ఎమ్మెల్యే మనోడే.. ఎవ్వరూ ఏం చేయలేరు..వారిని తగులబెట్టండి...
ʹఎమ్మెల్యే మనతో ఉన్నారు.. ఎవ్వరూ మనల్ని ఏం చేయలేరు.. వారిని తగలబెట్టండి..ʹ అక్బర్ఖాన్ను, అతని స్నేహితుడిని కొడుతూ గోరక్షకులు చేసిన వ్యాఖ్యలివి. ఈ ఘటనలో ప్రాణాలతో బయటపడిన అక్బర్ఖాన్ స్నేహితుడు అస్లామ్ పోలీసులకు రాతపూర్వకంగా ఇచ్చిన ఫిర్యాదులో ఈ విషయాలను పేర్కొన్నాడు. ʹవారు సురేశ్, విజరు, పరంజీత్, నరేశ్, ధర్మేందర్ అంటూ ఒకరినొకరు పిలుస్తున్నారుʹ అని తెలిపాడు. కాగా, వీరిలో పోలీసులు ముగ్గురిని మాత్రమే అదుపులోకి తీసుకున్నారు. ʹనన్ను, అక్బర్ను పట్టుకునేందుకు ప్రయత్నించారు. నేను కొద్ది దూరం పరిగెత్తాను. వారు అక్బర్ను పట్టుకొని తీవ్రంగా కొట్టడం మొదలుపెట్టారు. అక్బర్ను కొడుతుండగా.. అతను కేకలుపెట్టడం నేను విన్నానుʹ అని తెలిపాడు. ʹరెండు ఆవులు, రెండు దూడలను కొనుక్కొని నేను అక్బర్ లాల్వండీ గ్రామం మీదుగా ఇంటికి తిరిగి బయలుదేరాం. మోటారు వాహనాల మీద వచ్చిన వారు అరుస్తూ మావైపు పరుగులు పెట్టుకుంటూ వస్తున్నారు. భయంతో మేం రోడ్డు నుంచి పక్కనే ఉన్న పత్తి పొలాలవైపు పరుగులు పెట్టాం. ఏడుగురు వ్యక్తులు మా వెనుకపడ్డారు. ఐదుగురు ఒకరినొకరు పేర్లతో పిలుచుకోవడం నాకు వినిపించింది. అక్బర్ను కిందపడేసి ఐదుగురు వ్యక్తులు కర్రలతో కొట్టారు. ఇద్దరు ఘటనను చూస్తూ నిలబడ్డారు.. ఎమ్మెల్యే మనతో ఉన్నారు.. మనల్ని ఎవ్వరూ ఏం చేయలేరంటూ కేకలు వినిపించాయిʹ అని అస్లామ్ తన రాతపూర్వక ఫిర్యాదులో పేర్కొన్నాడు. దాడి రాత్రి ఒంటిగంట సమయంలో జరగ్గా.. అక్కడకు చేరుకున్న పోలీసులు అతన్ని తెల్లవారుజామున 4 గంటలకు ఆస్పత్రికి తరలించారు. అక్బర్ మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు. ʹఅక్బర్ శరీరంమీద తీవ్ర గాయాలున్నాయి. ఇంటర్నల్ బ్లీడింగ్తోనే అక్బర్ఖాన్ మృతిచెందాడుʹ అని వైద్యులు తెలిపారు.
ʹగోరక్షకులనుʹ కాపాడుకునే ప్రయత్నం
హింసాత్మక ఘటనకు పాల్పడిన ʹగోరక్షకులనుʹ కాపాడుకునే ప్రయత్నించిన తొలి వ్యక్తి కూడా ఇక్కడి స్థానిక ఎమ్మెల్యే బీజేపీకి చెందిన జ్ఞాన్దేవ్ అహూజా కావడం గమనార్హం. కాగా, అస్లామ్ ఫిర్యాదును అహూజా కొట్టిపారేశాడు. గోరక్షులు ఆ దాడిలో లేరనీ, తనను అపఖ్యాతిపాల్జేసేందుకు చేసిన ప్రయత్నమంటూ ఎదురుదాడికి దిగారు. అక్బర్ఖాన్ మృతికి అరెస్టయిన ʹగోరక్షకులుʹ కాదనీ, పోలీసులే బాధ్యులని ఆరోపించారు. ʹఅవినీతి ఐపీఎస్ అధికారులు అనిల్ బెనివల్, అల్వార్ మాజీ ఎస్పీ రాహుల్ ప్రకాశ్లే ఇందుకు కారణం. పోలీసులు వారి నిస్సహాయ వైఖరీ, మూర్ఖత్వంతో తప్పటడుగులు వేస్తున్నారు. గోరక్షకులను అదుపులోకి తీసుకున్నారుʹ అని అహుజా ఆరోపించారు. తాను గత 25 ఏండ్లుగా ఎన్నికల్లో పోటీచేస్తున్నాననీ, ఇలాంటి ఘటనను ఎప్పుడూ చవిచూడలేదని చెప్పారు. 2016లో జేఎన్యూ ఆందోళన నేపథ్యంలో విద్యార్థులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జేఎన్యూలో ప్రతిరోజూ వేల సంఖ్యలో కండోమ్లు, లిక్కర్ బాటిళ్లూ దొరుకుతాయని అన్నారు. ఈ వ్యాఖ్యలపై విద్యార్థి లోకం తీవ్రంగా తప్పుపట్టింది. 2017 ఏప్రిల్లో జరిగిన పెహ్లూఖాన్ హత్యను కూడా అహూజా అప్పట్లో సమర్థించుకున్నారు.
మా మనోభావాలను ముస్లింలు అర్థం చేసుకోవాలి : రాజస్థాన్ మంత్రి
ఇక రాజస్థాన్ మంత్రి జశ్వంత్ సింగ్ మరో వివాదానికి తెరతీశారు. ఇకనైనా హిందువుల మనోభావాలను అర్థం చేసుకోవాలనీ, గోవుల అక్రమ రవాణాను ఆపాలనీ ముస్లింలకు విజ్ఞప్తి చేశారు. ʹమరణాలను దృష్టిలో పెట్టుకునైనా.. ఈ వ్యాపారాన్ని వారు (ముస్లిం) ఆపాలిʹ అన్నారు. గత 15 నెలల్లో అల్వార్లో గోరక్షకుల దాడిలో ముగ్గురు ముస్లింలు హత్యకు గురయ్యారు. కేవలం 20 నిమిషాల వ్యవధి దూరంగల ఆస్పత్రికి అక్బర్ ఖాన్ను తరలించడానికి మూడున్నర గంటలు ఆలస్యం చేసినట్టు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. అంతేగాక అక్బర్ఖాన్ను కస్టడీలోనే ఉంచుకొని ఈ సంఘటనలో స్వాధీనం చేసుకున్న గోవుల్ని మొదట గోశాలకు తరలించారని ప్రత్యక్ష సాక్ష్యులు తెలిపారు.
ʹ12 తీవ్రగాయాలు.. విరిగిన ఎముకలుʹ
అక్బర్ఖాన్ మృత దేహంపై 12 తీవ్రగాయాలున్నాయనీ, అలాగే అతని ఒక చేయి, కాలు ఎముకలు విరిగి పోయాయని పోస్టుమార్టం నివేదిక స్పష్టంచేసింది. పక్కటెముక ఒకటి కూడా విరిగినట్టు తెలిపింది. డాక్టర్ రాజీవ్ కుమార్ గుప్తా, డాక్టర్ అమిత్ మిట్టల్, డాక్టర్ సంజరు గుప్తా సహా వైద్యులు బృందం అక్బర్ఖాన్ మృతదేహానికి పోస్ట్మార్టం నిర్వహించింది. తీవ్ర అంతర్గత రక్తస్రావం వల్లనే మరణించినట్టు స్పష్టంచేసింది.
దర్యాప్తు బృందానికి పోస్టుమార్టం నివేదికను వైద్యులు మంగళవారం సమర్పించారు. ఘటనా స్థలంలో నిర్వహించిన ఫోరెన్సిక్ పరీక్ష నివేదికను కూడా దర్యాప్తు బృందం సేకరించింది. అల్వార్లో ఘటన జరిగిన ప్రదేశంలో తీవ్ర పెనుగులాట జరిగినట్టు సంకేతాల నిర్ధారిస్తున్నాయి.
బీఫ్ తినడం ఆపేస్తేనే... కొట్టి చంపడాలకు బ్రేక్ : ఆర్ఎస్ఎస్
గోవుల రక్షణ పేరిట దేశంలో జరుగుతున్న మారణకాండ ఆగాలంటే ప్రజలు బీఫ్ తినడం మానేయాలని ఆర్ఎస్ఎస్ నాయకుడు ఇంద్రేశ్ కుమార్ అన్నారు. జార్ఖండ్లోని రాంచీలో జరిగిన హిందూ జాగరణ్ మంచ్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఆవు మాంసం తరలిస్తున్నాడనే ఆరోపణతో ఇటీవల రాజస్థాన్లోని అల్వార్లో ఓ ముస్లిం వ్యక్తిని కొట్టి చంపిన ఘటన తరువాత ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఇంద్రేశ్ మాట్లాడుతూ... ʹఈ తరహా మూకదాడులు సరైనవి కావు. వాటిని ఖండించాల్సిందే. ఈ హత్యలు ఆగాలంటే ప్రజలు బీఫ్ తినడం మానేయాలి. అప్పుడే దీనికి పరిష్కారం లభిస్తుందిʹ అని అన్నారు. ప్రపంచంలో ఏ మతం కూడా ఆవులను చంపాలని బోధించలేదన్నారు. క్రిస్టియన్లు పూజించే జీసస్ పశువుల పాకలో జన్మించాడని, ముస్లింల పవిత్ర స్థలమైన మక్కాలో గోవధ నిషేధం అమల్లో ఉన్నదని వివరించారు. గోవధ నిషేధంపై పటిష్టమైన చట్టం తీసుకురావాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. పాకూర్లో సామాజిక ఉద్యమకారుడు స్వామి అగ్నివేశ్పై గతవారం జరిగిన దాడిని ఆయన ఖండించారు. కానీ, వాక్ స్వాతంత్య్రం పేరిట మెజారిటీ ప్రజల మనోభావాలను దెబ్బతీసే హక్కు ఎవ్వరికీ లేదని పేర్కొన్నారు.
కస్టోడియల్ డెత్ అని ట్విస్ట్ ఇచ్చిన రాజస్థాన్ హోం మంత్రి
పోలీసు కస్టడీలోనే అక్బర్ ఖాన్ మృతిచెందా డని రాజస్థాన్ హోంమంత్రి వ్యాఖ్యా నించారు. ఘటనకు సంబంధించిన సాక్ష్యాల ఆధారంగా ఈ నిర్ధారణకు వచ్చినట్టు చెప్పారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగు తున్నదనీ అన్నారు. బాధితుడిని పోలీసులు ఆస్పత్రికి తీసుకెళ్ళకుండా గోవులను షెల్టర్కు తరలించారని హోం మంత్రి గులాబ్ చాంద్ కటారియా అన్నారు.
Keywords : gow rakshak, murder, jaipur, rajasthan, hindutva, rss, cheddi gang
(2024-04-24 20:11:58)
No. of visitors : 2761
Suggested Posts
| లెనిన్ ఎవరూ..!?భగత్సింగ్ వంటి యువకిశోరాల వర్థంతులనాడు దండులు వేసి దండం పెట్టడమే తప్ప ఏనాడైన ఆయన చరిత్రను చదివుంటే లెనిన్ కొంతలో కొంతైనా అర్థమయ్యేవాడు. పాతికేళ్ళు కూడా నిండని కొంతమంది యువకులు, ఆ లెనిన్ నుండి ఆయన సారధ్యం వహించిన సోవియట్ యూనియన్ నుంచి స్ఫుర్తిని పొందబట్టే ʹహిందూస్తాన్ రిపబ్లిక్ అసోషియేషన్ʹ |
| నువ్వు హిందువా ముస్లింవా అంటూ జర్నలిస్టు ప్యాంట్ విప్పి చూశారు...ఢిల్లీలో కొన సాగుతున్న అరాచకం
రెండు రోజులుగా దాడులతో, హింసతో అట్టుడుకుతోంది. ఈశాన్య ఢిల్లీలో అనేక ఇళ్ళు షాపులు తగలబడుతున్నాయి. సీఏఏ కు వ్యతిరేకంగా రెండు నెలలుగా శాంతియుతంగా ఆందోళనలు జరుగుతున్నాయి. |
| ఆజాదీ నినాదాలతో దద్దరిల్లిన ఢిల్లీ రాంజాస్ కాలేజ్ఢిల్లీ రాంజాస్ కాలేజ్ విద్యార్థులపై ఏబీవీపీ మూక చేసిన దాడికి నిరసనగా వేలాదిమంది విద్యార్థినీ విద్యార్థులు ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ మాజీ అధ్యక్షుడు కన్హయ్య మాట్లాడారు.... |
| Statement by Sudha Bharadwaj on false allegations aired on Republic TV I have been informed that Republic TV aired a programme on 4 July 2018, presented by anchor and MD Arnab Goswami as ʹSuper Exclusive Breaking Newsʹ. |
| ఈ చిన్నారుల ఆకలి కేకల సాక్షిగా... వాళ్ళను మనమే హత్య చేశాం !అమ్మా ఆకలి అన్నా అన్నం పెట్టలేని స్థితిలో అమ్మ...బాబూ ఓ ముద్దేయండంటూ రోడ్డు మీద బోరుమన్నా పట్టించుకోని జనం... మూడు రోజుల పాటు ఆకలితో ఏడ్చీ ఏడ్చీ ఆ ముగ్గురు చిన్నారులు చనిపోయారు. |
| అవును,దళిత బాలిక కాబట్టే అత్యాచారం చేసి హత్య చేశాం -ఒప్పుకున్న పూజారి,ఇతర నిందితులుఢిల్లీ శ్మశానవాటికలో ఒక పూజారి, మరో ముగ్గురితో కలిసి తొమ్మిదేళ్ల దళిత బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన ఘటనలో... బాలిక దళితురాలైనందునే ఆమెపై అత్యాచారం చేసినట్లు నిందితులు ఒప్పుకున్నారు. |
| ఏబీవీపీకి భయపడను - అమర జవాను కూతురుʹనేను ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్ ను . ఏబీవీకి భయపడను. నేను ఒంటరిని కాను దేశంలో ప్రతి స్టూడెంట్ నాతో ఉన్నాడుʹ. అని రాసి ఉన్న ప్ల కార్డ్ ను పట్టుకొని ఉన్న తన ఫోటోను ఫేస్ బుక్ లో పోస్ట్ చేసింది గుర్ మెహర్.... |
| మేం ప్రశ్నిస్తాం, తర్కిస్తాం, వాదిస్తాం, విభేదిస్తాం..ఇదే జేఎన్యూ ప్రత్యేకత - ఉమర్ ఖలీద్మిత్రులారా! నాలోని భావోద్వేగాన్ని ఎలా మాటల్లోకి మల్చాలో అర్థం కావడం లేదు. గత నెలాపదిహేను రోజులుగా వేగంగా జరిగిపోయిన సంఘటనలను ఒక క్రమంలో అర్థం చేసుకోవడానికి నేనింకా ప్రయత్నిస్తూనే ఉన్నాను. |
| కేజ్రీవాల్ పై మారణాయుధాలతో దాడిఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పై పంజాబ్ లో మారణాయుధాలతో దాడి జరిగింది అయితే ఈ దాడి నుంచి ఆయన త్రుటిలో తప్పించుకున్నారు.... |
| నా బిడ్డకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం లేదు - నిర్భయ తండ్రిʹʹనా బిడ్డకు న్యాయం జరగ లేదు., జరుగుతుందన్న నమ్మకం కూడా లేదుʹʹ ఇవి మూడేళ్ల క్రితం సామూహిక అత్యాచారానికి గురై ప్రాణాలు కోల్పోయిన ʹనిర్భయʹ తండ్రి దుంఖంతో అన్నమాటలు. ఈ దారుణం జరిగి మూడేళ్లయినా నిందితుల్లో ఇంకా నలుగురికి ఉరిశిక్ష అమలుచేయలేదని, మరో నిందితుడిని త్వరలో విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారని..... |