ఎక్కువమంది పిల్లలను కనాలన్న హిట్లర్ వారసుల పిలుపు ఎవరిపై దాడుల కోసం?

ఎక్కువమంది


దేశంలో చెడ్డీ గ్యాంగ్ దుర్మార్గ చేతలు, మాటలకు అడ్డూ అదుపూ ఉండటం లేదు. నరేంద్ర మోడీ ప్రధాని అయిన తర్వాత దళితులపై, ముస్లింలపై, మహిళలపై, ఆదివాసులపై, మేదావులపై చెడ్డీ గ్యాంగ్ చేస్తున్న‌ దాడులు, హత్యలు ఈ దేశాన్ని మధ్యయుగాల అరాచకాన్ని తలపిస్తున్నది.
ప్రతి రోజూ చెడ్డీ గ్యాంగ్ నాయకులు చేసే రెచ్చగొట్టే ప్రసంగాలు ఉన్మాదులను మరింత ఉన్మాదులుగా మారుస్తున్నవి. గోవుల పేరుతో మనో భావాల పేరుతో మూక హత్యలు చేస్తూ ఆ దుర్మార్గ మూకల బలం సరిపోలేదన్నట్టు ప్రతి హిందువు ఐదుగురిని కనాలంటూ మూర్కపు పిలుపునిస్తున్నారు. హిందువులందరూ ఒక్కొక్కరూ ఐదుగురు పిల్లలను కనాలి అని ఉత్తరప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ ఇచ్చిన పిలుపు దేనిని సూచిస్తున్నది ? ఆయన మాటలకు అసలు అర్దం..అసలు ఆయన అంతమంది పిల్లలను ఎందుకు కనమంటున్నాడో మరో బీజేపీ ఎమ్మెల్యే చెప్పకనే చెప్పాడు.
సురేంద్ర సింగ్ పిలుపుకు కొనసాగింపు అన్నట్టు కర్నాటకకు చెందిన మరో బీజేపీ ఎమ్మెల్యే బసవగౌడ పాటిల్.. ʹనేనే హోంమంత్రినైతే మేదావులనందరిని కాల్చి చంపేవాడినిʹ అని ప్రకటించాడు. దీన్ని బట్టే అర్దమవుతుంది కదా చెడ్డీ గ్యాంగ్ ఎక్కువమంది పిల్లలను ఎందుకు కనమంటుందో... ఒకడమే మూక హత్యలు సహజమంటాడు. మరొకడేమో ఇక్కడ బతకాలంటే హిందువుగా ఉండల్సిందేనంటాడు. ఆవుల పేరుతో ఆజరుగుతున్న మూక హత్యలను అడ్డుకట్ట వేస్తారా అని అడిగితే... గోవులు మాకు పూజ్యనీయమైనవని , వాటి జోలికొస్తారా అని సాక్షాత్తు చెడ్డీ గ్యాంగ్ ప్రముఖుడు, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ హెచ్చరిక లాంటి జవాబు చెబుతాడు. ఇటువంటి వాటిపై పోరాడాల్సిన ప్రజల్ని చైతన్యం చేయాల్సిన కమ్యూనిస్టులమని చెప్పుకుంటున్న పార్టీలు ఓట్లు, సీట్ల వేటలోపడి హిందువకే జైకొడుతుంటారు. రామాయణ పఠనాలు, మార్క్స్ ఫోటో పక్కన కృష్ణుని ఫోటోలు పెట్టి కృష్టామి ఉత్సవాలు, వివేకానందుని ప్రచారాలు చేస్తూ... ప్రజలు నమ్ముతున్నారు కాబట్టి మనమూ అదే బాటలోనే నడవాలంటూ పసలేని వాదనలతో రోజు రోజుకు కుంచించుక పోతున్నారు. ఇక ఈ దేశం ఈ మతోన్మాదుల చేతుల్లో నలిగి పోవాల్సిందేనా ? ఆదివాసుల, దళితుల, ముస్లి‍ంల, మహిళల, ప్రజాస్వామికవాదుల నెత్తుర్లు ఏరులై పారాల్సిందేనా ? నిజం మాట్లాడేవాళ్ళు చావడమో, భయంతో బతకడమో అనే పరిస్థితిలో మార్పు రాదా ? నిజం చెప్పాలంటే ఈ దేశ మెజార్టీ ప్రజలు ఈ దుర్మార్గ పరిస్థితిని వ్యతిరేకిస్తున్నారు. ప్రతిక్షణం భయంతో బతికే పరిస్థితినుండి విముక్తిని కోరుకుంటున్నారు. అది సాధ్యంకావాలంటే.. ఈ దేశంలో మెజార్టీగా ఉన్న అణగారిన ప్రజలు... దళితులు,బహుజనులు, ఆదివాసులు, ముస్లింలు, మహిళలు, ప్రజాస్వామికవాదులు ఏకం కావాల్సి ఉన్నది. తమ దోపిడిని కాపాడుకోవడానికి మతం పేరుతో పాలకులు ఆడుతున్న హత్యారాజకీయాలకు వ్యతిరేకంగా పోరాడవల్సిఉన్నది.

Keywords : rss, vhp, bjp, cheddigang, narendra modi, surendra sing, basavagauda patil
(2024-04-24 20:11:18)



No. of visitors : 1007

Suggested Posts


గోరక్షకులా ? దోపిడి దారులా ? - NDTV స్టింగ్ ఆపరేషన్ లో వెలుగు చూసిన నిజాలు !

ఆవులనే కాదు ఎద్దులను, బర్రెలను, దున్నపోతులను... వేటినైనా సరే వాహనాల్లో తీసుకెల్తే వీళ్ళు ఆపుతారు. పోలీసుల సహకారంతో గోశాలలకు తరలిస్తారు. అక్కడి నుంచి వాటిని అమ్ముకుంటారు. పశువులను తరలించేవారు వీరితో ముందే ఒప్పందానికి వచ్చి డబ్బులు ముట్టజెప్తే ఆ వాహనాలను ఆపరు....

బాలికల అక్రమ తరలింపు - బైటపడ్డ ఆర్‌ఎస్‌ఎస్‌ అసలు రంగు

ఆర్‌ఎస్‌ఎస్‌ అసలు ఎజెండా ఏంటి అనేది బహిర్గతమైంది. తన మతోన్మాద ఎజెండాను అమలుచేయడంలో భాగంగా బాలికల అక్రమ తరలింపుకు సిద్దపడింది. జాతీయ, అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించి ఆదివాసీ బాలికలను అక్రమంగా ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్న వైనాన్ని ఔట్ లుక్ పత్రిక బహిర్గతపర్చింది....

బీఫ్‌ తినడం నేరం కాదు - మద్రాస్‌ హైకోర్టు సంచలన తీర్పు

గో మాంసంపై మద్రాస్‌ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. బీఫ్‌ తినడం నేరం కాదని, ప్రజల ఆహార అలవాట్లలో జోక్యం చేసుకునే హక్కు ఎవరికీ లేదని స్పష్టం చేసింది. పళని ఆలయ పరిసరాల్లో ముస్లింలు నిర్వహిస్తున్న దుకాణాలను తొలగించాలని దాఖలైన పిటిషన్లను తోసిపుచ్చింది...

హిందూ మతోన్మాదం మోడి,యోగి - డా. కత్తి పద్మారావు

ఆర్ఎస్ఎస్ మూలవాసుల సంస్కృతికి వ్యతిరేకి. ముస్లిం మైనార్టీలకు శత్రువు. ఎంతో నెత్తురు హిందూ, ముస్లిం ఘర్షణల్లో భరత ఉపఖండంలో ఇంకిపోరుుంది. అందుకే అంబేడ్కర్ దళితులను బౌద్ధ మత స్వీకారం చేయమని బోధించాడు. బౌద్ధ మత స్వీకారం ఒక్కటే హిందూ మతం పునాదులను కదిలించగలుగుతుందని అంబేడ్కర్ విశ్వసించాడు....

HCU లో ఏబీవీపీ అరాచకం - విద్యార్థిపై దాడి

హైద‌రాబాద్ సెంట్ర‌ల్ యూనివ‌ర్సిటీలో మ‌తోన్మాద గుండాల అరాచ‌కాల‌కు అంతులేకుండా పోతోంది. రోహిత్ వేముల మృతికి కార‌ణ‌మైన సుశీల్ కుమార్, బీజేపీ నాయ‌కుడైనా అత‌ని సోద‌రుడు మ‌రో ముప్పై మందితో క‌లిసి నిన్నరాత్రి యూనివ‌ర్సిటీలో విద్యార్థుల‌పై దాడుల‌కు పాల్ప‌డ్డారు. గ‌త వారం ప‌ది రోజులుగా

ఫిదా సినిమా... జాతీయ గీతం - తుమ్మేటి రఘోత్త‌మ్ రెడ్డి

నేను తెలుగు సినిమా చూడాల్సి వచ్చింది! చాలా కాలం తరువాత! సంవత్సరాల తరువాత.... ఏం చెయ్యను? ఖర్మ! నాలుగురోజుల క్రితం, మాదగ్గరి బంధువు పోన్ చేసాడు! ఒకసారిʹఫిదాʹసినిమా చూడగలరా? మీతో చర్చించాలని ఉంది అన్నాడు! దగ్గరి బంధువు! సినిమా రంగంలో భవిష్యత్తును నిర్మించుకుంటున్నవాడు! కాదనలేని స్ధితి!

ఇప్పటి దేశ పరిస్థితుల్లో రాడికల్ ఉద్యమ అవసరం ఉందా?

వ‌ర్త‌మాన సామాజిక‌, రాజ‌కీయ‌, ఆర్థిక విష‌యాల‌పై ఎప్ప‌టిక‌ప్పుడూ స‌రైన అవ‌గాహ‌నను అందిస్తూ, ప్ర‌జ‌ల ప‌క్షాన గొంతును వినిపించే లామ‌కాన్, ముగ్గురు ప్ర‌ముఖ ఉద్య‌కారుల‌ను ఒకే వేదిక‌మీదికి తీసుకువ‌స్తోంది. ఆగ‌స్టు 15 సాయంత్రం 7 గంట‌ల‌కు లామ‌కాన్‌లో నిర్వ‌హించే.....

ముజ‌ఫ‌ర్ న‌గ‌ర్ బాకీ హై

22 రాష్ట్రాలు, 44 ప‌ట్ట‌ణాలు, 50 ప్ర‌ద‌ర్శ‌న‌లు... ఇది బాహుబ‌లి సినిమా కాదు... మ‌తోన్మాద రాజ‌కీయాల్నిన‌గ్నంగా నిల‌బెట్టిన డాక్యుమెంట‌రీ చిత్రం. వ‌ర్త‌మాన చ‌రిత్ర‌కు సాక్ష్యం.....

మోడీలు, మోహన్ భగవత్ లు బూట్లు తొడుక్కొని జెండాలు ఎగరేయొచ్చు... అదే ఓ ముస్లిం చేస్తే దాడులు చేస్తారా !

మోడీ, అమిత్ షాలు బూట్లు తొడుక్కొని స్వాతంత్ర్య దినోత్సవం రోజు జాతీయ జెండాకు వందనాలు చేయొచ్చు. మోడీ అయితే ఏకంగా జాతీయ జెండాతో చెమటను తుడుచుకోవచ్చు.... కానీ ఓ కాలేజీ ప్రిన్సిపాల్... ముస్లిం అయినందుకు జెండా ఎగరేయ కూడదు. ఎగిరేసినందుకు ఆయన కాశాయ మూక చేతుల్లో దాడికి గురవుతాడు.....

వాళ్ళు హంతకులు : మనుషులనే కాదు గోవులనూ చంపుతారు.

ఛత్తీస్‌గడ్‌లోని దుర్గ్‌ జిల్లాలోని జమూల్‌ నగర్‌ నిగమ్‌ గ్రామానికి చెందిన బీజేపీ నేత హరీశ్‌ వర్మ ప్రభుత్వం ఇచ్చే సొమ్ముతో ఏడు సంవత్సరాలుగా రాజ్‌పూర్‌ గ్రామంలో ఓ గోశాలను నడుపుతున్నారు. అయితే ఆయన సొమ్మును దిగమింగి ఆ ఆవులను ఊరి మీదికి వదిలేస్తాడనే ఆరోపణలు

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


ఎక్కువమంది