ప్రజా కోర్టులో తేలిన నిజం.. బాక్సైట్ తవ్వకాలు, భూకబ్జాలే ఎమ్మెల్యే హత్యకు కారణం

ప్రజా

అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేస్వరరావు, మాజీ ఎమ్మెల్యే సోమలను ఆదివారం డుంబ్రిగూడ మండలం లివిటిపుట్టు వద్ద మావోయిస్టులు కాల్చి చంపారు. దీనికి హకుంపేట మండలం గుడ గ్రామంలోని క్వారీ కారణమని ప్రాథమికంగా నిర్థారణకు వచ్చినా.. అసలు కారణాలు మాత్రం ఇంకా చాలా ఉన్నట్లు తెలుస్తోంది. సాధారణంగా మావోయిస్టులు ఒక నిర్ణయం తీసుకునే ముందు దాన్ని ప్రజా కోర్టులో ఉంచడం తప్పని సరి. ఏ నిర్ణయం కూడా సొంతంగా తీసుకోరనే విషయం తెలిసిందే. సర్వేశ్వరరావు, సోమ హత్యకు ముందు కూడా ప్రజాకోర్టు నిర్వహించారని సమాచారం. విశాఖ రేంజ్ డీఐజీ కూడా విలేకరులతో మాట్లాడుతూ కేవలం మావోయిస్టుల మాత్రమే కాదని.. ప్రజలు కూడా వాళ్లతో కలసి ఉన్నారని చెప్పారు. అంటే మావోయిస్టులు ఈ ఘటనకు ముందు ప్రజాకోర్టు నిర్వహించినట్లు స్పష్టంగా అర్థం అవుతోంది.

బాక్సైట్ తవ్వకాలు.. కబ్జాలు

అరకు ఎమ్మెల్యే సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సోమపై ఆ ప్రాంతంలో చాలా ఆరోపణలు వెల్లువెత్తాయి. వైసీపీ టికెట్‌పై గెలిచిన ఇతను కడప ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తితో కలసి రెండు క్వారీలు నిర్వహిస్తున్నట్లు ఆ ప్రాంత వాసులు చెబుతున్నారు. పైకి బ్లాక్ చిప్స్ అని.. ప్రభుత్వ రోడ్ల నిర్మాణం కోసమని చెబుతున్నా.. అక్కడి నుంచి అక్రమంగా బాక్సైట్ తరలిస్తున్నట్లు సమాచారం. ఈ క్వారీ వ్యాపారానికి అడ్డు రాకూడదనే గత ఎన్నికల్లో తనపై పోటీ చేసిన సోమతో రాజీ చేసుకొని.. ఇద్దరూ కలసి క్వారీ వ్యాపారాన్ని నిరాటంకంగా సాగిస్తున్నారని ఆదివాసీలు అంటున్నారు. అక్కడ బాక్సైట్ తవ్వకాలకు అనుమతి లేదని సీఎం చంద్రబాబు చెబుతున్నా.. పరిశీలకులు మాత్రం అక్కడ జరిగేది బాక్సైట్ మైనింగే అని తేల్చారు. ఇటీవల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా అక్కడ బాక్సింగ్ తవ్వకాలు యధేచ్చగా సాగుతున్నాయని విమర్శించారు. మరోవైపు తన అక్రమ వ్యాపారానికి, మైనింగ్‌కి సీఎం చంద్రబాబు సహకరిస్తారనే ఒప్పందంతోనే పార్టీ మారినట్లు కూడా స్థానికులు చెబుతున్నారు. మరోవైపు సర్వేశ్వరరావు పాడేరులో అక్రమంగా భవనాలు నిర్మించడమే కాక.. ఆర్టీసికి చెందిన స్థలాన్ని లీజుకు తీసుకొని.. లీజు పూర్తయిన తర్వాత కూడా తన ఆధీనంలోనే ఉంచుకున్న విషయంపై పలు రాజకీయ పార్టీలు విమర్శలు గుప్పించాయి. ఈ విషయం పాడేరు, అరకు ప్రాంతంలోని ప్రజలందరికీ తెలిసినా.. అధికార పార్టీ నాయకుడు కావడంతో ఎవరూ ధైర్యంగా ముందుకు వచ్చి పిర్యాదు చేయలేదని తెలుస్తోంది. ఒక ప్రజాప్రతినిధి ఇలా ప్రజావ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుండటంతో విషయం మావోయిస్టుల వరకు చేరింది. క్వారీకి సంబంధించి మావోయిస్టులు పలు హెచ్చరికలు చేసినప్పటికీ సర్వేశ్వరరావు దురుసుగా వెళ్లాడని సన్నిహితులు చెబుతున్నారు.

పర్యావరణానికి హానీ చెయ్యొద్దని హెచ్చరించారు..

ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, సోమ చేస్తున్న అక్రమ బాక్సైట్ తవ్వకాలపై మావోయిస్టులు ముందే హెచ్చరించారా అంటే అవుననే అంటున్నారు ఆ ప్రాంతవాసులు. బాక్సైట్ తవ్వకాల వల్ల పర్యావరణానికి తీవ్ర నష్టం వాటిల్లుతోందని వెంటనే ఆ తవ్వకాలను నిలిపేయాలని మావోయిస్టులు హెచ్చరించినట్లు స్థానికులు చెబుతున్నారు. అడవులు దెబ్బతిని.. ఆదివాసీల మనుగడ కష్టమవుతోందని.. విలువైన ఖనిజ సంపదను విదేశాలకు తరలించవద్దని మావోయిస్టులు వారికి స్పష్టం చేసినట్లు సమాచారం. ఇప్పటికే క్వారీలు, బాక్సైత్ తవ్వకాల వల్ల తాము చాలా నష్టపోతున్నామని ఆదివాసీలు మొరపెట్టుకోవడం.. తమ హెచ్చరికలు కూడా వారిద్దరు ఖాతరు చెయ్యకపోవడంతో మావోయిస్టులు వారిని ప్రజా కోర్టుకు పిలిచినట్లు తెలుస్తోంది.

ప్రజా కోర్టులో ఏం జరిగింది..!

సర్వేశ్వరరావు, సోమ.. ఇద్దరికీ తాము చేస్తున్న అక్రమ మైనింగ్‌పై మావోయిస్టులు ఏనాటికైనా స్పందిస్తారని ముందే ఊహించినట్లు సన్నిహితులు చెబుతున్నారు. అయితే తాము కూడా ఆదివాసీలమే కదా.. కావాలంటే వాళ్లతో రాజీ చేసుకుందాం అని వ్యాఖ్యానించినట్లు సమాచారం. ఆదివారం రోజు క్వారీకి సంబంధించిన పనుల కోసమే బయలుదేరిని వీరికి.. డుంబ్రిగూడ మండలంలో మావోయిస్టులు, ప్రజలు వారిని అడ్డుకున్నారు. ఎమ్మెల్యేను దాదాపు అరగంట సేపు ప్రజా కోర్టులో విచారించినట్లు ప్రత్యక్ష సాక్షులు మీడియాకు చెప్పారు. తనపై వచ్చిన ఆరోపణలను కిడారి ఒప్పుకున్నట్లు ఆ సమయంలో దగ్గరగా ఉన్న ఎమ్మెల్యే సహాయకుడు చెప్పడం గమనార్హం. పార్టీ మారడానికి అతను టీడీపీ దగ్గర ఎంత డబ్బు తీసుకున్నాడో కూడా విచారణలో బయటపడినట్లు ఎమ్మెల్యే డ్రైవర్ చెప్పాడు. దీంతో ప్రజా వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే కిడారి, సోమలను మావోయిస్టులు కాల్చి చంపారని తెలుస్తోంది.

Keywords : bauxite mining, quarry, araku, maoists, kidari sarveswararao, environment, బాక్సైట్ మైనింగ్, క్వారీ, పర్యావరణం, మావోయిస్టులు, అరకు ఎమ్మెల్యే
(2024-04-24 19:21:12)



No. of visitors : 3377

Suggested Posts


0 results

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


ప్రజా