ʹఅన్నలు మల్లొస్తరు బిడ్డా.. ఆల్లొస్తే వాళ్ళకు గిన్ని మంచి నీల్లో, తిండో పెట్టాలనే బతుకుతాన్నʹ

అందుకే అంత నిర్బంధంల కూడా నా కొడుకు అంత్యక్రియలకు వచ్చిన జనాలకు మా ఖిలా వరంగల్ సరిపోలె. ఎక్కడోల్లను అక్కడ అరెస్ట్ చేసినా వచ్చిండ్రు. ఎవరో నక్సలైట్ అట, చిన్న పిల్లగాడేనట, బలే తెలివికల్లోడట అని అనుకుంట జనాలు వచ్చిండ్రు. పద్దెనిమిది నిండి పందొమ్మిది పడగానే చంపేసిండ్రు.

కాగడాగా వెలిగిన క్షణం... అమరుడు యెం యెస్ ఆర్ కోసం ... నారాయణ స్వామి

ఎంత ప్రాణం శ్రీనుది బక్క పలుచగా ఉండేటోడు – ఎక్కడన్న సరిగ్గా తిన్నడో లేదో శరీరం లో బలం సత్తువ ఉన్నదో లేదో – ఆ దుర్మార్గులు పట్టుకొని చిత్రహింసలు పెడుతుంటే ఆ లేత శరీరం ఎంత గోస పడిందో ఎంత హింసకు గురైందో ఎంత అల్లల్లాడిందో – ఆ క్రూరులు చంపేయ్యబోతుంటే, చివరికి మేఘే ఢాకా తార లో సుప్రియ అరిచినట్టు నాకు బతకాలని ఉంది నాకు చావాలని లేదు నాకు బతకాలని ఉంది....

ఉత్తేజకరంగా సాగిన విరసం సాహిత్యపాఠశాల‌

అంతకుముందు అంతర్జాతీయ శ్రామికవర్గ పతాకావిష్కరణతో కార్యక్రమాలను ప్రారం భించారు. అమరుడు పులి అంజన్న తల్లి సైదమ్మ ఎర్ర జెండాను, సీనియర్ విరసం సభ్యురాలు రత్నమాల విప్లవ రచయితల సంఘం జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా అమరుడు శేషయ్య సోదరుడు సాంబయ్య, అమరుడు వివేక్ తండ్రి యోగానంద్ అమరుల స్థూపాన్ని ఆవిష్క రించారు.

ʹఅరుణోదయʹ పై పోలీసుల దాడిని ఖండించిన విరసం

తెలంగాణ ఉద్యమంలో ఆట పాటతో ఆరుణోదయ కళాకారులు గ్రామ గ్రామాన తిరిగి ప్రజల్లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని రగిలించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తమ వంతు కృషి చేశారు. ఆ సంస్థ కార్యాలయాన్ని దౌర్జన్యంగా మూసేయడం అత్యంత నిరంకుశమైన......

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


ఉన్మాదుల