include 'men';
?>
భీమాకోరేగావ్ విప్లవ, దళిత శక్తుల ఐక్యతకు ప్రతీక : పాణి
భీమాకోరేగావ్ దేశంలో విప్లవ, దళిత శక్తుల ఐక్యతకు ప్రతీక అని విప్లవ రచయితల సంఘం కార్యదర్శి పాణి అన్నారు. విరసం వ్యవస్థాపక సభ్యుడు వరవరరావు సహా దేశ వ్యాప్తంగా ప్రజా మేధావులు, ఉద్యమకారులపై అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన సభలో ఆయన ప్రసంగించారు. భీమాకోరేగావ్ అల్లర్లు, ప్రధాని మోదీ హత్యకు కుట్ర పేరుతో రాజ్యం ప్రజాస్వామిక గొంతులను అణచివేసే కుట్ర చేస్తుందన్నారు. దళితులు, ఆదివాసీలు, ముస్లింల పక్షాన నిలబడిన విప్లవోద్యమాన్ని అణచివేసేందుకు ప్రత్యామ్నాయ రాజకీయాల్ని ప్రచారం చేస్తున్న ఉద్యమకారులపై అక్రమ కేసులు మోపుతోందన్నారు. రెండు వందల సంవత్సరాల క్రితం పీష్వాల పాలనకు వ్యతిరేకంగా దళిత, అట్టడుగు వర్గాల ప్రజలు జరిపిన పోరాటాన్ని ఇవాళ సరికొత్తగా వ్యాఖ్యానించాల్సిన అవసరముందన్నారు. భీమాకోరేగావ్ ఇవాళ దళిత, విప్లవ శక్తుల ఐక్యతకు ప్రతీక అన్నారు. దేశంలో ముస్లింల పక్షాన నిలబడిన ఏకైక ఉద్యమం మావోయిస్టు ఉద్యమమని, కాశ్మీర్ స్వయంప్రతిపత్తి లాంటి అంశాలను నిర్ద్వందంగా బలపరిచిన మావోయిస్టు ఉద్యమాన్ని అణచివేసేందుకు ప్రత్యక్ష యుద్ధంతో పాటు, ఆ భావజాల ప్రచారాన్ని నిలువరించేందుకు ప్రజాస్వామిక గొంతునొక్కేందుకు రాజ్యం యత్నిస్తోందన్నారు. అందుకోసం అర్బన్ నక్సలైట్లు అనే ప్రచారాన్ని లంఘించిందన్నారు. మత ఆధిపత్యం, సామ్రాజ్యవాద దోపిడీ, పీడనలేని సమాజ నిర్మాణం కోసం సాగుతున్న ప్రజా ఉద్యమం మావోయిస్టు ఉద్యమమన్నారు. మావోయిస్టుల నాయకత్వంలో నడుస్తున్న జనతన సర్కార్ను నిలబెట్టుకోవల్సిన అవసరముందన్నారు.
కవులు, కళాకారులు, మేధావులపై మోపిన అక్రమ కేసులను ఎత్తివేయాలని ప్రొఫెసర్ హరగోపాల్ డిమాండ్ చేశారు. వరవరరావు లాంటి కవి, రచయిత, సున్నితమైన మనుషులను జైళ్లల్లో నిర్బంధించడం ద్వారా రాజ్యం భయానక వాతావరణం సృష్టించాలనుకుంటోందన్నారు. విద్యాధికులు, అధికార యంత్రాంగం, న్యాయ వ్యవస్థ సైతం మావోయిస్టులను నేరస్తులుగా చూసే దోరణి సమాజంలో పెరిగిపోయిందన్నారు. సమాజ మార్పు కోసం జీవితాలను త్యాగం చేస్తున్న ఉద్యమం పట్ల వ్యతిరేక దోరణి విడనాడాలన్నారు. ప్రజల పక్షాన నిలబడిన ప్రజాస్వామిక శక్తులను కాపాడుకోవల్సిన అవసరం ఉందన్నారు. ప్రముఖ కవి నిఖిలేశ్వర్ మాట్లాడుతూ రాజకీయ నేతలు ప్రజల భాషలో మాట్లాడుతూ ప్రజల్ని మోసం చేసేందుకు యత్నిస్తున్నారని, నిజమైన ప్రజా ఉద్యమాలపై నిర్బంధాన్ని ప్రయోగిస్తున్నారని విమర్శించారు. కవి యాకూబ్ మాట్లాడుతూ వరవరరావు మౌనం తెలియని మనిషి అని, ఆయన సమాజంలోని ఏ అసమానతను, హింసనూ చూస్తూ ఏనాడూ మౌనం వహించలేదని అన్నారు. సమాజంలోని అన్ని వర్గాల స్వేచ్ఛ కోసం ఆయన నిరంతరం తన సృజనను, మేధను వినియోగించారని అన్నారు. అలాంటి గొంతులను అణచివేయడం ద్వారా రాజ్యం ప్రజల గురించే వారికి ఒక హెచ్చరికను ఇస్తోందని అన్నారు. ప్రజాస్వామిక విలువల కోసం పోరాడే శక్తులను నిలబెట్టుకునేందుకు సమాజంలోని అన్ని శక్తులూ కలిసి రావాలన్నారు. సమావేశానికి అధ్యక్షత వహించిన డా. కాశీం మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా జైళ్లలో ఉన్న రాజకీయ ఖైదీల విడుదల కోసం ప్రజా ఉద్యమాన్ని నిర్మించాల్సిన అవసరముందన్నారు.
Keywords : paani, virasam, varavararao, bheema koregaon, gn saibaba, activists, arrests, elgar parishad, maharashtra police
(2024-04-24 18:55:18)
No. of visitors : 2369
Suggested Posts
| ఎన్ కౌంటర్ లో 8 మంది మావోయిస్టుల మృతి - తప్పించుకున్న హరిభూషణ్, దామోదర్ ఛత్తీస్ గడ్, తెలంగాణ రాష్ట్రాల సరిహద్దుల్లో జరిగిన ఎన్ కౌంటర్ లో 8 మంది మావోయిస్టులు మరణించినట్టు పోలీసులు ప్రకటించారు. పోలీసుల కథనం ప్రకారం.... |
| మా సభ్యులను పోలీసులు కిడ్నాప్ చేశారు: టీవీవీ అధ్యక్షుడు మహేష్ వరంగల్ పోలీసులు తమ సభ్యులను కిడ్నాప్ చేశారంటూ తెలంగాణ విద్యార్థి వేదిక ఆరోపించింది. టీవీవీ కాకతీయ యూనివర్సిటీ నాయకులు చిరంజీవి, రాజులను గురువారం సాయంత్రం ముగులు పోలీసులు కిడ్నాప్ చేశారని ఆ సంస్థ అధ్యక్షుడు మహేష్ పేర్కొన్నారు...... |
|
పోలీసును మింగిన వాట్సాప్...!
అతనో పోలీస్ ఆఫీసర్. వాట్సాప్ గ్రూపులో ఓ మెంబర్ కూడా. అదే అతని జీవితానికి ముగింపు పలికేలా చేసింది. ఓ చిన్న పొరపాటు ఆత్మహత్య చేసుకునేలా పురిగొల్పింది. కేరళ రాష్ట్రానికి చెందిన సీనియర్ పోలీస్ ఆఫీసర్ ఏపీ షాజి...ఆత్మహత్య సంచలనానికి కారణమైంది..... |
| కేసీఆర్ ఓ నియంత : మావోయిస్టు జగన్72 ఏండ్లలో పార్లమెంటరీ ప్రజాస్వామ్యం పేరిట జరిగిన ఎన్నికలు, అధికారం నెరిపిన పార్టీలు ఎలాంటి మార్పు తీసుకురాలేదన్నారు సీపీఐ (మావోయిస్టు) తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్. ముందస్తు ఎన్నికల సందర్భంగా ఆయన మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పార్లమెంటరీ రాజకీయ పార్టీల విధానాలను తీవ్రంగా విమర్శించారు. ప్రజల ప్రజాస్వామ్యం |
| Journalists – Arrested, tortured, jailed in South BastarPicked up in July and September end, two Hindi language journalists from the Darbha block in southern Bastar have been under arrest, charged with supporting.... |
| కంచె ఐలయ్యకు మావోయిస్టు పార్టీ మద్దతు నియంతృత్వ పాలన సాగిస్తున్న మోడీ, కేసీఆర్లు తమ వర్గాన్ని ప్రశ్నించడాన్ని, విమర్శించడాన్ని సహించలేకపోతున్నారు. అందుకే... కంచె ఐలయ్య భావప్రకటనా స్వేచ్చను అడ్డుకుంటూ. చంపుతామని, నాలుక కోస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారు. |
| తెలంగాణ ఉద్యమ స్పూర్తితో... గూర్ఖాలాండ్ కు మద్దతుగా ఓయూ లో ర్యాలీతెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన విద్యార్థులుగా, గూర్ఖాలాండ్ ఉద్యమానికి ఓయూ జేఏసీ సంఘీభావాన్ని ప్రకటిస్తోంది. బెంగాల్ ప్రభుత్వం గూర్ఖాలాండ్ ఉద్యమం పై అమలు చేస్తున్న అణచివేత విధానాలను ఓయూ జేఏసీ తీవ్రంగా ఖండిస్తోంది. వెంటనే గూర్ఖాలాండ్ ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తోంది.... |
| కేసీఆర్ కుటుంబానికి చెందిన అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్ |
| రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్ |
| నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు |
| 24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే ! |
| డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు |
| ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ |
| హుస్నాబాద్ స్తూపం స్థలాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక
|
| కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు |
| 5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన |
| ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా? |
| తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
|
| అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
|
| పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన |
| వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2) |
| వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1) |
| విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్ |
| హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ |
| అనారోగ్యంతో ఉన్న మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు |
| మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన |
| మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ ! |
| సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ |
| తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శన్ స్తూపావిష్కరణ |
| గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది -మావోయిస్టు పార్టీ |
| గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం |
more..