హిట్లర్ నిజంగానే తిరిగొచ్చాడు!!

హిట్లర్

తన శిష్యులు అన్ని రకాలుగానూ తనను మించిపోతున్నందుకు గురువు అడాల్ఫ్ హిట్లర్ సమాధిలో చాల సంతోషిస్తూ ఉండి ఉంటాడు!!

నిజంగానే హిట్లర్ శిష్యులు నిస్సిగ్గుగా హంతకుల మీద, నేరస్తుల మీద కేసులు ఉపసంహరించుకుంటున్నారు. మూడువందల యాబై సంవత్సరాల కింది దళిత నాయకుడి సమాధిని నేలమట్టం చేయడం, జనవరి 1న భీమా కోరేగాం ఉత్సవాలకు వెళుతున్న ఊరేగింపు మీద దాడి చేసి ఒక దళితుడిని చంపడం వంటి దాడి, దొమ్మీ, విధ్వంసం, హత్య నేరాలపై విచారణను ఎదుర్కొంటున్న నేరస్తుల మీద కేసులు ఉపసంహరించుకున్నారు. అలా తమ సొంత నేరాల మీద ముసుగు కప్పడం చాలనట్టుగా, హిట్లర్ శిష్యులు మరొక అడుగు ముందుకు వేసి, భీమా కోరేగాం యాత్రకు ముందు జరిగిన సభలో పాటల మీద, ఉపన్యాసాల మీద మొత్తం నెపం నెడుతున్నారు. రోజురోజూ మరింత మసాలా దట్టించడానికి అబద్ధపు ఉత్తరాలూ కథలూ సృష్టిస్తున్నారు.

అయితే విచిత్రమేమంటే, ఆ సభలో ఏ పాట మీద వాళ్లు అభ్యంతరం చెపుతున్నారో, ఏ పాటను నేరంగా అభివర్ణిస్తున్నారో, వాస్తవంగా ఆ పాట సరిగ్గా హిట్లర్ పాలనాకాలంలో నాటక రచయిత బెర్టోల్ట్ బ్రెహ్ట్ రాసిన ʹది గుడ్ ఉమన్ ఆఫ్ సెజువాన్ʹ అనే నాటకంలోని ఒక సంభాషణా శకలమైన కవితకు మరాఠీ అనువాదం!

భీమా కోరేగాం కేసులో ప్రాసిక్యూషన్ వారు ఉటంకించిన ఆ మరాఠీ అనువాదం ఇలా ఉంది:

జబ్ జుల్మ్ హో తో బగావత్ హోనీ చాహియే షహర్ మే
జబ్ జుల్మ్ హో తో బగావత్ హోనీ చాహియే షహర్ మే,
ఔర్ అగర్ బగావత్ న హో తో, బెహతర్ హై కీ, రాత్ ఢలానే సె పెహలే
యే షహర్ జల్ కె రాఖ్ హో జాయే, యే షహర్ జల్ కె రాఖ్ హో జాయే...

శనివార్ వాడ సభలో సుధీర్ ధావ్లె పాడాడని ప్రాసిక్యూషన్ ఆరోపిస్తున్న ఈ పాటను, 1942లో జర్మన్ లో బ్రెహ్ట్ రాసిన, ఆ తర్వాత ఇంగ్లిష్ లోకి అనువాదమైన కవితాపాదాలతో పోల్చి చూడండి.

**

షెన్ టె: .... అంటే మీరెవరూ ఏ జరిగిందో చెప్పదలచుకోలేదా? పట్టపగలు ఆయన చెయ్యి విరగ్గొట్టారు, మీరందరూ కళ్లారా చూస్తున్నారు, కాని ఒక్కరూ మాట్లాడడానికి ముందుకు రావడం లేదు! (కోపంగా)

విచారం నిండిన మనుషుల్లారా!
ఇక్కడ మీ తోబుట్టువు మీద దాడి జరిగింది,
మీరు కళ్లు మూసుకుని ఉన్నారు!
ఆయనను కొట్టారు, ఆయన గగ్గోలు పెట్టి ఏడుస్తున్నాడు,
మీరేమో పెదవి విప్పడం లేదు?
ఒక్కొక్క ఎరనూ వెతుక్కుంటూ రాక్షసి తిరుగాడుతున్నది,
మీరేమో రాక్షసి మమ్మల్ని పట్టుకోదులే,
మేం మా అసమ్మతి తెలపలేదుగా అంటున్నారు.
ఏమి నగరమిది, ఏమి లోకమిది, ఏమి మనుషులు మీరు?
అన్యాయం జరిగినప్పుడు లోకం ఒక్కటై లేచి తిరగబడాలి
అలా తిరుగుబాటు జరగలేదా,
రాత్రి ముసిరేలోపల ఈ నగరం తగలబడిపోవడం మేలు...

**

ʹపది అంకాల నీతికథʹ అనే పేరుతో బెర్టోల్ట్ బ్రెహ్ట్ రాసిన ఈ డర్ గుటె మెంష్ వా సెజువాన్ అనే నాటకం 1943లో రూపొంది, 1953లో తొలిసారి ప్రచురణ అయింది. ఈ నాటకానికి ది గుడ్ పర్సన్ ఆఫ్ సెజువాన్ అనీ, ది గుడ్ సోల్ ఆఫ్ సెజువాన్ అనీ, ది గుడ్ వుమన్ ఆఫ్ సెజువాన్ అనీ వేరువేరు ఇంగ్లిష్ అనువాదాలున్నాయి.

హిట్లర్ కాలం నాటి నిర్బంధాలను, ఆంక్షలను తప్పించుకోవడానికి ఈ నాటకంలోని కథాస్థలం చైనా అనీ, కాలం రెండు ప్రపంచ యుద్ధాల మధ్య కాలం అనీ చెప్పుకున్నారు గాని అది హిట్లర్ కాలం నాటి జర్మన్ సమాజ విలువలను చిత్రించింది. నిరుపేదరాలైనా, మంచి మనసున్న వేశ్య షెన్ టె ఈ నాటకపు కథానాయిక. ముగ్గురు దేవతలకు ఆశ్రయ6 ఇచ్చి వాళ్ల నుంచి డబ్బు కానుక పొందుతుంది. ఒక పొగాకు దుకాణం పెడుతుంది గాని ఆమె మంచితనాన్ని అవకాశంగా తీసుకుని ఆమెను అందరూ మోసం చేస్తుంటారు. వ్యాపారాన్ని రక్షించుకోవడానికి ఆమె షుయి టా అనే పురుష అవతారం ఎత్తి, తన దగ్గర కొనుగోలుదారుల నుంచి రావలసినది రాబట్టుకుంటుంది. దానితో కోపం వచ్చిన కొనుగోలుదారులు షెన్ టె ను షుయి టా చంపి, ఆమె వ్యాపారం కొల్లగొట్టాడని న్యాయస్థానానికి వెళ్తారు. చివరికి న్యాయస్థానంలో షెన్ టె తానే షుయి టా నని చెపుతుంది.

- ఎన్. వేణుగోపాల్ (ఎడిటర్, వీక్షణం)

Keywords : సుధీర్ ధావ్లె, బెర్టోల్ బ్రెహ్ట్, జర్మన్, ది గుడ్ ఉపన్ ఆఫ్ సెజువాన్, భీమా కోరేగావ్, పూణే పోలీసులు, రిమాండ్ డైరీ, sudheer dhavle, bhima koregaon, song,
(2024-04-24 19:16:16)



No. of visitors : 1228

Suggested Posts


0 results

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


హిట్లర్