మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల నుంచి బలగాలను ఉపసంహరించం - చత్తీస్‌గడ్ సీఎం

మావోయిస్టు

బుల్లెట్‌కు బుల్లెట్ సమాధానం కాదు.. మావోయిస్టులతో చర్చలే మేలు అంటూ రెండు రోజుల క్రితమే ఒక ఇంటర్యూలో చెప్పిన చత్తీస్‌గడ్ సీఎం భూపేష్ భగేల్ రెండు రోజుల్లో మాట మార్చారు. తాము కూడా బీజేపీ ప్రభుత్వానికేం తీసుపోమంటూ తమ మాటల ద్వారా తెలియ జేస్తున్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో భద్రతా బలగాలు అరాచకం సృష్టిస్తున్నాయని, మానవహక్కుల ఉల్లంఘన జరుగుతోందని బాధపడ్డారు. ఎంతో మంది బాధితులుగా మారారని మొసలి కన్నీరు కార్చారు.

తాజాగా బస్తర్ ప్రాంతం నుంచి బలగాలను ఉపసంహరించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం నడుస్తున్న వ్యవస్థే కొనసాగుతుందని.. మరింత బలోపేతమైన ప్రణాళికతో ముందుకు వెళ్తామని పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. దేశంలో కశ్మీర్ తర్వాత అత్యధిక ఎక్కువ సంఖ్యలో భద్రతా బలగాలు మోహరించిన ప్రాంతంగా బస్తర్ పేరుగాంచింది. ఇక్కడ గత మూడు దశాబ్దాలుగా మావోయిస్టులు ప్రజలతో మమేకమై జీవిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ప్రజా ఉద్యమాలను అణచివేయడానికి గత బీజేపీ ప్రభుత్వం రోజుకో ఎన్‌కౌంటర్‌లా ముందుకు సాగింది. అయితే కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం మావోయిస్టులతో చర్చలు జరిపి సానుకూల వాతావరణం తీసుకొస్తామని చెప్పింది.

బస్తర్ ప్రాంతంలో దాదాపు 70 వేల మంది భద్రతా బలగాలు మోహరించి ఉన్నాయి. సీఆర్‌పీఎఫ్, బీఎస్ఎఫ్, ఐటీబీపీ, ఎస్ఎస్‌బీ వంటి పారామిలటరీ దళాలు వీటిలో ఉన్నాయి. ఈ ప్రాంతంలో మావోయిస్టుల అణచివేతే లక్ష్యంగా ప్రభుత్వాలు ఇక్కడ వీరిని రంగంలోకి దింపాయి. అయినా సరే ప్రజలు నిత్యం వీరి ఆగడాలపై తిరుగుబాటు చేస్తూనే ఉన్నారు.

మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ప్రత్యేకమైన ప్రణాళికను అనుసరించి ముందుకు సాగుతామని.. రుణమాఫీ, సంపూర్ణ మద్య నిషేధం వంటివి కచ్చితంగా అమలు చేస్తామని సీఎం భూపేష్ చెప్పారు.

ఏదేమైనా బస్తర్ ప్రాంతంలో నిక్షిప్తమై ఉన్న అపార ఖనిజాల తరలింపునకే ప్రతీ ప్రభుత్వం కొమ్ము కాస్తోంది. కార్పొరేట్లకు అనుకూలంగా భద్రతా బలగాలను ఇక్కడ దింపి.. ప్రకృతి వనరుల తరలింపును ఎన్నాళ్లుగానో అడ్డుకుంటున్న మావోయిస్టులను అణచివేస్తున్నారు. ఈ విషయంలో ఏ ప్రభుత్వమైనా వైఖరి ఒకటే అని భూపేష్ వ్యాఖ్యలద్వారా మరో సారి వెల్లడైంది.

Keywords : మావోయిస్టులు, బస్తర్, చత్తీస్‌గడ్, భూపేష్ భగేల్, maoists
(2024-04-24 18:51:21)



No. of visitors : 1112

Suggested Posts


0 results

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


మావోయిస్టు