మావోయిస్టులతో చర్చలే మేలు.. ఎన్‌కౌంటర్లు ఇక చాలు - చత్తీస్‌గడ్ సీఎం

మావోయిస్టులతో

చత్తీస్‌ఘడ్ రాష్ట్రంలో ఇకపై ఎన్‌కౌంటర్ల మోతలు.. మృతదేహాల లెక్కలు ఉండకూడదని.. మావోయిస్టులతో చర్చలే మార్గమని ఆ రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి భూపేష్ భగేల్ అంటున్నారు. గత 15 ఏండ్లుగా బీజేపీ సీఎం రమణ్‌సింగ్ తూటాకు తూటాతో సమాధానం అనే విధంగా మారణహోమం సృష్టించారని.. తూటాతోనే సమస్యకు పరిష్కారం దొరుకుదుందనుకుంటే ఇప్పటికల్లా శాంతి నెలకొని ఉండేదని ఆయన అన్నారు. సీఎం అయ్యాక భూపేష్ తొలి సారిగా టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చారు.

గత మూడు దశాబ్దాలుగా మావోయిస్టుల ప్రభావం.. వారిని అణగదొక్క‌డానికి జరిగిన ఎన్‌కౌంటర్లు, మానవహక్కుల ఉల్లంఘనలకు ఇప్పటికైనా ముగింపు పలకాలని ఆయన అన్నారు. ఎక్కువ మంది భద్రతా సిబ్బందిని మోహరించి.. దూకుడుగా ఎన్‌కౌంటర్లకు పాల్పడటం వల్ల సమస్యను పరిష్కరించామని గత ప్రభుత్వం అనుకుంది. కాని దీని వల్ల ఆదివాసీలు, సామాన్యులు చాలా మంది బాధితులుగా మారారని ఆయన ఆరోపించారు.

నక్సలిజం ఒక రాజకీయ, సామాజిక, ఆర్థిక సమస్యని.. చర్చల ద్వారా సమస్య పరిష్కారానికి ప్రయత్నించడమే మంచిదని ఆయన అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా బస్తర్ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణాన్ని తగ్గించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ ప్రాంతంలోని ఆదివాసీలు, సామాన్యులు, మేధావులు, వ్యాపారులు, హక్కుల కార్యకర్తలు అందరూ బాధితులుగానే మారుతున్నారని ఆయన విచారం వ్యక్తం చేశారు.

బస్తర్ ప్రాంత ప్రజలు ప్రకృతితో మమేకమై జీవించే వారని.. వాళ్లు అలా ప్రకృతి ఒడిలో జీవించడానికికే ఇష్టపడతారన్నారు. కాని ప్రస్తుత పరిస్థితిలో వాళ్లు ప్రశాంతంగా జీవించే హక్కును కోల్పోయారని.. ఆందోళన, అభద్రతా భావం, భయంతో బతుకుతున్నారని అన్నారు. తమ ప్రభుత్వం ముందుగా వారికి కావాలసిన కనీస అవసరాలను తీర్చడానికి ప్రయత్నిస్తుందని.. ప్రజల ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేలా క్షేత్ర స్థాయిలో తగిన చర్యలు చేపడతామని ఆయన అన్నారు.

Keywords : chattisgarh, maoists, raman singh, bhupesh bhagel, talks, no encounters, చత్తీస్‌గడ్, సీఎం, భూపేష్ భగేల్, చర్చలు, మావోయిస్టులు
(2024-04-24 18:51:50)



No. of visitors : 3082

Suggested Posts


0 results

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


మావోయిస్టులతో