include 'men';
?>
70 ఏండ్ల చరిత్రను తిరగరాసిన విద్యార్థిని.. మతోన్మాద శక్తులపై లెఫ్ట్ విజయం
ఒక విద్యార్థిని మతోన్మాద శక్తుల మీద విజయం సాధించింది. ఎన్ని అడ్డంకులు ఎదురైనా తన పోరాటాన్ని ఆపకుండా ముందుకు సాగి పంజాబ్ యూనివర్సిటీలో జయకేతనం ఎగరవేసింది. పంజాబ్ యూనివర్సిటీ స్టూడెంట్ కౌన్సిల్ ఎన్నికల్లో స్టూడెంట్ ఫర్ సొసైటీ (SFS) చారిత్రాత్మక విజయం సాధించింది. ఆర్ఎస్ఎస్ అనుబంధ విద్యార్థి సంఘమైన ఏబీవీపీ, ఆకాలీదళ్,కాంగ్రెస్ అనుబంధ విద్యార్థి సంఘాలను ఓడించి చారిత్రిక విజయం సాధించింది.
70 ఏండ్ల పంజాబ్ యూనివర్సిటీ చరిత్రలో ఒక విద్యార్థిని స్టుడెంట్ కౌన్సిల్ టాప్ పోస్టును గెలుపొంది చరిత్రను సృష్టించింది. దాదాపు 60 శాతం అమ్మాయిలు ఉన్న ఈ యూనివర్సిటీలో ప్రతి సారి అబ్బాయిలే పోటీ చేసేవారు.గతంలో మూడు సార్లు SFS నుండి అమ్మాయిలను పోటీలో నిలబెట్టినప్పటికీ వారు స్వల్ప తేడాతో ఓటమిని చవిచూశారు.
అయితే ఈ సారి మాత్రం పట్టువదలని ఆత్మవిశ్వాసంతో విద్యార్థులలో కలసిపోయి.. సమస్యలపై పోరాటాలు చేస్తూ తమదైన స్థానం సంపాదించుకున్నారు. 2010లో ఏర్పడిన SFS మొదటి నుండి విద్యార్థి సమస్యలపై పోరాటం చేస్తూనే నిరంతరం విద్యార్థుల, బస్తీ వాసుల సమస్యలపై పాలక వర్గాలను ముచ్చెమటలు పట్టించింది. యూనివర్సిటీ సమస్యలపై జరిగే ప్రతీ నిరసనలో ఎస్ఎఫ్ఎస్ విద్యార్థుల భాగస్వామ్యం తప్పక ఉంటుంది. గతంలో యూనివర్సిటీ ఫీజులను పెంచినప్పుడు ఎస్ఎఫ్ఎస్ తీవ్రమైన ఆందోళనలు నిర్వహించింది. ఈ ఆందోళనలో 40 మంది ఎస్ఎఫ్ఎస్ సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు. ఇలా ఎన్నో పోరాటాలు చేసిన SFS తరపున విద్యార్థుల కౌన్సిల్కు పోటీ చేసిన కనుప్రియ కౌన్సిల్ టాప్ పోస్టుకు ఎన్నికైంది. అంతే కాకుండా ఈ కౌన్సిక్కు ఎన్నికైన తొలి మహిళగా చరిత్ర సృష్టించింది.
SFSలో భాగస్వామ్యులైన విద్యార్థులు అప్పట్లో ప్రత్యేక తెలంగాణ కోరుతూ ర్యాలీలు కూడా నిర్వహించారు. వీరి పోరాటాలు 80వ దశకంలో ఓయూ విద్యార్థులు చేసిన పోరాటాలను తలపిస్తుంటాయి. పంజాబ్ యూనివర్సిటీలోని SFS సంస్థకు తెలంగాణతో ప్రత్యేక అనుబంధం ఉంది. అభివృద్ది పేరుతో ఆదివాసులని నిర్వాసితులను చేస్తూ పోలవరం ప్రాజెక్ట్ను కట్టడాన్ని SFS వ్యతిరేకించడమే కాకుండా ముంపు ప్రాంతాలైన 7 మండలాల్లో క్షేత్ర పర్యటన చేసి ఒక నివేదికను పంజాబ్లో విడుదల చేసింది. ఇక్కడి ఆదివాసీలకు మద్దతుగా చండిఘర్లో ఆందోళనలు నిర్వహించింది.
తెలంగాణలోని విద్యార్థి సంఘాలు తాము నిర్వహించే మీటింగుల్లో పంజాబుకు చెందిన మేధావులను, హక్కుల కార్యకర్తలను ముఖ్య వక్తలుగా ఎలా అయితే ఆహ్వానిస్తుందో.. SFS కూడా తెలంగాణ మేధావులని, విద్యార్థి సంఘాల నాయకులని ఆహ్వానించి రెండు రాష్ట్రాల్లో జరిపే ప్రజాతంత్ర ఉద్యమాల్లో ఐక్యతను పెంపొందిస్తుంది.
మతోన్మాదం పెట్రేగి పోతున్న నేటి పరిస్థితిలో ప్రజాతంత్ర భావాలు గల SFS గెలుపొందడం హర్షించదగ్గ పరిణామం.
Keywords : SFS, Kanu Priya, Punjab University, Student Council, Won, ఎస్ఎఫ్ఎస్, కనుప్రియ, పంజాబ్ యూనివర్సిటీ, విద్యార్థి సంఘం
(2024-04-24 19:27:09)
No. of visitors : 1911
Suggested Posts
0 results
| కేసీఆర్ కుటుంబానికి చెందిన అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్ |
| రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్ |
| నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు |
| 24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే ! |
| డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు |
| ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ |
| హుస్నాబాద్ స్తూపం స్థలాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక
|
| కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు |
| 5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన |
| ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా? |
| తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
|
| అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
|
| పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన |
| వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2) |
| వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1) |
| విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్ |
| హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ |
| అనారోగ్యంతో ఉన్న మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు |
| మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన |
| మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ ! |
| సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ |
| తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శన్ స్తూపావిష్కరణ |
| గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది -మావోయిస్టు పార్టీ |
| గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం |
more..